-
సమాజాన్ని విస్మరించిన సినిమా
అత్యంత శక్తిమంతమైన భారత సినీ ప్రపంచం నేర ప్రపంచంలో రారాజులైన ‘భాయ్’ల ముందు మోకరిల్లిందనే విషయం మనం మరువ రాదు. తమ నిరసన తెలపడానికి ఈ సినీ ప్రముఖులు ఏనాడూ ప్రధానమంత్రి ఇంటికి ఊరేగింపుగా పోలేదు. వారు గుట్టు చప్పుడు కాకుండా రాజీపడతారు. ముంబై పోలీసుల్లో ఓ చిన్న బృందం గ్యాంగ్ స్టర్లను ఎన్కౌంటర్లలో కాల్చిచంపే పని ప్రారంభించగానే వారు సాగిలపడి మరీ తమ జోలికి రావద్దని వేడుకున్నారు. అయితే, అంతా చీకటే కాదు, కొత్త ఆశలు చిగురించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనేక మంది కొత్త, యువ సినీ దర్శకులు, కళాకారులు తమ అభిప్రాయాల్ని బాహాటంగా తమ చిత్రాల్లో ప్రదర్శించడానికి వెనుకాడడం లేదు. దేశంలో బాగా ప్రతిభ గల, విజయవంతమైన బడా సినీ దర్శకులు అధి కారంలో ఉన్నవారికి ఏ మాత్రం జంకు లేకుండా ఎందుకు లొంగిపోతున్నారు? విధూ వినోద్ చోప్రా– రాజ్కుమార్ హిరాణీ తాజా సినిమా సంజూ నా వాద నకు కారణం. సంజయ్దత్ని దుర్మార్గులైన జర్నలి స్టుల రాతలకు బలి అయిన నటునిగా ఈ సినిమాలో నిజాయతీ లేకుండా చిత్రించారని నేను చెప్పాను. అమెరికాలో ప్రసిద్ధ హాలీవుడ్ హీరో రాబర్ట్ డీ నీరో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను రాయడానికి వీలులేని మాటలతో తీసిపారేస్తూ మాట్లాడుతున్న ఈకాలంలో పెద్ద పెద్ద సినీ నిర్మాతలు రాజ్ ఠాక్రేకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ కొత్త సినిమా నిర్మాణం ఎందుకు ప్రారంభిస్తున్నారు? మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన నేత రాజ్ ఎంతటి బెదిరింపు ధోరణితో మాట్లాడినా, కిందటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్త 288 సీట్లకుగాను ఒక్క సీటు మాత్రమే సాధించగలిగారు. మరాఠీల కోసం పాటుపడుతున్నానని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఈ పార్టీకి 227 సీట్లున్న ముంబై మునిసి పల్ కార్పొరేషన్లో వచ్చిన స్థానాలు కేవలం ఏడే. అయితే ముంబై సినిమా నిర్మాతలు రాజ్ఠాక్రే ముందు ఎందుకు సాగిలపడుతున్నారు? కారణం– ఆయన గెలిచేదేమీ లేకున్నా చాలా విధ్వంసం సృష్టిం చగలరు. అందుకే సినీరంగం ఇలాంటివారికి తేలికగా లొంగిపోతుంది. ఈ సినీ పరిశ్రమకు మాఫియా ముఠాలన్నా, కండబలంతో అధికారం చెలాయించే వారన్నా భయం ఎక్కువ. భారత సమాజంలో దుర దృష్టకర విషయం ఏమంటే, మన సృజనశీల వర్గాలు సాధారణంగా అధికారంలో ఉన్నవారికి అనుకూ లంగా వ్యవహరిస్తారు. ఇండియాలో కొందరు విద్యా రంగానికి చెందిన అధ్యాపకులు, చిత్రకారులు, కొందరు జర్నలిస్టులు మినహా సృజనాత్మక రంగా లకు చెందిన పలువురు ప్రముఖులు ప్రభుత్వాలు, మాఫియా ముఠాల ముందు తాబేదారులుగా ప్రవ ర్తిస్తారు. అయితే వందల కోట్ల వసూళ్లు, వేలాది కోట్ల విలువైన స్టూడియోలున్న హిందీ సినీరంగం ఎందు కింత సిగ్గుమాలిన రీతిలో వ్యవహరిస్తోంది? పెరిగిన ‘దర్బారీ’ సంస్కృతి! ప్రాచీన కాలం నుంచీ దేశంలో సాగుతున్న దర్బారీ సంస్కృతి నుంచి ఈ ధోరణి పుట్టుకొచ్చింది. కళలు, సంస్కృతి ప్రధానంగా మహరాజులు, తర్వాత సుల్తా నులు, బాద్షాల ప్రాపకంలోనే ముందుకు సాగాయి. రాజాస్థానంలో ఉంటేనే సంగీతకారులు లేదా చిత్ర కారులు తమ ప్రతిభాపాటవాలను సొమ్ము చేసుకో వడం తేలిక. రాజుల పోయి ‘భారత ప్రభుత్వం’ వచ్చినా ఆస్థాన సంస్కృతి అలాగే నిలబడిపోయింది. ప్రభుత్వం ఈ కళాకారులకు నిధులు, స్కాలర్షి ప్లు, విదేశీ పర్యటనలకు అవకాశాలు, ఢిల్లీలో భారీ బంగళాలు, ఇంకా పద్మ అవార్డులు ఇస్తోంది. అయితే, రచయితలు ముఖ్యంగా కవులు, చిత్రకా రులు ఈ సర్కారీ ‘దయ’ నుంచి బయటపడ్డారు. ఈ ర^è యితల్లో ఎక్కువ మంది వామపక్ష సిద్ధాంతాలను నమ్మడం వల్లే భిన్న మార్గం ఎంచుకోగలిగారు. సినీరంగంలో అంతు లేని డబ్బు, పేరు ప్రఖ్యాతులు సంపాదించి, అత్యంత శక్తిమంతులైన ప్రముఖులు ఊహకందని రీతిలో పిరికిపందలుగా మారిపో యారు. వామపక్ష తరంతో పాటే మొదట కనిపించిన తెగువ, తిరుగుబాటు మాయమయ్యాయి. హిందీ పాటల రచయిత, కవి గుల్జార్(83) ఒక్కరే ధైర్యంగా నిలబడ్డారు. మిగిలినవారు ముఖ్యంగా, మొదటి తరం కళాకారుల వారసులు అధికారంలో ఉన్నవారికి సలాం చేస్తూ ఆస్థాన రచయితలు, కవులుగా మారి సంతోషంగా జీవిస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే నిజమైన, తీవ్ర పోటీ ఉన్న రాజకీయాల్లోకి దిగే సాహసం చేశారు. ఈ సినీ ప్రముఖులందరిలో అతి పెద్ద కళాకారుడైన అమితాబ్ బచ్చన్ ఎన్నికల రాజకీయాల్లోకి దిగిన మూడేళ్ల లోపే ‘గాయపడి’ వెనుదిరిగారు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. అధికారంలో ఉన్నవారిని తర్వాత ఏనాడూ ఆయన ప్రశ్నించలేదు. ఇటీవల కఠువా, ఉన్నావ్ రేప్ ఉదంతాలు వెలుగు చూసినప్పుడు ఆయన ‘గంభీర మౌనం’ పాటించారు. బాల్ ఠాక్రేపై తీసిన ‘సర్కార్’లో నటించినా అమితాబ్ నిజజీవి తంలో ఎవరి జోలికీ పోలేదు. అయితే, రాజ్ బబ్బర్, శత్రుఘ్న సిన్హా, హేమ మాలిని, స్మృతి ఇరానీ, దివ్య స్పందన వంటి కొందరు మాత్రం భిన్న మార్గంలో పయనిస్తున్నారు. మిగిలిన కళాకారులు కొందరు రాజ్యసభ నామినేటెడ్ సభ్యులుగా సంతృప్తిగా బతు కుతూ అవసరం లేకున్నా ప్రభుత్వాలకు అనుకూ లంగా సభలో ఓటు వేస్తున్నారు. నీతులు చెప్పడంతోనే పేచీ! ఈ సినీ ప్రముఖులు తాము రూపొందించే చిత్రాల్లో చెప్పే నీతులు కారణంగా వారిని తప్పు పట్టాల్సి వస్తోంది. మున్నాభాయ్ సిరీస్ సహా 3 ఈడియట్స్ నుంచి పీకే వరకూ రాజ్కుమార్ హిరాణీ సామాజిక సందేశంతో విజయవంతమైన సూపర్ హిట్ సిని మాలు తీశారు. విధువినోద్ చోప్రా దేశభక్తి బోధిస్తూ తీసిన ద మిషన్ కశ్మీర్ చూసి జనం కోట్లాది రూపా యలు సమర్పించుకున్నారు. చోప్రా సొంత రాష్ట్ర మైన కశ్మీర్లో ఐఎస్ఐ కుట్రలను సినిమాలోని మంచి వ్యక్తులు భగ్నం చేయడం మనకు బాగా నచ్చింది. అయితే వారు నివసించే ముంబై నగరంలో మాత్రం ఐఎస్ఐని తేలికగా వదిలేశారు. సంజయ్దత్ అమా యకుని పాత్రలో సామాన్య ప్రజానీకం మధ్య నటిస్తే బాగుంటుంది. కాని, లోపాలతోపాటు ప్రతిభ ఉన్న హీరో పాత్రలో ఆయన అంతగా ఆకట్టుకోలేడు. సంజయ్కు ఏకే 56 రైఫిల్ సరఫరా చేసిన దావూద్ ఇబ్రహీం, ఆయన సోదరుడు అనీస్, ఈ మాఫియా సభ్యులు ఇంకా కరాచీ నుంచి తమ నేర సామ్రాజ్యం నడుపుతూనే ఉన్నారు. అందుకే దావూద్ ‘భాయ్’ ముఠాతో ఎందుకు పేచీ పెట్టుకోవాలనేది ముంబై సినీప్రముఖుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇక జనం కోసం ‘భాయ్’ సల్మాన్ మరో సంచలన చిత్రం నిర్మిస్తారు! కరాచీలో ఉంటున్న ఓ బడా భాయ్ని కోర్టు విచారణకు రప్పించడానికి ఈ పనిచేస్తారు. అగ్రతారలు చెప్పే సాకు ఏమంటే... ఇలాంటి విషయాలపై ధైర్యంగా మాట్లాడకపోవడా నికి అగ్రతారలకు చెప్పడానికి సాకులున్నాయి. ఏం మాట్లాడినా తాము భారీగా నష్టపోతామని వారు వాదిస్తారు. ఓసారి బహిరంగంగా ధైర్యంగా మాట్లాడి ఆమిర్ ఖాన్ ‘పొరపాటు’ చేశారు. ఆయన వ్యాఖ్యలకు ఎదురైన స్పందన ఆయన నోరు మూయించింది. చివరికి ప్రభుత్వంతో ఓ విషయం ప్రచారానికి ఆమిర్తో కుదిరిన ఒప్పందం రద్ద యింది. ఇలాంటి సందర్భమే వచ్చినప్పుడు మరో అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ ఈ మాత్రం ధైర్యం కూడా ప్రదర్శించలేదు. కానీ, ముస్లిం పేర్లున్న పాత్రల్లో నటిస్తూ షారుఖ్ కనీసం ‘మౌన ప్రకటన’ అయినా చేయగలిగారు. సల్మాన్ పూర్తిగా అందరినీ ఓడించే