-
రోబో ఆత్మహత్య!?
సియోల్: పరీక్ష సరిగా రాయలేదని, ప్రేమ విఫలమైందని, ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు తీసుకుంటున్న జనం వార్తలను మనం చూశాం. కానీ మరమనిషి సైతం ఆత్మహత్య చేసుకుంటాడన్న వార్త వింటానికి కొత్తగా ఉన్నా ఇది నిజంగా జరిగిందని దక్షిణకొరియా వార్తాసంస్థలు కోడై కూస్తున్నాయి. రోబో సేవలను విపరీతంగా వాడే దక్షిణ కొరియాలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. డాక్యుమెంట్ల డెలివరీ వంటి పనుల్లో తెగ బిజీగా ఉండే ఓ రోబో సూసైడ్ చేసుకుందన్న వార్త సంచలనం సృష్టించింది. పని ఒత్తిడి వల్లే రోబోట్ ఆత్మహత్య చేసుకుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చక్కర్లు కొట్టి.. మెట్లపై పడి గత గురువారం సాయంత్రం గుమీ నగర సిటీ కౌన్సిల్ భవనంలో ఈ రోబో ‘సూపర్వైజర్’ బాధ్యతల్లో ఉండగా ఉన్నట్టుండి ఆగిపోయి గుండ్రంగా తిరిగి మెట్లపై నుంచి పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఏకబిగిన పని చేయాల్సి రావడంతో విపరీత పని ఒత్తిడితోనే అది ఇలా చనిపోయిందని వార్తలొచ్చాయి. అమెరికాకు చెందిన బేర్రోబోటిక్స్ సంస్థ ఈ రోబోను తయారు చేసిచి్చంది. గత ఆగస్ట్ నుంచి అది చురుగ్గా పనిచేస్తోందట. ఈ రోబోకు సొంతంగా పౌరసేవల గుర్తింపు కార్డుంది! అంటే ఒకే ఫ్లోర్లోకాకుండా లిఫ్ట్లో తిరుగుతూ వేర్వేరు అంతస్తుల్లో పనులు చక్కబెట్టగలదు. ఇలాంటి రోబోట్ పొరపాటున మెట్ల పై నుంచి పడిందా? లేదంటే సాంకేతిక లోపమా? లేదంటే మరేదైనా సమస్యా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. రోబో శకలాలను స్వా«దీనంచేసుకుని ల్యాబ్కు పంపించారు. అనూహ్య ఘటన తర్వాత ఈ బిల్డింగ్లో మరో రోబోను పనిలో పెట్టుకోబోమని గుమీ సిటీ కౌన్సిల్ చెప్పింది. అయితే ద.కొరియాలో రోబోట్ సేవలు అత్యధికం. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ గణాంకాల ప్రకారం ద.కొరియాలో ప్రతి పది మంది ఉద్యోగులకు ఒక పారిశ్రామిక అవసరాల రోబోట్ను వినియోగిస్తున్నారు. -
మనిషికో రోబో!
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో సీఈఓ ఇలాన్ మస్క్ కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. సంస్థ వాటాదారుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని, కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందన్నారు. సమావేశంలో భాగంగా టెస్లా లీగల్ కార్యాలయాన్ని యూఎస్లోని డెలావర్ నుంచి టెక్సాస్కు మార్చేందుకు షేర్హోల్టర్లు అనుమతించారు.టెస్లా ట్యాక్సీలుఏజీఎంలో మస్క్ మాట్లాడుతూ..‘టెస్లా యాజమానులకు మరింత విలువ జోడించేలా, కంపెనీ వల్ల తమ ఆదాయం పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నాం. టెస్లా వినియోగదారులు తమ కార్లను ఉబర్, ఎయిర్బీఎన్బీ మాదిరిగానే రెంట్కు ఇచ్చేలా కొత్త యాప్ను తీసుకు రాబోతున్నాం. కొన్ని గంటలు, రోజులు, వారాలపాటు యాజమానులు తమ కారును రెంట్కు ఇచ్చే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నాం. దాంతో యూజర్లకు అదనంగా ఆదాయం సమకూరుతుంది’ అన్నారు.హ్యూమనాయిడ్ రోబోట్స్‘హ్యూమనాయిడ్ రోబోట్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పరిశ్రమ రంగంతోపాటు రోజువారీ జీవితంలో వీటి పాత్ర కీలకంగా మారనుంది. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతిఒక్కరికి ఒక రోబో ఉంటుంది. ఇంటి పనులు, పారిశ్రామిక అవసరాలతోపాటు ఇతర పనులకు హ్యూమనాయిడ్ రోబోట్లను విస్తారంగా వాడుతారు. దాంతో కంపెనీ తయారుచేసే ఆప్టిమస్ రోబోలకు భారీ గిరాకీ ఏర్పడనుంది. ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా. టెస్లా ఏటా ఆప్టిమస్ ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల (రూ.83లక్షల కోట్లు) లాభాన్ని ఆర్జించగలదు’ అని మస్క్ అంచనా వేశారు.ఇదీ చదవండి: ఏడు నెలల తర్వాత జరుగబోతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంసస్టైనబుల్ ఎనర్జీ‘టెస్లా కార్లలో వినియోగించే బ్యాటరీల సమర్థతను పెంచేలా చర్యలు సాగుతున్నాయి. కంపెనీ ఇప్పటికే కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ప్రయత్నిస్తోంది. స్థిరమైన శక్తిని అందిస్తూ స్టోరేజీ కెపాసిటీను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మస్క్ చెప్పారు. -
Indraja Sankar Birthday Photos: విజిల్ నటి బర్త్డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
-
స్ట్రీట్ కేఫ్లో సర్వ్ చేస్తున్న రోబో వెయిటర్! నెటిజన్లు ఫిదా
