-
పోయిన వాలెట్ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమానికి చేరింది! ఎలాగంటే..?
కొన్ని వస్తువులు పోతే మళ్లీ మనకు చేరడం అసాధ్యం. ఎవరో కొంతమంది మంచివాళ్లు సదరు యజమానికి అందేలా చేయాలనకుంటే గానీ దొరకదు. అలా సహృదయంతో తిరిగే ఇచ్చివాళ్లు అరుదు. అలాంటిది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం పోయిన వాలెట్ ఏకంగా 65 ఏళ్ల తర్వాత యజమాని తాలుకా కుటుంబసభ్యులను చేరుకుంటే ఆ వ్యక్తి జ్ఞాపకాలు కళ్ల ముందు ఒక్కసారిగా మెదులుతాయి. ఇలాంటి ఘటన ఎవ్వరికో గానీ జరగదు. అసలు ఆ వాలెట్ ఎలా పోయింది?. ఎవరు ఆ వాలెట్ని యజమాని కుటుంబసభ్యుల వద్దకు చేర్చారంటే.. అట్లాంటాలోని పురాతన ప్లాజా థియోటర్ ఒకటి ఉంది. దాన్ని మరమత్తు చేస్తుండగా ఆ థియోటర్ వెనుకవైపున ఉన్న బాత్రూం గోడ కూలిపోయింది. దీంతో వాలెట్ బయటపడింది. దానిలో కొన్ని మాగ్నటిక్ స్ట్రిప్లేని క్రెడిట్లు, సినిమా టిక్కెట్, ఫ్యామిలీకి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్నాయి. దీంతో ఆ ధియోటర్ యజమాని క్రిస్ ఎస్కోబార్ సదరు వ్యక్తి కుటుంబానికి ఇప్పటికైన అందేలా చేయాలనుకున్నాడు. అయితే 1959లో చేవ్రోలెట్ సినిమా చూడటాని వచ్చి పోగొట్టుకున్నట్లు వాలెట్లో ఉన్న టికెట్ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ వాలెట్ యజమాని లేదా అతడి కుటుంబ సభ్యులకు అయినా దీన్ని అందేలా చేయాలన అనుకుంటాడు క్రిస్. అయితే ఆ కుటుంబం మునుపు ఈ పరిసరాల్లోనే ఉండొచ్చేమో గానీ ఇప్పుడూ చాల ఏళ్లు అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటుందనేది కనిపెట్టడం అసాధ్యంగా అనిపించింది క్రిస్ ఎస్కోబార్కి. దీంతో ఆ వ్యాలెట్లో ఉన్న లైసెన్స్ కార్డుల ఆధారంగా వ్యాలెట్ పోగొట్టుకున్న వ్యక్తి స్త్రీని అని కనుగొంటారు. ఆమె పేరు ఫ్లాయ్ కల్బ్రేత్గా గుర్తించారు. అయితే ఆ కాలంలో స్త్రీలు తమ భర్తల పేరుతో పిలిచేవారు. దీంతో ఆమె అడ్రస్ కనుగొనడం మరింత కష్టంగా మారింది. దీంతో క్రిస్ తన భార్య సాయం తీసుకుంటాడు. ఆమె ఇంటర్నెట్లో సోధించగా కల్బ్రెత్ మరణించినట్లు గుర్తిస్తుంది. దీన్ని బట్టి ఫ్లాయ్ ఆమె పేరు అని అర్థం చేసుకుంటారు ఆ దంపతులు. అంతేగాదు కల్బ్రెత్ పేరు మీద కల్బ్రెత్ కప్ అనే గోల్ఫ్ టోర్నమెంట్ వెబ్సైట్ను కనుగొంటారు. అతడి కుటుంబ చిన్నపిల్లలకు వచ్చే మస్తిష్క పక్షవాతం(Cerebral Palsy) అనే ఛారిటీ సంస్థ కోసం ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నట్లు తెలుసుకుంటారు. అలా ఫ్లాయ్ కుమార్తె థియా చాంబర్లైన్ను కనుగొంటారు. ఆమెకు ఈ వ్యాలెట్ని అందజేస్తాడు క్రిస్. దీంతో ఆమె ఒక్కసారిగా ఆ వ్యాలెట్ని తీసుకుంటూ తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఆమె చాలా అందంగా ఉంటుందని, మంచి వ్యక్తిత్వం గలదంటూ ఉద్వేగం చెందుతుంది. ఆమె వ్యాలెట్లో భీమా కార్డులు, డాక్టర్ అపాయింట్మెంట్ నోట్లు కనుగొంటుంది. ట్విస్ట్ ఏంటంటే థియా చాంబర్లైన్కు ఇప్పుడు 71 ఏళ్లు. ఈ వ్యాలెట్ పోయినప్పుడు ఆమెకు ఆరేళ్లు. ఈ మేరకు ఆ థియోటర్ యజమాని క్రిస్ మాట్లాడుతూ..తమకు మనవళ్లు, మునివళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కాబట్టి ఈ కల్బ్రేత్కు కూడా అలానే ఉంటారు కదా. ఈ వ్యాలెట్ కలెబ్రెత్ జ్ఞాపకాలను ఆ కుటంబంలోని తరతరాలకు తెలియజేస్తుంది కదా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు క్రిస్. (చదవండి: మీకు తెలుసా? కుక్కలు కూడా రక్తదానం చేయగలవు!) -
97 శాతం వెనక్కి వచ్చిన రెండువేల నోట్లు.. మిగిలింది ఎన్ని కోట్లంటే?
