-
పోచారం, సంజయ్పై బీఆర్ఎస్ ఫిర్యాదు.. స్పీకర్కు మెయిల్
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారుతున్న ఎంఎల్ఏలపై అనర్హతపై దూకుడు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన సభ సెక్రటరీకి ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి మెయిల్లో విజ్ఞప్తి చేశారు. స్పీకర్ సమయమడగడానికి ఫోన్ చేసినా ఆయన ఆఫీస్ స్పందించకపోవడంతో ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం, తెల్లంలపైనా బీఆర్ఎస్ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. -
ఇంకా అలక వీడని జీవన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు సమాచారం లేకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ను పార్టీలో చేర్చుకోవడంపై కినుక వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి ఇంకా అలకపాన్పు వీడలేదు. సంజయ్ను పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,సీనియర్ మంత్రి శ్రీధర్బాబు మంగళవారం హైదరాబాద్లోని జీవన్రెడ్డి నివాసానికి వెళ్లి గంటన్నర పాటు చర్చించారు. చర్చల తర్వాత కూడా ఆయన తన వైఖరి మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీని తాను వదిలే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం త్వరలోనే రాజీనామా చేస్తానని జీవన్రెడ్డి మీడియాకు వెల్లడించారు. మండలి చైర్మన్కు ఫోన్ సంజయ్ చేరిక సమయంలో కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదన్న మనస్తాపంతో ఉన్న జీవన్రెడ్డితో కాంగ్రెస్ నాయకత్వం సోమవారం చర్చలు జరిపింది. పార్టీ అధిష్టానం కూడా మాట్లాడింది. అయినా, తన వైఖరిలో మార్పు లేదంటూ జీవన్రెడ్డి మంగళవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాను కలుస్తానంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ఫోన్ చేశారు. కానీ, తాను అందుబాటులో లేనని, నల్లగొండ వెళుతున్నానని గుత్తా వెల్లడించడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబులు బేగంపేటలోని జీవన్రెడ్డి నివాసానికి హుటాహుటిన వెళ్లారు. గంటన్నరకు పైగా అక్కడే ఉండి జీవన్రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ తగిన గౌరవం ఇస్తుందని, సీనియారిటీకి ఎక్కడా గౌరవం తగ్గకుండా తాము చూస్తామని నచ్చజెప్పారు. అయితే, మంత్రులతో చర్చల సందర్భంగా జీవన్రెడ్డి తన మనసులోని మాటలను వారికి వెల్లడించారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలోని తన రాజకీయ ప్రత్యరి్థని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తనకు ఏం గౌరవం ఇచి్చనట్టని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధమని, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్టు సమాచారం. జీవన్రెడ్డి మా మార్గదర్శకులు: డిప్యూటీ సీఎం భట్టి మంత్రి శ్రీధర్బాబు, ఇతర నేతలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పదేళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన నాయకుడు జీవన్రెడ్డి అని అన్నారు. ఆయన మనస్తాపానికి గురైతే తాము కూడా బాధపడతామని వ్యాఖ్యానించారు. జీవన్రెడ్డి తమందరికీ మార్గదర్శకులని, ఆయన అనుభవాన్ని ప్రభుత్వాన్ని నడిపేందుకు తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పారు. ఆయన సీనియారిటీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సీనియర్ నాయకులను వదులుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జీవన్రెడ్డిని తాము కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి వెల్లడించారు. చైర్మన్ను సమయం ఎందుకు అడిగానో ఆలోచించుకోండి: జీవన్రెడ్డి భట్టి, శ్రీధర్బాబులతో చర్చలు ముగిసిన అనంతరం జీవన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉదని చెప్పారు. జరిగిన పరిణామాలు కొన్ని బాధించాయని వ్యాఖ్యానించారు. తనతో పార్టీ ఇన్చార్జ్ మున్షీ కూడా మాట్లాడారని వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరని, ఆయన అందుబాటులోకి రాగానే నిర్ణయం చెబుతానని, త్వరలోనే మండలి చైర్మన్ దగ్గరకు వస్తానని అన్నారు. మీరు ఎమ్మెల్సీగా కొనసాగుతారా? రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా, మండలి చైర్మన్ టైం ఎందుకు అడిగానో అర్థం చేసుకోవాలని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. -
