Advertisement
SC ST Welfare
-
Rahul Gandhi: ఎస్సీ, ఎస్టీ మహిళల ఖాతాలో లక్ష
సివనీ/షాదోల్: కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ఎస్సీ, ఎస్టీ మహిళ బ్యాంక్ ఖాతాకు ఏటా రూ.లక్ష జమ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సివనీ జిల్లాలోని ధనోరాలో ర్యాలీలో గిరిజనులనుద్దేశిస్తూ రాహుల్ మాట్లాడారు.‘‘ కేంద్రప్రభుత్వ విభాగాల్లో కీలకమైన ప్రభుత్వ పదవుల్లో 90 మంది ఐఏఎస్ అధికారులుంటే వారిలో కేవలం ఒకే ఒక్క గిరిజనుడు ఉన్నాడు. దేశజనాభాలో గిరిజనులు ఎనిమిది శాతంకంటే ఎక్కువే ఉంటారు. అయినా దేశంలోని టాప్ 200 కంపెనీల్లో ఒక్కదానికి కూడా గిరిజనులు యజమానులుగా లేరు. కనీసం ఆ సంస్థల్లో అత్యున్నత స్థాయి అధికారులుగానూ లేరు. దేశంలో ఒక్క మీడియా సంస్థకైనా ఆదివాసీ యజమానిగా ఉన్నారా? ఒక్కరైనా న్యూస్యాంకర్ ఉన్నారా?’ అంటూ గిరిజనుల అభ్యున్నతికి మోదీ సర్కార్ కృషిచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఏడాదిలోపు ఆదివాసీల భూ హక్కుల సమస్యను పరిష్కరిస్తాం. కేంద్ర ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ వ్యవస్థకు చరమగీతం పాడి 30 లక్షల కేంద్ర ఉద్యోగాలను భర్తీచేస్తాం’ అని అన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, ఉప ప్రణాళిక వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. మంగళవారం ఢిల్లీ తెలంగాణభవన్లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ తన్ఖాను నియమించిందని, ఆయన సానుకూలంగా వాదనలు వినిపిస్తున్నారని పేర్కొన్నారు. వర్గీకరణ విషయంలో వివేక్ తన్ఖాను కలిసి పలు విషయాలు చర్చించామన్నారు. వర్గీకరణ విషయంలో చొరవ చూపిన సీఎం రేవంత్కు మాదిగ జాతి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ అనేది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. వర్గీకరణ చేయాలా వద్దా అనేది మాత్రమే సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని, ఆ తర్వాత ఎంత శాతం ఇవ్వాలనేది జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వాదనలకు హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఎస్సీ వర్గీకరణపై విచారణ చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్కుమార్, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్యతో కలిసి దామోదర రాజనర్సింహ విచారణకు హాజరయ్యారు. -
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
కవాడిగూడ (హైదరాబాద్): ఎస్సీవర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం ఎంఆర్పీఎస్ (టీఎస్) ఆధ్వర్యంలో ఆర్థిక, రాజకీయ రంగాలలో మాదిగలకు సమానవాటా కోసం డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద cను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ, ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 దళిత స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశామని, 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్లో సదాలక్ష్మి విగ్రహం ఏర్పాటు చేసి, మాదిగ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య, ఆరోగ్య శాఖలోని శానిటేషన్, డైట్ విభాగాలలో దళితులకే కాంట్రాక్ట్ కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్(టీఎస్) జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సువర్ణరాజు, మాదిగ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్, ఎంఆర్పీఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీలకు సాయంలో రాష్ట్రం మేటి
సాక్షి, అమరావతి: మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే అట్టడుగు వర్గాలకు ఎంత మేలు జరుగుతుందో వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన నిరూపిస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఉన్నతికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ వర్గాల సాధికారతకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక అమలు, దాని ద్వారా ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి మూడు నెలల్లోనే మరే రాష్ట్రం అమలు చేయని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ ఉప ప్రణాళికను అమలు చేసిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల మంజూరు, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో, పట్టణ గృహ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి పనితీరు కనపరిచిందని ఆ శాఖ విడుదల చేసిన నివేదికలో ప్రశంసించింది. 2023–24 తొలి తైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) వివిధ రాష్ట్రాల పథకాల లక్ష్యాలు, అమలు తీరును నివేదిక వివరించింది. లక్ష్యాల్లో 90 శాతంపైగా అమలు చేసిన రాష్ట్రాలు చాలా మంచి పనితీరు కనబరిచినట్లు, 80 నుంచి 90 శాతం అమలు చేసిన రాష్ట్రాలు మంచి పనితీరు కనపరిచినట్లు, 80 శాతం లోపు అమలు చేసిన రాష్ట్రాల పనితీరు బాగోలేదని నివేదిక వర్గీకరించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏపీతో సహా 16 రాష్ల్రాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 14,54,481 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందగా, వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 14,43,619 కుటుంబాలకు సహాయం అందినట్లు నివేదిక స్పష్టం చేసింది. మిగతా ఏ రాష్ట్రంలోనూ కనీసం 10 వేల మందికి కూడా ఎస్సీ కుటుంబాలకు సాయం అందించలేదని ఆ నివేదికను పరిశీలిస్తే అర్ధమవుతుంది. దేశంలోని రాష్ట్రాలన్నీ కలిపి 14,39,152 మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించగా అందులో సగం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,15,872 మంది ఎస్సీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల ద్వారా సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. గృహ నిర్మాణంలో, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలోనూ ప్రథమ స్థానం పేదల గృహాల నిర్మాణంలో, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ రాష్ట్రమే ముందుందని ఆ నివేదిక పేర్కొంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ కింద పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా మొత్తం 1.01 లక్షల గృహాల నిర్మాణం జరగ్గా, వాటిలో ఒక్క ఆంద్రఫ్రదేశ్లోనే 66,206 గృహాల నిర్మాణం చేసి రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో లక్ష్యానికి మించి రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నట్లు చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం. తొలి త్రైమాసికంలో 6,213 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా, 19,085 కనెక్షన్లు ఇచి్చనట్లు నివేదిక వెల్లడించింది. అంటే లక్ష్యానికి మించి 307 శాతం అధికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచి్చనట్లు వివరించింది. అలాగే రాష్ట్రంలో ఐసీడీఎస్లు, అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు నివేదిక ప్రశంసించింది. -
ఎస్సీలకు 18%.. ఎస్టీలకు 12% రిజర్వేషన్లు
చేవెళ్ల: చేవెళ్ల ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించింది. మొత్తం 12 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ డిక్లరేషన్లో పేర్కొన్న అంశాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఖర్గే ప్రకటించారు. డిక్లరేషన్లోని అంశాలివీ.. జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12% మేర రిజర్వేషన్ల పెంపు. వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం. ఐదేళ్ల పాటు ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి పథకం అమలు. ఎస్సీ, ఎస్టీలకు అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 18 శాతం, 12 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇంటి స్థలాలు లేని ప్రతి దళిత, గిరిజనులకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల ఆర్థిక సాయం. ఐదేళ్లలో ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అన్ని హక్కులతో తిరిగి అసైనీలకే కేటాయింపు. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు సదరు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం. ఎస్సీలకు ఇచ్చిన అసైన్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన. అమ్ముకునేందుకు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే హక్కులు. ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములపైనా వారికి పూర్తి హక్కులు. అటవీ హక్కుల చట్టం పటిష్టంగా అమలు. సమ్మక్క–సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు రూ.25లక్షల అభివృద్ధి నిధులు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు. మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు ఒక్కో కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.750 కోట్ల నిధులు. గిరిజనుల కోసం మూడు కార్పొరేషన్లు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు. వాటికి ఏటా రూ. 500 కోట్ల కేటాయింపు. రాష్ట్రంలో ఐదు కొత్త ఐటీడీఏలు, తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్లలో ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. విద్యాజ్యోతుల పథకం కింద పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25వేలు, పీజీకి రూ.లక్ష.. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5లక్షల నగదు బహుమతులు. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అందరికీ విద్య. గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం. -
ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన కేసీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ చేవెళ్ల/ మొయినాబాద్: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని.. పైగా వారిపై దాడులు మరింతగా పెరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. దళిత సీఎం అని చెప్పి, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని.. గిరిజనులకు పోడు భూములు దక్కలేదని, వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతికి, అక్రమ సంపాదనకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని.. తొమ్మిదిన్నర ఏళ్లలో రూ.లక్ష కోట్ల ఆస్తులను, రూ.పదివేల కోట్ల విలువ చేసే భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. చేవెళ్ల వేదికగా శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఆయన 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. అనంతరం మాట్లాడారు. మూడో విజయం తెలంగాణలోనే.. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ తొలి విజయం హిమాచల్ప్రదేశ్లో, రెండో విజయం కర్ణాటకలో సాధించిందని.. మూడో విజయం తెలంగాణలో సాధించబోతోందని రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వంలో స్వేచ్ఛతోపాటు సామాజిక న్యాయం, సమాన అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల ప్రజలను మోసం చేశారని.. మంత్రి వర్గంలో బీసీలకు, ఎస్సీలకు ప్రాధాన్యత లేదని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో 50శాతం జనాభా ఉన్న బీసీలకు మూడే మంత్రి పదవులతో సరిపెట్టార న్నారు. దేశంలోని మోదీ, తెలంగాణలోని కేసీఆర్, పాతబస్తీలోని అసదుద్దీన్ ముగ్గురూ ఒక్కటేనని.. వీరిలో ఎవరికి ఓటేసినా కేసీఆర్కు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో అమర వీరుల కుటుంబాలకు, తెలంగాణ పోరాట యోధులకు, ఉస్మానియా విద్యార్థులకు, తెలంగాణ వాదులకు గుర్తింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ అవినీతి, అణచివేత, కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిందేనన్నారు. కాగా.. ప్రజా గర్జన సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, వీహెచ్, జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్బాబు, షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అంజన్కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, గడ్డం ప్రసాద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి: దామోదర తెలంగాణలో భూమి కోసం, హక్కులకోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉందని.. అది గుర్తించే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఇందిరాగాంధీ 25 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారన్నారు. కానీ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో పేదల భూములను గుంజుకుని, రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో దొర అహంకారం మితిమీరిందని.. కేసీఆర్పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే పదవులు: సీతక్క తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఏదో చేసిందని గొప్పలు చెప్పుకుంటోందే తప్ప.. చేసిందేమీ లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. వందల ఎకరాల భూములు, ఫాంహౌస్లు ఉన్న పెద్దలకే రైతుబంధు సొమ్ము ఎక్కువగా అందుతోందని.. భూమి లేని పేదలకు ఈ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు ఆత్మగౌరవం, సమానత్వం లభిస్తాయన్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చరిత్రాత్మకం: భట్టి రాష్ట్ర సంపదలో అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేయడానికి కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిందని.. ఇది చరిత్రాత్మక నిర్ణయమని సీఎల్పినేత భట్టి విక్రమార్క చెప్పారు. చేవెళ్ల నుంచి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎల్పీ నేతగా పాదయాత్ర చేపట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని.. అదే సీఎల్పీ నేతగా తాను చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించానని వివరించారు. వాటిపై కాంగ్రెస్ పెద్దలంతా చర్చించి పేదలకు ఇంటి స్థలం, భూమి, ఆర్థిక సాయం అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ తీసుకొచ్చారని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్.. ఆ హామీ నెరవేర్చకపోగా, పేదలకిచ్చిన లక్షల ఎకరాల భూములను వెనక్కి తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకిచ్చిన భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామని.. లాక్కున్న భూములను తిరిగి ఇస్తామని చెప్పారు. -
పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం భూమి ఎస్సీలకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమి తప్పనిసరిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన పారిశ్రామిక పాలసీ 2023 –27 కింద వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులకు ఏపీఐఐసీ భూ కేటాయింపులకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్స్ అలాట్మెంట్ రెగ్యులేషన్ 2020 కింద కేటాయించిన భూములకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, తాజాగా చేసిన కేటాయింపులకు మాత్రమే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తాజా మార్గదర్శకాల ప్రకారం.. పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం భూమిని కామన్ ఫెసిలిటీ సెంటర్, 5 శాతం వాణిజ్య ప్లాట్స్కు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 15 శాతం కేటాయించాలి. రూ.500 కోట్ల పైబడి పెట్టుబడితో కనీసం 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ కనీసం మరో ఐదు అనుబంధ యూనిట్లు వచ్చే యాంకర్ యూనిట్లకు 25 శాతం తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసే యాంకర్ యూనిట్లకు 20 నుంచి 33 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 33 ఏళ్లపాటు లీజుకు భూమిని ఇస్తారు. ఆ తర్వాత లీజును 66, 99 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉత్పత్తి ప్రారంభించి 10 ఏళ్లు దాటి నిబంధనలను పూర్తి చేసిన యూనిట్లకు ఆ భూమిని కొనుక్కొనే హక్కు కల్పిస్తారు. వివిధ కంపెనీలకు భూకేటాయింపులు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా వివిధ పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వట్ల గ్రామం వద్ద ఉన్న రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని సంజమల రైల్వే స్టేషన్కు అనుసంధానిస్తూ రైల్వే లైన్ నిర్మాణం కోసం 211.49 ఎకరాలు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా మల్లవల్లి వద్ద బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు అవిశా ఫుడ్స్కు 101.81 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద సత్య బయోఫ్యూయల్కు 30 ఎకరాలు కేటాయించింది. తిరపతిలో హిందుస్థాన్ స్టీల్ వర్క్స్కు కేటాయించిన 50.71 ఎకరాల యూనిట్ పూర్తి కావడానికి గడువును పెంచింది. కియా వెండర్స్కు రాయితీలకు సంబంధించిన విధివిధానాలు, శ్రీకాళహస్తి వద్ద ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (గతంలో శ్రీకాళహస్తి పైప్స్) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్కు, గుంటూరు టెక్స్టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్కులకు వాటి పెట్టుబడి, ఉద్యోగ కల్పన ఆధారంగా టైలర్మేడ్ రాయితీలను ప్రకటించింది. -