ముంబై: చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ‘‘మే 19వ తేదీ బిజినెస్ ముగింపు సమయానికి వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 బ్యాంక్ నోట్లు చెలామణిలో ఉన్నాయి. అక్టోబర్ 31వ తేదీ బిజినెస్ ముగింపు సమయానికి ఈ విలువ రూ.10,000 కోట్లకు తగ్గింది’’ అని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ప్రాంతీయ కార్యాలయాల్లో బారులు.. దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రాష్ట్ర రాజధానుల్లో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎవరైనా ఈ కార్యాలయాలకు వెళ్లలేని పక్షంలో పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని ఆర్బీఐ సూచించింది. కాగా, రూ.2,000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ కోసం ఆర్బీఐ కార్యాలయాల వద్ద పని వేళల్లో పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. రెండువేల నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలను 19 ఆర్బీఐ కార్యాలయాలకు మారాయి. ఆర్బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు, కంపెనీలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఒకసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. డిపాజిట్కు మాత్రం ఎటువంటి పరిమితి లేదు. 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ రూ.2,000 నోట్లతోపాటు కొత్త రూ.500 నోట్లను పరిచయం చేసింది. -
యూఎస్ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా
అమరావతి: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుండి వెనక్కు పంపించిన ఘటన సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగువారు కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదంతంపై అరా తీశారు. విద్యార్థుల పూర్తి వివరాలతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని చెబుతూనే అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఎన్నోఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా చేరుకున్న తాము అన్ని డాక్యుమెంట్లను సమర్పించామన్నారు విద్యార్థులు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ చేసి, కొద్దిసేపు విచారించాక కారణం చెప్పకుండానే వారిని వెనక్కి పంపించేశారు. వారిలో అత్యధికులు అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు. చదవండి: అక్రమాల పుట్ట మార్గదర్శి.. ఆందోళనలో చందాదారులు.. రామోజీ పాపం ఫలితమే ఇదంతా! -
అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమి గ్రేషన్/భద్రతా అధికారులు ఎయిర్పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది. దాదాపు వారం రోజుల నుంచి ఇలా ఒకరిద్దరిని పంపేస్తున్నా.. ఇప్పుడు ఒక్కరోజే 20 మందికిపైగా విద్యార్థులను వెనక్కి పంపడంతో విషయం బయటికి వచ్చిందని అమెరికాలోని తెలుగు సంఘాలు చెప్తున్నాయి. అయితే పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా..: అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు. ముందే టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు రాస్తారు. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్గా చూపిస్తారు. ఇందుకోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అనుభవం సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయి. డాక్యుమెంట్లపై అనుమానాలు.. సోషల్ మీడియా ఖాతాలు అమెరికాలో ‘సాక్షి’ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం.. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారు. అమెరికాలో ఆటా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాలో ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వాసుదేవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపేశారు. నాటా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా మన విద్యార్థులను తిప్పి పంపడానికి కారణాలను కేవలం భారత కాన్సులేట్కు మాత్రమే చెబుతుంది. దీనితో ఆ వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి. -
యుద్ధ మరణం: చనిపోయిన 73 ఏళ్లకు.. సైనికుడికి అంత్యక్రియలు..
విధి లిఖితమో దురదృష్టమో గానీ కొందరు చనిపోతే తదనంతరం చేయాల్సి కార్యక్రమాలకు రకరకాల అడ్డంకులు ఎదురవుతాయి. యుద్ధంలో లేక మిస్సింగ్ కేసులో చనిపోతే ఆ వ్యక్తి ఆఖరి చూపు కోసం కుటుంబసభ్యుల నిరీక్షణ అంతా ఇంత కాదు. ఈలోగ అతడి బంధవులంతా చనిపోయినా.. లేక ఆ వ్యక్తి లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకుంటున్న విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అచ్చం అలానే ఇక్కడొక సైనికుడు యుద్ధంలో వీరమరణం పొందాడు. కానీ అతడి మృతదేహం లేదా అవశేషాలు గానీ లేక అంతిమ సంస్కరాలు నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది అతడి కుటుంబం. ఐదో, పదో ఏళ్లు కాదు ఏకంగా 73 ఏళ్లు ఆ సైనికుడి అవశేషాల కోసం ఎదురు చూసింది ఆ కుటుంబం. వివరాల్లోకెళ్తే..