చాలా మనస్తాపానికి గురయ్యాను
-
కాంగ్రెస్ లో కలకలం
-
సంజయ్ చేరిక.. జీవన్ కినుక
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కాంగ్రెస్లో చేరిక ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. ఆదివారం రాత్రి అనూహ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం.సంజయ్కుమార్ సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫొటోలు బయటికి రావడంతో సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి శ్రీనివాస్లు నచ్చజెప్పినా ఆయన దిగిరాలేదు. చివరికు మంత్రి శ్రీధర్బాబు చొరవ తీసుకుని చర్చలు జరిపినా జీవన్రెడ్డి శాంతించినట్టుగా కన్పించలేదు. ఏ వ్యక్తిపైనైతే పోరాడానో ఆ వ్యక్తినే పార్టీలో చేర్చుకోవడం ద్వారా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, వారి అభిప్రాయాలను గౌరవించే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందంటూ సమస్య పరిష్కారం కాలేదనే సంకేతాలు ఇచ్చారు. నన్ను సంప్రదించకుండా ఎలా? జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్కు విధేయుడిగా కొనసాగుతున్న తనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలిసింది. తన అవసరం పార్టీకి లేదని భావించే, కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకున్నారని ఆయన అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయమే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని భావించారు. ఉదయాన్నే జగిత్యాలలోని తన నివాసానికి చేరుకున్న అనుచరులు, పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. 40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానంటూ తన సన్నిహితుల వద్ద జీవన్రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్లుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాలలో జీవన్రెడ్డి ఇంటికి చేరుకుని ఆయనతో చర్చలు జరిపారు. రాజీనామా వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. కానీ జీవన్రెడ్డి ససేమిరా అన్నారు. పార్టీకి అండగా నిలిచిన పెద్దమనిషి: శ్రీధర్బాబు తర్వాత మంత్రి శ్రీధర్బాబు రంగంలోకి దిగారు. జరిగిన వ్యవహారంపై విచారం వ్యక్తం చేస్తూ అన్నివిధాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడారు. అనేక క్లిష్టమైన సందర్భాల్లో పార్టీకి, ప్రజలకు అండగా నిలిచిన పెద్దమనిషి జీవన్రెడ్డి అని కొనియాడారు. ఆయన మనస్తాపం చెందిన విషయం తెలుసుకుని తామంతా వచ్చి పార్టీకి పెద్దదిక్కుగా ఉండాలని కోరామని తెలిపారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని, మనోవేదనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ సోమవారం రాత్రి జగిత్యాలలో విలేకరులతో మాట్లాడిన జీవన్రెడ్డి మాత్రం ఎమ్మెల్యే సంజయ్ను ఏకపక్షంగా చేర్చుకోవడం సరికాదని అన్నారు. నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ బలోపేతానికి పనిచేశారని, సంఖ్యాబలం ఉన్నా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. వారి అభిప్రాయాల మేరకు నడుచుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. తనతో చర్చించడానికి మంత్రి శ్రీధర్బాబుతో పాటు ఇతర నేతలు వచ్చారని అన్నారు. మూడు విడతలు తలపడిన జీవన్రెడ్డి, సంజయ్ జగిత్యాల నియోజకవర్గంలో జీవన్రెడ్డి ప్రస్థానం 1983 నుంచి మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2014 నుంచి మూడు పర్యాయాలు సంజయ్, జీవన్రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో జీవన్రెడ్డి గెలిచినప్పటికీ, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ చేతిలో ఓడిపోయారు. 2024లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా పరాజయం తర్వాత 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలావుండగా కాంగ్రెస్లో సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కో ఆర్డినేటర్ పదవీకి వాకిటి సత్యంరెడ్డి రాజీనామా చేశారు. -
జీవన్ రెడ్డి అవుట్!.. సంజయ్ ఇన్..!?
-
కాంగ్రెస్లో ఆసక్తికర రాజకీయం.. జీవన్రెడ్డి వ్యాఖ్యలకు చెక్ పెట్టినట్టేనా?
