Rolls Royce
-
రోల్స్ రాయిస్ అల్ట్రా-లగ్జరీ తొలి ఈవీ స్పెక్టర్: షాకింగ్ ధర
న్యూఢిల్లీ: బ్రిటన్ కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కూడా ఈవీ మార్కెట్లోకి అడుగు పెట్టింది.ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కస్టమర్లకోసం తొలి ఆల్-ఎలక్ట్రిక్ కారు ‘స్పెక్టర్’ ను ఆవిష్కరించింది. 2023 చివరికి కస్టమర్లకు వాహనాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ కారు పప్రారంభ ధర సుమారు దాదాపు రూ.3.5 కోట్లుగా ఉండనుంది. దాదాపు ఏడాది క్రితం దీనికి సంబంధించిన టీజర్ను విడుదల చేసిన కంపెనీ తాజాగా దీన్ని లాంచ్ చేసింది.ఇప్పటికే దాదాపు 300కు పైగా ఈ లగ్జరీ కారును ప్రీబుకింగ్ అయ్యాయని రోల్స్ రాయిస్ సీఈఓ టోర్స్టన్ ముల్లర్-ఓట్వోస్ వెల్లడించారు. ఈవీ కార్లలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదే కాదు "అల్ట్రా-లగ్జరీ ఎలక్ట్రిక్ సూపర్ కూపే" , ఫాంటమ్ కూపేకి కొనసాగింపు అని పేర్కొన్నారు. తమ స్పెక్టర్ 3.4 సెకన్లలో 0-100 (కిమీ/గం) వేగం పుంజుకుంటుందని తెలిపారు. డిజైన్ పరంగా, ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ మెరుగైన ఏరోడైనమిక్ సామర్థ్యం, విశాలమైన గ్రిల్ను యాడ్ చేసింది. అలాగే బానెట్పై కొత్త 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ’ అని పేర్కొంది. కేవలం 2 డోర్లు మాత్రమే ఉన్న ఈ అతి విలాసవంతమైన కారులోని ఇతర విశేషాలను గమనిస్తే. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు మధ్యలో పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేను అందించింది.అలాగే స్ప్లిట్ హెడ్ల్యాంప్ డిజైన్, హెడ్ల్యాంప్ క్లస్టర్, హై-మౌంటెడ్ అల్ట్రా-స్లిమ్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్స్), అలాగే ఏరో-ఆప్టిమైజ్ 23 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. -
దూసుకొస్తున్న రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు, ధర ఎంతంటే!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2023 చివరి నాటికి రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు 'రోల్స్ రాయిస్ స్పెక్టర్'ను విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ కారును రెండో సారి టెస్ట్ డ్రైవ్ నిర్వహించగా..ఆ కారులో 40శాతం అభివృద్ధి సాధించినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆ టెస్ట్ డ్రైవ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రోల్స్ రాయిల్స్ ఈవీ కారును ఆ సంస్థ రెండో సారి ఫ్రెంచ్ రివేరా, దక్షిణ ఫ్రాన్స్లో 625,000 కిలోమీటర్ల వరకు టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. దీంతో ఇప్పటి వరకు 2.5 మిలియన్ కిలోమీటర్ల టెస్ట్ డ్రైవ్ను పూర్తి చేసినట్లైంది. ఇక ఈ టెస్ట్లో కారులో 40 శాతం అభివృద్ధిని సాధించింది. ఈ సందర్భంగా రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ సీఈవో టోర్స్టెన్ ముల్లర్ ఓట్వోస్ మాట్లాడుతూ..రోల్స్ రాయిస్ కారు తరహాలో ఈ కొత్త ఈవీ కారు ఉండదని, వాటన్నింటి కంటే భిన్నంగా ఉంటుందని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ వేరియంటే కాకుండా.. కంప్యూటింగ్ సామర్ధ్యం ,లేటెస్ట్ డేటా ప్రాసెసింగ్ టెక్నాలజీ అప్లికేషన్ కనెక్ట్ చేసిన రోల్స్ రాయిస్ అని చెప్పారు. అంతేకాదు ఈ కారులో స్టార్ట్ రాడ్, ట్రాన్స్వెర్స్ రాడ్ (Transverse), కాయిల్ స్పింగ్, షాక్ అబ్జార్బర్స్(అంవాంఛనీయ ఘటనలు..లేదంటే రోడ్డు ప్రమాదాల్ని నివారించే సిస్టం), డ్రమ్, కంట్రో ఆర్మ్, డ్రైవ్ యాక్సిల్ భాగాల్ని కలిపే సస్పెన్షన్ సిస్టం 'మ్యాజిక్ కార్పెట్ రైడ్' ఫీచర్లు ఉన్నాయి. తమ సంస్థ చరిత్రలోనే తొలిసారి 1.5 మీటర్ల పొడవైన పిల్లర్ లెస్ కోచ్ డోర్లను ఈ ఈ కార్లలో ప్రవేశ పెట్టిందని టోర్స్టెన్ గుర్తు చేశారు. దాదాపు నాలుగు మీటర్ల పొడవుతో ముందు ఏ' పోల్ నుంచి వెనుక టెయిల్లైట్ల వరకు వన్ పీస్ సైడ్ ప్యానల్ విస్తరించింది ఉంది. అదేవిధంగా, పిల్లర్లెస్ కోచ్ డోర్లు దాదాపు 1.5 మీటర్ల పొడవుతో రోల్స్ రాయిస్ చరిత్రలో అత్యంత పొడవైనవి ఈ సందర్భంగా వివరించారు. కారు ధర ఎంతంటే! మోటార్ కార్లు, ఎలక్ట్రిక్ కార్ల ధరల్ని పోల్చితే.. ఈవీ కారు రోల్స్ రాయిస్ స్పెక్టర్ మోస్ట్ ఎక్స్పెన్సీవ్ కారుగా అవతరించనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పలు నివేదికల ప్రకారం..ఈ కారు ధర £400,000 (భారత్ కరెన్సీలో రూ.3,86,46,873.07) ఉండగా.. భవిష్యత్లో ఈ కారు ధర మరింత పెరిగే అవకాశం ఉండనుంది. -
రోల్స్రాయ్స్: గంటకు 623 కిలోమీటర్లు..
భూమిలో ఇంధనాలు అడుగంటిపోతుండటం, కర్బన ఉద్గారాలు పెరిగిపోతుండటంతో.. వాహనాల తయారీదారులు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. బైక్లు, కార్ల నుండి విమానాలకు చేరుకుంది. రోల్స్రాయ్స్... అందరికీ అత్యంత ఖరీదైన కార్ల కంపెనీగానే తెలుసు. అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానాన్ని ఇటీవల పరీక్షించింది. ఈ సంస్థ తయారు చేసిన ‘స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’ఆల్–ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ వేగంలో మూడు కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించింది. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ బోస్కోంబ్డౌన్ టెస్టింగ్ సైట్లో దీనిని పరీక్షించారు. టెస్ట్ ఫ్లైట్ను రోల్స్రాయ్స్ కంపెనీ ఫ్లైట్ ఆపరేషన్ డైరెక్టర్ ఫిల్ ఓడెల్ నడిపారు. ఫ్లయింగ్ ట్యాక్సీస్ తమ భవిష్యత్ ప్రణాళిక అని చెబుతోంది రోల్స్రాయ్స్. ‘రోడ్డు, సముద్ర, ఆకాశయాన మార్గాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగమే ఈ ఎలక్ట్రిక్ ప్లేన్’అని రోల్స్రాయ్స్ సీఈఓ వారెన్ ఈస్ట్ చెబుతున్నారు. డిపార్ట్మెంట్ ఫర్ బిజినెస్, ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ మరియు ఇన్నోవేట్ యూకే భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు సగం నిధులను బ్రిటీష్ ఏరోస్పేస్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అందించింది. ప్రత్యేకతలు.. ఇది పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ విమానం. గంటకు 387.4 మైళ్ల (గంటకు 623 కి.మీ) వేగంతో దూసుకెళ్తుంది. ఈ వేగం పాత రికార్డుకంటే... 132 మైళ్లు (212.5 కిలోమీటర్లు) ఎక్కువ. 60 సెకన్లలోనే మూడు వేల మీటర్ల ఎత్తు ఎగరడం ఈ విమానం ప్రత్యేకత. గతంలో ఉన్న రికార్డులు... గతంలో విమానం 3 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 345 మైళ్లు (555.9 కిలోమీటర్ల), 15 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 331 మైళ్లు (531.1 కిలోమీటర్లు), 202 సెకన్లలో మూడువేలమీటర్ల ఎత్తుకు ఎగిరిన రికార్డులున్నాయి. ఈ మూడు రికార్డులను ‘స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’బ్రేక్ చేసింది. బ్యాటరీ పనితీరు.. 400 కిలోవాట్ల పవర్ బ్యాటరీ దీని సొంతం. దీని సామర్థ్యం 7,500 స్మార్ట్ఫోన్లు పూర్తిగా చార్జ్ చేసేంత. సాధారణంగా వాషింగ్ మెషీన్స్లో ఉండే స్పిన్ 1000 ఆర్పీఎం ఉంటుంది. దానికి రెట్టింపు సామర్థ్యంతో ఈ విమానం ప్రొఫెల్లర్స్ తిరుగుతాయి. బ్యాటరీని కూల్గా ఉంచడం కోసం పోర్చుగీస్ కార్క్తో థెర్మల్ రక్షణ కవచం ఏర్పాటు చేశారు. -
అరె డాల్ఫిన్లా ఉందే, వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రికార్డ్లను తుడిచి పెట్టింది
రోల్స్ రాయిస్కు చెందిన 'స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్' ఎలక్ట్రిక్ ఫ్లైట్ ఇప్పటి వరకు అన్నీ రికార్డ్లను తుడిచిపెట్టింది. మూడు సరి కొత్త ప్రపంచ రికార్డ్లను క్రియేట్ చేసి ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్గా ప్రసిద్ధికెక్కింది. ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ అండ్ ఇన్నోవేట్ యూకే భాగస్వామ్యంతో ఏరోస్పేస్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (ATI) సంస్థ నిధుల్ని అందించింది. ఆ నిధులతో రోల్స్ రాయిస్ 'యాక్సిలరేటింగ్ ది ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్' పేరుతో స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ అనే ఎలక్ట్రిక్ ఫ్లైట్ను తయారు చేసింది. అయితే తాజాగా యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బోస్కోంబ్ డౌన్ ఎయిర్క్రాఫ్ట్ టెస్టింగ్ నిర్వహించింది. ఈ టెస్టింగ్లో రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ విమానం 3 కిలోమీటర్లను 555.9 కేఎం/హెచ్ (345.4 ఎంపీహెచ్ ) అత్యధిక స్పీడ్తో అధిగమించింది. దీంతో ఇప్పటికే ఉన్న రికార్డ్ను 213.04 కేఎం/హెచ్ (132ఎంపీహెచ్) బద్దలు కొట్టింది. అంతేకాదు విమానం 532.కేఎం/హెచ్ (330 ఎంపీహెచ్) స్పీడ్తో 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లి ఈ అరుదైన ఫీట్ను సాధించగా, ఒకే సమయంలో 3000 కిలోమీటర్ల ఎత్తును ఒకేసారి 60 సెకన్ల నుంచి 202 సెకన్ల సమయంలో అధిగమించింది. రికార్డ్ను క్రియేట్ చేసే సమయంలో విమానం 623కేఎం/హెచ్ (387.4ఎంపీహెచ్) గరిష్ట వేగాన్ని అందుకుంది. తో ఇదే ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్గా నిలిచింది. ఈ రికార్డ్లను వరల్డ్ ఏరోనాటికల్ అండ్ ఆస్ట్రోనాటికల్ రికార్డులను నియంత్రించే, ధృవీకరించే వరల్డ్ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ - ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ (FAI)రోల్ రాయిస్ రికార్డ్లను ధృవీకరించాయి. చదవండి: బిఎమ్డబ్ల్యు ఎలక్ట్రిక్ స్కూటర్ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
రోల్స్ రాయిస్ లగ్జరీ కారు భారత మార్కెట్లోకి
బ్రిటన్కు చెందిన లగ్జరీ కార్ల తయారీదారు రోల్స్ రాయిస్ భారతదేశంలో మరో న్యూ మోడల్ కారును మన మార్కెట్లోకి తీసుకొచ్చింది. కలినన్ ఎస్యూవీ ధరను భారతదేశంలో రూ .6.95 కోట్ల (ఎక్స్ షోరూం, ఇండియా) ధరగా నిర్ణయించింది. రోల్స్ రాయిస్ కొత్త ఎస్యూవీని 'లగ్జరీ ఆర్కిటెక్చర్' గా నిర్మించినట్టు కంపెనీ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వజ్రంగా చెప్పుకునే కలినన్ డైమండ్ పేరుతో 'రోల్స్ రాయిస్ కలినన్'ను విడుదల చేసింది రోల్స్ రాయిస్. ప్రపంచం మొత్తం మీద అత్యంత కాస్ట్లీ ఎస్యూవీ కూడా ఇదేనని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అన్ని భౌగోళిక, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ కారును తయారుచేశామని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా 'ఎవ్రీవేర్' మోడ్ ఆప్షన్ ద్వారా ఇసుక, మట్టి, తడిగడ్డి, కంకరరోడ్డు, మంచురోడ్డు ఇలా దేనిమీదైనా ఈ కారును ఏమాత్రం కుదుపులు లేకుండా, హాయిగా నడపొచ్చని పేర్కొంది. ఫీచర్లు 6.75 లీటర్ల వీ 12 ఇంజిన్, 653 బీహెచ్పీ శక్తిని, 850 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. డాష్బోర్డుపై టచ్స్క్రీన్తో పాటు ముందు సీట్ల వెనుక కూడా 12 అంగుళాల టచ్స్క్రీన్లను ఏర్పాటుచేశారు. 22 అంగుళాల అల్లోయ్ వీల్స్ జోడించింది. అలాగే వెనుకవైపు సీట్ల కింద బూట్లో రెండు ఇన్నర్ బెంచీలను ఏర్పాటుచేశారు. కావాలనుకుంటే వాటిని బయటకు లాగి కుర్చీల్లా మార్చుకోవచ్చన్నమాట. -
ఎగిరే కార్ల రేసులోకి ఆ కంపెనీ కూడా..
డ్రైవర్ అనే వాడే లేకుండా వాటంతట అవే నడిచే వాహనాలు రోడ్ల మీదకు వస్తాయి. కేవలం రోడ్లపైనే కాక, గగనంలోనూ స్వయంప్రతిపత్త వాహనాలు ఎగరబోతున్నాయి. ఈ బిగ్ ట్రాన్స్పోర్టేషన్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే ప్రపంచమంతటా వ్యాప్తిస్తోంది. ఉబర్ దుబాయ్లో ఈ ఎగిరే ట్యాక్సీ నెట్వర్క్ను క్రియేట్ చేస్తుండగా.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీపేజ్ కిట్టి హాక్ అనే ఎగిరే కారు స్టార్టప్ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఇప్పటికే పలువురు కస్టమర్లకు వీటిని ఆఫర్ చేస్తుంది కూడా. తాజాగ ఈ రేసులోకి రోల్స్ రాయిస్ కూడా వచ్చి చేరింది. యూకేలో జరిగిన ఫార్న్బోరో అంతర్జాతీయ ఎయిర్ షోలో ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ కాన్సెప్ట్ను ఆవిష్కరించింది. ఈ వెహికిల్ హెలికాప్టర్ తరహాలో గగనతలంలో ఎగరడంతోపాటు రోడ్డుపైనా దూసుకెళ్తుంది. ఈ వెహికిల్ ఐదుగురు ప్రయాణికులను తీసుకెళ్లడంతో పాటు, గాల్లో 500 మైళ్ల (805 కిలోమీటర్లు) వరకు ప్రయాణించగలదని, గంటకు గరిష్ఠంగా 200 మైళ్ల వేగంతో దూసుకెళ్లగలదని సంస్థ తెలిపింది. మరో ఏడాదిన్నరలో ఈ హైబ్రిడ్ ఫ్లయింగ్ ట్యాక్సీ ప్రొటొటైప్ సిద్ధం కానుందని, 2020నాటికి వెహికిల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రోల్స్రాయిస్ ఎలక్ట్రిక్ టీమ్ హెడ్ రాబ్ వాట్సన్ తెలిపారు. టేకాఫ్ అవ్వడం కానీ ల్యాండ్ అవ్వడం కానీ వెర్టికల్గా జరుగుతుందని కంపెనీ తెలిపింది. ఈ వెహికిల్ వింగ్స్ 90 డిగ్రీల్లో తిరుగుతూ ఉంటాయని చెప్పింది. -
ఈ రోల్స్ రాయస్ వెరీ వెరీ స్పెషల్...
-
ఈ రోల్స్ రాయస్ వెరీ వెరీ స్పెషల్...
అతి ఖరీదైన కార్లకు పెట్టింది పేరైన బ్రిటిష్ అల్ట్రా లగ్జరీ కార్ మేకర్ రోల్స్ రాయిస్ సరికొత్త కారును ఈ వారం ఆవిష్కరించింది. ఎలిగెన్స్ పేరుతో జెనీవా మోటారో షోలో లాంచ్ చేసిన ఈ రాయల్ కారు గురించి తెలుసుకోవాల్సిందే. అసలే కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారు.. అలాంటి కారుపై వజ్రాలు పొదిగితే ఎలా ఉంటుంది.. ఎందుకంటే మామూలుగానే రోల్స్ రాయిస్ కార్లు చాలా ప్రత్యేకం. అలాంటి రాయల్ కార్లతో పోలిస్తే ఇది మరీ స్పెషల్ . దాదాపు వెయ్యి రియల్ డైమండ్ల డస్ట్ తో దీన్ని పెయింట్ చేశారు. ఈ డైమండ్ పూతను ప్రత్యేకంగా చేతితోనే రూపొందించి మరింత స్పెషల్ అప్పీల్ తీసుకొచ్చారు. కారు టాప్ పార్ట్ డార్క్ గ్రే కలర్, దిగువ భాగం లైట్ బూడిద రంగులో డిజైన్ చేసినప్పటికీ ..ఈ కారు పై లైటింగ్ పడినపుడుమాత్రం మెటాలిక్ పెయింట్తో వజ్రపు కాంతుల మెరుపులతో మెరిసిపోతూ కార్ లవర్స్ను విపరీతంగా ఆకట్టుకోనుంది. దీనికోసం తమ టెక్నికల్ టీం రెండు నెలలు కష్టపడిందని రోల్స్ రాయిస్ తెలిపింది. యూనిక్ లైట్ ట్రాన్స్మిషన్, వజ్రాల కాంతి రిఫ్లెక్షన్ కోసం తమ టెక్నీషియన్స్ చాలా జాగ్రత్తగా పనిచేసినట్టు చెప్పింది. అంతేకాదు అల్ట్రా హార్డ్ డైమండ్ డస్ట్ కు ప్రత్యేక శ్రద్ధతో అతిసున్నితమైన స్మూత్ టచ్ ను తీసుకొచ్చినట్టు చెప్పింది. అన్నట్టు డై మండ్ పెయింటింగ్ను ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదట. అయితే దీని ధర ఎంతో కంపెనీ రివీల్ చేయలేదు. ఎందుకంటే ఒకప్రత్యేక ప్రయివేటు కస్టమర్ కోసం దీన్ని రూపొందించారట. -
రోడ్లూడ్చిన రోల్స్రాయ్స్
లండన్లోని బాండ్ స్ట్రీట్. ఒకాయన ఆ వీధిలో నడుస్తున్నాడు. మార్గమధ్యంలో రోల్స్రాయ్స్ షోరూమ్ కనిపించింది. వెంటనే ఆ షోరూమ్లోకి వెళ్లిన ఆయన కార్ల ధరలు, ఇతర ఫీచర్స్ గురించి అడిగాడు. ఇండియా నుంచి వచ్చిన అందరిలాంటి ఓ సాధారణ వ్యక్తి అనుకున్న సేల్స్మ్యాన్.. అతడిని అవమానించాడు. బయటికి గెంటేసినంత పని చేశాడు. అలా అవమానం పొందిన వ్యక్తి ఎవరో కాదు హైదరాబాద్ నవాబు ముకర్రమ్ జా. వెంటనే హోటల్రూమ్కు వచ్చిన నవాబు తన సేవకులతో షోరూమ్కు ఫోన్ చేయించాడు. కార్లు కొనడానికి హైదరాబాద్ నవాబు వస్తున్నాడని చెప్పించాడు. ఈసారి పూర్తిగా నవాబు హోదా, రాజఠీవీతో షోరూమ్కు బయలుదేరాడు. ఆయన అక్కడికి చేరేటప్పటికే ఫ్లోర్పై రెడ్కార్పెట్ పరిచి ఉంది. అక్కడ ఉన్న సేల్స్మెన్ వంగి వంగి దండాలు పెట్టారు. నవాబు అప్పుడు షోరూమ్లో ఉన్న ఆరు కార్లను డెలివరీ ధరలు కూడా చెల్లించి కొనేశాడు. ఇండియాకు చేరుకున్న నవాబు కార్లు రాగానే... ఆ ఆరు కార్లకు పొరకలు కట్టి హైదరాబాద్ రోడ్లను శుభ్రం చేయించాలని మున్సిపల్ డిపార్ట్మెంట్ను ఆదేశించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రోల్స్రాయ్స్ కార్లు అలా నగరంలో చెత్తను శుభ్రం చేయడానికి ఉపయోగించారు. ఈ వార్త ఈ పత్రికా, ఆ పత్రికా చేరి చివరకు... ప్రపంచ ప్రఖ్యాత రోల్స్రాయ్స్ పరువు మురికి కాలువలో కలిసింది. యూరప్ అమెరికాల్లో ఈ కారును ఉపయోగించిన వారు.. ‘ఏది ఇండియాలో చెత్త మోయడానికి వాడుతున్నారే.. ఆ కారా?’ అని వ్యంగ్యంగా అనేవారట. ఒక్కసారిగా రోల్స్రాయ్స్ ప్రతిష్టతోపాటు రెవెన్యూ కూడా తగ్గిపోయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా అసలుకే ఎసరొస్తుందనుకున్న రోల్స్రాయ్స్ యాజమాన్యం..నవాబుకు క్షమాపణలు చెబుతూ టెలిగ్రాం పంపింది. కార్లతో రోడ్లు క్లీన్చేయించడం ఆపేయాలని కోరింది. అంతేకాదు.. తాము చేసిన తప్పుకు బదులుగా ఆరు రోల్స్రాయ్స్ కార్లను ఉచితంగా ఇస్తామని కూడా ఆఫర్ చేసింది. 1967లో అతని నాన్నమ్మ మరణానంతరం ముకర్రమ్ జా యువరాజయ్యాడు. ప్రస్తుతం అతని ప్యాలెస్ మ్యూజియంగా మారింది. ఆ రోల్స్రాయ్స్ కార్లు కూడా ప్రదర్శనకు ఉంచారు.