యూఎస్ సైనికుడు సీపీఎల్ లూథర్ హెర్షెల్ స్టోరీ 18 ఏళ్ల వయసులో 1950 సెప్టంబర్ 1న జరిగిన కొరియన్ యుద్ధంలో మరణించాడు. ఐతే అదే యుద్ధంలో మరికొంతమంది సైనికులు చనిపోవడంతో సదరు సైనికుడు హెర్షెల్ అవశేషాలు అంత తేలికగా దొరకలేదు. దీని కోసం దర్యాప్తు సంస్థ పలు విధాలుగా విచారించింది కూడా. ఐతే ఆ యద్ధ సమయంలో మరణించిన సైనికులు అవశేషాలతో అతడి కుటుంబసభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో ఆ కుటుంబం అతడి అంతిమ సంస్కరాలు చేయడం కోసం చాలా ఏళ్ల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు అతడి అవశేషాలు దొరకడమే గాక అతడి కుటుంబ సభ్యలు డీఎన్ఏతో సరిపోయింది. దీంతో అతడు చనిపోయిన 73 ఏళ్లకు జార్జియాలోని స్వస్థలంలో సైనిక లాంఛనాలతో ఖననం చేశారు. కొరియన్ యుద్ధ సమయంలో పరాక్రమంతో శత్రువులను మట్టికరిపించినందుకు ఆ సైనికుడు అత్యంత గుర్తింపు పొందాడు. యూఎస్ ఆర్మీ అతని మరణాంతరం సైనిక అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడమే గాక ఆ మెడల్ని అతడి తండ్రికి ప్రధానం చేసింది. ఆతడు అసాధారణ పోరాట పటిమకు నిలవెత్తు నిదర్శనం అని ప్రశంసించింది. అకుంఠిత దీక్ష, ధైర్యసాహసాలకు ఈ అత్యున్నత మెడల్ సత్కారమని యూస్ ఆర్మీ పేర్కొంది. ఈ మేరకు అతడి చిత్ర పటంతోపాటు ఆ అత్యున్నత మెడల్ని నేషనల్ మెడల్ ఆఫ్ ఆనర్ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచింది. (చదవండి: ఆమె చనిపోయి నాలుగేళ్లైంది..ఐనా మృతదేహం కించెత్తు పాడవ్వకుండా..) -
అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ
న్యూఢిల్లీ: జీవితం ఎపుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియదు. ఒకానొక క్షణంలో ఏదో ఒక పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. అదే కొత్త ఆవిష్కారానికి బీజం వేస్తుంది. గ్లోబల్ సాప్ట్వేర్ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఎండీ ఆనంద్ దేశ్పాండే సక్సెస్స్టోరీ అలాంటిదే. గ్లోబల్ బిజినెస్తో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థకు ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్గా, దేశ్పాండే రూ. 10,600 కోట్ల నికర విలువకు చేరుకున్నారు. మహారాష్ట్రలోని అకోలాలో ఆనంద్ దేశ్పాండే జన్మించారు. కానీ మధ్యప్రదేశ్లోని భోపాల్లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) టౌన్షిప్లో పెరిగారు. పాఠశాల విద్య తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. దీంతోఆటు ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్షలో కూడా పాస్ కావడంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్లో చేరాడు. ఐఐటీ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుని నిర్ణయించారు. (Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్) అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తైన తరువాత ముఖ టెక్నాలజీ కంపెనీ హ్యూలెట్ ప్యాకర్డ్ (HP)లో తన ఉద్యోగంలో చేరాడు. ఇదే యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ హోల్డర్ కూడా. ఇక్కడే దేశ్పాండే జీవితం కీలక మలుపు తిరిగింది. వర్క్ వీసా లేదా గ్రీన్ కార్డ్ పొందాలా లేదంటే ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఇండియా తిరిగి వచ్యేయ్యాలి అనే రెండేరెండు ఆప్షన్స్ ఉన్నాయి. చివరికి ఆరునెలల తర్వాత ఇండియాకు తిరిగి రావాలనేనిర్ణయించుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి అమెరికాకు గుడ్బై చెప్పేశారు. అలా 1990లో పూణేలో తన సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ప్రారంభించాడు. అయితే ఇలా కంపెనీ అంత ఈజీగా ఏమీ సాధ్య పడ లేదు. తన దగ్గరున్న సొమ్ముతోపాటు, స్నేహితులు,కుటుంబ సభ్యుల దగ్గర అప్పు తీసుకున్నాడు. చివరికి రూ.2 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన కంపెనీ స్థాపించాడు. ఆరోజు దేశ్ పాండే చేసిన రిస్క్ అతన్ని బిలియనీర్ను చేసింది. ప్రస్తుతం పెర్సిస్టెంట్ సిస్టమ్స్ మార్కెట్ క్యాప్ రూ.36,000 కోట్లకు పైగా ఉందంటే అతని కృషిని పట్టుదల అర్థం చేసుకోవచ్చు.(బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్: కీవే బైక్స్పై భారీ ఆఫర్) లాంచ్ చేసిన పదేళ్లకు తొలిసారిగా దేశ్పాండే కంపెనీ 2000లో ఇంటెల్ క్యాపిటల్ ద్వారా ఒక మిలియన్ల డాలర్ల భారీ నిధులను సేకరించింది. అనంతరం 2005లో నార్వెస్ట్ వెంచర్ పార్టనర్లు, గాబ్రియేల్ వెంచర్ పార్టనర్లు దేశ్పాండే సంస్థలో 20 మిలియన్లు పెట్టుబడి పెట్టాయి ఇక ఆ తరువాత 2010లో ఐపీవోను విజయవంతంగా పూర్తి చేశారు. దేశ్పాండే మంచి పరోపకారి కూడా. తన కుటుంబంతో కలిసి దేఆస్రా అనే ఫౌండేషన్ను కూడా నిర్వహిస్తుండటం విశేషం. దీని ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తున్నారు. 2012లో IIT ఖరగ్పూర్ విశిష్ట పూర్వవిద్యార్థిగా గుర్తింపు, 2007లో ఇండియానా యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ ద్వారా కెరీర్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. 1.1 బిలియన్ డాలర్లు సంపద ఉన్నపుడే ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల డేటాలో ఆనంద్ దేశ్పాండే బిలియనీర్ల ఎలైట్ క్లబ్లో చేరారు. -
కొడుకును చూసి షాక్ తిన్న తండ్రి.. సినిమా స్టోరీని తలపించింది..