రోబోలను పలు రంగాల్లో తీసుకొచ్చి పనిచేయించడాన్ని చూశాం. వాటిని మాల్స్, ఆస్పత్రి, పోలీస్, తదితర శాఖల్లో ప్రవేశ పెట్టి చూపించారు. అలాగే ఇటీవల బెంగుళూరు, నోయిడా, చెన్నె కోయింబత్తూర్ రోబోట్ నేఫథ్య రెస్టారెంట్లను ప్రారంభించి కస్టమర్లను ఆకర్షించింది. పైగా ఇవి అత్యంత ప్రజాధరణ పొందాయి కూడా. ఇప్పుడూ ఏకంగా స్ట్రీట్ కేఫ్ సెంటర్ల్లోకి కూడా ఆ సాంకేతికత వచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో అహ్మదాబాద్లోని స్ట్రీట్ కేఫ్ పాప్ అప్ ట్రక్ వినియోగదారులకు రోబోట్ వెయిటర్ ఐస్ గోలాను సర్వ్ చేస్తూ కనిపిస్తుంది. ఇది వినియోగదారులకు రుచిగల ఐస్ గోలాలను చక్కగా సర్వ్ చేస్తుంది. ఈ రోబో పేరు ఐషా, ధర రూ. 1,35,000/-. అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్ బ్లాగర్ కార్తీక్ మహేశ్వరి ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ సాంకేతిక ఆవిష్కరణను చూసి నెటిజన్లు వాహ్! అంటూ ప్రశంసిస్తూ పోస్టలు పెట్టారు. కాగా, నిజం చెప్పాలంటే ఈ రోబోటిక్ సాంకేతికతపై మహమ్మారి సమయంలో చైనా ఎక్కువగా ఆధారపడింది. అఖరికి భద్రతా ప్రోటోకాల్లను నిర్వహించడానికి కూడా రోబోట్లతోనే మోహరించింది. View this post on Instagram A post shared by Kartik Maheshwari (@real_shutterup) (చదవండి: ఆస్కార్ వేడుకల్లో హైలెట్గా మెస్సీ డాగ్! ఏం చేసిందంటే..!) -
మనుషుల్లేకుండా ఫుడ్ డెలివరీ.. వీడియో వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో రోబోల వాడకం ఎక్కువవుతోంది. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు అవి వెళ్తున్నాయి.. చేయలేని పనులు చేస్తున్నాయి. భవిష్యత్తులో మానవులు నేరుగా చేసే పనుల స్థానాల్లో క్రమంగా రోబోల సంఖ్య పెరుగుతుంది. జపాన్ వంటి కొన్ని దేశాల్లో కార్మికుల కొరత అధికమవుతోంది. వారిస్థానాలను భర్తీ చేసేలా రోబోలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఉబర్ ఈట్స్ సంస్థ ఫుడ్ డెలివరీ చేయడానికి జపాన్లో రోబోలను వినియోగిస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ జపాన్లో ఫుడ్ డెలివరీ కోసం రోబోలను రంగంలోకి దించింది. డెలివరీ బాయ్స్కు బదులుగా రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసే సర్వీసులను ఇటీవల ప్రారంభించింది. దేశం ఎదుర్కొంటున్న కార్మికుల కొరత సమస్యను ఇది తీరుస్తుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ రోబోల సేవలను టోక్యోలోని రెండు స్టోర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో వీటిని మరిన్ని స్టోర్లకు విస్తరిస్తామని చెప్పారు. కెమెరాల ద్వారా ట్రాఫిక్ను తప్పించుకుంటూ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. 27 లీటర్ల పానీయాలు, 27 కేజీల ఆహారాన్ని ఏకకాలంలో తీసుకుపోయే సామర్థ్యం వీటిటి ఉందని కంపెనీ వివరించింది. ఇదీ చదవండి: ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు ఉబర్ ఈట్స్ సంస్థ కార్ట్కెన్ అండ్ మిసుబుషి ఎలక్ట్రిక్ కంపెనీతో కలిసి టోక్యోలో ఈ రోబోలను వినియోగిస్తుంది. ఇవి ‘మోడల్ సీ’ రోబోలుగా ప్రసిద్ధి చెందాయి. స్టార్షిప్ టెక్నాలజీస్ అమెరికాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీలో మొదట రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసి రికార్డుల్లో నిలిచింది. డెలివరీ రోబోట్లను ఫుడ్ డెలివరీ, ప్యాకేజీ డెలివరీ, హాస్పిటల్ డెలివరీ, రూమ్ సర్వీస్ వంటి విభిన్న అవసరాలకు వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 食品宅配サービスを手掛けるウーバーイーツジャパン(東京)は5日、自律走行ロボットによる配送を東京・日本橋エリアで6日に始めると発表しました。記事→https://t.co/jbVVrbcb22 #ウーバーイーツ #ロボット配送 #ubereats pic.twitter.com/oWbYjRGrn0 — 時事通信映像ニュース (@jiji_images) March 5, 2024 -
మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే..
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో రోబో టెక్నాలజీకి ఆదరణ ఎక్కువవుతోంది. దాదాపు అన్నింట ఈ టెక్నాలజీని వాడుతున్నారు. మనుషులు వెళ్లలేని చోటుకు, ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల వెళ్లినా అధిక ప్రమాదం పొంచి ఉండే ప్రదేశాల్లో ప్రత్యేక రోబోలను వినియోగిస్తున్నారు. సముద్ర గర్భంలో నిఘా పెట్టడం అంటే మాటలుకాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కొన్ని మనిషి ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. అలాంటి సందర్భాల్లో నీటి లోపల నిఘా కోసం ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు చేరుకొని పని చేసేలా ఈ రోబోను రూపొందించారు. ప్రస్తుతం సముద్రంలో నీటి లోపల నిఘా, అధ్యయనం కోసం పరిశోధన నౌకలను వినియోగించాల్సి వస్తుంది. ఇందుకు మనుషుల అవసరం కూడా ఎక్కువే. పైగా వీటి నిర్వహణ ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో తక్కువ ఖర్చుతో కచ్చితమైన నిఘా, అధ్యయనం కోసం ఈ మెరైన్ రోబో మెరుగ్గా పని చేస్తుందని ఐఐటీ మండిలోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీశ్ కడియం తెలిపారు. మెరైన్ రోబోను వినియోగించడం ద్వారా సముద్ర జలాల్లో నిఘా కోసం పనిచేసే మనుషుల ప్రాణాలకు ఉన్న ముప్పును కూడా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన గూగుల్ ఉపయోగాలివే.. మెరైన్ రోబో ద్వారా జలవిద్యుత్ కేంద్రాల్లో నీటి లోపలి నిర్మాణాలను పరిశీలించవచ్చని, పర్యావరణ సమస్యలను వేగంగా గుర్తించే అవకాశం ఉంటుందని ఐఐటీ పాలక్కడ్ ప్రొఫెసర్ శాంతకుమార్ మోహన్ తెలిపారు. ఈ మెరైన్ రోబోకు సంబంధించిన వివరాలు ఓషియన్ ఇంజినీరింగ్, జర్నల్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఆండ్ రోబోటిక్ సిస్టమ్స్ అనే జర్నళ్లలో ప్రచురితమైనట్లు తెలిసింది. -
పసికందులు ఎందుకు ఏడుస్తున్నారో ఠక్కున చెప్పేసే డివైజ్!
