-
వీర జవాన్లకు అశ్రు నివాళి
విమానాశ్రయం(గన్నవరం)/రేపల్లె రూరల్/పెడన: లద్దాఖ్లో భారత్ – చైనా సరిహద్దు సమీపంలోని షియోక్ నదిలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు జవాన్లకు ప్రజలు అశ్రు నివాళులర్పించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లెకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ముత్తముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్రకు చెందిన జవాను సాదరబోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్కు చెందిన హవల్దార్ సుభాన్ఖాన్ మృతి చెందారు. వారి పారి్ధవదేహాలు సోమవారం గన్నవరం విమానాశ్రయానికి సోమవారం చేరుకున్నాయి.వీర జవాన్ల భౌతికకాయాలను ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి భారత వాయుసేనకు చెందిన విమానంలో సాయంత్రం ఇక్కడికి తీసుకువచ్చారు. అనంతరం ఎయిర్పోర్ట్లోని ఇంటర్నేషనల్ టెరి్మనల్ ఆవరణలో జవాన్ల పార్ధివదేహాలను ప్రజల సందర్శనార్ధం ఉంచారు. వీర జవాన్లకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తరపున ఆయన ఏడీసీ దీపక్శర్మ, పలువురు సైనికాధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం జవాన్ల భౌతికకాయాలను రోడ్డు మార్గం ద్వారా వారి స్వగ్రామాలకు తరలించారు. హవల్దార్ సభాన్ఖాన్, జవాను నాగరాజు అంత్యక్రియలు సోమవారం వారి స్వగ్రామాల్లో సైనిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామంలో ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుభాన్ఖాన్కు అశ్రునయనాలతో తుది వీడ్కోలు సుభాన్ఖాన్ (42) భౌతికకాయం సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అతని స్వగ్రామం ఇస్లాంపూర్కు చేరుకుంది. సుభాన్ఖాన్ భౌతికకాయంను కడసారి చూసి తుది వీడ్కోలు పలికేందుకు గ్రామస్తులతో పాటు సమీప గ్రామంలోని ప్రజలు అతని గృహం వద్దకు చేరుకున్నారు. దేశరక్షణలో భాగంగా ప్రాణాలర్పించిన సుభాన్ఖాన్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సుభాన్ఖాన్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్డీవో హెలా షారోన్, డీఎస్పీ మురళీకృష్ణ, పలు శాఖల అధికారులు సుభాన్ఖాన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం సైనిక, పోలీసు లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. 17 ఏళ్ల క్రితం ఆర్మీలో జవాన్గా జీవితం ప్రారంభంసుభాన్ఖాన్ 17 సంవత్సరాల క్రితం ఆర్మీలో సైనికునిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో పని చేస్తూ ప్రమాదవశాత్తు కన్నుమూశారు. సుభాన్ఖాన్కు భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.ఆయన మరో రెండు సంవత్సరాలలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. సుఖాన్ఖాన్ తన కుటుంబాన్ని చూసుకునేందుకు ఈ నెల 7న కైతేపల్లి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఆయన ఆకస్మిక మృతిని జీరి్ణయించుకోలేని కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరులు సైతం కంటతడి పెట్టిస్తోంది.జవాన్ నాగరాజుకు ఘనంగా అంతిమ వీడ్కోలు ఆర్మీ జవాను సాదరబోయిన నాగరాజు (32) పారి్ధవదేహం సాయంత్రం 5.30 గంటల సమయంలో స్వగ్రామమైన చేవెండ్లకు చేరుకుంది. ఈ విషయం తెలిసి స్వగ్రామంతోపాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు వడ్లమన్నాడుకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా చేవేండ్రకు తీసుకొచ్చారు. అక్కడ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ, మచిలీపట్నం ఆర్డీవో ఎం.వాణి, డీఎస్పీ, సీఐలు, పలువురు అధికారులు, వివిధ పారీ్టల నాయకులు నాగరాజు పారి్ధవదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంతిమక్రియలు నిర్వహించారు. నాగరాజు మరణం దురదృష్టకరమని, దేశం ఓ వీరుడిని కోల్పోయిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నివాళులర్పించారు. -
గూగుల్ మ్యాప్స్ అనుసరిస్తూ నదిలోకి..
కాసర్గోడ్: అత్యవసరంగా ఆస్పత్రికి బయల్దేరిన ఇద్దరు యువకులు అనూహ్యంగా మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని ఆస్పత్రికి గూగుల్ మ్యాప్స్లో చూపించే మార్గంలో బయల్దేరి మార్గమధ్యంలో కారును నదిలోకి పోనిచ్చారు. నది ప్రవాహంలో కారు అదృష్టవశాత్తు ఒక చెట్టుకు చిక్కుకోవడంతో బయటికొచ్చి ప్రాణాలు కాపాడుకోగలిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని పల్లాంచి ప్రాంతంలో ఇద్దరు యువకులు ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని ఆస్పత్రికి కారులో బయల్దేరారు. ‘‘గూగుల్ మ్యాప్స్ ప్రకారం వెళ్తుంటే ఎదురుగా నీళ్లు కనిపించాయి. రోడ్డుపై నీళ్లు నిలిచాయేమోనని అలాగే వెళ్లాం. అది నదిలో లోతట్టు ప్రాంతంలో కట్టిన వంతెన అని తర్వాత అర్థమైంది. ఇరువైపుల రక్షణ గోడ లేదు. నది ఉప్పొంగి పై నుంచి ప్రవహిస్తోంది. ప్రవాహం ధాటికి మా కారు కొట్టుకుపోయింది. ఒడ్డువైపుగా ఒక చెట్టుకు చిక్కుకుని ఆగింది. పోలీసులకు మా లొకేషన్ షేర్ చేయడంతో సమయానికి వచ్చి కాపాడారు. మాకిది నిజంగా పునర్జన్మ’’ అని యువకుల్లో ఒకరైన అబ్దుల్ రషీద్ చెప్పారు. సంబంధిత వీడియో వైరల్గా మారింది. -
ఏప్రిల్లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్గఢ్లోని రామానుజ్గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్గంజ్వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
నదిపైనే ల్యాండింగ్ !