అల్లిపురం (విశాఖ దక్షిణ ): చనిపోయాడు అనుకున్న కొడుకు తిరిగి వస్తే ఆ ఆనందం వర్ణణాతీతం. అలాంటి అనుభవం ఒక తండ్రికి కలిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా గ్రామానికి చెందిన శ్యామ్రావ్ లోఖండే (38) మతిస్థిమితం లేకపోవడంతో నాలుగేళ్ల క్రితం ఊరు వదిలి వచ్చేశాడు. అలా వచ్చిన వ్యక్తి నగరంలో తిరుగుతుండగా అతడిని భీమ్నగర్ ఏయూటీడీ, టీఎస్ఆర్ కాంప్లెక్స్ నిరాశ్రయ వసతి గృహం సిబ్బంది రక్షించి, మెంటల్ కేర్ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్స అందజేశారు. చదవండి: కన్నతల్లిని నమ్మించి.. 12 లక్షలు కాజేసి! చికిత్స పొందుతూ ఈ ఏడాది జనవరి 31న పూర్తి ఆరోగ్యవంతుడిగా డిశ్చార్జి అయ్యాడు. దీంతో ఆయనకు భీమ్నగర్ షెల్టర్లో ఆశ్రయం కల్పించారు. అతని వివరాలు తెలుసుకున్న శ్రద్ధ ఫౌండేషన్ సభ్యులు స్వగ్రామం తీసుకెళ్లి తండ్రి ప్రవీణ్కు అప్పగించారు. చనిపోయాడనుకున్న శ్యామ్రావ్ తిరిగి రావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. -
నాడు కలిచివేసిన ఫొటో.. నేడు ‘కన్నీటి’ సుఖాంతం
కాబూల్: అఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న సమయంలో.. పలు హృదయవిదారక దృశ్యాల్ని ప్రపంచం వీక్షించింది. అఫ్ఘన్ నుంచి పారిపోవడానికి విమానాల రెక్కలు, టైర్ల మధ్య కూర్చోవటం.. గగనతలం నుంచి కిందపడి పౌరులు ప్రాణాలు పోగొట్టుకోవడం, తాలిబన్ల నుంచి కనీసం తమ పిల్లలను, ఆడకూతుళ్లను రక్షించుకోవాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు పడ్డ కష్టాల వంటి ఘటనలు కలిచివేశాయి. ఈ పరిస్థితుల్లో కాబుల్లో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల్లో.. ఓ పసికందును ఫెన్సింగ్ దాటించిన ఫొటో గుర్తుండే ఉంటుంది. అయితే ఆ సైనికుడు బాబును తిరిగి తమవద్దకు చేరుస్తారని భావించిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. ఆ నెలల చిన్నారి కనిపించకుండా పోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల గుండెలు బద్ధలు అయ్యాయి. ఈ ఘటన గత ఏడాది ఆగస్టు నెలలో జరగగా.. నాలుగు నెలలపాటు నిద్రాహారాలు మానేసి బిడ్డ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ తరుణంలో ఆ కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. ఆ బాబు మళ్లీ తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. కానీ, పెంచిన తండ్రి కన్నీళ్ల నడుమ.. ఆ చేరిక భావోద్వేగానికి పంచుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. ఆ చిన్నారి పేరు సోహైల్ అహ్మదీ. అతని తండ్రి మీర్జా అలీ అహ్మదీ. అతను యూఎస్ ఎంబసీ సెక్యూరిటీ గార్డు(మాజీ). తన భార్య సురయా నలుగురు పిల్లలు వెంటబెట్టుకొని అమెరికా తరలిపోవాలనుకున్నాడు. ఆ క్రమంలోనే ముందుగా బిడ్డను ఎయిర్పోర్ట్లోకి చేరవేయాలని.. ఫెన్సింగ్ దాటించాడు. ఆపై ఆ తర్వాత బాబు కనిపించకుండా పోయాడు. అయితే ఎయిర్పోర్ట్లో ఏడుస్తూ కనిపించిన ఆ పసికందును.. ట్యాక్సీ డ్రైవర్ హమీద్ సఫీ గుర్తించాడు. గందరగోళ పరిస్థితుల్లో బాబును ఎవరికి ఇవ్వలో అతనికి అర్థం కాలేదు. పైగా పిల్లలు లేకపోవడంతో ఆ బిడ్డను అల్లా ఇచ్చిన బిడ్డగా భావించి పెంచుకోవాలని ఇంటికి తీసుకెళ్లాడు సఫీ. చిన్నారి సోహైల్ను తాతకు కన్నీళ్లతో అప్పగిస్తున్న సఫీ ఈ ఘటన తర్వాత