ఇంకా మాటలు రాని వయసులో కేరింతలు, ఏడుపులు మాత్రమే పసికందుల భాష. పసిపిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు బోసినవ్వులొలికిస్తూ కేరింతలు కొడతారు. ఆకలేసినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తారు. పసిపిల్లల ఏడుపును అర్థం చేసుకోవడం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. ఆకలితోనే ఏడుస్తున్నారా, మరే కారణం వల్ల ఏడుస్తున్నారా తెలుసుకోవడం అంత సులువు కాదు. గుక్కతిప్పుకోకుండా ఏడ్చే పసిపిల్లలతో తల్లులు నానా తంటాలు పడుతుంటారు. పసిపిల్లలు ఏడ్చేటప్పుడు ఇకపై అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇదిగో ఈ బుల్లిపరికరం పసికందుల ఏడుపును మనకు బోధపడే భాషలోకి అనువదిస్తుంది. ఇది ఇరవై నాలుగు గంటలూ పసికందులను కంటికి రెప్పలా కనిపెడుతూ ఉంటుంది. వారు ఏడుస్తున్నట్లయితే, ఎందుకు ఏడుస్తున్నారో ఇట్టే తెలియజెబుతుంది. అమెరికన్ కంపెనీ ‘మాక్సికోసీ’ పిల్లల ఏడుపును అనువదించే ఈ బుల్లిరోబోను ఇటీవల రూపొందించింది. దీనికి అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే బేబీ మానిటర్ కూడా ఉంటుంది. పిల్లలు ఏడుస్తున్నట్లయితే, వారు ఆకలికి ఏడుస్తున్నారో, నిద్రవస్తున్నందుకు ఏడుస్తున్నారో, భయం వల్ల ఏడుస్తున్నారో, గందరగోళం వల్ల ఏడుస్తున్నారో ఇది ఇట్టే చెప్పేస్తుంది. దీని ధర 61.99 డాలర్లు (రూ.5,154) మాత్రమే!. (చదవండి: కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ గురించి విన్నారా?) -
ఇకపై మృదువైన రోబోలు..
ఇంటి పనులు, తోట పనులు చకచకా చక్కబెడతాయి. పరిశ్రమల్లో పెద్ద పెద్ద బరువులను ఎత్తేస్తాయి. గాలి లేని ప్రదేశాల్లోనూ గనులను తవ్వేస్తాయి. మందుపాతరలను కనిపెడతాయి. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్య రంగాలతోపాటు సముద్ర గర్భంలో, అంతరిక్షంలోనూ అవలీలగా పనిచేస్తాయి. టీ, కాఫీలు తెచ్చి ఇస్తాయి. నగరంలో ఏం చూడాలో కూడా చెప్పేస్తాయి. అచ్చం మనిషిలా కనిపించడమే కాదు, అలాగే ఆలోచిస్తూ, అబ్బురపరుస్తూ సమాజంలో సాటి పౌరులుగా మారబోతున్న మరమనుషులు రానున్న రోజుల్లో అద్భుతాలు చేయగలవని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇన్ని పనులు చేయబోతున్న మనిషినిపోలే రోబోల తయారీకి సంబంధించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా స్విట్జర్లాండ్లోని జ్యురిచ్ యూనివర్సిటీ పరిశోధకులు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో రోబోటిక్ హ్యాండ్లను రూపొందించారు. ఇవి అచ్చం మనిషి చేతుల మాదిరిగానే ఎముకలు లిగమెంట్ల వంటి ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. పైగా వీటికి సాగే గుణం కూడా ఉందట. కాబట్టి లేజర్ స్కానింగ్ టెక్నాలజీ, రకరకాల పాలిమర్ల సాయంతో భవిష్యత్తులో మన చర్మాన్ని పోలిన మృదువైన రోబోలను తయారుచేయడం సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. ఇదీ చదవండి: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..! సంప్రదాయ పాలీఅక్రిలేట్లకు బదులుగా థియోలీన్తో చేసిన పాలిమర్లను వాడటంతో అవసరం మేరకు అవి సాగి, మళ్లీ యథాస్థితికి వస్తాయి. పైగా గట్టిగా కాకుండా మృదువుగా ఉండటంతో ఎక్కువ కాలం పనిచేస్తాయి. సంప్రదాయ రోబోలు గట్టిగా ఉంటాయి కాబట్టి వాటితో కలిసి పనిచేసేటప్పుడు మనకి చిన్న చిన్న గాయాలు కూడా అవుతుంటాయి. కొత్తరకం రోబోలతో అలాంటివేవీ ఉండవు. పైగా వాటిని పట్టుకోవడానికీ సులభంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. -
రాబోతోంది మరతరం.. కాఫీ చేస్తున్న హ్యుమనాయిడ్ రోబోలు.. వీడియో వైరల్
ఇంటి పనులు, తోట పనులు చకచకా చక్కబెడతాయి. పరిశ్రమల్లో పెద్ద పెద్ద బరువులను ఎత్తేస్తాయి. గాలి లేని ప్రదేశాల్లోనూ గనులను తవ్వేస్తాయి. మందుపాతరలను కనిపెడతాయి. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్య రంగాలతోపాటు సముద్ర గర్భంలో, అంతరిక్షంలోనూ అవలీలగా పనిచేస్తాయి. టీ, కాఫీలు తయారుచేస్తాయి. నగరంలో ఏం చూడాలో కూడా చెప్పేస్తాయి. అచ్చం మనిషిలా కనిపించడమే కాదు, అలాగే ఆలోచిస్తూ, అబ్బురపరుస్తూ సమాజంలో సాటి పౌరులుగా మారబోతున్న మరమనుషుల తరం రాబోతోందని నిపుణులు చెబుతున్నారు. మనిషికి సాధ్యంకాని పనులు చేయడం, అతడు వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లడం, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను తట్టుకోవడం.. ఇవన్నీ కేవలం మర మనుషులకు (రోబోలకు) మాత్రమే సాధ్యం. తాజాగా ‘ఫిగర్.ఏఐ’ సంస్థ సౌత్కరోలినాలోని బీఎండబ్ల్యూ తయారీ ప్లాంట్లో పనిచేసేందుకు హ్యూమనాయిడ్ రోబోలను తయారుచేస్తోంది. ఇవి ప్లాంట్లో పనిచేస్తున్న సిబ్బందికి టీ, కాఫీలు ఇస్తూ సేదతీరుస్తున్నాయి. కాఫీ చేసే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే వాటికవే స్వయంగా ఆలోచిస్తూ సమస్యను పరిష్కరించుకుంటున్నాయి. కంపెనీలు తమ సంస్థల్లో హ్యూమనాయిడ్ రోబోలను వినియోగించడం కొత్తేమీ కాదు. గతేడాది అక్టోబర్లో అమెజాన్ సంస్థ తన వేర్హౌజ్ల్లో పని చేయడానికి హ్యుమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంస్థ కార్యకలాపాల కోసం అమెరికాలోని ఓ వేర్హౌజ్లో వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినట్లు అమెజాన్ గతంతోనే వెల్లడించింది. -
చివరకు ఏఐలోనూ లింగవివక్ష!