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ చాలా బలంగా ముందుకు తీసుకువెళ్తోంది. ప్రతిపక్ష పార్టీల్లో కీలక నేతలను హస్తం గూటికి చేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్లో భిన్న నెలకొంది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రతీ రాజకీయ పార్టీ వారి సిద్దాంతాలకు అనుగుణంగా పని చేయాలి.. పోరాటం చేయాలి. రాష్ట్రంలో ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాల్సిన పనిలేదని నా భావన అని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇతరుల చేరిక అవసరం లేదుపోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..@jeevanreddyMLC @PocharamBRS @PocharamBRS @PocharamBhasker @BRSparty @INCTelangana @KTRBRS pic.twitter.com/w7wYzgz0gz— Sai (@Vardhavelly) June 23, 2024 అయితే, జీవన్ రెడ్డి ఇలా కామెంట్స్ చేసిన మరుసటి రోజే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆదివారం సంజయ్ కుమార్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో రెండు పవర్ సెంటర్స్పై విస్తృత చర్చ నడుస్తోంది. కాగా, జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ప్రత్యర్థులుగా ఉన్న విషయం తెలిసిందే. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన మరో ఎమ్మెల్యే
రాయికల్: జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్కుమార్ బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి ఆదివారం రాత్రి కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోగల సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రెండురోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. సంజయ్కుమార్ 2014లో టీఆర్ఎస్లో చేరారు. ఆ సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2018లో మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి అదే జీవన్రెడ్డిపై విజయం సాధించారు. తిరిగి 2023లో జరిగిన ఎన్నికల్లో జీవన్రెడ్డిపైనే మరోసారి గెలుపొందారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొంత నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం. జాగృతి అధ్యక్షురాలు కవితకు నమ్మిన బంటుగా ఉన్న సంజయ్.. ఆమె అరెస్ట్ అయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలు కొంత దూరందూరంగా ఉంటున్నారు. మరోవైపు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ కనీసం సమావేశం కాకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా తర్జనభర్జనలో ఉన్న ఆయన కాంగ్రెస్లో చేరారు. అయితే సంజయ్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు పార్టీలో సీనియర్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి కూడా తెలియదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవన్రెడ్డికి తెలియకుండా ఆయన పార్టీలో చేరడంతో జిల్లాలో రాజకీయం మలుపుతిరిగే అవకాశముంది. -
ఐఆర్సీటీసీ సీఎండీగా సంజయ్ కుమార్
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సంజయ్ కుమార్ జైన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్లకు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇప్పటి వరకు సంజయ్ కుమార్ జైన్ నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా సేవలు అందించారు. ‘‘సీఎండీగా సంజయ్ కుమార్ జైన్ తక్షణ నియామకానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తేదీ 2026 డిసెంబర్ 31 వరకు లేదంటే తదుపరి ఆదేశాలు వెలవరించేంత వరకు.. వీటిల్లో ఏది ముందు అయితే అది అమలవుతుందని తెలిపింది. ఈ నెల 13న నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ బాధ్యతల నుంచి తప్పుకున్న జైన్, మరుసటి రోజు ఐఆర్సీటీసీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సరీ్వసెస్, 1990 బ్యాచ్ అధికారి అయిన జైన్, చార్టర్ అకౌంటెంట్ ఉత్తీర్ణులు. లోగడ భారత ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల వాణిజ్య వెంచర్లు, విధానాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. -
వివాదాస్పదమైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తీరు
-
క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్పై వేటు