మంచి హిందువుగా నటించారు. తన తాజా చిత్రంలో ఐఎస్ఐని దెబ్బదీసే పాత్రలో రాణించారు. అయితే, కేసుల్లో దోషిగా తేలడం వల్ల సల్మాన్కు కూడా సంజయ్దత్ మాదిరిగానే సమస్య ఎదురవు తోంది. సినిమా వంటి మాధ్యమాలు సమకాలీన సామాజిక, ఆర్థిక వాస్తవాలను ప్రతిబింబించడం ఆనవాయితీగా వస్తోంది. ఆరంభంలో ఈ పనిచేసిన సినిమా రంగం ఇప్పుడు ఆ బాధ్యత విస్మరించింది. సంజూ చిత్రంలో జర్నలిస్టులను దుర్మార్గులుగా చిత్రించడం, వారిపై విద్వేషం కక్కడంపై నాకు కోపం ఏమీ లేదు. పత్రికల్లో ఈ సినీ ప్రముఖులు తమకు అనుకూలంగా ఎలా రాయించుకుంటు న్నారో నాకు బాగా తెలుసు. అలాగే సినిమాలు బాగు న్నాయని డబ్బు ఇచ్చి మరీ ‘రేటింగ్స్’ సంపాదించు కుంటున్నారనేది బహిరంగ విషయమే. అయితే, జర్నలిస్టులను ఇంతగా మాయ చేసి లోబరుచుకున్నా గాని–1993 ముంబై బాంబు పేలుళ్ల చరిత్రను ఎవరూ మార్చలేరు. శక్తిమంతమైన సినీ ప్రపంచం సమాజంలో మార్పు తీసుకురాగలదు. బడుగు బల హీన వర్గాలు, మైనారిటీల హక్కుల రక్షణకు తోడ్పడ గలుగుతుంది. అయితే, అధికారంలో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వాలు, సొంత మూక బలమున్న రాజ్ఠాక్రే, దావూద్ ఇబ్రాహీం వంటి ‘బలవంతుల’ ముందు తలలు వంచితే ఈ పనులు చేయడం కుదరదు. కొన్ని వర్గాల ప్రజలపై ఉన్న అనుమానాలను తప్పని చెప్ప డంగాని, రాజ్యాధికారంతో విర్రవీగేవారిని ప్రశ్నించ డంగాని సాధ్యం కాదు. ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి మరుగుదొడ్లపై సినిమా తీయడం తేలికే. దేశంలో సినిమాల నిర్మాణం మొదలై ఇంత కాల మైనా పది మంది అగ్రశ్రేణి హీరోల్లో ఒక్కరూ కూడా ఓ దళితుడి పాత్ర వేయలేదు. రజనీకాంత్ మాత్రమే సగర్వంగా, ఆత్మవిశ్వాసంతో ఆ పని చేయగలిగారు. ముంబై ‘భాయ్ల’ ముందు మోకరిల్లారు! అత్యంత శక్తిమంతమైన భారత సినీ ప్రపంచం నేర ప్రపంచంలో రారాజులైన ‘భాయ్’ల ముందు మోకరి ల్లిందనే విషయం మనం మరువ రాదు. తమ నిర సన తెలపడానికి ఈ సినీ ప్రముఖులు ఏనాడూ ప్రధా నమంత్రి ఇంటికి ఊరేగింపుగా పోలేదు. వారు గుట్టు చప్పుడు కాకుండా రాజీపడతారు. ముంబై పోలీ సుల్లో ఓ చిన్న బృందం గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్లలో కాల్చిచంపే పని ప్రారంభించగానే వారు సాగిలపడి మరీ తమ జోలికి రావద్దని వేడుకున్నారు. అయితే, అంతా చీకటే కాదు, కొత్త ఆశలు చిగురించే పరి స్థితులు కనిపిస్తున్నాయి. అనేక మంది కొత్త, యువ సినీ దర్శకులు, కళాకారులు తమ అభిప్రా యాలు, ఆదర్శాలు, లక్ష్యాలను బాహాటంగా తమ చిత్రాల్లో ప్రదర్శించడానికి వెనుకాడడం లేదు. అధికారంతో విర్రవీగేవారిని ప్రశ్నించడానికి వారు తెగువ ప్రద ర్శిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య పెరగడమే గాక, వారు వృత్తిలో విజయం సాధించడం మనకు ఆనందాన్నిచ్చే విషయం. వారేమీ అగ్రశ్రేణి దర్శ కులు, నిర్మాతలు, తారలు కాలేదు. ఎప్పటికీ కాకపో వచ్చు కూడా. కానీ, వారు శక్తిమంతులు. వారే హిందీ సినిమా రంగాన్ని భవిష్యత్తులో సృజనాత్మక మార్గంలో నడిపిస్తారు. శేఖర్ గుప్తా, వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
రాజ్ కుమార్ హిరాణితో తరుణ్ భాస్కర్
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షో సందర్భంగా వీరిద్దరు కలుసుకున్నారు. ఇటీవల రిలీజ్ అయిన రాజ్ కుమార్ హిరాణి ‘సంజు’, తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాల గురించి చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో తరుణ్ భాస్కర్ తీయాలనుకుంటున్న సినిమాలకు సంబంధించిన ఆలోచనలను కూడా హిరిణితో చర్చించారట. సంజయ్ దత్ బయోపిక్ ఆధారంగా రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కిన సంజు గత శుక్రవారం రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది చిత్రం కూడా అదే రోజు రిలీజ్ అయి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. -
కష్టాల్లో ఒక స్నేహితుడుండాలి
సంజయ్ దత్ను జైల్లో పడేశారు. పెద్ద స్టార్. పైగా టాడా కేసులో ఉన్నాడు. అతడిని ఎవరైనా చంపితే అదొక గొడవ అని ఒంటరి గదిలో ఉంచారు. చీకటి... మాట్లాడే దిక్కు లేదు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. కేసు నడిచింది. ఏకె 56 రైఫిల్ ఉన్నందుకు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు. అప్పటికే మూడేళ్లు జైల్లో ఉన్నాడు కనుక ఇంకో మూడేళ్లు ఎరవాడ జైల్లో గడపాలి. ముంబై బ్లాస్ట్స్తో కాని టెర్రిరిస్ట్ చర్యతో కాని సంజయ్ దత్కు ఏం సంబంధం లేదనీ కాని ప్రాణభయంతో అనుమతి లేకుండా ఏకె 56 దగ్గర ఉంచుకున్నందుకు మాత్రమే జైలు శిక్ష అని కోర్టు ప్రకటించింది. సంజయ్ దత్ ఎరవాడ జైలుకు చేరుకున్నాడు.ఈసారి నలుగురులో తిరిగేంత స్వేచ్ఛ ఉంది.కొంచెం ఊపిరి సలుపుకునే వీలు ఉంది.కాని అక్కడ సంజయ్కు ఏ జ్ఞాపకం వెంటాడింది.తల్లి ఏనాడో మరణించింది. తండ్రి కూడా గతించాడు.తోబుట్టువుల దగ్గర అన్ని రహస్యాలు మాట్లాడలేము.ఇక మిగిలిందల్లా స్నేహితులు.ఆ స్నేహితులే సంజయ్ దత్కు జైల్లో పదే పదే గుర్తుకొచ్చారు. దగ్గర కూర్చునే స్నేహితులు, ధైర్యం చెప్పే స్నేహితులు, గట్టిగా హగ్ చేసుకునే స్నేహితులు... మనిషి ఆస్తి ఐశ్వర్యాలు కోల్పోయి ఒంటరి కాడు. స్నేహితులను కోల్పోయినప్పుడే ఒంటరి అవుతాడు.జైల్లో ఉన్నప్పుడు అసలైన శిక్ష స్నేహితులను కలవకపోవడమే.‘సంజు’ సినిమాలో ఒక స్నేహితుడి పాత్ర ఉంటుంది. తెర మీద ఆ పాత్ర పేరు ‘కమలేష్ కన్హయ్యలాల్ కపాసి’. నటుడు వికీ కౌశల్ దానిని పోషించాడు.విక్కీ కౌశల్ గతంలో ‘మసాన్’ సినిమాతో ప్రేక్షకులకు తెలుసు. కాని ‘సంజు’ సినిమాతో ఎక్కువమందికి తెలిసి పెద్ద స్టార్ అయ్యాడు. ‘సంజు’ సినిమాలో ఈ పాత్ర చివరికంటా సంజయ్దత పాత్ర పోషించిన రణబీర్ కపూర్కు తోడుగా ఉంటుంది. అమెరికాలో డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో చేరినప్పుడు అతనికి బాసటగా నిలుస్తుంది. అతడి కష్టంలో అండగా నిలుస్తుంది. అలాంటి స్నేహితుడు లేకపోతే సంజయ్దత్ ఏమైపోయి ఉండేవాడా అనిపిస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులకు నిజ జీవితంలో ఈ పాత్ర ఎవరా అనే కుతూహలం కలుగుతుంది. అతని పేరు ‘పరేష్ ఘెలాని’. అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్. ఇతనిది సంజయ్ దత్ది ఒకే వయసు. సంజయ్ తల్లి నర్గిస్ వైద్యం కోసం ఆమెను అమెరికాలోని హాస్పిటల్లో ఉంచినప్పుడు ఆమె కోలుకోవడం కోసం ఒక ఫ్యాన్గా అక్కడి వస్తాడు. అప్పుడే సంజయ్దత్కు పరిచయం అవుతాడు. ఆ పరిచయం చాలా మంచి స్నేహంగా మారుతుంది. అప్పటికే సంజయ్దత్ డ్రగ్స్కు బానిస అయి ఉంటాడు. అతణ్ణి ఆ మత్తు నుంచి బయటపడేయడానికి పరేష్ ఘెలాని చాలా ప్రయత్నించాడు. రిహాబిలేషన్ సెంటర్ నుంచి సంజయ్ పారిపోయి పరేష్ దగ్గరకు చేరుకున్నప్పుడు అతడే తిరిగి సెంటర్కు పంపాడు. ఏకే 56 ఉందన్న కారణంగా అరెస్టయినప్పుడు కూడా అమెరికా నుంచి ఇండియాకు వచ్చి సంజయ్ కోసం తిప్పలు పడ్డాడు. అయితే మీడియా ఏకంగా ముంబై పేలుళ్లకు సంజయే సూత్రధారి అన్నంతగా కథనాలు వెలువరించడంతో అమెరికాలో ఎఫ్బిఐ తనను కూడా విచారిస్తుందన్న భయంతో సంజయ్కు దూరం అయ్యాడు. ఎరవాడ జైలులో సంజయ్కు ఎక్కువగా గుర్తొచ్చిన స్నేహితుడు అతడే. ఇన్నాళ్లకు మళ్లీ ‘సంజు’ సినిమాతో పరేష్ వార్తలలోకి ఎక్కాడు.ఈ సినిమా ఆ ఇద్దరి స్నేహాన్ని మళ్లీ బలపరిచింది.ప్రేక్షకులు ప్రతి మనిషికి ఇలాంటి స్నేహితుడుండాలి అని మెచ్చుకుంటున్నారు.ఆమిర్ ఖాన్ సినిమా చూసి పరేష్ పాత్ర పోషించిన విక్కీ కౌశల్కు ప్రశంసలు కురిపించాడు. అన్నట్టు విక్కీ కౌశల్ సినిమా ఇండస్ట్రీలో ఒక సాధారణ స్టంట్ మేన్ కుమారుడు. కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి ‘సంజు’ సినిమాతో పెద్ద పేరు సంపాదించుకున్నాడు. ఇంతకీ సంజు చూశారా? ఇంకా లే....దా! -
అందుకే వరుసగా 8 విజయాలు సొంతమయ్యాయి..!!
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన గారాల కూతురు సోనమ్ కపూర్పై ప్రశంసల జల్లు కురిపించారు. సినీ రంగంలో కూతురి విజయాలను ప్రస్తావిస్తూ ... ‘జీవితాన్ని తీర్చిదిద్దడంలో మన ఎంపిక చేసుకునే అంశాలే కీలక పాత్ర పోషిస్తాయి. సోనమ్.. స్క్రిప్టులు, డైరెక్టర్లు, కంటెంట్ విషయాల్లో నువ్వు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నావ్. వృత్తి పట్ల నిబద్ధత, నీ కఠోర శ్రమల ఫలితంగానే వరుసగా 8 విజయాలు నీ సొంతమయ్యాయి...! చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూసి నేనెంతో గర్వపడుతున్నాను’ అంటూ అనిల్ కపూర్ ట్వీట్ చేశారు. సోనమ్ హిట్ సినిమాలు... నీర్జా, రాంజానా, భాగ్ మిల్కా భాగ్, ప్యాడ్మాన్, ఖూబ్సూరత్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వీరే ది వెడ్డింగ్, సంజు సినిమాలకు సంబంధించిన పోస్టర్ల ఫొటోల సమాహారాన్ని అనిల్ కపూర్ తన ట్వీట్తో పాటుగా షేర్ చేశారు. 2007 లో ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సోనమ్.. మొదట్లో సరైన హిట్లు లేక సతమతమైంది. కానీ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆమె నటించిన తాజా చిత్రాలు వీరే ది వెడ్డింగ్, సంజులు హిట్ టాక్ను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం రాజ్ కుమార్కు జంటగా నటిస్తోన్న ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో సోనమ్ కపూర్ తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది . The choices we make shape our lives. @sonamakapoor you have made some pretty damn good ones when it comes to scripts, directors & content...Your hard work, commitment & conviction has resulted in 8 hits in a row! So happy & proud of you! pic.twitter.com/R4LuMIh7oM — Anil Kapoor (@AnilKapoor) July 2, 2018 -
బాహుబలి-2 రికార్డు బద్ధలు
ఇండియన్ భాక్సాఫీస్ వద్ద బాహుబలి ది కంక్లూజన్ సృష్టించిన రికార్డులు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయి. హిందీతోపాటు విడుదలైన అన్ని భాషల్లోనూ బెంచ్ మార్క్ రికార్డులను క్రియేట్ చేసింది. అప్పటి నుంచి విడుదలైన చిత్రాలు భారీస్థాయిలో స్క్రీన్లలో రిలీజ్ చేసినప్పటికీ ఆ ఫీట్ను అందుకోలేకపోయాయి. అయితే ఎట్టకేలకు రీసెంట్ రిలీజ్ సంజు బాహుబలి-2 నెలకొల్పిన ఓ రికార్డును మాత్రం అధిగమించింది. ఈ చిత్రం ఆదివారం(మూడో రోజు) రూ. 46.71 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. అంతకు ముందు ఆ రికార్డు రూ.46.50 కోట్లతో బాహుబలి-2(హిందీ వర్షన్) పేరిట ఉంది. ఏదైతేనేం మొత్తానికి బాహుబలి-2కి చెందిన ఓ రికార్డును అధిగమించామని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించేస్తోంది. రాజ్కుమార్ హిరాణీ డైరెక్షన్లో రణ్బీర్ కపూర్ లీడ్ రోల్లో నటించిన సంజు కేవలం మూడు రోజుల్లోనే రూ. 120 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. తొలిరోజ దాదాపు రూ.35 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనర్గా నిలవటంతోపాటు.. రణ్బీర్ కెరీర్ బెస్ట్ ఓపెనర్గా కూడా నిలిచింది. సాహోరే.. హైబ్రిడ్ పిల్లా -
మేకింగ్ ఆఫ్ సంజు
-
వంద కోట్ల క్లబ్లో ‘సంజు’
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సంజు అదే రేంజ్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంజయ్ దత్ బయోపిక్గా తెరకెక్కిన ఈ మూవీలో రణబీర్కపూర్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా సంజయ్ వ్యవహారాలకు సంబంధించి, ఎఫైర్ల గురించి చెబుతూ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్తో రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు 34 కోట్టు రాబట్టి రణబీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే వీకెండ్ కూడా పూర్తయింది. మొదటి వారాంతానికి వంద కోట్ల క్లబ్లో చేరిన సంజు.. రెండో వారాంతానికి రెండు వందల కోట్ల క్లబ్లోకి చేరతాడని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, విక్కీ కౌశల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. TOP 5 - 2018 Opening Weekend biz... 1. #Sanju ₹ 120.06 cr 2. #Padmavaat ₹ 114 cr [5-day *extended* weekend; select previews on Wed, released on Thu]... Hindi + Tamil + Telugu. 3. #Race3 ₹ 106.47 cr 4. #Baaghi2 ₹ 73.10 cr 5. #Raid ₹ 41.01 cr India biz. — taran adarsh (@taran_adarsh) July 2, 2018 -
ఆయనకు నేను బిగ్ ఫ్యాన్ : హీరోయిన్
సాక్షి, ముంబై : సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ మూవీ హిట్ టాక్తో దూసుకుపోతోంది. సంజుగా రణ్బీర్ నటన విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా సంజు మూవీ దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ, రణ్బీర్ కపూర్లపై హీరోయిన్ అలియా భట్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన అనంతరం తన స్పందన తెలియజేస్తూ... ‘రాజ్కుమార్కు నేను పెద్ద అభిమానిని. ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ ఇవ్వడం సాధారణ విషయంగా మారిపోయింది. అయితే గత రెండేళ్లలో ఆయన తీసిన గొప్ప సినిమా ఏదంటే మాత్రం కచ్చితంగా సంజు అనే చెప్తాను. ఈ సినిమా ద్వారా ఆయన స్టామినా ఏంటో మరోసారి రుజువైంది’ అంటూ అలియా వ్యాఖ్యానించారు. పనిలో పనిగా తన స్నేహితుడు రణ్బీర్ కపూర్ను కూడా పొగడ్తల్లో ముంచెత్తారు అలియా. ‘సంజు పాత్రలో రణ్బీర్ జీవించేశారు. నా ఫేవరెట్ సినిమాల్లోని టాప్ 10లో సంజుకు మొదటి స్థానం ఇస్తాను. విక్కీ కౌశల్, పరేష్ జీ, అనుష్క శర్మ, సోనమ్ కపూర్ ఇలా ప్రతీ ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇదొక అద్భుతమైన సినిమా’ అంటూ అలియా ప్రశంసించారు. -
‘అమ్మ చనిపోతే కనీసం ఏడవలేదు’
భావోద్వేగాలతో తెరకెక్కిన రణ్బీర్ కపూర్ ‘సంజు’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సీనియర్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ కావటంతో ఆయన జీవితంలోని ఆసక్తికర కోణాలను తెలుసుకునేందుకు కొందరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో సంజూ బాబా పాత వీడియోలు వైరల్గా మారుతున్నాయి. అందులో తన తల్లి చనిపోయిన సమయంలో తాను ఎలా ప్రవర్తించిందనేది చెబుతూ భావోద్వేగానికి లోనైన ఇంటర్వ్యూ ఒకటుంది. 90వ దశకంలో తీసిన ఆ ఇంటర్వ్యూలో సంజయ్ చెప్పిన మాటలు... ‘నా తల్లిది చాలా మంచి మనస్తత్వం. సెట్స్లో అందరితోనూ మంచిగా మెలిగేది. ఆమె చనిపోయినప్పుడు నేను ఎలాంటి ఎమోషన్లను చూపించలేకపోయా. కనీసం ఏడవలేదు కూడా. రెండేళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో గ్రూప్గా కూర్చున్న సమయంలో హఠాత్తుగా ఓ ఆడియో క్లిప్ ప్లే అయ్యింది. అందులో ఉంది నా తల్లి వాయిస్. (బ్యాక్ గ్రౌండ్లో నర్గీస్దత్ గొంతు వినిపించింది...)... ‘అది విన్నాక ఆమెకు నా మీద ఎంత ప్రేమ ఉందో?.. ఎంత జాగ్రత్తలు తీసుకుందో? తను నా గురించి ఏం కోరుకుందో? అప్పుడు నాకు అర్థమైంది. అంతే నా ప్రమేయం లేకుండా కళ్లలోంచి నీళ్లు వచ్చేశాయి. అలా నాలుగైదు గంటలు ఏడ్చుకుంటూ ఉండిపోయా. తప్పో.. ఒప్పో.. అన్నీ నాలోనే ఉంటాయి. వాటిని బయటకు తీసినప్పుడే మారినమనిషిని అవుతాను’ సంజు ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సంజు డెబ్యూ చిత్రం రాకీకి కొద్ది రోజుల ముందే నటి, సునీల్ దత్ సతీమణి నర్గీస్ దత్ చనిపోవటం తెలిసిందే. -