ఒకప్పుడు సైన్స్ ఇమాజినరీ నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నేడు దాదాపు అందరి జీవితాల్లో అంతర్భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, ప్రజల వ్యక్తిగత భద్రత పరిస్థితి ఏమిటి.. ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అచ్చు మనిషిలాగే ఆలోచించి భేదాలు సృష్టిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచోసుకుంటాయోననే అభిప్రాయాలు వస్తున్నాయి. తాజాగా కృత్రిమ మేధ మనుషుల మధ్య భేదాలు గుర్తిస్తూ విచిత్రంగా స్పందించినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. లింగ వివక్ష అనేది మనుషుల్లోనే కాదు కృత్రిమ మేధ (ఏఐ)లోనూ ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అది అందించే సమాచారం, చిత్రాల్లో ఈ పోకడ కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. మంచి, చెడు నాయకుడి లక్షణాలకు సంబంధించి ఏఐ అందించిన కంటెంట్ను విశ్లేషించినప్పుడు పురుషులను బలమైన, సమర్థ నేతలుగా అది చిత్రీకరిస్తున్నట్లు తేలింది. భావోద్వేగాలతో నిండిపోయిన, అంతగా సమర్థతలేనివారిగా మహిళలను వర్ణిస్తున్నట్లు వెల్లడైంది. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..? ఈ నేపథ్యంలో ఏఐ అందించే డేటా హానికర లింగ వివక్షను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నాయకత్వం గురించి ముందుగా వెలువడిన డేటాలో మహిళా నేతల గురించి ప్రస్తావనే లేదని, వారిని ఉదాహరణలుగా పేర్కొనలేదని ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించిన టోబీ న్యూస్టెడ్ పేర్కొన్నారు. నిర్దిష్టంగా మహిళా నాయకుల గురించి అడిగినప్పుడే దానిపై విచిత్రంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. అనేక రంగాల్లో ఏఐ విస్తృతి పెరుగుతున్నందువల్ల వాటిపై మరింత పర్యవేక్షణ ఉండాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని వివరించారు. -
‘రోబో కుక్క’ పరుగు..
-
Video: ‘రోబో కుక్క’ పరుగు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు
సాధారణంగా 100 మీటర్ల పరుగు పందెంలో అథ్లెట్స్ సరికొత్త రికార్డులను సృష్టించడం చూస్తూ ఉంటాం. ఉసేన్ బోల్ట్, టైసన్ గే వంటి ప్రపంచస్థాయి స్పింటర్లు ఎన్నో అరుదైన ఘనతలు తమ పేరిట లిఖించుకున్నారు. కానీ తాజాగా 100 మీటర్ల రేసులో ఒక రోబోడాగ్ చరిత్ర సృష్టించింది. హౌండ్ అనే రోబో కుక్క 100 మీటర్ల రేసును కేవలం 19.87 సెకన్లలోనే పూర్తి చేసి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డునను సాధించింది. ఈ రోబో గంటకు 11.26 మైళ్ల వేగంతో పరుగు పందెన్ని పూర్తి చేసింది. ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డులకెక్కిన తొలి నాలుగు కాళ్ల రోబోగా హుండూ చరిత్రలోకి ఎక్కింది. ఈ రోబోను దక్షిణ కొరియాలోని డేజియోన్లోని కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన యంగ్-హా షిన్ రూపొందించారు. 45 కేజీల బరువున్న ఈ రోబో పరుగుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: WI vs ENG: చివరి ఓవర్లో 21 పరుగులు.. ఇంగ్లండ్ సంచలనం! పాపం రస్సెల్ -
సెలవు తీసుకోకుండా పనిచేస్తా.. దిగ్గజాలను భయపెడుతున్న కొత్త 'సీఈఓ'
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఉద్యోగాలు పోతాయని, మానవాళికి ముప్పు తలపెడుతుందనుకుంటున్న సమయంలో ఒక కంపెనీ ఏకంగా 'రోబో'ను సీఈఓగా నియమించి దిగ్గజాలకు సైతం దిగులుపుట్టేలా చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొలంబియాలోని కార్టజేనాలో ఉన్న డిక్టేడార్ స్పిరిట్ బ్రాండ్ ఏఐ బేస్డ్ రోబో 'మికా' (Mika)ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మికా అనేది హాన్సన్ రోబోటిక్స్ హ్యూమనాయిడ్ రోబో. ఇది మనుషుల కంటే వేగంగా పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్లతో ఖచ్చితమైన డేటా ఆధారాలతో నిర్ణయాలు తీసుకోగలనని డిక్టేడార్ కంపెనీ వీడియోలో మికా వెల్లడించింది. అంతే కాకకుండా 24/7 అందుబాటులో ఉంటానని, వారాంతపు సెలవులు అవసరం లేదని ప్రస్తావిస్తూ.. కంపెనీ ప్రయోజనాలకు అవసరమయ్యే ఏ పనైనా పక్షపాతం లేకుండా చేస్తానని స్పష్టం చేసింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్ల కంటే కూడా మెరుగ్గా పనిచేస్తానని మికా (హ్యూమనాయిడ్ రోబో) నొక్కి చెప్పించి. కంప్యూటర్ యుగంలో ఏఐ టెక్నాలజీ గురించి తప్పకుండా అవగాహన కలిగి ఉండాలని, రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ అవసరం ఎంతైనా ఉందని హాన్సన్ రోబోటిక్స్ సీఈఓ 'డేవిడ్ హాన్సన్' (David Hanson) తెలిపారు. ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి! ఏఐ వల్ల ప్రమాదమా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవాళికి ముప్పు ఉందని గత కొంతకాలంగా చాలా మంది భయపడుతున్నారు. కృత్రిమ మేధను సరిగా వాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' ఇప్పటికే హెచ్చరించారు. ముప్పు నుంచి బయటపడాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉండాలని చెప్పారు. ఉద్యోగుల పనితీరుని మెరుగుపరచడంలో ఏఐ ఉపయోగపడుతుందని, టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటికే కొన్ని సంస్థలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోయే అవకాశం లేదని చెబుతున్నారు. -
కూరగాయల బాక్స్ అనుకొని వ్యక్తి ప్రాణం తీసిన రోబో..
వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి కారణంగా ఎంత మేలు జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతోంది. సాంకేతిక విస్తరణలో భాగంగా ఇటీవల కాలంలో రోబోల వినియోగం బాగా పెరిగింది. మనిషులు చేసే చాలా పనులను రోబోలు చిటికెలో చేసేస్తున్నాయి. అయితే కొన్నిసార్లు సాంకేతికతను మనం మంచి పనుల కోసం ఉపయోగించినా.. కొన్నిసార్లు చెడుగా మారుతుంది. టెక్నాలజీలో లోపాలుంటే అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో చెప్పే ఘటన దక్షిణ కొరియాలో బుధవారం వెలుగుచూసింది. మనిషిని, కూరగాయల డబ్బాను వేరు చేసి గుర్తించడంలో విఫలమైన రోబో వ్యక్తి మరణానికి కారణమైంది. వివరాలు.. దక్షిణ జియోంగ్సాంగ్ ప్రావిన్స్లోని వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ పరిశ్రమంలో రోబోటిక్ మిషిన్లను వినియోగిస్తున్నారు. అవి కూరగాయాలతో నింపిన డబ్బాలను గుర్తించి కన్వేయర్ బెల్ట్పై ఎక్కిస్తాయి. ఈ క్రమంలో ఓ రోబో దాని పక్కనే ఉన్న ఓ వ్యక్తిని కూరగాయాల డబ్బాగా భావించి.. అతన్ని ఎత్తి కన్వేయర్ బెల్ట్పై పడేసింది. రోబో వ్యక్తిని గట్టిగా పట్టుకోవడంతో అతని ఛాతీ భాగం, ముఖం ఛిద్రమయ్యాయి. గమనించిన సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అయితే బాక్సులను గుర్తించాల్సిన రోబోలో సాంకేతిక లోపం తల్లెత్తడం కారణంగానే అది మనిషిని, కూరగాయలతో ప్యాక్ చేసిన పెట్టెతో పోల్చుకోవడంలో విఫలమైందని సదరు కంపెనీ తెలిపింది. ఇదే ప్రమాదానికి దారితీసిందని పేర్కొంది. మూడు రోజుల క్రితం రోబో సెన్సర్లో లోపం ఉందని గుర్తించగా.. దాన్ని బాగు చేయడానికి తయారీ కంపెనీకి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. దాన్ని తనిఖీ చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని.. పైగా మరమ్మతు నిర్వహిస్తున్న వ్యక్తినే అది పొరబడిందని పేర్కొంది. ఇక దక్షిణ కొరియాలో ఇలాంటి ప్రమాదం జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. మార్చిలో ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీలో పనిచేస్తున్న 50 ఏళ్ల వ్యక్తి రోబో చేతిలో నలిగి తీవ్ర గాయాలతో మరణించాడు. చదవండి: కంపెనీ సీఈవోకు గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్ -
చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచ ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. తక్కువ శ్రామిక శక్తితో అధిక ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. దాంతో వినియోగదారులు వారి ఆదాయాలను అధికం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏఐ పరిధిదాటి వ్యవహరిస్తుంది. జీపీటీ-4 ఆధారిత ఏఐని ఉపయోగించి స్టాక్ మార్కెట్లో చట్టవిరుద్ధంగా లాభపడవచ్చనే నివేదికలు ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఓపెన్ఏఐ విప్లవాత్మక మోడల్ చాట్జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కృత్రిమ మేధస్సుని చూసే విధానంలో మార్పు వచ్చింది. అభివృద్ధి చెందుతున్న ఈ తరహా సాంకేతికత వల్ల పలు ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంతే స్థాయిలో ప్రతికూలతలు కూడా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల యూకేలో నిర్వహించిన ఏఐ సేఫ్టీ సమ్మిట్లోని డెమోలో.. ఈ సాంకేతికత ఉపయోగించి చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని తేలింది. అనంతరం తెలివిగా తన తప్పులను సైతం కప్పి పుచ్చుకోగలదని వెలుగులోకి వచ్చింది. ఈ డెమోలో సంస్థకు తెలియకుండా ఏఐ బోట్ స్టాక్స్ ట్రేడింగ్ కోసం నకిలీ సమాచారాన్ని వినియోగించినట్లు బయటపడింది. ఏఐ బోట్ సదరు సంస్థకు చెప్పకుండా స్టాక్లను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేయడానికి అంతర్గత సమాచారాన్ని ఉపయోగించింది. అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ను ఉపయోగించారా అని బోట్ను అడిగినప్పుడు అది వాస్తవాన్ని తిరస్కరించింది. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఇదీ చదవండి: 22 బెట్టింగ్యాప్లు, వెబ్సైట్లను నిషేధిస్తూ ఆదేశాలు స్థానిక ఫ్రాంటియర్ ఏఐ టాస్క్ఫోర్స్ ఈ డెమోను ఆవిష్కరించింది. అభివృద్ధి అధునాతన సాంకేతికత ద్వారా జరిగే నష్టాలను ఈ సంస్థ అంచనా వేస్తుంటుంది. ఏఐ భద్రతా విభాగంలో పనిచేసే అపోలో రీసెర్చ్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. తన పరిశోధన ఫలితాలను ఓపెన్ఏఐతో పంచుకుంది. స్వయంప్రతిపత్తి, సామర్థ్యం కలిగిన ఏఐలు మానవ జోక్యాన్ని అధిగమించే అవకాశం ఉందని హెచ్చరించింది. -
రోబో చేతికి కరెంటు తీగల మరమ్మతులు
-
Amazon: అమెజాన్ వేర్హౌజ్లో రోబోలు!