భారత క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య పాలక వర్గాన్ని సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రకటన వల్ల ఈ మేరకు వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మాజీ అధ్యక్షుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్భూషణ్ తన పట్టు నిరూపించుకున్నాడు. బరిలో లేకపోయినా పట్టు నిరూపించుకున్న బ్రిజ్ భూషణ్ నేరుగా బరిలో నిలకపోయినా... 15 పదవుల్లో తన వర్గానికి చెందిన 13 మందిని గెలిపించుకున్నాడు. ఈ క్రమంలో బ్రిజ్ భూషణ్ ప్రధాన అనుచరుడిగా పేరొందిన, ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్పై 40–7 ఓట్ల తేడాతో గెలిచి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే, డబ్ల్యూఎఫ్ఐలో బ్రిజ్ భూషణ్ వర్గం ఎన్నికకావడాన్ని నిరసిస్తూ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి చెప్పగా.. బజరంగ్ పునియా తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాడు. రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన మరోవైపు.. సాక్షికి మద్దతుగా బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ సైతం పద్మ శ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తానని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలపై చర్చ నడుస్తుండగా.. తాజాగా క్రీడా శాఖ నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. కాగా డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. అండర్-16, అండర్-20 రెజ్లింగ్ జాతీయ పోటీలు ఉత్తరప్రదేశ్లోని గోండాలో గల నందినగర్లో జరుగుతాయని ప్రకటించాడు. అయితే, ఈ క్రీడల్లో పాల్గొనే రెజ్లర్లకు ముందుగా సమాచారం ఇవ్వకుండానే ఇలాంటి ప్రకటన చేయడం డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగానికి విరుద్ధం. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై నిషేధం విధిస్తూ క్రీడా శాఖా నిర్ణయం తీసుకుంది. అందుకే వేటు ‘‘డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగంలోని క్లాజ్ 3(e) ప్రకారం.. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్స్ ఎక్కడ నిర్వహించాలన్న అంశాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయిస్తుంది. అంతకంటే ముందు సమావేశంలోని ఎజెండాలను పరిశీలిస్తుంది. డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 ప్రకారం.. మీటింగ్కు సంబంధించి కోరం కోసం ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఇందుకు కనీసం 15 రోజుల నోటీస్ పీరియడ్ ఉంటుంది. మొత్తం ప్రతినిధుల్లో మూడొంతుల ఒకటి మేర కోరం ఉండాలి. అత్యవసరంగా సమావేశం నిర్వహించాలనుకుంటే కనీసం ఏడు రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి’’ . అయితే, ఈ నిబంధనలను సంజయ్ సింగ్ అతిక్రమించిన కారణంగా క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Virat Kohli: అక్కడున్నది కోహ్లి.. రాత్రికిరాత్రే వెళ్లలేదు.. పక్కా ప్లాన్తోనే! -
నిబంధనల ప్రకారమే గేమింగ్ కంపెనీలకు నోటీసులు
న్యూఢిల్లీ: చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఈ–గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ ఎగవేత నోటీసులు జారీ చేసినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ స్పష్టం చేశారు. డేటాను పూర్తిగా విశ్లేíÙంచిన మీదటే పన్ను మొత్తంపై నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్ గేమింగ్, కేసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించేలా సవరించిన నిబంధనలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అగర్వాల్ చెప్పారు. దీనికి సంబంధించిన చట్ట సవరణలను పార్లమెంటు ఇటీవలే ఆమోదించింది. అప్పటి నుంచి డ్రీమ్11 వంటి ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, డెల్టా కార్ప్ వంటి కేసినో ఆపరేటర్లకు నోటీసులు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగర్వాల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. రూ. 16,800 కోట్ల మేర పన్నులు కట్టాల్సి ఉందంటూ డెల్టా కార్ప్కు గత వారం నోటీసులు జారీ అయ్యాయి. రూ. 21,000 కోట్లు రాబట్టుకునేందుకు ఆన్లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్క్రాఫ్ట్కు గతేడాది షోకాజ్ నోటీసులు వచ్చాయి. వీటిని కర్ణాటక హైకోర్టు కొట్టేయగా, రెవెన్యూ డిపార్ట్మెంట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్టోబర్ 10న దీనిపై తదుపరి విచారణ జరగనుంది. -
ముగిసిన ఈడీ డైరెక్టర్ పదవీకాలం
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంటు డైరెక్టర్గా సంజయ్కుమార్ మిశ్రా పదవీకాలం శుక్రవారం ముగిసింది. ఆయన స్థానంలో రాహుల్ నవీన్ను ఇంఛార్జి డైరెక్టర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 1993 ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన రాహుల్ నవీన్ ఈడీకి రెగ్యులర్ డైరెక్టర్ నియమితులయ్యే దాకా పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. రాహుల్ నవీన్ ప్రస్తుతం ఈడీలోనే స్పెషల్ డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు. సంజయ్కుమార్ మిశ్రాకు గతంలో రెండు పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం ఏడాది చొప్పున పొడగింపు ఇవ్వగా సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. మరోసారి పొడగింపు కుదరదని తేల్చిచెబుతూ సెప్టెంబరు 15 దాకా గడువుచ్చింది. అది పూర్తి కావడంతో శుక్రవారం రాహుల్ నవీన్ను ఇంఛార్జిగా నియమిస్తూ కేంద్రం ఆదేశాలు వెలువరించింది. -