మూడు నెలలపాటు మీర్జా అలీ అహ్మదీ.. కాబూల్లోనే ఉండిపోయి కొడుకు కోసం వెతుకుతూనే ఉంది. బిడ్డపై ఆశలు పోతున్న క్రమంలో చివరికి పునరావాసం కింద అమెరికాకు వెళ్లింది ఆ కుటుంబం. అయితే బిడ్డను వెతికే పని ఆ చిన్నారి తాత మొహమ్మద్ ఖాసేమ్ రజావి(మీర్జా అలీ మామ)కి అప్పగించాడు. చివరికి రెడ్క్రాస్ సాయంతో ఆ చిన్నారి టాక్సీ డ్రైవర్ సఫీ వద్ద బాబు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఖాసేమ్ రజావి.. సఫీ వద్దకు పంపి బాబును తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే సఫీ ముందు ససేమీరా అన్నాడు. పోలీసులు కిడ్నాప్ కేసు పెడతామని హెచ్చరించారు. అయినా సఫీ బెదరలేదు. చివరికి కన్నప్రేమకు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లకు కరిగిపోయాడు. కన్నీటి పర్యంతమవుతూనే.. బాబు సోహైల్ను తాత రజావి చేతికి అందించాడు. ‘సోహైల్ను తల్లిదండ్రుల చెంతకు చేర్చటం తన బాధ్యత’ అని తాత ఖాసేమ్ రజావి మీడియాకు తెలిపాడు. -
మంచి దొంగలు.. వీళ్లు చేసిన పనేంటో తెలుసా?
Hackers Returning Crypto: డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో అతి పెద్ద చోరీగా చెప్పుకుంటున్న పాలి నెట్వర్క్ హ్యాకింగ్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఛేదించి క్షణాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీని కొట్టేసిన హ్యాకర్లు. ఆ తర్వాత ఎందుకనో మెత్తపడ్డారు. అందులో దాదాపు సగం సొమ్మును తిరిగి ఇచ్చేశారు. హ్యాకింగ్లో కొత్త రికార్డు పటిష్టమైన భద్రతా వ్యవస్థగా పేర్కొంటున్న బ్లాక్చైయిన్ ఫ్లాట్ఫామ్పై నడిచే డీఫై యాప్ పాలినెట్వర్క్ను ఇటీవల హ్యాక్ అయ్యింది. సైబర్ నేరగాళ్లు ఈ యాప్ నుంచి ఏకంగా 611 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 12 వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీని కొట్టేశారు. పాలినెట్వర్క్ నుంచి తమకు అనుకూలమైన ఖాతాలకు క్రిప్టో కరెన్సీని తరలించుకుపోయారు. క్షణాల్లో జరిగిన ఈ మెరుపు హ్యాకింగ్తో బిత్తరపోయిన పాలి నెట్వర్క ఆ తర్వాత తేరుకుంది. కొన్ని వేల మందికి సంబంధించిన డిజిటల్ కరెన్సీని కొట్టేయడం సరికాదని... దయ ఉంచి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ హ్యాకర్లను సోషల్ మీడియా వేదికగా హ్యాకర్లను పాలిగాన్ నెట్వర్క్ కోరింది. $260 million (As of 11 Aug 04:18:39 PM +UTC) of assets had been returned: Ethereum: $3.3M BSC: $256M Polygon: $1M The remainings are $269M on Ethereum, $84M on Polygon — Poly Network (@PolyNetwork2) August 11, 2021 హ్యాకర్ల మంచి మనసు పాలిగాన్ నెట్వర్క్ చేసిన విజ్ఞప్తికి హ్యాకర్లు స్పందించారు. తాము దారి మళ్లించిన సొత్తులో కొంత భాగాన్ని పాలి నెట్వర్క్ సూచించిన ఖాతాలో జమ చేశారు. కొట్టేసిన సొత్తులో 260 మిలియన్ డాలర్లు జమ చేశారు. ఇందులో ఈథేరియమ్ 3.3 మిలియన్ డాలర్లు, బినాన్స్ స్మార్ట్ కాయిన్లు 256 మిలియన్లు, పాలిగాన్ 1 మిలియన్ డాలర్లు ఉన్నాయంటూ పాలినెట్ వర్క్ ప్రకటించింది. హ్యాకర్లు విడదల వారీగా సొమ్మును పాలిగాన్ నెట్వర్క్కి తిరిగి బదిలీ చేస్తున్నారు. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్కి గురైంది. -
ప్రసవం అయిన 14 రోజులకే విధుల్లోకి!