విస్తృత భేటీలు.. ముమ్మర ప్రచారం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు ఎత్తుగడల్లో భాగంగా బీజేపీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో రిజర్వ్ స్థానాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.రిజర్వ్డ్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ఆరేడు వేల మం ది కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించనుంది. ఆయా భేటీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానా లను ఎండగట్టాలని, సీఎం కేసీఆర్ దళితులకు, గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 అసెంబ్లీ స్థానాలకు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఇప్పటికే జాతీయ నాయకులు ఆయా నియోజకవ ర్గాల్లోని నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, నేతలు అరవింద్ మీనన్, తరుణ్ఛుగ్, సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏపీ జితేందర్రెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక ఒక్కో పోలింగ్ కేంద్రం నుంచి 20 నుంచి 30 మంది కార్యకర్తలతో బూత్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను ఏవిధంగా తుంగలో తొక్కిందన్న అంశాలను వివరించడంతోపాటు, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు / గిరిజనులకు అమలు అవుతున్న పథకాల గురించి వివరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చిందనే విషయాన్ని కూడా వివరిస్తామని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో దళితులు, గిరిజనులను ఓట్లు వేయించుకోవడానికి వాడుకోవడం తప్ప.. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించని విషయాన్ని కూడా వివరి స్తామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని వివరించారు. పార్టీ నేతలతో జవదేకర్ భేటీ తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేయ డంతో పాటు, ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాష్ జవదేకర్ శుక్రవారం మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డితో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలతో సమా వేశమయ్యారు. పార్టీ పటిష్టత, లోపాలకు సంబంధించి అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
త్వరలో ‘కేసీఆర్ విద్యా కానుక’: గంగుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలు తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శాసనమండలిలో శుక్రవారం ‘రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు’అనే అంశంపై లఘు చర్చ జరిగింది. సంక్షేమంపై పలువురు సభ్యులు అడిగిన పలు ప్రశ్నలపై మంత్రులు స్పందించారు. బీసీ సంక్షేమంపై మంత్రి గంగుల మాట్లాడుతూ కేసీఆర్ తీసుకున్న చర్యలతో బీసీల్లో ఆత్మగౌరవం ఎన్నోరెట్లు పెరిగిందన్నారు. త్వరలోనే కేసీఆర్ విద్యాకానుక పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఎవరూ చేయలేదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన వర్గాలను కేసీఆర్ జనజీవనంలో ఉన్నతస్థానంలో నిలిపారన్నారు. -
దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి
సాక్షి, అమరావతి: దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏపీలో ఎస్సీల సంక్షేమం అద్భుతంగా జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలకు మేలు జరగడం లేదంటూ టీడీపీ నేతలు విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబుకి దమ్ముంటే రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధిపై బహిరంగచర్చకు రావాలని సవాలు చేశారు. రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ నేతలు చేసిన విమర్శలను మంత్రి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఖండించారు. దేశంలో గతంలో పరిపాలించిన ఎస్సీ, బీసీ ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా సీఎం జగన్మోహన్రెడ్డి దళితుల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా అన్ని రాష్ట్రాలు కలిపి ఎస్సీలకు చేస్తున్న సాయం కంటే ఒక్క ఏపీ సాయమే అత్యధికమని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిసి ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా 34.86 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించాయని, వాటిలో ఒక్క ఏపీలోనే 33.57 లక్షల కుటుంబాలున్నాయని తెలిపారు. ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో చేసిన ఖర్చు రూ.33,625 కోట్లు కాగా, మూడున్నరేళ్ల కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.49,710.17 కోట్లని తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు ఎస్సీల సంక్షేమానికి రూ.33,629 కోట్లు ఖర్చుచేస్తే, జగన్మోహన్రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో ఎస్సీల కోసం రూ.58,353 కోట్లు ఖర్చుచేశారని వివరించారు. టీడీపీ నేతలు దళితపల్లెకు వెళ్లి పేదగుడిసె తలుపుతట్టి జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా వారు చెబుతున్న మాటలను ప్రస్తావిస్తే చెప్పుతో కొడతారని ఆయన హెచ్చరించారు. చదవండి: AP EAPCET Results 2023: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే.. -
‘పరిశ్రమల స్థాపన’లో స్టాండ్–అప్ ఇండియా స్కీమ్ చేయూత
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడంలో స్టాండ్–అప్ ఇండియా పథకం కీలక పాత్ర పోషిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ పథకం కింద 1.80 లక్షల మంది లబ్ధిదారులకు బ్యాంకులు రూ.40,700 కోట్లకు పైగా మంజూరు చేశాయి. ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి 2016 ఏప్రిల్ 5, స్టాండ్ అప్ ఇండియా పథకం ప్రారంభమైంది. 2025 వరకూ దీనిని పొడిగించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు పరిశ్రమల స్థాపనకు రుణాలను ఇవ్వడానికి అన్ని బ్యాంకు శాఖలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళలు పరిశ్రమలు సాధించాలన్న తమ కలను సాకారం చేసుకోవడంలో ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం, లక్ష్యాన్ని సాకారం చేయడానికి తగిన ప్రోత్సాహం అందించడం వంటి పలు అంశాలు ఈ పథకంలో ఇమిడి ఉన్నాయి. వ్యాపార రంగం, వ్యవసాయం, తయారీ వంటి రంగాల్లో ఆయా వర్గాలు ముందడుగు వేయడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గర్వకారణం... 1.8 లక్షలకు పైగా మహిళలు, ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి రూ. 40,600 కోట్లు మంజూరు చేయడం నాకు గర్వకారణం. సంతృప్తి కలిగించే విషయం. అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు శాఖల నుండి రుణాలను పొందడం ద్వారా కీలక వర్గాలు పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టడానికి ఈ పథకం తగిన సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ దిశలో ఒక సులభతర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోంది. – నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ మూడవ స్తంభం స్టాండ్–అప్ ఇండియా పథకం.. నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ (అందరికీ ఆర్థిక ఫలాలు అందడం, వృద్ధి అన్ని వర్గాలకూ చేరడం) మూడవ స్తంభం. నిధులు లేని వారికి వాటిని అందించడం లక్ష్యంగా ఈ పథక రూపకల్పన జరిగింది. – భగవత్ కిసన్రావ్ కరాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి -
AP: ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్.. మరో పదేళ్లు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్ప్లాన్ (ఉప ప్రణాళిక)ను ప్రభుత్వం మరో పదేళ్లు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్ను జారీచేసింది. దళిత, గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం పదేళ్ల కాలపరిమితితో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం ఈ నెల 23తో ముగియనుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సబ్ప్లాన్ను కొనసాగించేందుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆయా వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డినెన్స్ తేవడం గొప్ప విషయం ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వివిధ ప్రజా సంఘాల నేతలు స్పందించారు. ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పందిస్తూ.. సబ్ప్లాన్ చట్టం 2013 జనవరి 23 నుంచి అమలులోకి వచి్చందని.. చట్ట ప్రకారం పదేళ్ల తర్వాత ఇప్పుడు రద్దయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై సకాలంలో సీఎం వైఎస్ జగన్ స్పందించి.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంతో ముందుగానే ఆర్డినెన్స్ తేవడం గొప్ప విషయమన్నారు. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపట్ల సీఎం తనకున్న ప్రేమను మరోసారి చూపించారని కొనియాడారు. సబ్ప్లాన్ మరో పదేళ్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, దేశంలో మెరుగ్గా సబ్ప్లాన్ అమలుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడం వెనుక సీఎం జగన్ చిత్తశుద్ధే కారణమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి.. వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అన్నారు. సబ్ప్లాన్ను మరో పదేళ్లు పొడిగించడం హర్షణీయమంటూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సీపీఎం, కేవీపీఎస్, సెంటర్ ఫర్ దళిత స్టడీస్ హర్షం ఇక ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తేవడం పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఒ.నల్లప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సెంటర్ ఫర్ దళిత స్టడీస్ (హైదరాబాద్) చైర్పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్కుమార్, ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్నాయక్ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తంచేశారు. అలాగే, జాతీయ దళిత హక్కుల చైర్మన్ పెరికె ప్రసాదరావు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేరాజోత్ హనుమంతు నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు కూడా ముఖ్యమంత్రి నిర్ణయంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. సీఎం వైఎస్ జగన్కు రుణపడి ఉంటామన్నారు. -