సంజయ్ దత్ ఎమోషనల్ వీడియో
-
90ల నాటి నుంచే ‘సంజు’ ప్రమోషన్...!
బాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో రణ్బీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా 1993 నాటి ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసిన రిషి కపూర్... ‘ థ్యాంక్యూ! ఈ నలుగురు అప్పుడెప్పటి నుంచో మూవీ(సంజు)ని ప్రమోట్ చేస్తూ ఉన్నారంటూ’ కామెంట్ చేశారు. అసలు విషయమేమిటంటే... 1993 ముంబై పేలుళ్ల సమయంలో అరెస్టైన సంజయ్ దత్కు సంఘీభావం తెలుపుతూ బాలీవుడ్ పరిశ్రమ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ‘సంజు వీ ఆర్ విత్ యూ’ (సంజు మేము నీతో ఉన్నాం) అనే పోస్టర్తో సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్లు నిల్చుని ఉన్న పాత ఫొటోను రిషి కపూర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న రణ్బీర్ సంజు సినిమాను ప్రమోట్ చేసేందుకు రిషి కపూర్ కష్టపడాల్సిన అవసరం లేదోమో’ అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు. సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సంజు సినిమా పాజిటివ్ టాక్తో భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. సంజు పాత్రకు ప్రాణం పోసిన రణ్బీర్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతుండటంతో రిషి కపూర్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. Thank you! These people been promoting the film ever since! pic.twitter.com/Ot2iDM9Hk7 — Rishi Kapoor (@chintskap) June 29, 2018 -
హయ్యెస్ట్ గ్రాసర్గా ‘సంజు’
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ తొలిరోజు కలెక్షన్ల దుమ్మురేపింది. ఈ ఏడాది ఇప్పటిదాకా రిలీజ్ అయిన చిత్రాల్లో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టింది. అంతేకాదు రణ్బీర్ కెరీర్లోనే బెస్ట్ వసూళ్లు(ఫస్ట్ డే) రాబట్టిన చిత్రంగా నిలిచింది. సంజు మూవీ రివ్యూ బాలీవుడ్ ట్రేడ్ అనాలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం ఇండియాలోనే సంజు ఫస్ట్ డే రూ. 34.75 కోట్లు రాబట్టింది. ఇక రణ్బీర్ కెరీర్లో ఇప్పటిదాకా తొలిరోజు వసూళ్లు రాబట్టిన చిత్రంగా సంజు నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు బేషరమ్(రూ.21.56) పేరిట ఉంది. చిత్రానికి పాజిటివ్ టాక్ రావటంతో వీకెండ్లోనే వంద కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని ఆదర్శ్ అంచనా వేస్తున్నారు. రాజ్కుమార్ హిరాణీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామాలో పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, విక్కీ కౌశల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
సంజయ్ దత్తు
సినిమా హీరోలకు మేకప్ మామూలే. తళతళలాడిపోడానికి పూస్తారు. సమాజంలో కూడా రంగులు పులిమేవారుంటారు. నిజం సరిగ్గా తెలియకపోతే ఆ రంగులు భలే ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. ఒక్కోసారి ఆ రంగులే నిజం అనిపిస్తాయి. సంజయ్దత్ జీవితంలో అలాంటి రంగులు ఎన్నో! ఉగ్రవాది.. వ్యసనపరుడు.. స్త్రీలోలుడు.. వగైరా.. వగైరా..! ‘సంజూ’ సినిమాలో రాజ్కుమార్ హిరాణీ ఈ రంగుల్లో నిజానిజాల్ని ఇంకో కోణంలో చూపించాడు. సంజయ్ని ముత్యంలా చూపించడానికి దత్తత తీసుకున్నాడు! డ్రగ్స్, ఆల్కహాల్, అమ్మాయిలు, గన్స్, గూండాలు.. ఇదంతా సినిమా సరుకు. సంజయ్దత్ జీవితాన్ని ‘సంజు’ సినిమాగా తీసిన రాజ్కుమార్ హిరాణీకి ఈ సరుకు ఎక్కడా వెతుక్కోకుండానే గంపగుత్తగా ఒకటే చోట దొరికింది. సంజయ్దత్ జీవితంలోనే ఇవన్నీ ఉన్నాయి. వాటికి హిరాణి కొంచెం ఎమోషన్ కలిపాడు. పిక్చర్ హిట్ అయింది. ఐదు స్టార్లకు అంతా నాలుగు స్టార్లు వేస్తున్నారు. సంజయ్ రోల్ వేసిన రణబీర్ కపూర్ కూడా మళ్లీ చాలాకాలం తర్వాత ఈ సినిమాతో స్టార్ అయ్యాడు. ‘నేను టెర్రరిస్టును కాదు’ పాతికేళ్లుగా సంజయ్దత్ తన నెత్తిమీద ‘టెర్రరిస్ట్’ అనే గంపను మోస్తున్నాడు. అది అతడి జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్నిప్పుడు దించి, సినిమాలో పెట్టి సంజయ్ మనో భారం తగ్గించాడు హిరాణీ. కళంకితుడన్న ఇమేజ్ని తొలగించి సంజయ్ని ప్రక్షాళన చెయ్యిడానికి హిరాణీ ఈ సినిమా తియ్యలేదు. ఒక స్టార్ తనయుడు.. విలాసాలకు, విపరీతాలకు అలవాటు పడినవాడు.. జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడో కూడా హిరాణీ చెప్పలేదు. నిరంతరం ప్రశ్నలతో విసిగించి, వేధించే మీడియా నుంచి పారిపోయి.. ‘నేను టెర్రరిస్టును కాదు’ అని అరిచి చెప్పడానికి బయోగ్రఫీని రాయించాలనుకుంటాడు రణబీర్కపూర్ (సంజు). పూర్తిగా అతడి సైడు నుంచి స్టోరీ చెప్పాలి. అనుష్క వస్తుంది బయోగ్రఫీ రాయడానికి. వస్తుంది కానీ, గొప్ప ఉద్వేగంతో వచ్చేం కూర్చోదు. టెర్రరిస్ట్ బయోగ్రఫీలో తెలియంది ఏముంటుందీ?! ‘ఏముంటుందిలే అనుకునేదానిలో ఎంతో ఉండొచ్చు’ అని రణబీర్ భార్య దియా మీర్జా అంటుంది. రణబీర్ కూడా అంతా నిజమే చెబుతాను అంటాడు. అనుష్క రెడీ అవుతుంది. సినిమా మొదలౌతుంది. ఒక్కో ఘట్టం చెప్పుకుంటూ పోతాడు రణవీర్. ఒక్కో ఘట్టం రాసుకుంటూ పోతుంది అనుష్క. ఒక్కో ఘట్ట తీసుకుంటూ పోతాడు రాజ్ హిరాణీ. రీలంతా రియల్ లైఫే బయోపిక్ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో సీనియర్ నటుడు సంజయ్దత్ జీవితగాథను సినిమాగా తీస్తున్నట్లు ప్రకటించి, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ. పైగా సక్సెస్ లేక సతమతమవుతున్న యువ హీరో రణ్బీర్ కపూర్ను ‘సంజు’ మూవీ రోల్కు తీసుకోవటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ట్రైలర్, ప్రొమోల్లో అచ్చం ‘సంజూబాబా’లా కనిపించిన రణ్బీర్.. ఆ అంచనాలను తారస్థాయికి చేర్చాడు. కథేమిటంటే.. స్టార్ వారసుడిగా బాలీవుడ్లో అడుగుపెట్టి, తొలి చిత్రం (రాకీ)తోనే స్టార్డమ్ సంపాదిస్తాడు సంజు. సినీ ప్రస్థానం కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్ అలవాటు, అక్రమాయుధాల కేసు అతడి జీవితాన్ని కుదిపేస్తాయి. ఆయుధాల కేసులో తనకు తానుగా లొంగిపోవాలని భావిస్తాడు. కానీ, అంతకు ముందే తన జీవితాన్ని కథగా బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. బయోగ్రాఫర్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విన్నె (అనుష్క శర్మ) ముందుకు వస్తుంది. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సంజు.. అనుష్కకు వివరిస్తూ ఉండగా కథ సాగుతుంది. ‘ఒక్క మనిషి.. పలు కోణాలు’ ఈ ట్యాగ్ లైన్తోనే సంజు జీవితంలోని దశలను దర్శకుడు వివరించే ప్రయత్నం చేశాడు. వివాదాల నటుడు సంజయ్ దత్ లైఫ్ను తెరపై ఆయన డీల్ చేసిన విధానం అద్భుతం. వివాదాలను కూడా ఎమోషనల్గా మలిచిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తన జీవితంలో ఎత్తుపల్లాలను పూస గుచ్చినట్లుగా వివరిస్తూ సంజు కథ ముందుకు సాగుతుంది. తల్లి మరణం, హీరోగా ఎదిగే క్రమంలో డ్రగ్స్ అలవాటుతో సంజు సతమతమయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు చేసే స్ట్రగ్రుల్, విమర్శలు వెల్లువెత్తినా తండ్రి (పరేష్ రావెల్) కొడుక్కి అండగా నిలవటం, ముఖ్యంగా వాళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే ఫస్టాఫ్ను గ్రిప్పింగ్గా నడిపిన దర్శకుడు.. సెకండాఫ్ను మొత్తం జైలు జీవితం, కేసు, కోర్టు ప్రధానాంశాలుగా నడిపించాడు. తాను టెర్రరిస్ట్ను కాదంటూ సంజు పడే మానసిక సంఘర్షణ, భావోద్వేగపూరిత సన్నివేశాలతోనే ద్వితీయార్థాన్ని కానిచ్చేశాడు. ఈ క్రమంలో సంజు కెరీర్ను చూపించినా.. వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. హీరోయిన్లతో రిలేషన్షిప్స్, వైవాహిక జీవితంలోని లోతైన అంశాలను (మొదటి భార్య రిచా శర్మ, కూతురు త్రిశల గురించి) చూపించకుండా సంజు కథ సాగింది. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. దియా మెప్పించారు సంజయ్ దత్ పాత్రలోకి రణ్బీర్ కపూర్ జీవించేశాడు. సంజు అంటే రణబీర్ అనేలా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో రణ్బీర్ తనను తాను అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు. డ్రగ్స్ బాధితుడిగా చేసే సన్నివేశాలు అయితేనేం, వీధుల్లో అడుక్కునే సీన్ అయితేనేం, పోలీస్ విచారణలో, ఆస్పత్రిలో స్నేహితుడితో... ఒక్కటి కాదు.. చెప్పుకుంటూ పోతే బోలెడు సీన్లు. తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం అనిపిస్తుంది. ఇక సంజు బెస్ట్ ఫ్రెండ్ కమలేష్ (విక్కీ కౌశల్) పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా ఉండటం, సంజు–కమలేష్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. నర్గీస్ దత్ పాత్రలో సీనియర్ నటి మనీషా కొయిరాలాకు పెద్దగా సీన్లు లేవు. అయినా ఉన్నంతలో ఆమె పాత్ర అలరిస్తుంది. భార్య మాన్యతా పాత్రలో దియా మీర్జా మెప్పించారు. సోనమ్ కపూర్, అనుష్క శర్మ, మిగతా పాత్రలు ఓకే. పలువురు సెలబ్రిటీలు, చివర్లో కాసేపు స్వయంగా సంజయ్ దత్ కనిపించటం ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్, రోహన్ రోహన్–విక్రమ్ మాంట్రెసె సంగీతం సినిమాకు తగ్గ మూడ్ను అందించింది. ‘కర్ హర్ మైదాన్ ఫతే సాంగ్’, ‘రుబీ రుబీ’ పాటలు అలరిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్తోపాటు విజువల్గా కూడా సంజు మెప్పిస్తుంది. రాజ్కుమార్ హిరాణీ అద్భుతమైన స్టోరీ టెల్లర్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. దత్ ఫ్యామిలీతో ఉన్న స్నేహాన్ని పక్కనపెట్టి మరీ కథానుగుణంగా కొన్ని సన్నివేశాలను స్వేచ్ఛగా తెరకెక్కించారు. చిత్రం నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఓవరాల్గా హిరాణీ సినిమాల్లో లభించే హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమర్ ఎలిమెంట్స్ ‘సంజు’లో పుష్కలంగా లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 5300 స్క్రీన్లు ‘సంజు’తో రణ్బీర్ కపూర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్తో స్టార్టయ్యింది. శుక్రవారం సినిమాకి íß ట్ టాక్ వస్తే శని, ఆదివారాలు హౌస్ఫుల్ అవుతాయి. అటువంటిది ‘సంజు’ సినిమా ముందుగానే అడ్వాన్స్ బుకింగ్లతో హోరెత్తిందనే చెప్పాలి. ఇకపోతే బాలీవుడ్లో రెండు రకాలుగా సినిమా ఓపెనింగ్స్ ఉంటాయి. హాలిడే ఓపెనింగ్, నాన్ హాలిడే ఓపెనింగ్. శుక్రవారం నార్త్ ఇండియాలో నాన్ హాలిడే ఓపెనింగ్ 55 శాతంతో మార్నింగ్ షో స్టార్టయ్యింది. అంటే అది చాలా పెద్ద ఓపెనింగ్ కింద లెక్క. మొత్తమ్మీద 4000 స్క్రీన్లతో పాటు విదేశాల్లోని 1300 స్క్రీన్లు కలుపుకుని 5300 స్క్రీన్లలో రిలీజైంది సంజు. మొదటిరోజు షేర్ 33 కోట్లనుండి 36 కోట్ల వరకు వస్తుందని బిజినెస్ అనలిస్ట్ల విశ్లేషణ. ఇది రీసెంట్గా రిలీజైన సల్మాన్ఖాన్ రేస్3 కంటే ఎక్కువ. (రేస్3 ఫస్ట్ డే షేర్ 29.5 కోట్లు) అని ‘సంజు’ విశేషాలను వివరించారు ఫాక్స్ స్లార్ ఇండియా హైదరాబాద్ ప్రతినిధి తెలిపారు. ‘సంజు’కు భారీ షాక్ కొన్ని గంటల క్రితమే విడుదలైన ఈ సినిమాకు ఇంతలోనే భారీ షాక్ తగిలింది. పైరసీ భూతం సంజు సినిమానూ వదల్లేదు. ప్రస్తుతం ‘సంజు’ పైరసీ కాపీ, అది కూడా హెచ్డీ ప్రింట్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. అది కూడా పూర్తి నిడివి చిత్రం కావడం గమనార్హం. ఇది గమనించిన సోషల్ మీడియా యూజర్లు ఆ వెబ్సైట్ లింక్ను స్క్రీన్ షాట్స్ తీసి ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. సినిమా విడుదలైన కొద్దిసేపటికే ఈ సంఘటన జరగడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. సినిమా లీక్ అయిన విషయం తెలుసుకున్న రణ్బీర్ కపూర్ అభిమానులు ఈ విషయం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అభిమానులు ‘సంజు లీక్ అయ్యింది. దయచేసి ఈ లింక్లను ఎవరికీ షేర్? చేయకండి’ అంటూ రణ్బీర్కు మద్దతు తెలుపుతున్నారు. సంజుపై కామెంట్స్ సంజు చాలా బాగా నచ్చింది. తండ్రీకొడుకులు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ మనసుని కదలించేలా చెప్పారు రాజ్ కుమార్గారు. రణ్బీర్ కపూర్ అవుట్స్టాండింగ్గా చేశారు. విక్కీ కౌశల్ మైండ్బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎంటర్టైన్ చేస్తూనే ఎంగేజింగ్గా కథ చెప్పారు హిరాణీ. టీమ్ అందరికీ కంగ్రాట్స్. – ఆమిర్ ఖాన్ కేవలం రెండున్నర గంటల్లో ఏడుస్తూనే, నవ్వించడం అచీవ్మెంట్. ప్రస్తుతం ఉన్న నెంబర్ 1 ఫిల్మ్ మేకర్ రాజ్ కుమార్ హిరాణీ. సంజయ్ దత్లా రణ్బీర్ అత్యద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. మిమిక్రీ చేస్తున్నట్టుగా కాకుండా సంజయ్ దత్ క్యారెక్టర్ స్కిన్లోకి వెళ్లి మరి నటించాడు. మనందర్నీ స్క్రీన్కి కట్టిపారేస్తాడు. బ్లాక్బస్టర్ హిట్కొట్టినందుకు టీమ్కి కంగ్రాట్స్. – దర్శక–నిర్మాత కరణ్ జోహార్ మాస్టర్ ఆఫ్ సినిమా నుంచి మరో బెస్ట్ జెమ్ బయటకు వచ్చింది. బెస్ట్ ఇవ్వడంలో రణ్బీర్, రాజ్ కుమార్ హిరాణీ ఇద్దరూ పోటీపడ్డారు. – దర్శకుడు హరీష్ శంకర్. రాజ్ కుమార్ సార్... మంచి సినిమా ఇవ్వడం ప్రతిసారీ మీకెలా సాధ్యం అవుతుంది? మైండ్బ్లోయింగ్ సినిమా. నవ్వించారు. ఏడిపించారు. రణ్బీర్, రాజు సార్ మీ ఇద్దరికీ పెద్ద హగ్. థియేటర్ నుంచి ఓ బెటర్ పర్సన్గా.. నన్ను బయటకు పంపించారు. – ధనుశ్, తమిళ నటుడు మాస్టర్పీస్. బయోపిక్ తీయడమంటే ఆషామాషీ కాదు. కానీ, రాజు హిరాణీ, రైటర్ అభిజిత్ జోషీ అద్భుతమైన స్క్రీన్ప్లే రాశారు. పవర్ఫుల్. ఎంగేజింగ్, ఎమోషనల్. రాజ్కుమార్ ఎందుకు మాస్టర్ స్టోరీ టెల్లరో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రణ్బీర్ కపూర్కి ఈ సినిమాతో అవార్డ్లు, అభినందనలు అందుకుంటాడు. సినిమాలో ప్రతి ఒక్కరు తమ పాత్రల్లో మెరిశారు. – తరణ్ ఆదర్శ్, ట్రెడ్ అనలిస్ట్ -
‘ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడం మర్చిపోయాను’
భారీ అంచనాల మధ్య రికార్డు స్థాయిలో విడుదలైన ‘సంజు’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొడుతూ సూపర్ హిట్ వైపు దూసుకెళ్తోంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖులు కూడా తెగ అభినందిస్తున్నారు. తాజగా ఈ జాబితాలోకి మరో సీనియర్ నటి చేరారు. విభిన్న కథలతో...అద్భుతమైన నటనతో హిందీ చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ హీరోయిన్ షబనా ఆజ్మీ ‘సంజు’ను అభినందిస్తూ ట్విటర్లో మెసేజ్ చేశారు. ఈ సందర్భంగా రిషి కపూర్ను ట్యాగ్ చేస్తూ ‘సంజు సినిమా చూశాను...రణ్బీర్ జీవితంలోనే ఇది అద్భుతమైన సినిమా అవుతుంది. ‘సంజు’లో రణ్బీర్ యాక్టింగ్ చూసి నిజంగా ఒక్క క్షణం నేను ఊపిరి తీసుకోవడం మర్చిపోయాను. విక్కి కౌశల్ నువ్వు నీ పాత్రకు న్యాయం చేశావు’అని మెసేజ్ చేశారు. -
‘సంజు’కు భారీ షాక్...
సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ చిత్రం బాక్సాఫీస్ల వద్ద కలేక్షన్ల సునామీ సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా కేవలం ఒక్క భాషలోనే 4000 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొన్ని గంటల క్రితమే విడుదలైన ఈ సినిమాకు ఇంతలోనే భారీ షాక్ తగిలింది. పైరసీ భూతం సంజు సినిమానూ వదల్లేదు. ప్రస్తుతం ‘సంజు’ పైరసీ కాపీ, అది కూడా హెచ్డీ ప్రింట్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. అది కూడా పూర్తి నిడివి చిత్రం కావడం గమనార్హం. ఇది గమనించిన సోషల్ మీడియా యూజర్లు ఆ వెబ్సైట్ లింక్ను స్క్రీన్ షాట్స్ తీసి ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. సినిమా విడుదలైన కొద్దిసేపటికే ఈ సంఘటన జరగడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. సినిమా లీక్ అయిన విషయం తెలుసుకున్న రణ్బీర్ కపూర్ అభిమానులు మాత్రం ఈ విషయం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ‘నిజమైనా సిని అభిమానులు ఇలాంటి పనికిమాలిన చర్యలను ప్రోత్సాహించరు. వారు థియేటర్కి వెళ్లి, టిక్కెట్ కొని సినిమా చూస్తార’ని ప్రచారం చేస్తున్నారు. మరికొందరు అభిమానులు ‘సంజు లీక్ అయ్యింది. దయచేసి ఈ లింక్లను ఎవరికీ షేర్ చేయకండి’ అంటూ రణ్బీర్కు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం ఈ విషయం గురించి సీబీఎఫ్సీని విమర్శిస్తున్నారు. గతంలో సంజు సినిమాలోని టాయిలెట్ దృశ్యాలు విడుదలయినప్పడు సీబీఎఫ్సీ నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. దాన్ని ఉటంకిస్తూ ‘టాయిలెట్ సీన్లు విడుదలైతే దేశ గౌరవాన్ని కించపరిచామని వాదించిన వారు ఇప్పుడు సినిమా మొత్తం లీక్ అయింది. అయినా ఎందుకు మాట్లడటం లేదు’ అని విమర్శిస్తున్నారు. -
‘సంజు’ మూవీ రివ్యూ
టైటిల్ : సంజు జానర్ : బయోపిక్ తారాగణం : రణ్బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, దియా మీర్జా, విక్కీ కౌశల్, అనుష్క శర్మ తదితరులు సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : రాజ్కుమార్ హిరాణీ నిర్మాత : విదూ వినోద్ చోప్రా, రాజ్కుమార్ హిరాణీ Sanju Telugu Movie Review: బయోపిక్ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవితగాథ సంజును ప్రకటించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ. పైగా సక్సెస్ లేక సతమతమవుతున్న యువ హీరో రణ్బీర్ కపూర్ను సంజు రోల్కు తీసుకోవటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ట్రైలర్-ప్రొమోల్లో అచ్చం సంజు బాబాల కనిపించిన రణ్బీర్.. ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చాడు. భారీ అంచనాల మధ్య సంజు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సంజుగా రణ్బీర్ ఏమేర అలరించాడో చూద్దాం... కథ.. స్టార్ వారసుడిగా బాలీవుడ్లో అడుగుపెట్టి డెబ్యూ చిత్రం(రాకీ)తోనే స్టార్డమ్ సంపాదిస్తాడు సంజు(రణ్బీర్ కపూర్). సినీ ప్రస్థానం కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్ అలవాటు, అక్రమాయుధాల కేసు సంజు(రణ్బీర్ కపూర్) జీవితాన్ని కుదిపేస్తాయి. ఆయుధాల కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు తానుగా లొంగిపోవాలని సంజు భావిస్తాడు. కానీ, అంతకు ముందే తన జీవిత కథగా మలిచేందుకు ప్రయత్నిస్తాడు. రచయిత కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విన్నె(అనుష్క శర్మ) ముందుకు వస్తుంది. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సంజు.. విన్నెకు వివరిస్తూ కథ సాగుతుంది. విశ్లేషణ.. మనకు బాగా తెలిసిన వ్యక్తి జీవితంలోని ఆసక్తికర అంశాలను కూలంకుశంగా తెలుసుకోవాలనే ఆసక్తి సహజం. ‘ఒక్క మనిషి.. పలు కోణాలు’ అంటూ ట్యాగ్ లైన్తోనే సంజు జీవితంలోని దశలను దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ వివరించే యత్నం చేశాడు. అయితే వివాదాల నటుడు సంజయ్ దత్ లైఫ్ను తెరపై హిరాణీ డీల్ చేసిన విధానం అద్భుతం. వివాదాలను కూడా ఎమోషనల్గా మలిచిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తన జీవితంలో ఎత్తుపల్లాలను పూసగూచ్చినట్లు వివరిస్తూ సంజు కథ ముందుకు సాగుతుంది. తల్లి మరణం, హీరోగా ఎదిగే క్రమంలో డ్రగ్స్ అలవాటుతో సంజు సతమతమయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు చేసే స్ట్రగుల్, విమర్శలు వెల్లువెత్తినా తండ్రి(పరేష్ రావెల్) కొడుక్కి అండగా నిలవటం, ముఖ్యంగా వాళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే ఫస్టాఫ్ను గ్రిప్పింగ్గా నడిపిన దర్శకుడు.. సెకండాఫ్ను మొత్తం జైలు జీవితం, కేసు, కోర్టు ప్రధానాంశాలుగా నడిపించాడు. తాను టెర్రరిస్ట్ను కాదంటూ సంజు పడే మానసిక సంఘర్షణ, భావోద్వేగపూరిత సన్నివేశాలతోనే ద్వితీయార్థాన్ని కానిచ్చేశాడు. అయితే ఈ క్రమంలో సంజు కెరీర్ను చూపించినా.. వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. హీరోయిన్లతో రిలేషన్షిప్స్, వైవాహిక జీవితంలోని లోతైన అంశాలను(మొదటి భార్య రిచా శర్మ, కూతురు త్రిశల గురించి) చూపించకుండా సంజు కథ సాగటం గమనార్హం. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురికావొచ్చు. నటీనటుల విషయానికొస్తే.. సంజయ్ దత్ పాత్రలోకి రణ్బీర్ కపూర్ జీవించేశాడు. సంజు అంటే రణబీర్ అనేలా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో రణ్బీర్ తనను తాను అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు. డ్రగ్స్ బాధితుడిగా చేసే సన్నివేశాలు అయితేనేం, వీధుల్లో అడుక్కునే సీన్ అయితేనేం, పోలీస్ విచారణలో, ఆస్పత్రిలో స్నేహితుడితో... ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే బోలెడు సీన్లు. ఎమోషనల్ సీన్లలోనే కాదు.. కామెడీతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను కూడా పండించాడు. తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం అనిపించింది. సాధారణంగా ఎంటర్టైన్మెంట్ పాత్రలకు పేరుగాంచిన ఈ సీనియర్ నటుడు.. సీరియస్ నటనతో సంజుకు బలంగా నిలిచాడు. ఇక సంజు బెస్ట్ ఫ్రెండ్ కమలేష్(విక్కీ కౌశల్) పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా ఉండటం, సంజు-కమలేష్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. నర్గీస్ దత్ పాత్రలో సీనియర్ నటి మనీషా కోయిరాలాకు పెద్దగా సీన్లు లేవు. అయినా ఉన్నంతలో ఆమె పాత్ర అలరిస్తుంది. భార్య మాన్యతా పాత్రలో దియా మీర్జా మెప్పించారు. సోనమ్ కపూర్, అనుష్క శర్మ, మిగతా పాత్రలు ఓకే. పలువురు సెలబ్రిటీలు, చివర్లో కాసేపు స్వయంగా సంజయ్ దత్ కనిపించటం ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్, రోహన్ రోహన్-విక్రమ్ మాంట్రెసె సంగీతం సినిమాకు తగ్గ మూడ్ను అందించింది. కర్ హర్ మైదాన్ ఫతే సాంగ్, రుబీ రుబీ పాటలు అలరిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్తోపాటు విజువల్గా కూడా సంజు మెప్పిస్తుంది. రాజ్కుమార్ హిరాణీ అద్భుతమైన స్టోరీ టెల్లర్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. దత్ ఫ్యామిలీతో ఉన్న స్నేహాన్ని పక్కనపెట్టి మరీ కథానుగుణంగా కొన్ని సన్నివేశాలను స్వేచ్ఛగా తెరకెక్కించారు. చిత్రం నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఓవరాల్గా హిరాణీ సినిమాల్లో లభించే హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమర్ ఎలిమెంట్స్ ‘సంజు’లో పుష్కలంగా లభిస్తాయి. ఫ్లస్ పాయింట్లు కథా-కథనం రణ్బీర్ కపూర్ మిగతా పాత్రలు సంగీతం మైనస్ పాయింట్లు కొన్ని ఆసక్తికరమైన అంశాలను చూపించకపోవటం అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
సంజుపై సెక్స్ వర్కర్ల ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: సెక్స్ వర్కర్ల మనోభావాలను దెబ్బతీశారంటూ బాలీవుడ్ చిత్రం సంజుపై జాతీయ మహిళా కమిషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. చిత్ర ట్రైలర్లో ఓ డైలాగ్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు ఎన్సీడబ్య్లూలో ఫిర్యాదు చేశారు. ‘మీ భార్యతో కాకుండా ఎంత మందితో పడుకున్నారంటూ అనుష్క పాత్ర రణ్ బీర్ ను అడుగుతుంది. దానికి స్పందిస్తూ.. వేశ్యలతో కలుపుకుని చెప్పాలా? లేక.. అంటే వారిని మినహాయించి చెప్పాలంటే 308 మందితో... అంటూ సమాధానం ఇస్తాడు. ఈ డైలాగ్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ సెక్స్ వర్కర్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యమకారుడు, న్యాయవాది గౌరవ్ గులాటి సెక్స్ వర్కర్ల తరపున ఎన్సీడబ్యూలో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చైర్పర్సన్ రేఖా శర్మ బుధవారం మీడియాతో ధృవీకరించారు. ‘చిత్రంలో ఓ డైలాగ్పై అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్కు ఈ ఫిర్యాదును పంపించాం. వారిచ్చే నివేదిక మీదే చర్యలు ఆధారపడి ఉంటాయి’ అని ఆమె చెప్పారు. కాగా, రణ్బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, సోనమ్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన సంజు రేపు అంటే జూన్ 29న విడుదల కానుంది. -
ఆ హీరో కెరీర్లోనే అతిపెద్ద రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా ‘సంజు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ నటించాడు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. రాజ్ కుమార్ హిరానీ ట్రాక్ రికార్డ్ తో పాటు సంజయ్దత్ బయోపిక్ కావటంతో సంజు అడ్వాన్స్ బుకింగ్స్లోనూ సరికొత్త రికార్డ్లు సృష్టిస్తోంది. అందుకు తగ్గట్టుగా దాదాపుగా 4000 స్క్రీన్స్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఒక్క భాషలో రిలీజ్ అయ్యే సినిమాను ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేయటం కూడా ఓ రికార్డే. అంతేకాదు రణబీర్ కపూర్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ కావటం విశేషం. -
తారల విషాదగాథలే... తెరపై అద్భుత కావ్యాలా?
చిత్ర సీమలో వెలిగిన తారలెందరో. నేలకు రాలిన తారలు మరెందరో. కొందరి తారల గాథలు సినిమా కథలా విషాదంతో ముగిశాయి. జీవితంలో ఓడిపోయినా.. వారి జీవితాన్ని కథగా మలిస్తే... అవి వెండితెరపై అద్భుతాలను సృష్టించాయి. అవే డర్టీపిక్చర్, మహానటి. సిల్క్ స్మిత. అప్పట్లో ఓ క్రేజీ స్టార్. ఈమె చూపుల్లోనే ఏదో మత్తు ఉన్నట్లు కుర్రకారుకు మతి పోగొట్టేసింది. కేవలం ఈమె నర్తించిన పాటల కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు ఉండేవారు. సినిమాలో ఈమె చేసిన ప్రత్యేక గీతం తరువాత థియేటర్లో ఎవరూ ఉండేవారు కాదట. అంతలా ఆమె పాపులార్టీని సొంతం చేసుకుంది. ఒకానొక దశలో ఈమె స్టార్ హీరోలు, హీరోయిన్ల కంటే ఎక్కువ డిమాండ్ ఉండేది. తెరపై మాత్రమే అశ్లీల పాత్రలు చేసే ఈమె.. వ్యక్తిగతంగా ఎన్నో నిగూఢ దానధర్మాలు చేసేవారట. సిల్క్స్మిత ఎంతో మంచి వారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అలాంటి సిల్క్స్మిత కథను ఆధారంగా తెరకెక్కించిన డర్టీ పిక్చర్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక సినీ తారల జీవిత చరిత్రను తెరకెక్కించిన వాటిలో చెప్పుకోదగ్గ సినిమా మహానటి. తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో మహానటిగా గుర్తింపు పొందిని సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను అంతటి నటికి నివాళిగా పేర్కొన్నారు సినీ అభిమానులు. సినీ జీవితాన్ని ప్రారంభించడం, అందులోని ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితం, చివరి దశ అన్నింటిని మనసుకి హత్తుకునేలా చిత్రీకరించారు. మహానటి సావిత్రిని గుర్తుంచుకున్నంత కాలం ఈ ‘మహానటి’ సినిమాను కూడా గుర్తుంచుకుంటారు. బాలీవుడ్కు పెద్దన్న సంజయ్ దత్. ఎన్నో వివాదాలు, ఇంకెన్నో ఎఫైర్స్, దుర్భరమైన జైలు జీవితం గడిపిన సంజయ్ దత్ జీవితాన్ని తెరకెక్కించారు రాజ్ కుమార్ హిరాణీ. తన ప్రతి సినిమాలో సమాజానికి ఏదో ఒకరకమైన సందేశాన్ని ఇచ్చే దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ. మున్నాభాయ్ సిరీస్, పీకే, త్రీ ఇడియట్స్ ఇలా ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేశారు హిరాణీ. తాజాగా తన ఆప్త మిత్రుడైన సంజయ్ దత్ ప్రస్థానాన్ని సంజు పేరుతో వెండితెరపై ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు. సంజయ్దత్గా రణ్బీర్ కపూర్ నటనకు బీ టౌన్ మొత్తం ఆశ్చర్యపోతోంది. ట్రైలర్లో సంజయ్ను మరిపించేలా యాక్ట్ చేసిన రణ్బీర్ కపూర్ పూర్తి నటనను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అంతేగాక సంజయ్దత్ జీవితంలోని చీకటి కోణాలను కూడ ఈ సినిమా ప్రస్థావించబోతోంది. సంజయ్కు ఎంతమంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందన్న విషయం, డ్రగ్స్కు బానిసైన పరిస్థితుల గురించి, ముంబై పేలుళ్ల గురించి కూడా ఈ సినిమాలో టచ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాకు కావల్సినంత ట్విస్ట్లు, రొమాన్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్న సంజయ్ దత్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన ఎటువంటి ఆంక్షలు పెట్టకపోవడం ఆశ్చర్యకరం. పైన మాట్లాడుకున్న రెండు సినిమాలు వారి మరణానంతరం కథలను వెండితెరపై ఆవిష్కరించారు. కానీ జూన్ 29న రానున్న సంజు మాత్రం అందుకు విరుద్దంగా వస్తోంది. ఈ సినిమా సంజయ్ దత్కు ఎలాంటి ఇమేజ్ను తెచ్చిపెడుతుందో చూడాలి మరి. -
కుర్ర హీరోయిన్లే కావాలా?
ఒక హీరోయిన్కు 30 ఫ్లస్ దాటాయంటే.. ఆమెకు ఛాన్స్లు తగ్గిపోవటం ఇండస్ట్రీలో కామన్గా మారింది(కొందరిని మినహాయిస్తే...). ఆ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా(37) కూడా ఉన్నారు. సుమారు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్లో ఆమె రణ్బీర్ కపూర్ ‘సంజు’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో మాన్యతాదత్ పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘ఒక నటీమణికి 30 ఏళ్లు వచ్చాయంటే, క్రమక్రమంగా ఆమెకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. దర్శక నిర్మాతలు యంగ్ హీరోయిన్లే కావాలని కోరుకుంటున్నారు. అంతెందుకు 50 ఏళ్లు దాటిన మన హీరోలు కూడా పడుచు అమ్మాయిలతోనే జత కట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏం? అందరికీ కుర్రహీరోయిన్లే కావాలా? మిగతా వాళ్లు నటనకు పనికిరారా?’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ..‘ఇక్కడ టాలెంట్తో పని లేదు. కేవలం ఫ్రెష్ ఫేస్ల కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు. మిగతా ఇండస్ట్రీల్లోనూ ఇదే పరిస్థితి. సినిమా రంగంలో మార్పులు వస్తున్నాయి. మరి యాక్టర్ల జీవితంలో మార్పు రాకూడదా?.. పర్సనల్ లైఫ్తోపాటు ప్రొఫెషనల్ లైఫ్ కోరుకోవటం తప్పేం కాదు కదా!’ అని ఆమె తెలిపారు. ‘అయితే వివాహం అయ్యాక కూడా కెరీర్ను తమ టాలెంట్తో అద్భుతంగా మలుచుకున్న వాళ్లూ లేకపోలేదు. ఉదాహరణకు షర్మిలా ఠాగూర్, వహీదా రెహమాన్, స్మితా పాటిల్లు.. పెళ్లయ్యాక కూడా కెరీర్ను సక్సెస్ఫుల్ గా కొనసాగించారు. నేను కూడా వాళ్ల బాటలోనే పయనించాలని నిర్ణయించుకున్నా. అందుకే మంచి కథల కోసం ఇంత కాలం ఎదురు చూశా. మధ్యలో ఓ ఇరానియన్ చిత్రం చేస్తున్న సమయంలో దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ నుంచి కబురు అందింది. దాదాపు రెండేళ్ల తర్వాత సంజు కార్యరూపం దాల్చింది. సంజుతో మంచి చిత్రంలో నటించాననే కోరిక తీరింది’ అని దియా ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
‘సంజు’ మూవీ స్టిల్స్
-
రణ్వీర్ స్థానంలో రణ్బీర్ వచ్చాడా..?
సిని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సంజు’. ట్రైలర్...ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. రణ్బీర్ కపూర్ అచ్చు సంజయ్ దత్ లాగా మారిపోయాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు రణ్బీర్. అయితే సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు చిత్ర నిర్మాత విధు వినోద్ చోప్రా. ‘సంజు’ సినిమాలో సంజయ్ దత్ పాత్ర కోసం మొదట రణ్వీర్ సింగ్ను అనుకున్నారంట. కానీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మాత్రం రణ్బీర్ కపూర్ను ‘సంజు’ పాత్ర కోసం ఎంపిక చేసారంట. ఈ విషయం గురించి విధు ‘‘సంజు’ పాత్ర కోసం రణ్బీర్ను తీసుకోవాలనే ఆలోచన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీది. కానీ నాకు ఈ ఆలోచన నచ్చలేదు. ఎందుకంటే సంజయ్ పాత్రలో నేను రణ్వీర్ను అనుకున్నాను. ఈ పాత్రకు రణ్వీర్ అయితే చాలా బాగా సరిపోతాడని అనిపించింది. కానీ రాజు మాత్రం రణ్బీరే ఈ పాత్రకు చక్కగా సరిపోతాడని నన్ను ఒప్పించాడు. షూటింగ్ ప్రారంభమయ్యాక రణ్బీర్ను సంజయ్ పాత్రలో చూసి నేను ఆశ్చర్యపోయాను. దాంతో నేను మొదట్లో అన్న మాటలను వెనక్కి తీసుకున్నాను. ఎందుకంటే రణ్బీర్ పూర్తిగా సంజయ్లాగా మారిపోయాడు. సంజయ్ దత్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఒక్కోసారి సంజయ్ ఆత్మ రణ్బీర్లో ప్రవేశించిందేమో అనిపిస్తుంది. అంతలా ఒదిగిపోయాడు ఆ పాత్రలో’ అని తెలిపారు. రణబీర్కపూర్, సంజయ్ దత్ పాత్రలో నటించిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజు భాయ్ పాత్రలో రణబీర్ కపూర్ ఒదిగిపోయిన తీరుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సంజయ్దత్ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలతో పాటు ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు. -
అపజయం ఓ అనుభవం
ఏ రంగంలో అయినా సక్సెస్లు, ఫెయిల్యూర్లు కామన్. కానీ వాటిని మనం ఎలా తీసుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్ అంటున్నారు బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్. సంజయ్ దత్ జీవితం ఆధారంగా రూపొందిన ‘సంజు’ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు రణ్బీర్. ఫాదర్స్ డే సందర్భంగా ట్వీటర్లో అభిమానులతో చాట్ చేశారీ హీరో. ఈ సందర్భంగా ఓ అభిమాని సక్సెస్, ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అని అడిగితే, ‘‘సక్సెస్, ఫెయిల్యూర్ మనం చేసిన పనికి రిజల్ట్ మాత్రమే. రిజల్ట్ కంటే ఆ జర్నీని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అలాగే సక్సెస్ నుంచి నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. ఫెయిల్యూర్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అందులోని పాఠాలే సక్సెస్కి ఫార్ములాలు అవుతాయి’’ అని సమాధానమిచ్చారు. -
సల్మాన్కు సాలిడ్ కౌంటర్
విడుదలకు ముందే సీనియర్ హీరో సంజయ్ దత్ సంజుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అచ్చం సంజును దింపేశాడంటూ రణ్బీర్ కపూర్పై ఇప్పటికే ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే సంజుపై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్లు మాత్రం ఆసక్తికరంగా మారాయి. క్లైమాక్స్ సన్నివేశాల్లో సంజయ్ దత్ స్వయంగా నటిస్తేనే బాగుండేదన్న సల్లూ భాయ్ అభిప్రాయ పడ్డాడు. దీంతో రకరకాల కథనాలు బాలీవుడ్లో చక్కర్లు కొట్టగా.. చివరకు ఈ చిత్ర హీరో రణ్బీర్ ఎట్టకేలకు స్పందించారు. ‘ఎవరి బయోపిక్లో వాళ్లు నటించటం అనేది జరిగే పని కాదు. అది ఆ పాత్ర ఔనత్యాన్ని నాశనం చేస్తుంది. ప్రేక్షకులు చిత్రంలో నన్నే సంజుబాబాగా ఊహించుకుని చూస్తుంటారు. అలాంటప్పుడు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయటం నా బాధ్యత. వయసురీత్యా సర్దుబాటు చేయాలంటూ అసలు పాత్రనే రంగంలోకి దించితే ఆ ఫలితం ఖచ్ఛితంగా తేడా కొడుతుంది. ఇంతదాకా ఏ దర్శకుడు కూడా అలాంటి ప్రయత్నం చేసి ఉండడనే నేను అనుకుంటున్నా. అసలు ఆ ఆలోచన చేసిన వాళ్లు.. అది కరెక్ట్కాదన్నది గుర్తిస్తే మంచిది’ అని ఆదివారం ఓ ఈవెంట్లో పాల్గొన్న రణ్బీర్ తెలిపాడు. కాగా, కత్రినా కైప్ విషయంలో ఈ ఇద్దరు హీరోలకు అస్సలు పడదనే.. బాలీవుడ్లో ఇప్పటికీ టాక్ నడుస్తూనే ఉంటుంది. సంజయ్ దత్ బెస్ట్ ఫ్రెండ్ కావటంతో ఆయన బయోపిక్పై సల్మాన్ మాములుగా స్పందించాడే తప్ప.. ఎవరినీ బాధపెట్టడానికి కాదని భాయ్ సన్నిహితుల చెబుతున్నారు. ఆ సంగతి పక్కనబెడితే రాజ్కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కిన సంజు ఈ నెల 29న విడుదల కానుంది. -
‘సంజు’పై ఫిర్యాదు; ఇండియా పరువేంగాను?
న్యూఢిల్లీ: రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ సినిమాపై ఫిర్యాదు నమోదైంది. ‘సంజు’ ట్రైలర్లో చూపించిన ‘జైలు టాయిలెట్ లీకేజీ సీన్ల’ను తక్షణమే తొలగించాలని, లేకుంటే సినిమా విడుదలపై స్టే కోరుతూ కోర్టుకు వెళతామని ఫృథ్వీ మస్కే అనే స్వచ్ఛంద కార్యకర్త.. సెన్సార్ బోర్డును హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషికి ఫిర్యాదును అందజేశారు. ఇండియా పరువేంగాను?: ‘‘సంజు సినిమా ట్రైలర్లో టాయిలెట్ లీకేజీ సీన్ చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆ సీన్ వల్ల ఇండియాలోని జైళ్ల నిర్వహణ, అధికారుల పనితీరుపై ప్రపంచానికి తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇంతకు ముందు చాలా సినిమాల్లో జైల్ సీన్లు ఉన్నప్పటికీ, ఇలా టాయిలెట్ లీకేజీని చూపించిన దాఖలాలు లేవు. వాస్తవానికి అలాంటి సంఘటనేదీ జరిగినట్లు ఎక్కడా నమోదుకాలేదు’’ అని ఫృథ్వీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు సీన్పై సెన్సార్ బోర్డు స్పందించకుంటే, సినిమా విడుదల నిలిపేసేలా కోర్టుకు వెళతానని తెలిపారు. కాగా, ఈ ఫిర్యాదుపై సీబీఎఫ్సీ స్పందన ఇంకా వెలువడాల్సిఉంది. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 29న ‘సంజు’ విడుదలకానుంది. సంజు ట్రైలర్