లక్నో : ‘సృష్టిలో దేవుడు స్త్రీకి అత్యంత శక్తిని ఇచ్చాడు. బిడ్డలను కనడమే కాదు వారి పాలనను కూడా అంతే సక్రమంగా చూస్తుంది’ అంటోంది ఐఎఎస్ అధికారి సౌమ్య పాండే. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా ఐఏఎస్ అధికారి సౌమ్య పాండే ప్రసవం అయిన 14 రోజులకే తిరిగి విధుల్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. కుమార్తెతో డ్యూటీ చేస్తున్న సౌమ్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చదవండి: ఆమ్రపాలి: ఒంగోలు టూ పీఎంవో బిజీగా మహమ్మారి పనులు.. ‘కోవిడ్–19 సమయంలో సక్రమంగా పనులు చేయడం మనందరి కర్తవ్యం’ అంటున్న సౌమ్య కరోనా సమయంలో ఎస్డీఎం అధికారిగా నియమించబడ్డారు. డెలివరీ అయిన 14 రోజుల తరువాత తన మూడు వారాల కుమార్తెతో కార్యాలయానికి వచ్చి, పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ– ‘గ్రామంలోని మహిళలు గర్భధారణ సమయంలో ఇంటి సంబంధిత పనులన్నీ చేస్తారు. ప్రసవించిన తరువాత ఆ పనులతో పాటు పిల్లల సంరక్షణ కూడా చేస్తారు. అదేవిధంగా, నా మూడు వారాల శిశువుతో పరిపాలనా పని చేయగలుగుతున్నాను. చదవండి: ఘజియాబాద్లో బీజేపీ బంధువు దారుణ హత్య ఈ పరిస్థితులలో నా కుటుంబం నాకు మద్దతు ఇచ్చింది. తహసీల్, ఘజియాబాద్ జిల్లా పరిపాలన నాకు ఒక కుటుంబం లాంటిది. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఘజియాబాద్లో ఎస్డిఎమ్ ఆఫీసర్గా ఉన్నాను. సెప్టెంబరులో నా ఆపరేషన్ సమయంలో 22 రోజుల సెలవు వచ్చింది. ప్రసవించిన రెండు వారాల తర్వాత నేను తహసీల్లో చేరాను. ఈ అంటువ్యాధి సమయంలో పనిచేసేటప్పుడు ప్రతి గర్భిణీ స్త్రీల అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల’ని సౌమ్య పాండే సూచనలు చేసింది. -
నిజాయతీ ఉందనడానికి ఇదే నిదర్శనం..!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి చిరుద్యోగులు, రోజు కూలీలు, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. లాక్డౌన్తో అసలు జనాలు భయటకు వెళ్లలేదు. ప్రస్తుతం సడలింపులు ఇచ్చినప్పటికి.. పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దాంతో రోజు గడవడం.. వాహనాల ఈఎమ్ఐలు, రోజు వారి అద్దెలు గడవడం గగనంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఓ ఆటోడ్రైవర్ తన నిజాయతీని కోల్పోలేదు. రోజుకు మూడు వందల రూపాయలు సంపాదించడమే కష్టంగా ఉన్న తరణంలో తన ఆటోలో అతడికి సుమారు లక్షన్నర రూపాయల సొమ్ము దొరికింది. కానీ అతడు దానిలో ఒక్క రూపాయి ముట్టుకోకుండా పోలీసులకు అప్పగించి నిజాయతీని చాటుకున్నాడు. (ఉపాధి ఊడుతోంది!) వివరాలు.. మహ్మద్ హబీబ్ నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కరోనా ముందు వరకు ఆటో మీద బాగానే సంపాదించేవాడు. కానీ లాక్డౌన్తో కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రోజుకు కేవలం మూడువందల రూపాయలు మాత్రమే సంపాదించగల్గుతున్నాడు. దానిలో 250 రూపాయలు ఆటో అద్దెకు పోతుంది. మిగిలిన 50 రూపాయలతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మహ్మద్ హబీబ్ ఆటోలో ఇద్దరు మహిళలు ఎక్కారు. సిద్దంబర్ బజారు ప్రాంతంలో దిగారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో మహ్మద్ తాడబన్ ప్రాంతానికి చేరుకున్నాడు. వాటర్ బాటిల్ కోసం ప్యాసింజర్ సీటులో వెతికాడు. అతడికి ఓ బ్యాగ్ కనిపించింది. అది చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఏ బాంబో ఉంటే ఎంటి పరిస్థితి అనుకున్నాడు. (నెల రోజుల తర్వాత కాస్త రిలీఫ్..) ఇంతలో మహ్మద్కి సిద్దంబర్ బజార్ ప్రాంతంలో దిగిన మహిళలు గుర్తుకు వచ్చారు. ఈ బ్యాగ్ వారిదే అయ్యుంటుందని భావించాడు. అక్కడి వెళ్లి వారి కోసం చూశాడు. కానీ కనిపించలేదు. దాంతో ధైర్యం చేసి బ్యాగ్ ఒపెన్ చేశాడు. దాన్నిండ డబ్బుల కట్టలు ఉన్నాయి. మొత్తం 1.40 లక్షల రూపాయలు ఉన్నాయి. వెంటనే దగ్గరిలోని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. విషయం వారికి చెప్పాడు. ఇంతలో బ్యాగ్ మర్చిపోయిన మహిళ పోలీస్ స్టేషన్కు వచ్చింది. మహ్మద్ ఆమెను గుర్తు పట్టాడు. అనంతరం బ్యాగ్ను ఆమెకు అందించాడు. పోయింది అనుకున్న డబ్బు దొరకడంతో సదరు మహిళ సంతోషించింది. మహ్మద్కు కృతజ్ఞతలు తెలపడమే కాక అతడికి ఐదు వేల రూపాయలు బహుమతిగా ఇచ్చింది. పోలీసులు మహ్మద్ నిజాయతీని ప్రశంసించడంతో పాటు అతడికి సన్మానం చేశారు. -
20 ఏళ్ల క్రితం తప్పిపోయి..
అరకులోయ : విశాఖ ఏజెన్సీలోని అరకులోయలో 2000 సంవత్సరంలో తప్పిపోయిన గంగాధర్ అనే గిరిజన యువకుడు 20 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. 9ఏళ్ల వయస్సులో గంగాధర్ విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంతంలో తప్పిపోయి చెన్నైకి చేరుకున్నాడు. అప్పట్లో గంగాధర్ ఫొటోతో తప్పిపోయిన బాలుడి పేరిట తమిళనాడు రాష్ట్రంలోని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే గంగాధర్కు చక్ర సెంట్రల్ ఆర్గనైజేషన్ అనాథాశ్రమం నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు. 2015 సంవత్సరం వరకు ఆశ్రమంలోనే వసతితో పాటు చదువు కొనసాగించిన గంగాధర్ 2015లో కొంతమంది స్నేహితులతో కలిసి ఆశ్రమం నుంచి బయటకు వచ్చాడు. ఐటీఐ, కంప్యూటర్ కోర్సులను పూర్తి చేసిన గంగాధర్ తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఎల్ఐసీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో గంగాధర్ 15 రోజుల కిందట అరకులోయకు చేరుకుని తన తల్లిదండ్రులు, గ్రామం కోసం వెతుకుతున్నాడు. చిన్న వయస్సులో వెళ్లిపోవడంతో తనకు గిరిజన మ్యూజియం, సినిమాహాలు, గార్డెన్ ప్రాంతాలు మాత్రమే గుర్తున్నాయని గంగాధర్ తమిళ భాషలో వాపోతున్నాడు. గంగాధర్ తల్లిదండ్రులు, గ్రామం ఆచూకీని తెలుసుకునేందుకు స్థానిక పోలీసు అధికారులు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం గంగాధర్ పోలీసుల ఆదీనంలో ఉన్నాడు. -
రేషన్కార్డు నా కొద్దు..!
మిర్యాలగూడ టౌన్ : బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తీసుకువచ్చిన తెల్ల రేషన్కార్డు (బీపీఎల్) నేడు బియ్యానికి తప్ప దేనికీ పనికి రాకుండా పోయిందని పట్టణానికి చెందిన వీవీఎస్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ శనివారం ఆర్డీఓ కార్యాలయం వద్ద డీఏఓ రఘునాథ్, నాయబ్ తహసీల్దార్ జి. రామకృష్ణారెడ్డికి కార్డును అందజేశాడు. రేషన్ కార్డు ద్వారా గతంలో బియ్యం, చింతపండు, పప్పు, కారం, పామాయిల్లతో పాటు పలు రకాల నిత్యావసర సరుకులు ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం లబ్ధిదారులకు అందించేది.. ఇటీవల బియ్యంతో పాటు పంచదార అడపదడప వస్తుంది. కాని మిగిలిన ఏ నిత్యవసర వస్తువులు కూడా రాకుండా ప్రభుత్వం కోత విధించింది. దీంతో నిరుపేదల లబ్ధిదారుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఈ కార్డు బియ్యానికి తప్ప.. మరేదానికి ఎలాంటి ఉపయోగం లేదని, తన రేషన్ కార్డును పట్టణంలోని మెయిన్ బజారుకు చెందిన వీవీఎస్ కుమార్ డీఏఓ, నాయబ్ తహసీల్దార్లకు అందించాడు. దీంతో అధికారులు ఒక్కసారిగా పరేషాన్ అయ్యారు. -
కొన్ని గంటల ముందు
ఒకరోజు, జ్వరం వచ్చిన తోటమాలిని పరామర్శించి తిరిగి వస్తూ, ‘మృత్యువంటే అతడు భయపడుతున్నాడు’ అని తన కార్యదర్శి రత్తూతో అన్నారు అంబేడ్కర్. కానీ మృత్యువు ఆయన చెంతే ఉన్నది. 1956 డిసెంబర్ 4న కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సమావేశానికి హాజరయ్యారు. సాయంత్రం మహారాష్ట్ర నాయకులు ఆచార్య ఆత్రే, ఎస్.ఎం.జోషీలను రిపబ్లికన్ పార్టీలో చేరవలసిందిగా ఉత్తరాలు డిక్టేట్ చేశారు. ఆ తెల్లారి జైన నాయకులు వస్తే వారితో మాట్లాడారు. అనంతరం, అలసటగా ఉండటంతో తలకు రత్తూ నూనెతో మాలిష్ చేస్తుండగా ఆ హాయిలో సోఫా మీద తాళం వేస్తూ మంద్ర స్వరంలో ‘బుద్ధం శరణం గచ్ఛామి’ పాడుకున్నారు. భోజనానికి పిలుపు రావడంతో లేచి, కొద్దిగా అన్నం తిని వస్తూ తన పర్సనల్ లైబ్రరీలోని కొన్ని పుస్తకాలను పడకగదిలో పెట్టించుకున్నారు. అలాగే, బుద్ధా అండ్ దమ్మ పీఠిక, బర్మా ప్రభుత్వానికి రాసిన ఉత్తరం కూడా తెమ్మన్నారు. కబీరు గీతం పాడుతూ పడకగదికి చేరుకున్నారు. డిసెంబర్ 6వ తేదీ ఉదయం 6:30కు చూసినప్పుడు అంబేడ్కర్ నిద్రిస్తున్నారనే అనుకున్నారు భార్య సవితాదేవి. కానీ ఆయన దేహం అప్పటికే భవసాగరాన్ని దాటేసింది. దళితులపై హిందూమతం చూపుతున్న వివక్షను ఏళ్లతరబడి సహిస్తూ వచ్చిన అంబేడ్కర్ అప్పటికి ఇరవై ఏళ్ల క్రితమే బౌద్ధం వైపు మళ్లారు. 