Fact Check: అబద్ధాలు చెప్పటమే అసలు దగా! దిగజారిపోయిన ‘ఈనాడు’
సాక్షి, అమరావతి: నాడు.. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీలంటే అత్యంత చులకన. ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అనే ఈసడింపు.. దళితులకు శుద్ధీ శుభ్రం ఉండవంటూ ఏవగింపు. నేడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఎస్సీ, ఎస్టీలంటే ఎంతో గౌరవం. ఎక్కడైనా ‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు’ అంటూనే మాట్లాడటం మొదలెడతారు. వారి హక్కులను కాపాడటమే కాదు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారికి సమున్నత స్థానమిస్తున్నారు. సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యాయాన్ని ఆరంభించారు. అయినా సరే... ‘ఎస్సీ, ఎస్టీలకు దగా’ అంటూ చంద్రబాబు కళ్లలో సంతోషం కోసమే కథనాలు వండే స్థాయికి దిగజారిపోయింది ‘ఈనాడు’. అసలు ఎస్సీ, ఎస్టీలకు ఎవరేం చేశారు? 2014–19 మధ్య ఐదేళ్లలో చంద్రబాబు సీఎంగా ఎస్సీల సంక్షేమానికి ఖర్చు చేసింది రూ.33,629 కోట్లు, ఎస్టీలకు రూ.12,488 కోట్లు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది నవంబరు వరకూ... అంటే మూడున్నరేళ్లలో ఎస్సీల సంక్షేమానికి రూ.58,353.07 కోట్లు, ఎస్టీలకు 15,660.03 కోట్లు ఖర్చు చేసింది. ఇదీ ఇద్దరికీ తేడా!!. రుణాల మంజూరు కనిపించదా రామోజీ? – ఈ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాధి, జీవనోపాధి మెరుగుదల కోసమిచ్చే రుణాలు 53 శాతం పెరిగాయి. ఇది సాక్షాత్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తాజా నివేదిక చెప్పిందే. – ‘జగనన్న తోడు’ పథకం కింద చిన్న వ్యాపారాలు చేసుకునే 9.05 లక్షల మందికి రుణాలివ్వగా... ఈ ఏడాది మూడో దశలో ఏకంగా 9 లక్షల మందికి రుణాలివ్వాలని లకి‡్ష్యంచారు. వారిలో 5.10 లక్షల మందికి ఇప్పటికే రుణాలిచ్చారు. ఈ రుణాలపై వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 32.51 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. ఎస్సీ, ఎస్టీలకు మూడేళ్లలో ఇచ్చిన రుణాలివీ... ఏడాది రుణ మొత్తం (రూ.కోట్లలో) 2019–20 15,791 2020–21 18,689 2021–22 28,577 పథకాల్లో సింహభాగం... ఎన్నికల మేనిఫెస్టోనే పవిత్ర గ్రంథంలా భావించి చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ప్రభుత్వం... 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రకరకాల పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు గరిష్ఠ ప్రయోజనాన్ని చేకూర్చింది. – ఎస్సీ, ఎస్టీల వివాహాలు, కులాంతర వివాహాలకు సంబంధించి ఎన్నికలకు మూడునెలల ముందు హడావుడిగా పథకాన్ని ప్రకటించిన చంద్రబాబు... ఒక్కరికైనా ఇస్తే ఒట్టు. కానీ బాబు ప్రకటించిన మొత్తాలను రెట్టింపు చేసి మరీ దీనికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్. విద్యకు ఇంత ప్రాధాన్యం ఎన్నడైనా ఉందా? ఎస్సీ, ఎస్టీల విద్యను పట్టించుకోవడం లేదనేది రామోజీ విషప్రచారం. చంద్రబాబు హయాంలో అమలు చేసిన విదేశీ విద్య అద్యంతం అక్రమాల పుట్టే. నకిలీ విదేశీ వర్సిటీలను చూపించి తమ వారి ఖాతాల్లోకే డబ్బులు మళ్లించేశారు. ఇది విజిలెన్స్ విచారణలోనూ వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వ సాయంతో విదేశాలకు వెళ్లేవారు రాష్ట్రానికి పేరు తెచ్చేలా... ఇక్కడి సంపదను పెంచేలా ఉండాలని భావించిన ముఖ్యమంత్రి జగన్... ప్రపంచంలోని టాప్–100 వర్సిటీల్లో సీట్లు సాధించినవారికి పూర్తి ఫీజును రీఇంబర్స్ చేస్తామని ప్రకటించారు. టాప్–200 వర్సిటీల్లో చేరినవారికి రూ.50 లక్షల సాయం ప్రకటించారు. అంతేకాదు. నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన వంటి అనేక పథకాల ద్వారా విద్యావకాశాలు, మౌలిక వసతులను మెరుగుపరిచింది. ► రాష్ట్రంలోని స్టడీ సర్కిల్స్ ద్వారా విశాలో సివిల్ సర్వీసెస్, విజయవాడలో గ్రూప్–1, తిరుపతిలో బ్యాంకు పోస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. స్టడీ సర్కిల్స్లో ఈ ఏడాది ఆగస్టు వరకు 10,976 ఎస్సీ విద్యార్థుల కోసం రూ.12.75 కోట్లు ఖర్చు చేశారు. ► ఎస్సీ గురుకులాలకు టీడీపీ హయాంలో 9 ఐఐటీ, 19ఎన్ఐటీ, 18 ఎంబీబీఎస్ సీట్లు వస్తే... ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 57ఐఐటీ, 101ఎన్ఐటీ, 40ఎంబీబీఎస్ సీట్లు సాధించారు ఎస్సీ విద్యార్థులు. దీన్నిబట్టే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. అదే తీరులో గిరిజన సంక్షేమ గురు కులాలనూ ప్రోత్పసహించటంతో గతేడాది 30 మంది ఐఐటీ, 59 మంది ఎన్ఐటీలో ప్రవేశానికి అర్హత సాధించారు. రాజకీయాల్లో సముచిత స్థానం... వాడుకుని వదిలేయడానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అడుగడుగునా నిర్లక్ష్యమే ఎదురైంది. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీల రాజకీయ సాధికారతలో కొత్త అధ్యాయం లిఖిస్తున్నారనటానికి కేబినెట్లో వారికిచ్చిన స్థానమే నిదర్శనం. తొలి కేబినెట్లో 56 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలను రెండవ విడతలో 70 శాతానికి తీసుకెళ్ళారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులిస్తే వారిలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. పెద్దల సభ శాసన మండలి చైర్మన్గా కొయ్యే మోషేన్రాజు (ఎస్సీ), వైస్ చైర్మన్గా జకియాఖానం (మైనారిటీ), అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని సీతారాం(బీసీ)ను ఉన్నతస్థానాల్లో కూర్చొబెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్దే. 32 మంది వైసీపీ ఎమ్మెల్సీల్లో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలేనంటే... ముఖ్యమంత్రి జగన్ వారికిచ్చిన ప్రాధాన్యమేంటో తెలియకమానదు. ప్రత్యేక కార్పొరేషన్లతో అభివృద్ధికి ఊతం... ఎస్సీ, ఎస్టీలకు వేరువేరు కార్పొరేషన్లతో పాటు ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, గిరిజన సహకార సంస్థ వంటి ప్రత్యేక కార్పొరేషన్తో వారి అభివృద్ధికి ఊతమిస్తున్నారు. మాదిగలకు లిడ్క్యాప్ చైర్మన్, డైరెక్టర్ పోస్టులిచ్చారు. ► స్ధానిక సంస్ధల పదవుల విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వాటా 67 శాతం పైనే. 13 జెడ్పీ చైర్మన్ పదవుల్లో 9 ఈ వర్గాలకే. 14 నగర కార్పొరేషన్ మేయర్ పదవుల్లో 12 వీరివే. పార్టీ గెలిచిన 84 మున్సిపాల్టీలలో 58 స్ధానాలు వీరివే. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో 117 పదవులు ఈ వర్గాలకే కేటాయించారంటే ముఖ్యమంత్రి చిత్తశుద్ధి తెలియకమానదు. ఇక ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 79... 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవుల్లో 280 ఈ వర్గాలకే కేటాయించారు. ► ఇవి మాత్రమే కాదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 2.60 లక్షల వాలంటీర్లలో 84 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే!. ► విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి... వేగంగా నిర్మాణ పనులు చేయిస్తున్నారు. 125 అడుగుల ఎతైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్మృతి వనానికి ప్రభుత్వం రూ.268.48కోట్లు ఖర్చు చేస్తోంది. గిరి జనానికి అండాదండ వివిధ పథకాల్లో ఎస్టీలకు సముచిత వాటా ఇవ్వటంతో పాటు... వారికి భూమి హక్కు(ఆర్వోఎఫ్ఆర్, డీకేటీ పట్టాలు) కల్పించడంలో ఈ ప్రభుత్వానికి ఎవ్వరూ సాటిరారనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో గత 12 ఏళ్లలో 2.34 లక్షల ఎకరాలను పట్టాలుగా ఇవ్వగా.. ఈ ప్రభుత్వం మూడున్నరేళ్లలో ఏకంగా 2.48,887లక్షల ఎకరాలను పంచి రికార్డు సృష్టించింది. ► ప్రత్యేక గిరిజన విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల, ఇంజనీరింగ్ కాలేజీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలతో ఎస్టీలకు సాంకేతిక, వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు అరకు కాఫీ, నల్లమల నన్నారి వంటి గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ను కల్పించి ప్రోత్సహిస్తున్నారు. వీటన్నిటినీ మరుగున పరుస్తూ... చంద్రబాబు కాలమే స్వర్ణయుగమనే ‘ఈనాడు’ రాతలు ఇంకెన్నాళ్లు? -
అభివృద్ధి నిధులు ‘స్పెషల్’!