మాస్కో: రన్వేపై ల్యాండ్ చేయడం మామూలే.. నది ఉపరితలంపై విమానాన్ని పరుగెత్తించడంలోనే ఉంది అసలు మజా అనుకున్నాడో ఏమో. రష్యాలో చిన్న విమానాన్ని ఒక పైలట్ నేరుగా నదిపైనే ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు నది ఉపరితలం మొత్తం దట్టంగా మంచుతో నిండిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలబడ్డాయి. రష్యాలో తూర్పు సైబీరియా పరిధిలోని జిర్యాంకా విమానాశ్రయ సమీపంలో జరిగిందీ ఘటన. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రాంతంలోని యాకుట్సŠక్ నగరం నుంచి 34 మంది ప్రయాణికులతో ఆంటోవ్ ఏఎన్–24 విమానం గురువారం ఉదయం జిర్యాంకా నగరానికి బయల్దేరింది. భారీగా మంచు కురుస్తుండటంతో జిర్యాంకా ఎయిర్పోర్ట్ రన్వే సరిగా కనబడక దానిని దాటేసి ఎదురుగా ఉన్న కోలిమా నదిపై ల్యాండ్చేశాడు. నగరంలో ప్రస్తుతం గడ్డకట్టే చలి వాతావరణం రాజ్యమేలుతోంది. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత దెబ్బకు నది ఉపరితలం మొత్తం గడ్డకట్టింది. దీంతో దీనిపై ల్యాండ్ అయిన విమానం అలాగే కొన్ని మీటర్లు సర్రున జారుతూ ముందుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఘటనకు కారకుడైన పైలట్పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. సోవియట్ కాలంనాటి ఈ చిన్న విమానాన్ని పోలార్ ఎయిర్లైన్స్ నడుపుతోంది. -
ఆ స్థలంలో వాహనాలు అదృశ్యం
-
ఆ స్థలంలో వాహనాలు అదృశ్యం
కొన్ని దృశ్యాలు కంటితో చూసినప్పటికీ.. అవి నిజమా? కాదా?.. అనే సందేహం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి భావనే కలిగించే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రాఫిక్ సిగ్నల్ దాటుకొని వస్తున్న వాహనాలు.. పక్కనే ఉన్న నది వంతెనలోకి దూసుకుపోయి అదృశ్యమవుతున్నట్టు కన్పిస్తున్న వీడియోను డేనియల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా దీనిపై చాలా మంది నెటిజన్లు తమకు తోచిన విధంగా సమాధానమిస్తున్నారు. మరి కొందరైతే వాహనాలు ఎలా అదృశ్యమవుతున్నాయో తెలుసుకోవడానికి వారి ఊహకు పని చెబుతున్నారు. ఈ వంతెన.. విమానాలు, పడవలను అదృశ్యం చేసే ‘బెర్ముడా ట్రయాంగిల్’ ప్రాంతంలా ఉందని, హ్యారీపోటర్ సినిమాలోని మాయా విశ్వం మాదిరిగా ఉందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియోను గ్రాఫిక్స్లో అలా క్రియేట్ చేశారా లేదా అనేది తెలాల్సి ఉంది. -
చిన్నారి ప్రాణాలు కాపాడిన కుక్క
-
వైరల్.. చిన్నారి ప్రాణాలు కాపాడిన కుక్క
కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. అయితే కొన్ని ఘటనలు చూసినప్పుడు వారు ఈ మాట ఊరికనే చెప్పలేదని అనిపిస్తుంది. తాజాగా ఓ కుక్క తన విశ్వాసాన్ని ప్రదర్శించడమే కాకుండా.. తెలివిగా వ్యవహరించి చూపరుల మనసును దోచుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో ఏముందంటే.. నది పక్కన ఆడుకుంటున్న ఓ చిన్నారి.. బాల్ను నీళ్లలో పడవేసుకుంటారు. తర్వాత దాన్ని తీసేందుకు నదిలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తారు. దీన్ని గమనించిన ఒక కుక్క వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని గౌను పట్టుకుని వెనక్కి లాగి పడేస్తుంది. ఇలా చిన్నారి ప్రాణాలు కాపాడటమే కాకుండా.. నీటిలో పడిన బంతిని తీసుకువచ్చి ఆ పాపకు అందజేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారడంతో.. కుక్క చేసిన పనిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. కుక్కను మెచ్చుకుంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కుక్క విశ్వాసం అయింది కాబట్టే చాలా మంది తమ ఇళ్లలో వాటిని పెంచుకుంటారు. కొంత మంది మాత్రం కుక్కను కూడా తమలో ఒక్కరిగా చూస్తారు. -
విహార యాత్రలో విషాదం..
సాక్షి, రాజమండ్రి : ఆహ్లాదకరమైన చల్లని వాతావారణంలో సేదతీరడానికి ఏజెన్సీ ప్రాంతానికి విహార యాత్రకు వచ్చిన ఇద్దరు స్నేహితులను మృత్యువు కాటేసింది. ఆ యువకుల కుటుంబంలో పెనువిషాదాన్ని మిగిల్చింది. మారేడుమల్లి మండలం పాములేరు గ్రామం వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోకవరం మండలానికి చెందిన ముగ్గురు స్నేహితులు ద్విచక్ర వాహనంపై పాములేరు గ్రామానికి వచ్చారు. అప్పటి వరకు ప్రకృతిలో అనందంగా గడిపిన వారు మధ్యాహ్నం భోజనాలు చేసి ముగ్గురు యువకుల్లో జుత్తుక నరేష్(24), గేదెల సీతారామ్(22) అనే ఇద్దరు యువకులు వాగులోకి స్నానానికి దిగారు. ఆ ప్రదేశం లోతు ఎక్కువగా ఉండడంతో ఊబిలో కూరుకుపోయి మృతి చెందారు. ఆ సమయంలో ఒడ్డుపైన ఉన్న మరో యువకుడు బంటిమిల్లి నాగబాబు తన స్నేహితులు ఇంకా వాగులోంచి పైకి రాకపోవడంతో ప్రమాదాన్ని గమనించి మారేడుమిల్లి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు రాజు, గొర్లె సతీష్ తన సిబ్బందితో సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు గ్రామస్తుల సహాయంతో వాగులో మునిగిపోయిన వారి మృతదేహాలను బయటకు తీశారు. వారి బంధువులకు సమాచారం అందించారు. మృతులు జుత్తుక నరేష్ది గోకవరం గ్రామం. ఇతడు డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. గేదెల సీతారామ్ది గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామం ఇతడు ఇంటర్ పూర్తిచేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రంపచోడవరం ఏఎప్పీ రాహుల్ దేవ్ సింగ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. గతంలో వాగులో మునిగి పలువురు మృతి పాములేరు వాగులో స్నానానికి దిగి అనేక మంది మృతి చెందారు. చాలా వరకు ఇక్కడి వచ్చే వారిలో ఎక్కవగా మద్యం సేవించేవారే. అక్కడ ఉండే గ్రామస్తులు, సిబ్బంది వాగులో స్నానాలకు దిగవద్దని చెప్పినా మద్యం మత్తులో లెక్క చేయకుండా వాగులోకి దిగి ప్రాణలు కోల్పోయే వారే అధికం. మరోవైపు అటవీశాఖ అధికారులు వాగులో స్నానాలు చేయడం, దిగడం నిషేధమని ప్రమాదాల ఫొటోలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. -
బహూదా నదిలో స్నానికి వెళ్లి నలుగురు మహిళలు మృతి
-
రన్వే నుంచి నదిలోకి..
జాక్సన్విల్లే: అమెరికాలో పెను విమాన ప్రమాదం తప్పింది. క్యూబా దేశం నుంచి అమెరికాలోని ఉత్తర ఫ్లోరిడాకు 143 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఓ చార్టర్ విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయి వేగంతో దూసుకెళ్తూ రన్వే నుంచి అదుపుతప్పి ఆ పక్కనే ఉన్న సెయింట్ జాన్స్ నదిలోకి దూసుకెళ్లింది. అయితే శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. క్యూబాలోని గ్వాంటనమో బే నావల్ స్టేషన్ నుంచి బయల్దేరిన బోయింగ్–737 విమానం అమెరికాలోని జాక్సన్విల్లే నావల్ స్టేషన్లో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినపుడు విమానంలో 136 మంది ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు. స్వల్పగాయాలైన 21 మందిని ఆస్పత్రికి తరలించారు. ఈ విమానంపై మియామీ ఎయిర్ ఇంటర్నేషనల్ లోగో ఉన్న ఫొటోను అధికారులు పోస్ట్ చేశారు. అయితే దీనిపై మియామీ స్పందించలేదు. ‘ఇది నిజంగా ఒక అద్భుతం. నదిలో నుంచి విమానాన్ని బయటికి తీయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం’ అని ఎన్ఏఎస్ జాక్సన్విల్లే కమాండింగ్ అధికారి కెప్టెన్ మేఖేల్ కాన్నర్ అన్నారు. విమానంలోని ఇంధనం నదిలోకి లీక్ అవ్వకుండా చూసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. -
విసిరేసిన రాళ్లు
చేపలు పట్టే ఒక వ్యక్తి తెల్లవారుజామునే ఒక నదీ తీరానికి చేరుకున్నాడు. దారిలో అతని కాలికి ఏదో సంచీలాంటిది తగిలితే దాన్ని తీసుకుని తడిమి చూస్తే అందులో ఏవో కొన్ని రాళ్లలాంటివి తగిలాయి. వెలుగు వచ్చాక చేపలు పట్టుకోవచ్చనుకుని వలను పక్కనపెట్టి నది ఒడ్డునే కూర్చుని బద్ధకంగా ఆ సంచీలోంచి ఒక రాయిని తీసి నదిలోకి విసిరాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో నదిలోకి విసిరిన రాయి నీట మునిగే శబ్దం అతనికి తమాషాగా అనిపించింది. వెలుగు వచ్చేదాకా ఏ పనీలేదు కాబట్టి అలా రాళ్లు విసురుతూ కాలక్షేపం చేస్తూనే ఉన్నాడతను. మెల్లిగా సూర్యోదయమైంది. కాంతికిరణాలు పరుచుకున్నాయి. అప్పటికే ఆ సంచీలోని రాళ్లన్నిటినీ అతను విసిరేసి ఉన్నాడు. ఇక విసిరేందుకు చేతిలో చిట్టచివరి రాయి ఒక్కటే మిగిలి ఉంది. వెలుతురులో దాన్ని గమనించిన అతని గుండె ఆగినంతపనైంది. అది ఒక వజ్రం. అనుకోకుండా అతనికి అంతులేని సంపద లభించినా, చీకటిలో తెలియక దాన్ని చేజార్చుకున్నాడు. ఒక విధంగా అతను అదృష్టవంతుడు. వెలుగు రావడం కొంచెం ఆలస్యమైతే అతను ఆ రాయిని కూడా నీటిలోకి విసిరేవాడే. చాలామంది ఆపాటి అదృష్టానికి కూడా నోచుకోరు. జీవితంలో లభించిన వజ్రాలను గులకరాళ్లుగా భావించి, వాటిని విసిరిపారేస్తారు. కొద్దిమంది మాత్రం కనీసం ఆఖరునిమిషంలో అయినా మేలుకొంటారు. నిజానికి జీవితమే విలువైన వజ్రం లాంటిది. చివరి వరకూ దాన్ని వ్యర్థంగా గడిపి, చరమాంకంలో దాని విలువ తెలుసుకుని, మంచి పనులు చేయడం మొదలు పెడతారు చాలామంది. -
ప్రయాణికురాలికి, డ్రైవర్కి మధ్య గొడవ..15 మంది మృతి
-
వివాదం సృష్టించిన ప్రమాదం.. 15 మంది మృతి
బీజింగ్ : డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్లు చాలా జాగ్రత్తగా.. సహనంతో వ్యవహరించాలి. ప్రయాణికులు కూడా వారికి సహకరిస్తేనే క్షేమంగా గమ్యానికి చేరగలం. లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చైనాలో జరిగిన ఈ ప్రమాదం చూస్తే అర్థం అవుతోంది. ప్రయాణికురాలికి, డ్రైవర్కి మధ్య జరిగిన గొడవ దాదాపు 15 మంది మృతికి కారణమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోను చైనా అధికారిక మీడియా విడుదల చేసింది. అధికారులు తెలిపిన దాని ప్రకారం పరధ్యానంగా ఉన్న డ్రైవర్ని ఓ మహిళ తన ఫోన్తో అతని తలపై కొట్టింది. దాంతో డ్రైవర్ స్టీరింగ్ మీద నుంచి చెయ్యి తీసి సదరు మహిళతో గొడవ పడటం ప్రారంభించాడు. దాంతో కంట్రోల్ తప్పిన బస్సు ముందుగా కారును ఢీ కొని.. ఆపై బ్రిడ్జ్ రెయిలింగ్కు గుద్దుకుని దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. -
ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బడికి వెళుతున్నారు
-
ఆ పిల్లల ప్రాణాలు అరచేతుల్లో..
సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంలోని విశ్వనాథ్ జిల్లా, సూటియా అనే కుగ్రామంలో ప్రాథమిక పాఠశాల పిల్లలు ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బడికి వెళుతున్నారు. మోయలేక మోస్తున్న పుస్తకాల బరువు అందుకు కారణం కాదు. వారంతా బడికి వెళ్లాలంటే ఎప్పుడూ ప్రవహించే ఓ నదిని దాటాలి. దానిపై వంతెనా లేదు. ప్రయాణికులను దాటించే పడవులూ లేవు. అందుకని పిల్లలంతా పెద్ద రాతెండి జబ్బ తట్టలను ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. అందులో కూర్చొని నీటి వాలున చేతులతో వాటిని నడిపిస్తూ ఆవలి ఒడ్డుకు వెళుతున్నారు. వస్తున్నారు. పుట్టీలు మునిగినట్లు ఆ రాతెండి తట్టలు పల్టీకొడితే పిల్లల ప్రాణాలు నీటిలో కలసిపోయే ప్రమాదం ఉంది. ఇదివరకు పిల్లలు అరటి బోదెలతోని చిన్న పడవల్లా చేసుకొని వచ్చేవారని, అవి త్వరగా పాడవడం, విరివిగా దొరక్కపోవడం వల్ల ఇప్పుడు వెడల్పుగా ఉండే జబ్బ తట్టలను ఉపయోగిస్తున్నారని అదే పాఠశాలలో పనిచేస్తున్న జే. దాస్ అనే ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల పిల్లలు నది దాటటంలో పడుతున్న పాట్లను ఏఎన్ఐ అనే వార్తా సంస్థ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఇప్పడది వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన స్థానిక బీజేపీ శాసనసభ్యుడు ప్రమోద్ బోర్తాకుర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం పీడబ్ల్యూ రోడ్డు కూడా లేకుండా దీవిలా ఉన్న చోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎందుకు నిర్మించారో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను వెంటన జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళతానని, విద్యార్థుల కోసం పడవ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. -
జల కవచం
ముసలావిడ పేరు వాంగ్. రాజకీయాలు ఆమెకు అర్థం కావు గానీ అక్కడెక్కడో యుద్ధం జరుగుతున్నదని మాత్రం తెలిసింది. జపాన్ వాళ్లొచ్చి తమ దేశం వాళ్లని చంపుతున్నారట. ఎంతమంది చైనీస్లనిలా చంపుతారు వాళ్లు? తనదాకా రాలేదు. తన కళ్ల ముందర ఎవరూ ఎవర్నీ చంపలేదు. ఎల్లో రివర్ ఒడ్డున వున్నదా వూరు. వాంగ్ పూర్వీకులంతా అక్కడే పుట్టి పెరిగారు. జపాన్ వాళ్లెలా ఉంటారో అక్కడి వాళ్లకు తెలియదు. వర్షాకాలం. పొద్దు గుంకుతున్నది. నది పొంగి ఊరిని ముంచెయ్యకుండా ఉండటానికి నిర్మించిన కట్ట ఎక్కి నీటి పొంగు ఎలా ఉందో పరిశీలించింది వాంగ్. జపాన్ వాళ్ల సంగతేమో గానీ నది పొంగితే మాత్రం అపాయం తప్పదు. వందల వేల పాములు మెలికలు తిరుగుతున్నట్టుగా నీళ్లలో మెరుస్తున్న అలలు. ‘‘నీటిమట్టం బాగా పెరిగిందిరో’’ అంటూ హెచ్చరించింది. ‘‘పాడు నది. ఈ ఊరికి పట్టిన దయ్యం ఇది’’ అన్నాడు ఆమె మనవడు. వాడి పేరు లిటిల్పిగ్. ‘‘జాగ్రత్త. జలదేవత వింటుంది.’’ కట్టమీద కూర్చున్నవాళ్లంతా జపాన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ‘‘వాళ్లెలా ఉంటారసలూ? చూస్తే ఎలా గుర్తు పట్టడం?’’ ‘‘పరదేశం వాళ్లను పోల్చుకోవడం కష్టం కాదులే. బాగా పొడుగ్గా ఉంటారు. ఒంటి రంగు కూడా తేడా ఉంటుంది. పైగా వాళ్లవి చేపకళ్లు. మన మాదిరిగా లేనివాళ్లంతా జపానువాళ్లే’’. ఆ ఊళ్లో అందరికన్నా ముసల్ది ఆవిడే. అందువల్ల ఆమె మాటకు తిరుగులేదు. ‘‘వాళ్లు విమానాల్లో దాక్కుంటారు తాతమ్మా. మనకు కనిపించరు.’’ అన్నాడు మనవడు. ‘‘జపనీస్ అనేవాళ్లు అసలు వుండరురా’’ అంటూ తీర్మానించింది వాంగ్. అందరూ గొల్లున నవ్వారు. అది చిన్న ఊరు. ముప్ఫై యిళ్లకు మించి ఉండవు. ఇంతదూరం ఎందుకు వస్తారు జపాన్వాళ్లు? ఎంతచెడ్డా, వాళ్లూ మనుషులే. ఆమె జీవితంలోని ఎన్నో ముఖ్య సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిందీ డైక్. పదిహేనేళ్లప్పుడు నవవధువుగా ఉన్నప్పుడు భర్త పిలిస్తే ఇక్కడికి వచ్చింది. కొన్నాళ్లకే అతడు ప్రమాదవశాత్తూ ఈ నీళ్లలో పడి మరణించాడు. బుద్ధిస్ట్ నరకం నుండి భర్తను రక్షించడానికి ఎన్ని సంవత్సరాలపాటు పూజలు చేయించిందో! ఉన్నదంతా ఊడ్చిపెట్టింది. ఇంకా పిల్లాణ్ని పెంచాలి. భూమి సాగు చెయ్యాలి. ఖర్చులు పెరిగిపోయాయి. ‘‘మరో పది వెండి బిళ్లలు కావాలి!’’ అంటూ డిమాండ్ చేశాడు పూజారి. ‘‘ఇంకెన్నాళ్లీ పూజలు?’’ ‘‘నీ భర్త కుడిచెయ్యి యింకా నరకంలోనే చిక్కుకుని ఉన్నది’’ అన్నాడు. ‘‘చెయ్యే గదా! లాక్కోగలడులే. నాకాయన సంగతి బాగా తెలుసు’’ అంది వాంగ్. ఇన్నేళ్లు గడిచినా ఇంకా అనుమానం తీరలేదు. నిజంగా లాక్కున్నాడో లేదో. మనవడి పెళ్లాం నీళ్లాడటానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాతైనా డబ్బులు జమచేసి ఆయన్ను విడిపించాలి. నదిని చూస్తే చాలు.. వాంగ్కు ఆలోచనలు పొంగి పొర్లుతాయి. తన భర్తను కబళించిన రాక్షసి! ఆ రోజు కట్టకు గండి పడ్డది. అతడు మరమ్మతు చెయ్యటానికెళ్లాడు. తను వారిస్తూనే ఉంది. అంతలోనే నీటి మట్టం పెరిగింది. కాలు జారింది. కళ్లముందరే కొట్టుకుపోయాడు. తమకు జీవన్మరణాల మధ్య సరిహద్దు రేఖ ఈ కట్ట. ఆ ఊరివాళ్లు తరతరాలుగా నదిని తిట్టుకుంటూ, అడ్డుగోడకు మరమ్మతులు చేస్తూ గడుపుతారే తప్ప, తమ నివాసాల్ని ప్రమాదస్థలానికి మరికాస్త దూరంలో కట్టుకోవాలని మాత్రం తట్టలేదు. అది వాళ్ల అమాయకత్వానికి పరాకాష్ట. నీటి అలల మీద వెన్నెల పరుచుకుంది. ‘‘తాతమ్మా! విమానాలు వస్తాయిలాంటప్పుడు’’ అన్నాడు మనవడు. ‘‘అశుభం పలక్కు. ఎక్కడ నేర్చుకున్నావురా ఇలాంటి మాటలు!’’ అంటూ కట్ట దిగింది వాంగ్. ఆమె వెంట ఊరి జనమూ బయల్దేరారు. రాత్రి పక్కలో వాలిందన్న మాటేగానీ ఆలోచనలన్నీ జపాన్ వాళ్ల గురించే. వాళ్లెలా ఉంటారు? ఎందుకొచ్చారట? ఏం చేస్తారు? తమ గ్రామం గురించి వాళ్లకు తెలుసా? రాక్షసుల్లాంటి వికృతాకారాలను కొన్ని వూహించుకుని బహుశా ఇలాగే ఉంటారు కాబోలు అనుకుంది. అర్ధరాత్రి దాటింది. ‘‘వచ్చారు.. వచ్చారు..’’ అంటూ కేకేసింది మనవడి పెళ్లాం. ‘‘ఎక్కడ?’’ ‘‘అదిగో, ఆకాశంలో!’’ నిజమే. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కాని పక్షులు. ‘‘ఏమిటవి?’’ జవాబుగా, అల్లంత దూరాన, పొలంలో వెండి గుడ్డులాంటిది జారిపడింది. మట్టి ఆకాశమంతెత్తు ఎగిసింది. అందరూ ఈ వింత చూడటానికి పరిగెత్తారు. ముప్ఫై అడుగుల మేర గొయ్యి ఏర్పడింది. అంతలోనే మరొకటీ, మరొకటీ. జనమంతా చెల్లాచెదురుగా పరిగెత్తారు. ‘అంతా’ అంటే వాంగ్ తప్ప మిగతా వాళ్లందరూ అని అర్థం. మనవడూ, మనవరాలూ చెయ్యి పట్టుకుని లాగారు. కానీ విడిపించుకుని కట్ట పక్కనే కూలబడిపోయింది ఆవిడ. ‘‘నేను పరిగెత్తలేనురా. డెబ్భై ఏళ్లుగా పరిగెత్తలేదు. మా పాదాలను కట్టేశారు గదా. ఈ కాళ్లతో పరిగెత్తలేను. మీరిద్దరూ వెళ్లండి. చిన్నపిల్ల జాగ్రత్త. ఒట్టి మనిషి కూడా కాదు’’ అంటూ వెనక్కు వాలింది వాంగ్. ‘‘తాతమ్మా! నువ్వు రాకపోతే నేనూ వెళ్లను’’ అంటూ మొండికేసింది పిల్ల. ‘‘పోవే మూర్ఖురాలా. నీ మొగుడు చస్తే, వంశాంకురం ఉండటానికన్నా, నీ ప్రసవం క్షేమంగా జరగాలి. వెళ్లు’’ అంటూ చేతికర్రతో తోసింది వాంగ్. పైన విమానాల రొద పెరిగింది. అందరూ ఏదో అరుస్తున్నారు గానీ ఒకరి మాటలొకరికి వినిపించడం లేదు. మరికొన్ని విమానాలు వచ్చి మొదట వచ్చిన వాటిని ఎదిరించాయి. ఆకాశంలో యుద్ధం! పెంకుటిళ్లు, పూరిపాకలు ఒక్కొక్కటే నేల మట్టమవుతున్నాయి. ఎటు చూసినా మొండి గోడలు తప్ప మరేమీ కనిపించడం లేదు. తన ఇల్లేమైంది? పొగ వ్యాపించింది. మంటలు. యుద్ధమంటే ఏమిటో, ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను, చెమటోడ్చి పండించిన పంటలను ఎవరైనా ఎందుకు నాశనం చెయ్యాలి? మరికాసేపట్లో, నిన్నగాక మొన్న మనవడు దుక్కి దున్నిన సోయాబీన్ పొలంలో రెక్క తెగిన పక్షిలా ఏదో కూలింది. మొదట భయమేసింది. కానీ, ఈ వయసులో తను దేనికి భయపడాలి? ఏం జరిగినా ఫరవాలేదు. కర్ర సాయంతో నెమ్మదిగా నడిచింది.విమానం చుట్టూ చేరి మొరుగుతున్నాయి కుక్కలు. ఇదికాక, ఇంజిన్ రొద కొంత. ‘ఉస్స్!’ అంటూ అదిలించింది కర్రతో. తెల్లగా మెరుస్తున్న రెక్కలు. ‘ఇదంతా వెండి కాబోలు’ అనుకుంది వాంగ్. విమానం లోపల కుర్రాడెవరో కూర్చున్నాడు. అంతెత్తునుంచి పడటంతో సీటులో ముందుకు వాలి పడిపోయాడు. ‘‘లే.. లే..’’ అంటూ పలకరించింది. బతికాడో, చచ్చాడో! చైనా వాడిలా లేడు. చర్మం అదో రంగులో ఉంది. ‘దక్షిణ దేశం వాడైవుంటాడు’. ‘‘బైటికిరా కట్టు కడతాను’’ అంది. వాడేదో గొణిగాడు గానీ అర్థం కాలేదు. తనే, అతి ప్రయత్నం మీద బయటికి లాగింది. నేలమీద పడబోయి, నిలదొక్కుకున్నాడు ఆ యువకుడు. ‘‘మా ఇంటిదాకా నడిస్తే, అక్కడేమైనా చికిత్స చేస్తాను’’ అంది. కుక్కలు మొరుగుతూ మీదికి లంఘించాయి. వాడు భయపడి ఆమెను వాటేసుకున్నాడు. కర్రతో కుక్కల్ని విదిలించింది వాంగ్ – ‘‘ష్! పొండే. కుర్రాణ్ని చంపుతారా ఏంటి?’’ నడవలేని మనిషిని, వీపున వేసుకుని ఈడ్చుకుంటూ, కూలిన, ఇళ్ల శిథిలాల గుండా నడిచింది. ఇంటికి చేరుకోవాలనే ఆమె ప్రయత్నం. కానీ ఇల్లు మిగల్లేదు. కట్ట గేటుకి ఎదురుగా ఉంటుంది తన ఇల్లు. మళ్లీ కట్టుకోవాల్సిందే. గోడకు వాలి కూర్చున్నాడు కుర్రాడు. నీళ్లు కావాలని సైగ చేశాడు. ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఒక్క మాటా అర్థం కాలేదు. పగిలిన కుండ పెంకులో నది నీళ్లు పట్టించింది వాంగ్. గాయాలు కడిగి తన గౌను చింపి కట్టుకట్టింది. కుర్రాడికి బాధతో కళ్లు మూసుకుపోతున్నట్టున్నాయి. ‘‘ఆకలిగా ఉందా! ఏదన్నా ఉందేమో చూస్తాను’’ నాలుగిళ్లావల, రొట్టెలు చేసే బేకరీ ఒకటి ఉంది. ఇప్పుడక్కడ బేకరీ మిగల్లేదు గానీ దుమ్ము కొట్టుకుపోయిన రొట్టె ముక్కయినా దొరక్కపోతుందా! చాలాసేపు వెతికింది. చివరికి, కూలిన గోడల మధ్య ఇంకా వేడి వేడిగా ఉన్న బ్రెడ్ రోల్ చేతికి తగిలింది. ఆహారం కనిపించగానే ఆకలి జ్ఞాపకం వచ్చింది. ముందర, తను కాసింత తిని, కుర్రాడికికూడా పెట్టొచ్చనుకుంది. అంతలో, అరుపులు వినిపించాయి. ‘‘జపనీస్!’’ అంటూ పరిగెత్తుకొచ్చారు సైనికులు. ‘‘జపనీస్ ఎవరు?’’ ‘‘వీడే’’ ‘‘వీడు జపనీసా? మన పోలికలూ ఉన్నాయే’’ ‘‘వీడు జపనీస్’’ అన్నాడొక సైనికుడు కోపంగా. ‘‘సర్లే. ఆకాశం నుండి ఊడిపడ్డాడు. నన్నేం చెయ్యమంటావు?’’ అంది వాంగ్. ‘‘ఆ బ్రెడ్డిటివ్వు’’ ‘‘మీరు తినండి. వాడికీ ఓ ముక్క ఇవ్వండి’’ ‘‘జపనీస్కు మన రొట్టె ఇవ్వాలా?’’ ‘‘ఏం? వాడికి మాత్రం ఆకలి ఉండదా?’’ తనవాళ్లే అయినా, చైనీస్ సైనికులు ఇలా ఉంటారని అనుకోలేదు వాంగ్. కానీ, ఎవర్నెందుకు తప్పుపట్టడం! సైనికులంతా ఒకటే. ‘‘మాది ప్రశాంత జీవితం. నా ఎరుకలో, ఈ ఊరికి సైనికులు రాలేదు. మీరూ రావొద్దు. వెళ్లిపోండి’’ ‘‘నిజమే. చాలా ప్రశాంతంగా ఉందిప్పుడూ. సమాధిలాగ. ఈ వూరినలా చేసిందెవరో తెలుసా మామ్మా? ఈ జపనీస్గాళ్లే!’’ ‘‘కానీ, ఎందుకు వాళ్లిలా చేస్తున్నారు?’’ ‘‘మన దేశం, మన భూమి వాళ్లక్కావాలట!’’ ‘‘మన భూమి వాళ్లకెందుకిస్తాం?’’‘‘ఎప్పటికీ ఇవ్వం!’’ అంటూ అరిచాడొక సైనికుడు. ఏదో గొడవ జరుగుతూనే ఉందిగానీ, అందరూ తూర్పు వైపు పరిశీలనగా చూస్తున్నారు. ‘‘అటుకేసి ఎందుకు చూస్తున్నారు?’’ ‘‘జపాన్గాళ్లు అటునుండే వస్తున్నారు’’ ‘‘మరేం చెయ్యాలి? మీరు పారిపోతారా?’’ ‘‘మేం కొద్దిమందిమే ఉన్నాం. సావోఆన్ గ్రామం రక్షణ బాధ్యత మాకప్పగించారు’’ ‘‘ఆ ఊరు నాకు బాగా తెలుసు. టీ కొట్టు యజమాని పావో ఎలా ఉన్నాడు? వాడు నా తమ్ముడు’’ ‘‘ఎవరూ మిగల్లేదా వూళ్లో. అందర్నీ చంపేశారు జపనీస్. విదేశీ ట్యాంకులు, విదేశీ తుపాకులతో జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది’’ హతాశురాలైంది వాంగ్. తన వంశంలో ఇంకెవరూ మిగల్లేదన్నమాట. జపనీస్ మరోసారి దాడికి పాల్పడవచ్చని సైనికులు అప్రమత్తంగా ఉన్నారు. ‘‘ఇంతకూ, వీడు బతికున్నాడా, చచ్చాడా?’’ అంటూ ఒక సైనికుడు కత్తి తీసి గాయపడిన పైలట్ను రెండు మూడు సార్లు పొడిచాడు. వ్యూహంలో భాగంగా, సైనికులంతా వెళ్లి దూరంగా ఎక్కడో నక్కారు. ‘‘వీడు జపాన్వాడా? ఎంత ఆశ్చర్యం!’’ అనుకొని విస్తుపోయింది వాంగ్. పైలట్ శవం నేలకొరిగింది. వంశం కొనసాగాలంటే మనవడూ, వాడి పెళ్లాం క్షేమంగా వుండాలి. ఇద్దరూ ఎటువైపు పారిపోయారో! కనిపిస్తారేమోనని కట్ట ఎక్కి చూసింది. గంట సేపట్లో నీటి మట్టం బాగా పెరిగినట్టుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊరు మునిగిపోతుంది. ‘పాపిష్టి దయ్యం’ అంటూ తిట్టుకుంది. ‘నది విననీ. ఇంకేం జరిగినా బాధ లేదు. జపాన్ వాళ్లు నాశనం చేసిన ఊరును నది తన కడుపున దాచుకుంటుందా!’. మొహం, కాళ్లూ, చేతులూ కడుక్కుంది. చుట్టూ చూసింది. సైనికులు పడుతూ, లేస్తూ పరిగెత్తుతున్నారు. నిర్మానుష్యంగా ఊరు, తన మనవడూ, మనవరాలూ ఎక్కడో తన కోసం నిరీక్షిస్తూనే ఉండి ఉంటారు. కట్ట దిగుదామనుకుంటున్నప్పుడు, తూర్పున, దూరంగా, ఏదో కదలిక కనిపించింది. మొదట ధూళి మేఘంలాగ. పరికించి చూస్తే ఏవో చుక్కలు. మెరుస్తున్న చుక్కలు. అర్థమైంది. పోల్చుకోగలిగింది. మనుషులు. ఒకరూ యిద్దరూ కాదు. పదాతిదళం కదలి వస్తున్నది. ‘‘జపనీస్’’ అనుకున్నది వాంగ్. వాళ్లకు రక్షణగా, పైన షీల్డ్ చేస్తూ యుద్ధ విమానాలు టార్గెట్ చూసుకుని బాంబులు విడుస్తాయి. ‘‘ఎవరు కావాలి మీకు? ఇంకా ఏం మిగిలిందని ఈ ఊళ్లో? నేను, నా మనవడూ, మనవరాలు తప్ప. మా తమ్ముణ్ని చంపేశారు!’’ మంచి టీ చేసే పావో మరణించాడు. అతడి భార్య, ఏడుగురు పిల్లలు జపాన్ సైనికుల తూటాలకు బలైపోయారు.’’ కట్ట ఎక్కి నిల్చున్నది. తను వాళ్లకు కనిపిస్తూనే ఉండి ఉంటుంది. దిగుతున్నప్పుడు కట్ట గేటు జ్ఞాపకం వచ్చింది. ఈ నది తమకు శాపం. తమను ఎన్ని ఇక్కట్ల పాలు చేసిందో! గేట్ తెరవడం వచ్చు తనకు, అంటే పంట కాల్వల కోసం కాదు. ఒకేసారి, మొత్తం గేట్ ఎత్తేస్తే ఏమవుతుందో కూడా బాగానే తెలుసు. తెరచి తను కొట్టుకుపోకుండా తప్పించుకోవడం సాధ్యమా? ‘కాటికి కాలు జాచుకున్న ముసల్దాన్ని. ఎందుకింత భయం!’ అనుకుంది. మనవడికి పుట్టబోయే పిల్ల ఎలాగుంటుందో చూడలేదన్న బెంగ ఒక్కటే మిగిలింది. కానీ, జీవితంలో అనుకున్నవన్నీ ఎప్పుడూ జరగవు. ఇంతవరకూ చూసింది చాలు. మరొక్కసారి తూర్పుకు దృష్టి సారించింది. జపాన్ సైనికులు ముందుకు కదులుతున్నారు. వందలో, వేలో.. గేట్ తెరిస్తే వరద ఉప్పెనలాగా పొలాలను, శిథిలాలుగా మిగిలిన ఇళ్లను ముంచెత్తి ఆకలిగొన్న డ్రాగన్లాగా ముందుకురుకుతుంది. మనవడూ, మనవరాలూ ఊరు దాటి మరెక్కడో క్షేమంగా తలదాచుకునే ఉంటారు. శత్రు సైన్యంతో యుద్ధం చెయ్యడానికి అనేక పద్ధతులున్నాయి. కొందరు విమానాలు వాడతారు. కొందరు తుపాకులు, నది నా ఆయుధం. లాకులు తెరవడం కాస్త కష్టమే. అయితేనేం, ఈ ఒక్క పని చెయ్యగలిగితే చాలు. ఈ జీవితానికి పరిసమాప్తి. గేట్ లీవర్ పట్టి లాగింది. ‘‘చేసేది పాపమా? అయితేనేం, నరకానికే పోతాను. చెయ్యి చిక్కుకున్న నా మొగుడింకా అక్కడే ఉన్నాడు. అక్కడైనా కలిసి బతుకుతాం’’ మరుక్షణం... కనుచూపు మేర కప్పేసింది జలప్రళయం. కిందా, మీదా, నలువేపులా నీరు. వాంగ్ ఏదో అనబోయింది. ఊపిరి తీసుకోబోయింది. కానీ ఎంతసేపు? అంతా లిప్తపాటులో ముగిసింది. శత్రు సేనలకు అది జలసమాధి. ఆంగ్లమూలం : పెర్ల్ ఎస్. బక్ అనువాదం: ముక్తవరం పార్థసారథి -
స్నేహితుల మాట విని సాహసం
దొడ్డబళ్లాపురం: స్నేహితుల మాటకు కట్టుబడి ఒక వ్యక్తి నిండి ప్రవహిస్తున్న నదిలో దూకిన సంఘటన హొళేనరసీపురలో చోటుచేసుకుంది. హొళేనరసీపురకు చెందిన రాము అనే వ్యక్తి ఈ సాహసానికి పూనుకున్నాడు. ఆదివారం తన పిల్లలు, స్నేహితులతో కలిసి రాము కావేరి నది పరివాహక ప్రదేశానికి వెళ్లాడు. ఈ సందర్భంగా స్నేహితులతో 17 ఏళ్ల క్రితం ఇదే విధంగా పొంగి ప్రవహిస్తున్న నదిలో దూకి అవతలి వైపు ఒడ్డును చేరుకున్న సంఘటనను గుర్తు చేసాడు. దీంతో స్నేహితులు సరదాగా అయితే ఇప్పుడు చేసి చూపించు అంటూ ఎగతాళి చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న రాము పిల్లలతో ఈతకొట్టి చూపిస్తాను చూడండంటూ చెప్పి అమాంతం నదిలో దూకి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
భారీ వర్షాలతో ఏపీలో పోంగుతున్న వాగులు, నదులు
-
ఏరు దాటిన పెండ్లికూతురు
చెన్నై / సేలం: ముంచుకొస్తున్న పెండ్లి ముహూర్తం ముందు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద. కుటుంబీకులు, గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు కలిసి శుక్రవారం సాహసంతో పెండ్లికూతురిని ఏరు దాటించారు. ఈరోడ్ జిల్లా సత్యమంగళం సమీపంలో భవనీ సాగర్ పరిధిలోని అడవి ప్రాంతంలో డెంగుమరడ కొండ గ్రామం ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే ఇక్కడి మాయారు (ఏరు) దాటాల్సి ఉంది. ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా మాయారు ఉధృతంగా ప్రవహిస్తోంది. మాయారును దాటవద్దని అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేసి ఉన్నారు. ఇదిలా ఉండగా డెంగుమరడ గ్రామానికి చెందిన రైతు అవినాశి. ఇతని భార్య సెల్వి. వీరి కుమార్తె రాసాత్తి (24). బీఏ డిగ్రీ పట్టభద్రురాలు. ఈమెకు కోవై జిల్లా ఆలంకొంబు ప్రాంతానికి చెందిన రంజిత్కుమార్తో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం ఈ నెల 20వ తేదీ ఆలంకొంబులో జరిపించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహానికి రెండు రోజులే ఉండడంతో మాయారును ఎలా దాటి వెళ్లాలా, పెండ్లి జరుగుతుందా అనే సందేహాలతో రాసాత్తి కుటుంబీకులు ఆందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు వారికి ధైర్యం చెప్పి, గ్రామస్తుల సాయంతో పెండ్లి కూతురు రాస్తాతితో పాటు 15 మంది కుటుంబ సభ్యులను శుక్రవారం బుట్ట పడవలో ఏరు దాటించారు. తర్వాత వారు భవానీసాగర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాసాత్తి మాట్లాడుతూ మాయారులో వరద ఉధృతి చూసి నా పెళ్లి ఆగిపోయినట్లే అనుకున్నాను. అధికారులు ధైర్యం చెప్పి సాహసంతో ఏరు దాటించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పింది. అదే సమయంలో మాయారు దాటి వెళ్లడానికి వంతెన ఏర్పాటు చేయాలి. బస్సు సౌకర్యం కల్పించాలని రాసాత్తి కోరింది. -
రూ.200 కోసం చెత్త ఆలోచన!
-
రూ.200 కోసం!
మన కారో.. బైకో నెలకోసారైనా వాటర్ సర్వీసింగ్కు ఇస్తుంటాం. అయితే ఆ డబ్బులు ఎందుకు వృథా చేయడం అనుకున్నవారు ఏం చేస్తారు. ఇంట్లోనే బకెట్లో నీరు తీసుకుని ఎంచక్కా పొద్దున్నే శుభ్రం చేసుకుంటారు. అయితే ఓ చైనీయుడు మాత్రం రూ.200ను ఆదా చేసుకునేందుకు ఓ చెత్త ఆలోచన చేశాడు. ఆ తర్వాత నాలుక్కరుచుకున్నాడు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్కు చెందిన ఓ వ్యక్తి తన ఖరీదైన ల్యాండ్రోవర్ ఎస్యూవీని కడుక్కోవాలనుకున్నాడు. అయితే అందుకు రూ.200 ఖర్చు అవుతుందని వెనుకడుగు వేశాడు. అంతేకాదు ఎంచక్కా తనే శుభ్రం చేయాలని భావించాడు. అదేదో తన ఇంటిలోనే కడిగితే ఇది వార్తే కాదు. ఇంతకీ అతడేం చేశాడంటే.. దగ్గర్లో ఉన్న నదిలో కారును శుభ్రం చేయాలని భావించాడు. అనుకున్నదే తడవు అక్కడికి వెళ్లి ఒడ్డుకు దగ్గరగా తక్కువ ప్రవాహం ఉన్న ప్రాంతంలోకి కారును దింపి.. శుభ్రం చేసుకుంటున్నాడు. అయితే అప్పుడే పక్కనే ఉన్న డ్యాం నుంచి గేట్లు తెరిచారు. దీంతో ఆ కారున్న చోటికి నీటి ప్రవాహం పెరిగింది. వెంటనే మనోడు పక్కనే ఉన్న ఓ బండరాయిపైకి చేరుకున్నాడు. కానీ వెళ్లిపోతున్న కారును తీసుకురాలేకపోయాడు. వెంటనే అక్కడున్న జనం ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని కారును ఒడ్డుకు చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టడంతో నెటిజన్లు జోకుల మీద జోకులు పేలుస్తున్నారు. పాపం రూ.200ల కోసం చూసుకుంటే దాదాపు 50 లక్షల కారును పోగొట్టుకునే వాడు పాపం! -
వారధి.. వర్ష విధ్వంసం
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు సోమవారం సాయంత్రం మంగళూరు తాలూకా– బంట్వాళ మధ్య ఫాల్గుని నదిపై కూలిపోయిన మాలూరుపట్న పాతవంతెన. అదృష్టవశాత్తు ప్రాణాపాయం జరగలేదని అధికారులు చెబుతున్నారు. సాక్షి, బెంగళూరు: దక్షిణ కన్నడ జిల్లాలోని మాలూరుపట్న వద్ద ఫాల్గుని నదిపై ఉన్న పాత వంతెన వర్షాలకు సోమవారం సాయంత్రం కూలిపోయింది. దీంతో మంగళూరు తాలూకా– బంట్వాళ మధ్య రాకపోకలు స్తంభించాయి. కొన్ని దశాబ్దాల క్రితం ఈ వంతెన నిర్మించారు. గత కొన్ని వారాలుగా దక్షిణ కన్నడ జిల్లాతో పాటు కరావళి ప్రాంతాన్ని వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వర్షాల ధాటికి తడిసి ముద్దయిన వంతెనలో కొంతభాగం ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు వంతెనకు ఇరువైపులా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఆ వంతెనను మూసివేశారు. ఇసుక తవ్వకాలతో నష్టం మాలూరుపట్న ప్రాంతంలో కొన్నేళ్లుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక తవ్వకాల ఫలితంగా వంతెన పిల్లర్లు దెబ్బతిన్నాయి. కాగా ఇటీవల ఇసుక తవ్వకాలను నిషేధించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వంతెన కూలడంతో కుప్పెడవు, కైకాంబ, ఇరువేల్, ఇడపడవు, గంజిమట్, సురత్కాల్ తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
బవనాసి.. ప్రాణం తీసి!
ఆత్మకూరురూరల్: సప్తనదీ సంగమంలో కలిసే నదుల్లో ఒకటైన పరమపావన బవనాసి నది ఇద్దరు బాలుర ప్రాణాలు బలి తీసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. రంజాన్ మాసం, వేసవి సెలవులు నేపథ్యంలో బండిఆత్మకూరు మండలం ఏ కోడూరుకు చెందిన ముర్తుజావలి తన కుమారుడు యూనిస్(13)ను శ్రీపతిరావుపేటలో ఉండే తన మామ వన్నూర్సాబ్ ఇంటికి పంపాడు. గ్రామంలో వన్నూర్సాబ్ ఇంటికి ఎదురుగా ఉండే ముర్తుజా కుమారుడు నబీరసూల్(14)తో యూనిస్కు స్నేహం కుదిరింది. దీంతో ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. మంగళవారం ఉదయం నబీరసూల్ తాత దస్తగిరి పశువులకు మేత కోసం తన పొలం వైపు వెళుతుంటే స్నేహితులిద్దరూ వెళ్లారు. అక్కడ పొలంలో కాసేపు తాతతో కలిసి గడ్డి కోసిన వారు గడ్డి కోసం సమీపంలోని బవనాసి నది ఒడ్డుకు వెళ్లారు. ఎంతసేపటికీ రాకపోవడంతో దస్తగిరి చుట్టుపక్కల వారితో కలిసి పిల్లల కోసం వెతికారు. ఓ చోట వాగు గట్టున పిల్లల దుస్తులు, చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి వాగులో గాలించగా ఇద్దరి మృతదేహాలు బురదలో చిక్కుకుపోయినట్లు గుర్తించి బయటకు తీశారు. ఆత్మకూరు ఎస్ఐ రమేష్కుమార్ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా నబీరసూలు సోదరి వివాహ శుభలేఖల పంపిణీలో నిమగ్నమైన ముర్తుజా కుటుంబసభ్యులకు సమాచారం తెలియడంతో బోరున విలపించారు. అలాగే సెలవులకని వెళ్లిన కుమారుడు ఇక లేడని తెలుసుకున్న యూనిస్ తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. -
కన్నీరే మిగిలి‘నది’
అమ్మా లేమ్మా.. నాన్నా.. చెల్లిని, అమ్మను పైకి లేవమని చెప్పు.. తాతయ్యా.. చెల్లి నాతో ఆడుకోవడానికి రావడం లేదు.. నువ్వయినా పిలువు.. మామయ్య వాళ్ల ఇంటికి వెళదాం.. అంటూ ఆ చిట్టి తల్లి మారం చేస్తుంటే.. ప్రతి గుండె కన్నీటితో ద్రవించింది. చిన్నారి ఎదురుగా పడి ఉన్న తల్లి, చెల్లి.. ఇక రారని చెప్పడానికి గొంతు పెగలక కృష్ణమ్మ మౌనంగా కదిలిపోయింది. తననే నమ్ముకున్న జీవితాలు తన ఒడిలోనే తెల్లారిపోతుంటే.. గుండె పగిలేలా రోదించింది. శనివారం తుళ్లూరు మండలంలో బోరుపాలెం వద్ద పడవ ప్రమాదంలో తల్లీకూతురు మృత్యువాత పడ్డారు. కృష్ణమ్మ ఒడిలో మృత్యుకేక వినిపించింది. నదినే నమ్ముకున్న వారి జీవితం నీటిలో మునిగిపోయింది. పొట్టకూటి కోసం వేటకొచ్చి నదిలో వలవేస్తే మృత్యువు అందులోకి లాగేసింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన నడకుదిటి సైదారాజుకు భార్య మాధవి(26), చిన్నకూతరు కావ్య(3)తో కలసి రాయపూడి ఇసుక రీచ్ను ఆనుకుని ఉన్న లంక రేవు వద్ద వేటకు వచ్చాడు. చీకటి పడటంతో ముగ్గురూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలో ఇసుకను తరలిస్తున్న పడవ వేగంగా వచ్చి వీరు నిద్రిస్తున్న తెప్పను ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ నదిలో పడిపోయారు. భార్య, బిడ్డ నీటిలో మునిగిపోయారు. గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. తుళ్ళూరు రూరల్ : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన నడకుదిటి సైదారాజుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు. వేసవి సెలవులు కావడంతో పెద్ద కూతురు జ్యోతిని అమ్మమ్మ వాళ్ల ఇంటి వద్ద వదిలి పెట్టాడు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటలకు బోరుపాలెం సమీపంలో రాయపూడి ఇసుక రీచ్ను ఆనుకుని ఉన్న లంక రేవు వద్దకు వేటకని బయలుదేరాడు. చిన్న కూతురు కావ్యను పక్కింట్లో వదిలి వెళదామని భార్యాభర్తలు సైదారావు, మాధవి అనుకున్నారు. కావ్య తానూ వస్తానని మారం చేయడం, పిల్లలను పట్టుకెళుతున్నారనే వందతులు రావడంతో తమ వెంట తీసుకెళ్లారు. నదిలో వలవేసి పడవలోనే కాపలా కాస్తుండగా తెల్లవారుజాము కావడంతో ముగ్గురూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలో రాయపూడి రేవు నుంచి ఇసుక నింపుకునేందుకు నదిలోకి పడవ అటుగా వచ్చింది. పడవ నడుపుతున్న వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా వీరు నిద్రిస్తున్న తెప్పను ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ నదిలో పడిపోయారు. కావ్య(3), మా«ధవి(26) నీటిలో మునిగిపోయారు. సైదారావు నీటిలో భార్య, బిడ్డ కోసం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే పడవలోని ఈతగాళ్లు సైదారావును ఒడ్డుకు చేర్చారు. పోలీసుల అదుపులోపడవ నిర్వాహకుడు పడవ నిర్వాహకుడు నాగమల్లేశ్వరరావును ఫిషర్మ్యాన్ రాయపూడి సొసైటీ వారు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సుధాకరరావు, ఎస్సై శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి నాలుగు పడవల ద్వారా నదిలోకి వెళ్లారు. గజ ఈతగాళ్ల సాయంతో తొలుత కావ్య, కొద్దిసేపటికి మాధవి మృతదేహాలను గుర్తించగలిగారు. ఎన్డీఆర్ఎఫ్ అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రెడ్డి రీచ్ను పరిశీలించారు. సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జ్యోతికి అండగా ఉంటాం చిన్నారి జ్యోతి పేరు మీద కొంత ఆర్థిక సాయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తామని రాయపూడి సొసైటీ సభ్యులు చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నేత కత్తెర సురేష్కుమార్, సీపీఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి, సీఐటీయూ రాజధాని ప్రాంత డివిజన్ కార్యదర్శి జొన్నకూటి నవీన్ప్రకాష్ డిమాండ్ చేశారు. రూ.11 లక్షల ఆర్థిక సహాయం విజయవాడ : కృష్ణా నదిలో ప్రమాదవశాత్తూ పడవ మునిగి చనిపోయిన ఇబ్రహీంపట్నానికి చెందిన తళ్లీకూతుళ్లు మాధవి, కావ్యల కుటుంబానికి రూ.11 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి కారణమైన బోటు యాజమాన్యం రూ.6 లక్షలు అందజేస్తోందని, చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలు మృతురాలు మాధవి భర్త సైదురాజుకు ఇస్తామని వెల్లడించారు.