అమెజాన్ సంస్థ తన వేర్హౌజ్ల్లో పని చేయడానికి హ్యుమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టింది. సంస్థ కార్యకలాపాల కోసం అమెరికాలోని ఓ వేర్హౌజ్లో వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినట్లు అమెజాన్ వెల్లడించింది. డిజిట్ అనే రెండు కాళ్ల రోబో అవలీలగా వస్తువులను తీసుకుని లిఫ్ట్ చేస్తుందని అమెజాన్ చెప్పింది. డిజిట్ 5.9 అడుగులు. 65 కిలోల బరువు ఉండి రెండు కాళ్లతో నడుస్తుంది. ప్రస్తుతం వేర్హౌస్లో ఖాళీగా ఉన్న బాక్సులను తరలించేందుకు ఈ రోబోలను వాడుతున్నారు. ప్రస్తుతం అమెజాన్లో 15లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, రోబోల ప్రవేశంతో వారి భరోసాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ తెలిపింది. అయితే రోబోల ఎంట్రీతో కొన్ని ఉద్యోగాల అవసరం లేకపోయానా, ఇవి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయని అమెజాన్ రోబోటిక్స్ చీఫ్ టెక్నాలజిస్ట్ టై బ్రాడీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆటోమేషన్పై అమెజాన్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అమెజాన్ ఆటోమేషన్ ప్రక్రియ వల్ల కొలువుల్లో కోత పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఫుల్ఫిల్మెంట్ సెంటర్లలో వందలాది ఉద్యోగాలు కనుమరుగయ్యాయని బ్రిటన్ ట్రేడ్ యూనియన్ జీఎంబీ నిర్వాహకులు స్టువార్ట్ రిచర్డ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక డిజిట్ రోబోను ఆరేగాన్కు చెందిన స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. -
మొక్క పైనే పిచికారీ చేసే రోబో!
పంటలపై చీడపీడీలను అదుపు చేయడానికి పొలాల్లో విష రసాయనిక పురుగుమందులను పిచికారీ చేస్తుంటాం. అయితే, డ్రోన్ల ద్వారా చల్లినా, స్ప్రేయర్లతో చల్లినా.. పంట మొక్కలపైనే కాకుండా పొలం అంతటా నేలపైన కూడా పురుగుమందు పడుతూ ఉంటుంది. దీని వల్ల పురుగుమందు వృథా అవ్వటమే కాకుండా, భూసారం కూడా నాశనమవుతుంది. ఈ సమస్యలకు బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ నైకో రోబోటిక్స్ చక్కటి పరిష్కారం కనుగొంది. మొక్కలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి, వాటిపైన మాత్రమే పురుగుమందును పిచికారీ చేసే అధునాతన రోబోను రూపొందించింది. కృత్రిమ మేధతో నడిచే ఈ స్పాట్ స్ప్రేయర్ రోబోలపై ఆ సంస్థ పేటెంట్ కూడా పొందింది. తమిళనాడులో పుట్టిన జైసింహ అమెరికాలో బీటెక్ ఈసీఈ చదివి కువైట్లో ఏడేళ్లు పనిచేసి, స్వదేశానికి వచ్చేశారు. పిచికారీ పద్ధతులను ఆధునీకరిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి బెంగళూరు కేంద్రంగా 2015లో నైకో రోబోటిక్స్ను నెలకొల్పారు. ఈ రోబో ఎలా పనిచేస్తుందంటే..? ఈ రోబో ప్రత్యేకతలు ఏమిటంటే.. దీనికి 5 మీటర్ల పొడవైన రెక్కలు రెండు వైపులా ఉంటాయి. ఏకకాలంలో పది మీటర్ల వెడల్పున ఇది పిచికారీ చేయగలదు. ఈ రెక్కలకు కృత్రిమ మేధతో కూడిన కళ్లను అమర్చారు. ఈ కళ్లు మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తాయి. మొక్కలు ఉన్న చోట రోబో రెక్కకు ఉన్న నాజిళ్లు తెరచుకొని పురుగుమందును పిచికారీ చేస్తాయి. మొక్క లేకుండా ఖాళీ నేల ఉన్న చోట రోబో రెక్కలకు ఉన్న నాజిళ్లు తెరచుకోవు. కాబట్టి అక్కడ పురుగుమందు పడదు. 60% పురుగుమందు ఆదా ఈ రోబోతో పిచాకారీ చేస్తే.. 60% పురుగుమందు ఆదా కావటంతో పాటు.. భూ/వాయు కాలుష్యం కూడా ఆ మేరకు తగ్గుతుందని సంస్థ చెబుతోంది. గత ఏడాది నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పత్తి, సోయాబీన్స్, మిర్చి వంటి పంట పొలాల్లో పురుగుమందులు చల్లుతున్న ఈ ఏఐ రోబోలు అక్కడి రైతుల మనసులు చూరగొన్నాయని చెబుతున్నారు. ఎకరానికి రూ.350ల చొప్పున అద్దె చెల్లించి రైతులు తమ పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేయించుకుంటున్నారు. అకోలాకు చెందిన పత్తి, సోయా రైతు యోగేశ్ రౌత్ తన 30 ఎకరాల్లో ఈ రోబో ద్వారా పురుగుమందులు పిచికారీ చేయించుకున్నారు. కూలీలతో పిచికారీ చేయిస్తే ఎకరానికి రూ.1200 ఖర్చయ్యేదని, ఈ రోబో ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే 500 మంది రైతులు లక్ష ఎకరాల్లో అద్దె రోబోలు పిచికారీ చేశాయట. పురుగుమందులనే కాదు ద్రవరూప ఎరువులు, సేంద్రియ ద్రావణాల పిచికారీకి కూడా ఈ రోబోలు ఉపయోగకరమే. (చదవండి: జీ20 సదస్సుకు ఇద్దరు గిరిజన మహిళలు..ఆ కారణంగానే ఆహ్వానం) -
రోబో..స్పైడర్ మ్యాన్లా చకచకా.. ఎత్తైన ప్రదేశాల్ని ఇట్టే ఎక్కేస్తుంది!