జగిత్యాల: పథకాలు అమలైనా.. ఫలితం మాత్రం సున్నా..
BRS పార్టీ నుండి 2014లో మాకునూరి సంజయ్ కుమార్ ఓటమి అనంతరం, 2019లో సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిసి కులాలు నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలపై ప్రభావితం పార్టీల పరిస్థితి: బి.ఆర్.ఎస్ పార్టీకి రెబల్స్ బెడద ఉండేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా రెబల్స్ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఐదుగురు ఆశిస్తున్నారు. ఆశావహులు బీఆర్ఎస్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ తాటిపర్తి జీవనరెడ్డి ( ప్రస్తుత ఎమ్మెల్సీ ) ఆశావహులు తాటిపర్తి విజయలక్ష్మి తాటిపర్తి రాము బీజేపీ: బోగ శ్రావణి (రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు) శైలేందర్ రెడ్డి మధుసూదన్ తిరుపతి రెడ్డి BRS అభ్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్లస్లు: జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణా. సీఎం రిలీఫ్ పండ్, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఎప్పటికప్పుడు అందించడం, అధిష్టానం సీఎం కేసీఆర్, కెటిఆర్ వద్ద మంచి పేరు ఉండటం. మైనస్లు: బీర్పూర్ మండలంలో రోళ్లవాగు నిర్మాణం పూర్తి అయిన ముంపు గ్రామాల బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం. కులవసంఘ భవనాలు నిర్మాణం జరిగినా.. దళిత బంధుకు అందించడం పార్టీ ప్రజాప్రతినిధులు పనులు పూర్తి చేసిన బిల్లులు రాక పోవటం. తన అనుకూల వర్గానికి పనులు చేయడం, మరో వర్గంపై చిన్న చుపు చూడడం మండల, గ్రామ స్థాయి నాయకులతో, సంబంధాలు అనుకూలంగా లేకపోవడం పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్లను అర్హులకు అందిచక పోవటం. -
అనిత X సంజయ్
న్యూఢిల్లీ: ఇన్నాళ్లు రెజ్లర్ల ఆరోపణలు, నిరసనలతో తరచూ వార్తల్లోకెక్కిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఇప్పుడు ఎన్నికల హడావిడిలో ఉంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ రెజ్లర్ అనిత షెరాన్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయగా, వివాదాస్పద డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్భూషణ్ తన వీర విధేయుడు సంజయ్ కుమార్ సింగ్ను బరిలో దించాడు. నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో అధ్యక్ష పోటీ ఇప్పుడు మాజీ రెజ్లర్ అనిత, బ్రిజ్భూషణ్ నమ్మిన బంటు సంజయ్ల మధ్యే నెలకొంది. నిరసన దీక్షలో పాల్గొన్న రెజ్లర్లకు వెన్నుదన్నుగా నిలిచి మాట్లాడిన 38 ఏళ్ల అనితకు రెజ్లర్ల మద్దతు ఉంది. ఇప్పటికే విడుదలైన ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఈ నెల 12న ఓటింగ్, అదే రోజు ఫలితాలు విడుదలవుతాయి. -
కార్గిల్ యుద్ధ వీరుడికి సలాం
ఇండిగో ఎయిర్లైన్స్ పుణె ఫ్లైట్లో ప్రయాణిస్తున్న మేజర్ సంజయ్ కుమార్ను ఇండిగో సిబ్బంది సత్కరించారు. కార్గిల్ యుద్ధవీరుడు, పరమవీర చక్ర పురస్కార గ్రహీత సంజయ్ కుమార్ను ప్రయాణికులకు పరిచయం చేసి ఆనాటి యుద్ధంలో ఆయన సాహసాలను గురించి చెప్పారు ఎయిర్లైన్స్ పైలట్. సంజయ్ కుమార్ని ప్రయాణికులు ప్రశంసల్లో ముంచెత్తారు. దీనితాలూకు దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. -
జగిత్యాల నియోజకవర్గంని పరిపాలించే వారెవరు?
జగిత్యాల నియోజకవర్గం జగిత్యాలలో ఆరుసార్లు విజయం సాదించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి 2018 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. టిఆర్ఎస్ తరపున పోటీచేసిన డాక్టర్ ఎమ్.సంజయ్ కుమార్ భారీగా 61125 ఓట్ల ఆదిక్యతతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికలలో గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించడం మరో విశేషంగా చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలలో సంజయ్ కుమార్ కు 104247 ఓట్లు రాగా, జీవన్ రెడ్డికి కేవలం 43062ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది ముదిగంటి రవీంద్ర రెడ్డికి కేవలం 4700 ఓట్లు మాత్రమే వచ్చాయి. సంజయ్ కుమార్ వెలమ సామాజికవర్గానికి చెందిన నేత.1978 వరకు వెలమ సామాజికవర్గం నేతలు ఇక్కడ అదికంగా ఎమ్మెల్యేలుగా గెలుపొందినా, ఆ తర్వాత అంటే నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈసారే వెలమ నేత గెలిచారు.2014లో కరీంనగర్ జిల్లాలో టిఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎదురొడ్డి గెలిచిన ఏకైక నేత జీవన్ రెడ్డి కావడం విశేషం. ఆయన జగిత్యాల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ది సంజయ్ కుమార్ పై 7828 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. 