1935లో యవ్లాలో జరిగిన ఒక సమావేశంలో ఆయన ఆవేశపూరితంగా మాట్లాడారు. ‘దురదృష్టవశాత్తు నేను హిందూ సమాజంలో అంటరానివాడిగా పుట్టాను. పుట్టుక నా చేతిలో లేదు కాబట్టి దానికి ఇప్పుడు నేనేమీ చేయలేను. అయితే హిందువుగా మాత్రం మరణించను’ అని అన్నారు. ఆయన నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా చాలామంది దళితులు సమర్థించారు. బాంబేలోని నయీగాంలో దళితులు సమావేశమై అంబేడ్కర్తో పాటు మతం మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. యవ్లా సమావేశం తర్వాత ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు అంబేడ్కర్కు ఆహ్వానాలు పంపారు. అయితే సిక్కు, బౌద్ధ మతాలే అంబేడ్కర్ను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఇటాలియన్ బౌద్ధ సన్యాసి రెవరెండ్ లోక్సుదా 1936 జూన్లో అంబేడ్కర్ను కలుసుకుని, బౌద్ధమత ప్రాశస్త్యాన్ని వివరించారు. తర్వాత కొద్ది కాలానికే అంబేడ్కర్ బౌద్ధం స్వీకరించారు. (రేపు అంబేడ్కర్ వర్ధంతి) -
ఇంటికి చేరిన బాలికలు
తిరుపతి క్రైం: తిరుపతిలోని ఓ హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థినులు ఇద్దరూ సోమవారం తమ గ్రామం చేరుకున్నారు. ఒకరిని విజయవాడ నుంచి పోలీసులు తీసుకురాగా, మరో బాలిక తానే ఒంటరిగా స్వగ్రామం చేరుకుంది. చదువుపై ఇష్టం లేకే.. ఏర్పేడు మండలం కోబాకకు చెందిన విద్యార్థినులు తిరుపతిలోని ఓ హాస్టల్లో ఉంటూ పదోతరగతి చదువుతున్నారు. వారిద్దరూ ఈనెల 24న స్కూల్కు వెళ్తున్నామని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వచ్చారు. తర్వాత అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో వీరు వరంగల్లో కీచకుల బారినపడినట్టు ప్రచారం జరిగింది. బాలికల అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న తిరుపతి అలిపిరి ఎస్ఐ మల్లికార్జునరెడ్డి ఓ బాలిక విజయవాడలో ఉన్న సమాచారం తెలుసుకుని సోమవారం ఆమెను తీసుకువచ్చారు. అలాగే వరంగల్లో అదృశ్యమైన బాలిక కూడా ఒంటరిగా సోమవారం స్వగ్రామం చేరుకుంది. వీరిద్దరినీ పోలీసులు విచారించగా.. బాలికలకు చదువుపై ఆసక్తి లేదని, దీంతో కరీంనగర్లో ఉన్న స్నేహితురాలి వద్దకు వెళ్లాలనే ఉద్దేశంతో రైలులో వరంగల్ వెళ్లినట్లు తెలిసింది. రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియక ప్లాట్ఫాంపై ఉండగా అక్కడ దుకాణంలో పనిచేసే ఒక వ్యక్తి బాలికలకు భోజనం పెడతానని చెప్పి తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదిలోకి మరో ఇద్దరు యువకులు వచ్చి అనుమానాస్పదంగా మాట్లాడుకోవడంతో అప్రమత్తమైన ఒక బాలిక పరారై విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకుంది. అక్కడ చైల్డ్లైన్ సంస్థ సభ్యులు బాలికను గుర్తించి విషయం తెలుసుకున్నారు. అనంతరం ఆ సంస్థ వారు వరంగల్కు వెళ్లి బాలికలు తలదాచుకున్న గదికి వెళ్లి చూడగా మరో విద్యార్థిని కనిపించకపోవడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఓ బాలికను విజయవాడ నుంచి పోలీసులు తీసుకురాగా, మరో బాలిక ఒంటరిగా స్వగ్రామం చేరుకుంది.