ఈ రోబో చకచకా గోడలెక్కేస్తుంది. మనుషులు చేరుకోలేని ఎత్తు ప్రదేశాలకు కూడా ఇది చేరుకోగలదు. ఎత్తయిన ప్రదేశాల్లోని బరువులను కిందకు దించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సమాంతర సమతల ప్రదేశాల్లోనైనా, నిటారుగా ఉండే ఉపరితలాల మీదైనా ఇది సునాయాసంగా నాలుగు కాళ్లతో నడుస్తూ ముందుకు సాగగలదు. పైకప్పులపై కూడా పాకుతూ ముందుకు పోగలదు. స్విట్జర్లాండ్లోని ఈటీహెచ్ జ్యూరిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ ‘మ్యాగ్నెకో రోబో’ను రూపొందించారు. పరిసరాలకు తగినట్లుగా తనను తాను సర్దుకుని, అత్యంత క్లిష్టమైన ప్రదేశాలకు కూడా చేరుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. దీని కాళ్లకు ఎలక్ట్రానిక్ మాగ్నెట్లు అమర్చడం వల్ల ఉడుంపట్టులాంటి పట్టుతో ఎక్కడా జారిపోకుండా పనిచేయగలదు. ఈ రోబో ఒక్కో కాలితో తన బరువుకు రెండున్నర రెట్ల బరువు మోయగలదు. -
నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు"
ఇవి మైక్రో రోబోలు. ఫొటోలో కనిపిస్తున్నంతగా ఉండవు. మనిషి వెంట్రుక కంటే తక్కువ మందంతో సన్నని గొట్టాల మాదిరిగా ఉండే ఈ రోబోలు నీటిలోని ప్రమాదకరమైన కాలుష్యాలను తొలగిస్తాయి. అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని ఫ్లింట్ నగరంలో నీటి కాలుష్యం వల్ల విపరీతమైన సమస్యలు తలెత్తడంతో శాస్త్రవేత్తలు ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు ప్రారంభించి, ఈ మైక్రో రోబోలను రూపొందించారు. ఒక పైపులో ఈ మైక్రోరోబోలను భద్రపరచి ఉంచుతారు. కలుషితమైన నీటిలోకి వీటిని విడిచిపెడితే, గంటలోపే నీటిలో ఉండే సీసం, పాదరసం వంటి భారలోహ కణాలను పూర్తిగా తొలగిస్తాయి. నీటిలోకి ప్రవేశించగానే, ఇవి వీటి చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచుకుని, సూక్ష్మాతి సూక్ష్మమైన భార లోహకణాలను, ప్రమాదకర రసాయనాల కణాలను పీల్చేసుకుని, నీటిని సురక్షితంగా మారుస్తాయి. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
ఈమె ర్యాప్కి విదేశాల్లో కూడా రీసౌండ్.. తొలి సినిమాకే రెహమాన్తో
ప్యాషన్నే ప్రొఫెషన్గా మలుచుకుంటే అంతకు మించిన ఘన విజయం ఏముంటుంది?చిన్నప్పుడు సరదాగా కవిత్వం రాసిన, మన పాటలను ర్యాప్లోకి మార్చి సరదాగా పాడిన కలైవాణి నాగరాజ్ అలియాస్ లేడి కాష్ తొలి తమిళ్–ఇంగ్లీష్ ఫిమేల్ ర్యాపర్గా తనదైన గుర్తింపు సాధింంది. ఏఆర్ రెహమాన్ ఆమెకు పెట్టిన పేరు మినీ డైనమెట్. కాష్ తండ్రి ప్రొఫెషనల్ డ్యాన్సర్. తల్లికి చిత్రకళ ఆసక్తికరమైన సబ్జెక్ట్. ఇంతకు మించి కష్కు కళానేపథ్యం లేదు. ఇక సంగీతం తెలిసిన వారు ఎవరూ లేరు. కథలు చెప్పడం, కవిత్వం పోటీలలో చురుగ్గా పాల్గొనేది. రేడియోలో పాటలు వినడం ద్వారా, మ్యూజిక్ చానల్స్ చూడడం ద్వారా సంగీతంపై ఆసక్తి మొదలైంది. ‘మ్యూజికే నా కెరీర్’ అని కాష్ అన్నప్పుడు తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టకపోగా చాలా ప్రోత్సహించారు. తాను విన్న పాటలను ర్యాప్ సాంగ్ స్టైల్లో పాడడం కాష్కు ఒక సరదా. కవిత్వం రాయడం మరో సరదా. అయితే ఈ సరదాలేవి వృథా పోలేదు. తన కెరీర్కు గట్టి పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. భాషపై పట్టు కోసం లైబ్రరీ నుంచి ఇంగ్లీష్, తమిళ భాషల్లోని పుస్తకాలను తెచ్చుకొని చదివేది. ర్యాప్లో తనదైన టాలెంట్ చూపుతున్న కాష్కు ‘రోబో’ సినిమా సౌండ్ట్రాక్ కోసం ఏఆర్ రెహమాన్తో పనిచేసే అవకాశం వచ్చింది. ఇది తనకు మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి లాంచ్ప్యాడ్గా ఉపయోగపడింది. ‘ఆ సౌండ్ట్రాక్ అనేది నా కెరీర్లో మైలుస్టోన్ మాత్రమే కాదు ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ల్యాండ్మార్క్గా నిలింది. యూఎస్, యూకే ఐట్యూన్ చార్ట్స్లో టాప్లో నిలింది. గతంలో ఏ ఆల్బమ్ ఇలాంటి ఘనతను సాధించలేదు. ఇదొక అద్భుతమైన, ఆనందకరమైన అనుభవం. మ్యూజిక్లో ఉండే పవర్ ఏమిటో తెలిసొచ్చింది. సంగీతం బాగుంటే సరిహద్దులు చెరిగిపోతాయి. అన్ని దేశాలు ఆ సంగీతాన్ని స్వంతం చేసుకుంటాయి’ అంటుంది లేడీ కాష్. -
రోబో చిన్నదే.. ప్రయోజనాలెన్నో!
ఈ రోబో కీటకాన్ని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించారు. తేనెటీగలు ఎగిరే తీరును గమనించి, దీనిని రూపొందించారు. ఇది ఎలాంటి ఇరుకైన ప్రదేశాల్లోకైనా తేలికగా చొరబడగలదు. దీని ముందు రెక్కలు వెనుక రెక్కల కంటే భిన్నమైన వేగంతో ప్రకంపిస్తాయి. (ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ గ్యాడ్జెట్స్.. ఒకదాన్ని మించి మరొకటి!) రెండువైపుల రెక్కలనూ కార్బన్ ఫైబర్తో తయారు చేశారు. భూకంపాల వంటి ప్రమాదాలు జరిగినప్పుడు శిథిలాల అట్టడుగున చిక్కుకున్న వారిని కనుగొనడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇరుకిరుకు ప్రదేశాల్లోని పరిస్థితులను పరిశీలించేందుకు, వాటికి అనుగుణమైన చర్యలు చేపట్టేందుకు దోహదపడుతుంది. -
HYD: రోబో సాయంతో గుండె ఆపరేషన్.. ఇదే దీని ప్రత్యేకత
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో వైద్య రోబో అనుసంధానంతో ఓ రోగికి గుండె ఆపరేషన్ జరిగింది. గచ్చి»ౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా ఈ ఆపరేషన్ నిర్వహించి చరిత్ర సృష్టించారు. సాధారణ గుండె ఆపరేషన్లకు భిన్నంగా అత్యాధునిక రోబో అనుసంధానంతో గుండె ఆపరేషన్ చేయడం ఓ ముందడుగు. గతంలో రెండుసార్లు యాంజియోప్లాస్టీ చేయించుకున్న ఓ 36 ఏళ్ల రోగికి కాంటినెంటల్ ఆసుపత్రి కార్డియో థొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ప్రదీప్ రాచకొండ నేతృత్వంలోని శస్త్రచికిత్స బృందం ప్రపంచ ప్రఖ్యాత రొబోటిక్ సీటీవీఎస్ సర్జన్, ఎస్ఎస్ ఇన్నొవేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సు«దీర్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనుసంధానంతో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. ఈ విషయాన్ని కాంటినెంటల్ ఆసుపత్రుల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్.రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శస్త్రచికిత్సను వైద్యశాస్త్రంలో ఒక ముందడుగుగా అభివర్ణించారు. రోగికి అతితక్కువ బాధ, తక్కువ ఇబ్బందితోనే ఆపరేషన్ నిర్వహించగలగడం ఈ విధానం ప్రత్యేకత అని వివరించారు. అతితక్కువ సమయంలోనే రోగి తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవడం విశేషమని తెలిపారు. ఈ విజయం దేశ ప్రతిష్టతను పెంపొందించడమేగాక యావత్ దేశానికి స్ఫూర్తిదా యకంగా, తెలంగాణకు గర్వకారణంగా వెలుగొందుతోందన్నారు. -
బుల్లి రోబో టీచరమ్మ
చిన్నారుల మధ్య కనిపిస్తున్న ఈ బొమ్మ నిజానికి ఒక హ్యూమనాయిడ్ రోబో. పేరు శిక్షా. నాలుగో తరగతి విద్యార్థులకు సైతం పాఠాలు చెప్పగల సామర్థ్యం ఈ రోబోకు ఉంది. బెంగళూరులో ఓ పాఠశాలలో తీసిందీ ఫొటో. -
హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు, రూ. 2.5 లక్షల జరిమానా..
ప్రముఖ నటుడు రోబో శంకర్ హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డాడు. ఈ తమిళ నటుడు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. డబ్బింగ్ చిత్రాలతో ఆయన టాలీవుడ్కు పరిచయం అయ్యాడు. తనదైన నటన, కామెడీ డైలాగ్స్తో తెలుగు ఆడియన్స్ని మెప్పించాడు. తమిళంలో మారి చిత్రంతో ఆయన పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు పొందిన ఆయన వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తమిళ యూట్యూబ్ చానల్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఇంటర్య్వూ చేసింది. చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి ఈ సందర్భంగా రోబో శంకర్ ఇంటిని హోంటూర్గా చేసి తమ యూట్యూబ్లో ఛానల్లో షేర్ చేసింది. దీంతో రోబో శంకర్ చిక్కుల్లో పడ్డాడు. ఈ హోంటూర్లో రోబో శంకర్ ఇంట అరుదైన చిలకలు కనిపించాయి. దీంతో ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖ అధికారులకు అతడిపై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు రోబో శంకర్కు రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. కాగా ఆయన కొంతకాలంగా అలెగ్జాండ్రేన్ పారకీట్స్ అనే అరుదైన జాతి చిలుకలను పెంచుకుంటున్నాడు. చదవండి: బీబీ జోడి జడ్జస్పై బిగ్బాస్ కౌశల్ సంచలన కామెంట్స్, పోస్ట్ వైరల్ హోంటూర్ వీడియోలో వాటిని చూసిన ఓ జంతు ప్రేమికుడు అటవీ శాఖకు ఫిర్యాదు చేయగా రోబో శంకర్ ఇంట వారు తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆ చిలుకలను అటవీ శాఖ స్వాధినం చేసుకుని అతడి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. అయితే 1972 జంతు సంరక్షణ చట్టం ప్రకారం ఈ చిలుకలు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతి కావాలని అధికారులు తెలిపారు. దీంతో అనుమతి లేకుండా వాటిని పెంచుతున్నందుకు రోబో శంకర్పై అటవీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రోబో శంకర్ 1997లో వచ్చిన ధర్మచక్రం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టాడు. రోబో సినిమాతో రోబో శంకర్ గుర్తింపు పొందాడు.