2018లో మాత్రం జీవన్ రెడ్డి ఓడిపోవల్సి వచ్చింది. జీవన్ రెడ్డి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో జగిత్యాలలో టిడిపి, బిజెపి కూటమి తరపున పోటీచేసిన తెలుగుదేశం ఎన్నికల ప్రచార కమిటీ అద్యక్షుడు ఎల్.రమణ 22385 ఓట్లతో ఇక్కడ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2018లో పోటీచేయలేదు. జగిత్యాల నియోజకవర్గంలో ఏడుసార్లు రెడ్లు ఏడుసార్లు వెలమ, మూడుసార్లు బిసి వర్గం నేతలు, ద్విసభ్య నియోజకవర్గం గా ఉన్నప్పుడు ఒక ఎస్.సి నేత గెలుపొందారు. జీవన్రెడ్డి 1983లో టిడిపి పక్షాన తొలిసారి గెలుపొంది ఎన్.టి.ఆర్.క్యాబినెట్లో స్థానం పొందారు. ఆ తరువాత ఆయన నాదెండ్ల భాస్కరరావు పక్షాన చేరారు. అనంతరం కాంగ్రెస్ ఐలో చేరి 1989 నాటికి తిరిగి ఎమ్మెల్యే కాగలిగారు. 1994లో ఓడిపోయినప్పటికి, అప్పుడు గెలిచిన ఎల్.రమణ, 1996లో కరీంనగర్ లోక్సభ స్థానానికి ఎన్నికవడంతో జరిగిన ఉప ఎన్నికలో జీవన్రెడ్డి విజయం సాధించారు. 1999,2004,2014లలో కూడా నెగ్గారు. వై.ఎస్. క్యాబినెట్లో రహదారులు, భవనాల శాఖమంత్రిగా ఉన్నారు. కరీంనగర్ లోక్సభ స్థానంలో కేసిఆర్ రెండుసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు దిగిన సందర్భంలో జీవన్రెడ్డే ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచారు. ఒకసారి మంత్రి పదవికి రాజీనామా చేసి లోక్సభ ఉప ఎన్నికలో పోటీ చేసి, అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ వెంటనే తిరిగి మంత్రి పదవి బాధ్యతలు చేట్టారు. జగిత్యాలకు రెండు ఉప ఎన్నికలతో సహా 17సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి 10సార్లు, టిడిపి నాలుగుసార్లు, పిడిఎఫ్ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి ఎస్.టి.ఎఫ్. ఒకసారి గెలుపొందాయి. 1967లో కానుగంటి లక్ష్మీనరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు గెలిచారు. 1952లో ఇక్కడ గెలిచిన బుట్టి రాజాం 57లో సుల్తానాబాద్లో, 62లో పెద్దపల్లిలో, 67లోను స్తులాపూర్లో మొత్తం నాలుగుసార్లు విజయం సాధించారు. 1972లో ఇక్కడ గెలుపొందిన వి.జగపతిరావు, 1989లో కరీంనగర్లో ఇండిపెండెంటుగా నెగ్గారు. ఇక్కడ నుంచి గెలిచి మంత్రి పదవి నిర్వహించినవారిలో జీవన్రెడ్డితోపాటు, రాజేశంగౌడ్, ఎల్.రమణ కూడా ఉన్నారు. రాజేశంగౌడ్ గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో పనిచేస్తే, రమణ 1995లో చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసారు. జగిత్యాల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఈడీ డైరెక్టర్ను కొనసాగిస్తాం
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్కుమార్ మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15 వరకూ పెంచేందుకు అనుమతి కోరుతూ కేంద్రం బుధవారం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. 63 ఏళ్ల మిశ్రా పదవీకాలాన్ని పదేపదే పెంచడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇటీవలే తప్పుబట్టడం తెలిసిందే. ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సమీక్షకు సంజయ్ కుమార్ గైర్హాజరైతే భారత ప్రయోజనాలకు భంగకరమని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. అందువల్ల తమ పిటిషన్పై జూలై 28లోగా విచారణ జరపాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. -
జగిత్యాల సీఎం కప్ పోటీల్లో దొంగల హల్చల్..
జగిత్యాల: సీఎం కప్ లైటింగ్ నిర్వహణ చూస్తున్న సతీష్ అనే వ్యక్తి నుంచి లక్ష రూపాయలు కొట్టేసిన దొంగలు.. మంత్రి కొప్పుల, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు హాజరైన కార్యక్రమంలో లక్ష రూపాయలు అపహరణకు గురి కావడంతో కలకలం.. పోలీస్ సెక్యూరిటీ కళ్ళు కప్పి ఉడాయించిన దొంగ.. మైక్ లో అనౌన్స్ మెంట్ చేసిన నిర్వాహకులు. -
అప్పుడప్పుడు అలా జరుగుతుంది.. ఎమ్మెల్యే సంజయ్కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అప్పుడప్పుడు వైద్యం వికటించడం సహజమని, డాక్టర్లే కాకుండా సిబ్బంది వల్ల కూడా తప్పు జరగొచ్చంటూ వ్యాఖ్యానించారు. స్వయంగా డాక్టర్ అయిన సంజయ్ కుమార్ కు కంటి వైద్యంలో మంచి పేరుంది. డాక్టర్లు, చికిత్స గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. ఒకటి రెండు సంఘటనల వల్ల ప్రభుత్వాసుపత్రుల పట్ల అభిప్రాయాన్ని చెడుగా మార్చుకోవద్దని కోరారు. "మహిళ కడుపులో గుడ్డ ఉంచి కుట్లు వేశారన్నది రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఘటన.. కానీ ఇపుడు పేపర్లలో వస్తోందన్నారు. కింది స్థాయిలో ఒకరు చేసిన పొరపాటుకు మొత్తం వ్యవస్థను నిందించవద్దు. డాక్టర్లు, నర్సుల సమిష్ఠి బాధ్యతతో ఆపరేషన్లు జరుగుతాయని, ప్రభుత్వాసుపత్రులపై నమ్మకంతో రండి, మాతా శిశు ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం చేయించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. కాగా, జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన గత వారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన నవ్యశ్రీ అనే మహిళకు పదహారు నెలల క్రితం.. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు కడుపులోనే క్లాత్ వదిలేయడం కలకలం రేపింది. ఏడాది తర్వాత నవ్యశ్రీకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంది. స్కానింగ్లో కడుపులో బట్ట ఉన్నట్టు గుర్తించగా.. వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్ట తొలగించారు. ఈ మొత్తం విషయాన్ని లేఖలో పేర్కొంటూ నవ్యశ్రీ కుటుంబీకులు జగిత్యాల DMHOకు ఫిర్యాదు చేశారు. చదవండి: నిప్పులకొలిమి.. ఎండకు వెళ్తే మండిపోతారు! డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక -
చైర్మన్ శ్రావణిని అవమానించిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: బీసీ సామాజిక వర్గానికి చెందిన జగిత్యాల మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణిని రాజకీయంగా వేధించి, అవమానపరిచిన ఎమ్మెల్యే సంజయ్కుమార్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఒక మహిళ మీడియా సమక్షంలో తనను వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకోవడం బాధాకరమని, మహిళా చైర్మన్ను రాజకీయంగా అణచివేయడమంటే మొత్తం బీసీ సమాజాన్ని అణచివేయడమే అవుతుందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో బీసీ మహిళలు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నారని, ఇటీవల హైదరాబాద్లోని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా స్థానిక ఎమ్మెల్యే సుభాష్రెడ్డి వేధింపులు తాళలేకి కన్నీరు పెట్టుకుందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు బీసీలను కించపర్చడం కొత్తేం కాదన్నారు. గతంలో బీసీ లేదు గోసిలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారని, రిజర్వేషన్లు ఎత్తేయాలని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారని జాజుల తెలిపారు. మరో వైపు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఎత్తేస్తే దేనికీ పనికిరారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సభలో మాట్లాడిన మాటలే నిదర్శనమన్నారు. ఇలాంటి వాటిపై సీఎం జోక్యం చేసుకోవాలని కోరారు. జగిత్యాల ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయాలని, బీసీలకు క్షమాపణ చెప్పాలని జాజుల డిమాండ్ చేశారు. -
శ్రావణి రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే సంజయ్.. ఏమన్నారంటే?
సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ పనులకు అడ్డుపడుతున్నారని అవి భరించలేకనే పదవికి రాజీనామా చేస్తున్నట్టు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజీనామా చేసి మీడియా ఎదుటే శ్రావణి కన్నీరుపెట్టుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. శ్రావణి రాజీనామాపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా తన వ్యక్తిగతం. చైర్పర్సన్ వ్యాఖ్యలు చాలా బాధించాయి. నేను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. శ్రావణి వెనుక ఎవరో వ్యక్తులు ఉన్నారు. రాజకీయ కారణాలతో రాజీనామా చేశారు. కౌన్సిలర్లను ఎలాంటి క్యాంపులకు పంపలేదు. అధిష్టానం అన్ని విషయాలు చూసుకుంటుంది. తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆమె కామెంట్స్ చేయడం సరికాదు. దీన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. సమన్వయ లోపం ఉందని అవిశ్వాసం పెడతామని కౌన్సిలర్లు చెప్పినా వద్దని చెప్పాము. సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలనీ నిర్ణయించి చైర్పర్సన్కు కాల్ చేశాము. ఈలోపే ఆమె ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడం బాధించింది. కలిసి పనిచేస్తానంటే కౌన్సిలర్లను సముదాయించేందుకు ప్రయత్నం చేస్తాను. 50% బీసీ మహిళలకు పదవులు ఇచ్చామ’ని వ్యాఖ్యలు చేశారు. -
వైరల్ వీడియో: ఆమె పాదాలను పాలతో కడిగి.. ఆ పాలు తాగారు!
-
Viral Video: ఆమె పాదాలను పాలతో కడిగి.. ఆ పాలు తాగారు!
ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటారు. చిన్నారి పాపలను అదృష్ట దేవతలుగా భావిస్తుంటారు. అంతేకాదు ఆడపిల్లలను అల్లారుముద్దుగా, అపురూపంగా చూసుకుంటారు. తాజాగా ఇంటర్నెట్లో వైరల్ అయిన ఓ వీడియో ఇలాంటి భావనను మన కళ్ల ముందుకు తెచ్చింది. జార్ఖండ్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేశారు. ‘భావోద్వేగ క్షణం. తల్లిదండ్రులు తమ కుమార్తెకు వీడ్కోలు చెబుతూ ఆమె పాదముద్రలను ఇంట్లో భద్రపరుస్తార’ని వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఇంతకీ వీడియోలో ఏముంది? ఓ యువతిని కుర్చీలో కూర్చోపెట్టి తల్లిదండ్రులు ఆమె పాదాల చెంత కూర్చుంటారు. ఆమె పాదాలను పళ్లెంలో ఉంచి ముందుగా తండ్రి నీళ్లతో కడుగుతాడు. తర్వాత పాలతో పాదాలను కడుగుతాడు. పాదాలను కలిగిన పాలను తండ్రితో పాటు యువతి తల్లి కూడా తాగుతారు. తర్వాత యువతి పాదాలను ఎరుపు రంగు నీళ్లలో ఉంచి తెల్లటి వస్త్రంపై ఆమె పాదముద్రలు పడేలా చేస్తారు. అయితే ఈ వీడియోలోని వారు ఎక్కడ వారనే వివరాలు వెల్లడించలేదు. అంతేకాదు ఈ వీడియో ఎప్పటిదనే విషయం కూడా తెలియదు. కానీ ఆ తల్లిదండ్రులు చేసిన పని మాత్రం ఎంతో మందిని కదిలించింది. మిశ్రమ స్పందన రెండు నిమిషాల 15 సెకన్ల ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేయగానే లక్షకు పైగా వ్యూస్తో వైరల్గా మారింది. ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ‘హార్ట్ టచింగ్’ అంటూ చాలా మంది మెచ్చుకున్నారు. ‘భారతీయ సంస్కృతిలోని గొప్పదనానికి మచ్చుతునక’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘ఇంకా ఏ యుగంలో ఉన్నారు సార్ అని మరొకరు అంటే.. ‘ఇదంతా బాగానే ఉంది కానీ ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వండి’ అని ఇంకొరు వ్యాఖ్యానించారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఆడపిల్లను అపురూపంగా చూసుకోవాలన్న సందేశాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. (క్లిక్: ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని.. ఏకంగా 70 కిలోలు తగ్గి) -
యూపీలో బీజేపీ భారీ విజయం: తాజా ఎగ్జిట్పోల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో బీజేపీ భారీ విజయం సాధించడం ఖాయమని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు కొత్త పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. పంజాబ్, ఉత్తరాఖండ్లలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని.. గోవాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని వెల్లడించింది. Lokniti- CSDS Post Poll Survey UP AC 70 Locations 280 Sample size nearly 7000 (exact number awaited as some data yet to be added) Vote Share Estimate BJP+ 43% SP+ 35% BSP 15% Cong 3% Oth 4% Big win for BJP Margin of error 3%@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 ఉత్తరప్రదేశ్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 43 శాతం ఓట్లను కైవసం చేసుకుంటాయని లోక్నీతి-సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ 35 శాతం ఓట్లను సాధిస్తుందని అంచనా వేసింది. బీఎస్పీ 15 శాతం, కాంగ్రెస్ 3 శాతం, ఇతరులు 4 శాతం ఓట్లు సంపాదిస్తారని తెలిపింది. తాము అంచనా వేసిన దానికి 3 శాతం అటుఇటుగా ఫలితాలు రావొచ్చని వెల్లడించింది. Lokniti- CSDS Post Poll Survey findings PUNJAB No of AC 45 Locations 180 all sampled randomly, Sample size 4668, voters sampled randomly from voters list Vote share Estimate AAP 40% Cong 26% SAD+20% BJP+ 7% Oth 7% Big victory for AAP Margin of error 4%@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 40 శాతం, కాంగ్రెస్ పార్టీకి 29 శాతం, శిరోమణి అకాలీదళ్కు 20 శాతం, బీజేపీ, ఇతరులకు 7 శాతం చొప్పున ఓట్లు వస్తాయని లోక్నీతి-సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్ అంచనా కట్టింది. తుది ఫలితాలు, ఎగ్జిట్పోల్కు మధ్య 4 శాతం వ్యత్యాసం ఉండొచ్చని తెలిపింది. (క్లిక్: ఎస్పీకి మరీ అన్ని తక్కువ సీట్లా?.. సరికొత్త ఎగ్జిట్ పోల్స్) Finding from Lokniti-CSDS Post Poll survey UTTARAKHAND No of AC 26 Locations 104, Sample size 2738, All sampled randomly Estimated Vote Share BJP 43% Cong 38% AAP 3% BSP 4% Oth 12% Should give a comfortable majority to BJP Margin of error 3%.@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉండే అవకాశముందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి రెండో స్థానం దక్కనుందని లోక్నీతి-సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్లో తేలిందని రాజకీయ విశ్లేషకుడు సంజయ్ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనేది గురువారం(మార్చి 10న) తేలనుంది. (క్లిక్: వర్మ ఓవరాక్షన్.. అక్కడే మకాం) Lokniti-CSDS Post Poll survey GOA AC 20 location 80 sample size 2066 sampled from voters list Vote share estimate BJP 32% Cong 29% AITC+ 14% AAP 7% RG 8% Oth 10% Hung Assembly possible Margin of error 6% due to smaller sample & multi corner contest@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022