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది. ఏటా ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నా.. తాజాగా 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో నిధులు పెంచింది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.47,350.37 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ నిధులు పెంచామని తెలిపారు. ఇందులో ఎస్సీ ఎస్డీఎఫ్ కింద రూ.33,937.75 కోట్లు, ఎస్టీ ఎస్డీఎఫ్ కింద రూ.13,412.62 కోట్లు చూపారు. గత బడ్జెట్లో ఈ నిధికి రూ.33,610.06 కోట్లు కేటాయించగా.. ఈసారి అంతకన్నా రూ.13,740.31 కోట్లు పెరిగాయి. ఈ ఫండ్కు కేటాయించిన నిధులను సంబంధిత సంక్షేమ శాఖలతోపాటు 42 ప్రధాన ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దళితబంధుకు భారీ నిధులు కరోనా ప్రభావం కారణంగా రెండేళ్లుగా సంక్షేమ శాఖలకు కేటాయింపులు పెద్దగా చేయలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, రోజువారీ జనజీవనం సాధారణ స్థితికి రావడంతో సంక్షేమ కార్యక్రమాల అమల్లో వేగం పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు పెంచుతున్నట్టు తెలిపింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు పథకానికి తాజా బడ్జెట్లో ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామని ప్రకటించింది. దళిత బంధు పథకానికి భారీగా నిధులు కేటాయించడంతో ఎస్సీ ఎస్డీఎఫ్లోనూ భారీ పెరుగుదల నమోదైంది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు నిధుల కేటాయింపులు పెరగడంతో.. పెండింగ్లో ఉన్న పథకాలు, ఇతర సమస్యలకు పరిష్కారం లభించినట్టేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న వివిధ రాయితీ పథకాలకు మోక్షం కలుగుతుందని పేర్కొంటున్నాయి. -
ఇది మనుషులు పట్టని అభివృద్ధి
రానున్న వందేళ్ల భారతావనికి మార్గం వేసేదని ఘనంగా చాటిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు సరే... ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా అందులో భాగమని ప్రకటించారు సరే... అయితే ఆచరణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు లేవు. చేసినవి కూడా సరిగ్గా ఖర్చు చేయలేదని గత నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. ఆ వర్గాల ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. ఢిల్లీ సర్కార్ బడ్జెట్ సమర్పణ జరిగి పోయింది. స్పందనలు, ప్రతిస్పందనలు హోరెత్తాయి. అధికార పక్షం శభాష్ అంటే, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కొంతమంది తటస్థంగా ఉండే విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు నిజాలు మాట్లాడితే పట్టించుకున్నవారు లేరు. ఇప్పటికే పది రోజులు దాటిపోయింది. ఇక ఆ తర్వాత అందరూ మరిచి పోతారు. మళ్ళీ వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ దాని ఊసు ఎత్తేవారుం డరు. ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. విమర్శ లను పట్టించుకోరు. ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీల బడ్జెట్ కేటాయింపులు చాలామంది విశ్లేషకులకు పట్టవు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం యథావిధిగా కేటాయింపులు జరిపింది. నాకు తెలిసి ఒక ఆలోచనతో, ప్రణాళికతో చేసిన కేటాయింపులు ఇవి కావని తెలుస్తూనే ఉంది. గత సంవత్సరం రెండు పైసలు ఇస్తే, ఈ సంవత్సరం మూడు పైసలు ఇచ్చి, మధ్యలో దానిని రెండున్నర పైసలు చేసి, ఖర్చు అంతకన్నా తక్కువ చేసి, చేతులు దులుపుకొంటారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆ కేటాయింపుల తతంగం చూస్తే అర్థమవుతుంది. కేంద్రంలో కూడా సబ్ప్లాన్ హెడ్ ఒకటి ఉంటుంది. అయితే దానిని పేరు మార్చారు. గతంలో బడ్జెట్లో ప్లాన్, నాన్ప్లాన్ అనే వర్గీకరణ ఉండేది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్ను ఏర్పరిచిన తర్వాత ప్లాన్ అనే పేరు లేదు. అందువల్ల జనాభా దామాషా ప్రకారం కేటాయించాల్సిన నిధులను, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కేటాయింపులు (అలోకేషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్)గా పేరు మార్చారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లెక్కలు ఘనంగానే ఉన్నాయి. భారతదేశం మొత్తం బడ్జెట్ 39,44,909 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో షెడ్యూల్డ్ కులాలకు 1,42,342 కోట్ల రూపాయలుగా, షెడ్యూల్డ్ తెగలకు 89,265 కోట్లుగా నిర్ణయించారు. నిజానికి జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు కేటాయించా ల్సింది ఒక లక్షా 82 వేల 976 కోట్ల రూపాయలు. ఆ కేటాయించిన దానిలో కూడా ప్రత్యక్షంగా ఎస్సీలకు చేరే నిధులు 53,795 కోట్లు. ఈ కేటాయింపులు మొత్తం బడ్జెట్లో 37 శాతం మాత్రమే. మిగతా మొత్తంలో ఎస్సీలకు నేరుగా చేరేవి చాలా తక్కువ. దాదాపు సగానికి పైగా మంత్రిత్వ శాఖలకు అసలు కేటాయింపులే లేకపోవడం విచార కరం. అదేవిధంగా ఎస్టీలకు నిజానికి 98,664 కోట్లు కేటాయించాల్సి ఉంది. కేటాయించిన మొత్తంలోనూ వారికి నేరుగా చేరేవి 43 వేల కోట్లు మాత్రమే. కొన్ని మంత్రిత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీలకు అందరితో పాటు కేటాయిస్తారు. కానీ వాటి లెక్కలు, వివరాలు... ఎవరైతే ప్రయోజనం పొందాలో వారి వివరాలు ఏమీ ఉండవు. ఉదాహరణకు, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద అమలు జరుగుతున్న ఫసల్ బీమా యోజనకు 2022–23 సంవత్సరానికి ఎస్సీలకు 2,667 కోట్లు, ఎస్టీలకు 1,381 కోట్లు కేటాయించారు. ఇవి కాకిలెక్కలు తప్ప నిజ మైన ప్రయోజనమేదీ వీటివల్ల లేదని, గత బడ్జెట్లపైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికను బట్టి అర్థమవుతుంది. కాగ్ 2017లో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న విషయాలను చూస్తే మన కళ్ళు తెరుచుకుంటాయి. ‘‘ఎస్సీ, ఎస్టీ రైతుల ప్రయోజనం కోసం 2011–12 నుంచి 2015–16 వరకు 2,381 కోట్ల రూపాయలు కేటా యించారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందిన వివరాలు లేవు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ మహిళా రైతుల కోసం శ్రద్ధ వహించాలని చేసిన సూచనను మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదు.’’ అదేవిధంగా ఉన్నత సాంకేతిక విద్య కోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేటాయించిన డబ్బులు కూడా వినియోగం కాలేదని కాగ్ తెలియజేసింది. ఇప్పటికే ఐఐటీ సంస్థల్లో పీహెచ్డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య అత్యల్పం. ఎస్సీలకు కేటాయించిన సీట్లలో 75 శాతం, ఎస్టీలకు కేటాయించిన సీట్లలో 95 శాతం ఖాళీగా ఉన్నట్టు కాగ్ తన నివేదికలో తెలిపింది. అదేవిధంగా పీజీ కోర్సులలో కూడా ఇదే విధమైన ఖాళీలు ఉన్నట్టు 2021లో కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న సఫాయి కర్మచారి సంక్షేమం కోసం కేటాయించిన నిధుల వివరాలు కూడా బడ్జెట్ లెక్కల్లో లేవని కూడా కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో సఫాయి కార్మికులు ఏ విధమైన సాహసం చేశారో మనందరికీ తెలుసు. అటువంటి వాళ్ల కోసం కేటాయించిన అరకొరా నిధులను కూడా సరిగ్గా వినియోగించకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. 2016–17లో స్వయం ఉపాధి కింద 9 కోట్లు కేటాయిస్తే, ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. 2017–18లో అయిదు కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా 2020–21లో వంద కోట్లు కేటాయించామని గొప్పలకు పోయారు. అయితే అందులో ఖర్చు చేసింది కేవలం 16.60 కోట్లు మాత్రమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్ కథా ఇదే. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. కేవలం బడ్జెట్లో అంకెలు చూపెడితే సరిపోదు. అందుకోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెచ్చిన సబ్ప్లాన్ చట్టం, మరిన్ని సానుకూల అంశాలతో 2017లో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ వల్ల ప్రయోజనం చేకూరింది. అయితే ఆశించిన స్థాయిలో ఆ ప్రయోజనాలు అందాయా అంటే, లేదనే చెప్పాలి. కానీ, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చట్టం అమలులో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకల్లో భిన్నమైన పథ కాలు వచ్చాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఎస్సీ, ఎస్టీల కోసం నెలకొల్పి, నిర్వహిస్తోన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు దేశంలోనే మార్గదర్శకంగా నిలిచాయి. కర్ణాటకలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరహాలో సబ్ప్లాన్ చట్టం అమలులోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ చట్టం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ బడ్జెట్కు ఒక ప్రత్యేకత ఉందని ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది వందేళ్ళ భారత్కు మార్గంవేసే బడ్జెట్ అని చెప్పారు. భవిష్యత్ భారతావనికిది ఆరంభం అన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా ఒకటిగా ప్రకటించారు. అయితే ఆచ రణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. భవిష్యత్లో యువత ఎదుర్కోబోయే నిరుద్యోగం ఈ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా నిలవనుందనడంలో సందేహం లేదు. దీనికి ముందుగా బలవబో తున్నది ఎస్సీ, ఎస్టీలే. డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసిన లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం కష్టం. అందుకోసం ఇప్పటి నుంచే ఒక సమగ్రమైన కార్యాచరణ కావాలి. కోవిడ్ మహమ్మారి వల్ల చాలా రంగాల్లో ఉపాధి కోల్పోయిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. మానవ రహిత అభివృద్ధి, రోబోలు, సాంకే తిక ప్రయోజనం ఉన్న అభివృద్ధి వైపు పారిశ్రామిక వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. దానికి ప్రభుత్వాల దగ్గర ఎటువంటి కార్యక్రమం లేదు. కేవలం దేశ సంపదను పెంచి, నిజమైన సంపదగా ఉన్న మను షులను వదిలేస్తే, అది ఎటువంటి దేశాభివృద్ధి అవుతుందో నిపుణులు ఆలోచించాలి. ‘‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషు లోయ్’’ అన్న గురజాడ మాటలను హిందీలోకి అనువాదం చేసి, మన దేశాధినేతలకు ఎవరైనా వినిపిస్తేనైనా కళ్ళు తెరుస్తారేమో చూడాలి. మల్లెపల్లి లక్ష్మయ్య ,వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కేసుపై సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత ధర్మాసనం ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేజన్ల కేసుపై శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) మరియు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పనపై తామేలాంటి ప్రమాణాలను నిర్దేశించలేమని తెలిపింది. ప్రాతినిధ్య ప్రమాణాలను నిర్ణయించడానికి న్యాయస్థానం వద్ద ఎలాంటి కొలమానం లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలే లెక్కలు సేకరించాలని తెలిపింది. మొత్తం సర్వీసు ఆధారంగా కాక, రిజర్వేషన్ల ఆధారంగానే డేటాను సేకరించాలని స్పష్టం చేసింది. అదే విధంగా ప్రమోషన్ల డేటా సమీక్షకు వ్యవధి సహేతుకుంగా ఉండాలని తెలిపింది. రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్రాలు తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. దామాషా ప్రాతినిధ్యం, తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలన్నీ రాష్ట్రాలే చూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. కాగా, ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనలో ప్రమాణాలను నిర్దేశించడంలో ఎదురవుతున్న అయోమయాన్ని దూరం చేయాలని కోరుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: ‘సిద్ధూ డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టాడు’ -
ఎస్సీ,ఎస్టీ నియోజక వర్గాలపై టీ-బీజేపీ ఫోకస్
-
జీవో 5ను యథావిధిగా అమలు చేయాలి
కవాడిగూడ (హైదరాబాద్): ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను కాలరాస్తూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో అన్యాయం చేస్తున్నాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో ప్రాధాన్యం కల్పించాలని, అందుకోసం జీవో 5ను యథావిధిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు తూట్లు పొడిచే జీవో నంబర్ 2ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆదివారం ఇందిరాపార్కు వద్ద ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, జాక్టో చైర్మన్ సదానంద్గౌడ్ ధర్నాకు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన పోరాటాలకు టీజేఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. దేశంలో నేటికీ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను చట్టసభల్లో ప్రస్తావించడంతోపాటు ప్రత్యక్షంగా చేసే పోరాటాల్లో కూడా తన మద్దతు ఉంటుందని తెలిపారు. -
కాకాని గోవర్ధన్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు
-
సీఎం హామీల వైఫల్యంపై 30న ధర్నా
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకిచ్చిన హామీల అమల్లో విఫలమైనం దుకు నిరసనగా ఈ నెల 30న ఎస్సీ, ఎస్టీ, బీసీ మోర్చాల ఆధ్వ ర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. దళితబంధు కింద ఎస్టీలకు కూడా రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీనేతలు మనోహర్రెడ్డి, ప్రకాశ్రెడ్డి, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ మోర్చాల నేతలు హుస్సేన్నాయక్, కొప్పు బాషా, ఆలె భాస్కర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా ఎస్సీ, ఎస్టీలకు 300 ఎకరాల భూమిని కూడా పంచలేదని విమర్శించా రు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం అసెంబ్లీలో ఇచ్చిన మాటను తప్పారన్నారు. -
ఎస్సీ, ఎస్టీలతో మమేకం
సాక్షి, అమరావతి: వారానికోసారి జిల్లాల ఎస్పీలు కలెక్టర్లతో కలిసి ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అక్కడి ప్రజలతో మమేకమై వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని సూచించారు. దీనివల్ల పోలీసులు అణగారిన వర్గాలకు దగ్గరవుతారని చెప్పారు. ఆరేళ్ల అనంతరం ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం అమలుపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తు ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఐడీలోని ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసుల దర్యాప్తు విభాగాన్ని సీఎం ఆదేశించారు. దర్యాప్తునకు సంబంధించి ఎస్వోపీ పంపాలని.. దర్యాప్తులో ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారా? లేదా? అన్నదానిపై సమీక్షించి అందులోని లోటుపాట్లను మూడు నెలల్లో సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కలెక్టర్లు, ఎస్పీల మొదటి కాన్ఫరెన్స్లోనే అణగారిన వర్గాలు, మహిళలకు అండగా ఉండాలని చెప్పానని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే వారంలో ఒకసారి కలెక్టర్లు గ్రామ సచివాలయాలను సందర్శించడం తప్పనిసరి చేశామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా ఈ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలీసు శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. తప్పు చేసినవారు తమ వారైనా సరే.. సంబంధిత పోలీసు అధికారులపై ఆ శాఖ చర్యలు తీసుకుంది. హోంమంత్రి, డీజీపీ ఎంతో సాహసంతో వ్యవహరించి నిబంధనల మేరకు వారిపై చర్యలు తీసుకుని చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నట్లుగా వ్యవహరించి ఎస్ఐలు, సీఐలపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. బాధితులకు ఆర్థిక సాయం కొనసాగుతుంది వేధింపులకు గురైన కేసుల్లో బాధితులకు ఎప్పటికప్పుడు ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇది కొనసాగుతుంది. అలాగే.. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అత్యాచారం, హత్యకు గురైన బాధిత కుటుంబాల్లోని వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించాలి. ఇందులో ఎలాంటి జాప్యం జరగకూడదు. అందుబాటులో భూమి ఉంటే ఇద్దాం.. లేనిపక్షంలో సేకరించి బాధితులకు పంపిణీ చేద్దాం. ప్రత్యేక కోర్టులు, న్యాయవాదుల నియామకంపై దృష్టి ఎస్సీ, ఎస్టీ చట్టం అమలుకు సంబంధించి కమిటీలో ఉన్న సభ్యులు తమ సూచనలు, సలహాలను పోలీసు అధికారులకు ఇవ్వాలి. వీటిపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు మేధోమథనం చేయాలి. తదుపరి దీనిపై కార్యాచరణ చేపట్టాలి. అధికారులతో కమిటీ సభ్యులు సమావేశమై వీటిపై మరోసారి చర్చించాలి. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, న్యాయవాదుల నియామకం, అలాగే.. బాధితులకు అందాల్సిన సహాయంపైనా దృష్టి పెట్టాలి. అణగారిన వర్గాల్లో సాధికారత కోసం.. అణగారిన వర్గాలకు మంచి జరగాలి.. సాధికారత రావాలన్న ఉద్దేశంతోనే తొలిసారిగా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం. ఇందులో భాగంగానే హోంమంత్రి పదవిని దళిత మహిళకు ఇచ్చాం. విద్యాశాఖనూ దళితులకే ఇచ్చాం. డీజీపీ కూడా ఎస్టీ వర్గానికి చెందిన వారే. అణగారిన వర్గాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. విద్యాశాఖలో కూడా అన్ని విషయాలు తెలిసిన మనిషి ఉండాలని సురేష్ను మంత్రిగా పెట్టాం. తద్వారా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, అణగారిన వర్గాల్లో సాధికారత కోసం ప్రయత్నిస్తున్నాం. ఒక దిశగా మనం అడుగులు వేయడం మొదలు పెట్టాం, మన లక్ష్యసాధనలో ప్రగతి కనిపిస్తోంది. 2013 తర్వాత ఇప్పటి వరకు ఈ కమిటీ సమావేశం జరగలేదు. చట్టం అమలుపై గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారికి ప్రత్యేక దృష్టి లేదని దీంతో స్పష్టమైంది. ఇది శోచనీయం. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఇక ఏటా ఈ సమావేశాన్ని నిర్వహిస్తాం. చట్టం అమలు తీరు.. ప్రగతిని మనం సమీక్షించుకుంటాం. గతంలో తీసుకున్న చర్యలు, ఇప్పుడు మెరుగుపర్చుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, వాటి అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తాం. చట్టం అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధికి ప్రశంస ► ఈ సందర్భంగా.. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధిని కమిటీ సభ్యులు ప్రశంసించారు. వివిధ కేసుల్లో బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని షెడ్యూలు కులాల నేషనల్ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి.సునీల్కుమార్బాబు చెప్పారు. ► తూర్పుగోదావరి (రాజమండ్రి), ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ఘటనల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎస్సీ, ఎస్టీ చట్టం అమలులో తన చిత్తశుద్ధిని చూపించిందని కమిటీ సభ్యులు ప్రశంసించారు. ► ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా సీఎం తక్షణమే స్పందిస్తున్నారని సమావేశంలో సభ్యులు ప్రస్తావించారు. దాదాపు ఏడు ఘటనల్లో ఆయా కుటుంబాలను సీఎం ఉదారంగా ఆదుకున్నారని వారు గుర్తు చేశారు. ► ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో జరిగిన ఘటనల్లో రూ.60 లక్షలు బాధితులకు ఆర్థిక సహాయం చేశారని అధికారులు తెలిపారు. బాధితుల వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక సహాయ అంశాన్ని ఎక్కడా వార్తల్లో కనిపించనీయకుండా సున్నితంగా వ్యవహరిస్తున్న అంశాన్నీ సమావేశంలో కమిటీ సభ్యులు ప్రస్తావించారు. ► ఈ సమావేశంలో పోలీస్ శాఖ రూపొందించిన ‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళల పట్ల సత్ప్రవర్తన’ బుక్లెట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ► హోంమంత్రి మేకతోటి సుచరిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె. సునీత, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పలువురు ఉన్నతాధికారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు ప్రతి మూడు నెలలకోసారి ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం అమలు తీరుపై జిల్లాల్లో సమీక్ష చేయాలి. ఇందులో కలెక్టర్ సహా ఉన్నతాధికారులు పాల్గొనాలి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలి. ఎస్ఓపీలనూ తయారు చేసి ఇవ్వాలి. అమలు తీరుపై వారు నివేదిక పంపాలి. ఇలా జిల్లాల నుంచి వచ్చిన నివేదికలపై రాష్ట్ర స్థాయి కమిటీ దృష్టి సారిస్తుంది. వీటిపై సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ -
పెండింగ్ కేసులపై సత్వర విచారణ: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పెండింగ్ కేసులపై సత్వరం విచారణ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సీఎం అధ్యక్షతన స్టేట్ లెవల్ హైపవర్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ గురువారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మేకతోటి సుచరిత, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ , సీఎస్ ఆదిత్య నాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు గురించి మీడియా సమావేశంలో మంత్రులు వివరించారు. (చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..) బాధితులకు రావాల్సిన భూమి, ఇతర పరిహారాలు అందించాలని సీఎం సూచించారని మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. భూమి లేని చోట భూసేకరణ చేసైనా భూమి ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన తెలిపారు. అట్రాసిటీ కేసులు పెట్టిన వారికి సత్వర న్యాయం అందించాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహించాలని తమని సీఎం ఆదేశించారని విశ్వరూప్ వెల్లడించారు. కలెక్టర్లు, ఎస్పీలు కూడా వారానికి ఒకరోజు ఎస్సీ వాడల్లో పర్యటించాలని.. తద్వారా ప్రభుత్వం వారి వెంట ఉందని భరోసా కల్పించాలని సీఎం చెప్పారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: స్థానిక ఎన్నికలు: టీడీపీ నేతల దౌర్జన్యకాండ) రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే మొదటి సమావేశమని, గత టీడీపీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. ఏడాదికి రెండు సార్లు జరగాల్సిన సమావేశం ఒక్కసారి కూడా జరగలేదని తెలిపారు. దళితుల పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చని మంత్రి విశ్వరూప్ విమర్శించారు. పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు.. గతంలో పోలిస్తే ఎస్సీ,ఎస్టీ కేసులు తగ్గాయని హోంమంత్రి సుచరిత అన్నారు. విచారణ సమయం గతంలో 60 రోజులు ఉంటే ఇప్పుడు 50 రోజులకు తగ్గిందన్నారు. అట్రాసిటీ కేసులపై పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని తెలిపారు. గతంలో 3.6 శాతం విచారణలు పూర్తయితే ఇప్పుడు 7 శాతానికి పెరిగిందని సుచరిత పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్ను మరింత బలోపేతం.. ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్ను మరింత బలోపేతం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బాధితుల పరిహారంపై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. బాధితులకు ఇవ్వాల్సిన భూమి, ఇతర పరిహారాలు అందించాలని, భూమి లేనిచోట భూసేకరణ చేసైనా భూమి ఇవ్వాలని సూచించారని మంత్రి సురేష్ వెల్లడించారు. -
జగనన్న దసరా కానుక
సాక్షి, అమరావతి: ‘రాయితీలు ఎంతో ఉపయోగపడతాయి. కోవిడ్ సమయంలో రాయితీలు ఇచ్చి ఆదుకున్నారు. జగనన్న ఇచ్చిన దసరా కానుక ఇది’ అని పలువురు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందించేందుకు ‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల మనోగతం ఇలా ఉంది. రూ.కోటి సబ్సిడీ.. ఇదే తొలిసారి వైఎస్సార్ గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. అయితే ఇవాళ్టి పాలసీ దేశంలోనే తొలిసారి. కోటి రూపాయల సబ్సిడీని ఎక్కడా ఇవ్వడం లేదు. నైపుణ్యాభివృద్ధి నుంచి ఉత్పత్తి వరకు అన్ని కోణాల్లోనూ ఆలోచించారు. ఎస్సీ, ఎస్టీలకు జగనన్న ఇచ్చిన దసరా కానుక ఇది. ప్రభుత్వంతో కలిసి మేం అడుగులు ముందుకు వేస్తున్నాం. డీఐసీసీఐ (దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నుంచి పూర్తి సహకారం అందిస్తాం. దేశంలోని దళిత పారిశ్రామిక వేత్తలతో రాష్ట్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. – నర్రా రవికుమార్, డీఐసీసీఐ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్సెంటివ్తో ఎంతో ఉపయోగం నేను నోట్బుక్లు తయారు చేస్తున్నాను. ఏడాదిలో కేవలం ఆరు నెలలు మాత్రమే మా యూనిట్ పని చేస్తుంది. ఈసారి కోవిడ్ వల్ల పాఠశాలలు ఆరు నెలలు వాయిదా పడ్డాయి. దీంతో యూనిట్ నడవక చాలా ఇబ్బంది పడ్డాం. ఈ పరిస్థితుల్లో మీరు ఇచ్చిన ఇన్సెంటివ్ ఎంతో ఉపయోగపడింది. నవరత్నాలు, ఇతర పథకాలతో ప్రతి కుటుంబంలో ఆనందం నిండింది. ప్రభుత్వ స్కూళ్లంటే ఉన్న చెడు భావన ఇప్పుడు పోయింది. – సి.సుజాత, సూరంపల్లి, గన్నవరం మండలం, కృష్ణా రూ.21 లక్షల సబ్సిడీ పొందాను నా పరిశ్రమలో 25 మంది ఉపాధి పొందుతున్నారు. రూ.45 లక్షల యంత్రాలకు రూ.15 లక్షల సబ్సిడీ వచ్చింది. విద్యుత్ చార్జీలో కూడా సబ్సిడీ ఇచ్చారు. ఆ విధంగా దాదాపు రూ.21 లక్షల సబ్సిడీ వచ్చింది. కరోనా కష్టకాలంలోనూ చిన్నతరహా పరిశ్రమలను ఆదుకున్నారు. దీంతో విజయవంతంగా నా పరిశ్రమను నడిపించుకోగలుగుతున్నాను. వివిధ పథకాల కింద రూ.60 వేలకుపైగా లబ్ధి కలిగింది. – సీహెచ్ ఏసుపాదం, ఐఎంఎల్ పాలిమర్స్ కంపెనీ, పశ్చిమగోదావరి మమ్మల్ని నిలబెట్టారు నేను డిప్లొమా చేశాను. ఒక ఫార్మా కంపెనీలో 17 ఏళ్లు పని చేశాను. ఆ తర్వాత రూ.12 కోట్లు పెట్టుబడితో సీపీఆర్ కంపెనీ స్థాపించి, బల్క్ డ్రగ్లు తయారు చేస్తున్నాను. తొలి ఏడాది చాలా ఇబ్బంది పడ్డాను. ఓ వైపు బ్యాంక్ ఈఎంఐ.. మరోవైపు మార్కెట్ లేదు.. ఇంకోపక్క కోవిడ్.. ఈ సమయంలో మీరు ఇచ్చిన రీస్టార్ట్ ప్యాకేజి నాతో పాటు నా దగ్గర పని చేస్తున్న 50 మంది కుటుంబాలకు పునర్జన్మలాంటిది. – డి.రవికుమార్, విశాఖపట్నం -
తన వర్గం కోసమే చంద్రబాబు తాపత్రయం
తాడికొండ: చంద్రబాబు తన బినామీలైన సుజనాచౌదరి, మాజీ మంత్రులతో పాటు తన సామాజిక వర్గం ప్రయోజనాల కోసమే తాపత్రయ పడుతున్నాడని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పర్యవేక్షణ కమిటీ కన్వీనర్ కొదమలకుమార్ విమర్శించారు. పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో కొనసాగుతున్న దీక్షలు సోమవారానికి 27వ రోజుకు చేరాయి. ఆదివారం 26వ రోజు జరిగిన దీక్షల్లో కొదమల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు న్యాయ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని కోర్టుల్లో తన వర్గ న్యాయవాదులను జొప్పించి పేదలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రఘురామకృష్ణరాజు డబ్బు మదంతో మహిళలను వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని, ఇంకోసారి ఇలా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బాబుకు బుద్ధి చెప్పాల్సిందే.. 27వ రోజైన సోమవారం నిర్వహించిన దీక్షల్లో పాల్గొన్న మోడల్ అసోసియేషన్ ఆఫ్ దళిత ఎంప్లాయీస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మురికిపూడి దేవపాల్ మాట్లాడుతూ చంద్రబాబు తన బినామీలతో కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నాడన్నారు. అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే సీఎం వైఎస్ జగన్ సంకల్పం గొప్పదని, చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో దళిత నేతలు బూదాల సలోమీ, పరిశపోగు శ్రీనివాసరావు, పిడతల అభిõÙక్, పులి దాసు, కొలకలూరి లోకేష్, బందెల భాను కుమార్, గుండాల ప్రసాద్, బుర్రి సుధాకర్, సలివేంద్రపు బాల సుందరం, పెద్దిపాగ బాబు, దాసరి సుదీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల దశ మారబోతుంది
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోకుండా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ‘జగనన్న–వైఎస్సార్ బడుగు వికాసం పథకం’తో వారి దశ దిశ మారబోతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, తలారి వెంకట్రావు, జోగారావు అన్నారు. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా ఏపీఐఐసీ భూకేటాయింపుల్లో కూడా వారికి భూములు కేటాయించడం గొప్ప విషయమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2020– 23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం దళిత జాతికి దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నామని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇంతకాలం అణచివేతకు గురైన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని, బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలను అమలు పరచడానికి కంకణబద్ధులయ్యారని కొనియాడారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీలలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మేలు చేసే విధంగా నూతన పారిశ్రామిక విధానం ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కోటి రూపాయల వరకు ప్రోత్సాహక మొత్తం (ఇన్సెంటివ్) ఇస్తున్నారని పేర్కొన్నారు. వారిలో నైపుణ్యం పెంచేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ చొరవ వల్ల ఎస్సీ, ఎస్టీల నుంచి వందల సంఖ్యలో పారిశ్రామికవేత్తలు రాబోయే రోజుల్లో తయారవుతారన్నారు. వైఎస్ జగన్ సీఎం కావడం ఎస్సీ, ఎస్టీల అదృష్టమన్నారు. మహానేత వైఎస్సార్ పేదలకు, ఎస్సీ, ఎస్టీల కోసం తెచ్చిన ఇండస్ట్రీ పాలసీ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆయన తనయుడు ఏపీలో దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేస్తున్న మేలు నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉందన్నారు. దేశంలోనే ఉత్తమ విధానం ఎస్సీ, ఎస్టీ వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ పథకం దేశంలోనే అత్యుత్తమమైనది. ఇంత వరకు ఏ రాష్ట్రంలోనూ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి గరిష్టంగా కోటి రూపాయల సబ్సిడీ ఇవ్వలేదు. ఇది ఎస్సీ, ఎస్టీలకు జగనన్న ఇచ్చిన దసరా కానుక. దివంగత వైఎస్సార్ మొదటిసారి దేశంలోనే తొలిసారి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ పాలసీ ప్రకటించి చరిత్ర సృష్టించగా, నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ అంతకంటే బెస్ట్ పాలసీ ప్రకటించి ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. – మామిడి సుదర్శన్, దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు