-
రిపబ్లిక్ డే 2024: ఈసారి థీమ్ ఏంటంటే..
భారతదేశం జనవరి 26న (శుక్రవారం) 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో గణతంత్ర దినోత్సవ చరిత్ర, పరేడ్, థీమ్ తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు ‘రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదు. ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనం. దీని స్ఫూర్తి ఎల్లప్పటికీ నిలచి ఉంటుంది’ అని అన్నారు. 1950లో భారత రాజ్యాంగానికి ఆమోదం లభించింది. నేడు మనం భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని చేసుకునేందుకు సిద్ధమవుతున్నాం. గణతంత్ర దినోత్సవాలలో భారతదేశ గొప్పదనాన్ని, సాంస్కృతిక వారసత్వం, దేశ పురోగతి, విజయాలను గుర్తుచేసుకోనున్నాం. ఢిల్లీలో జరిగే పరేడ్లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే ప్రదర్శనలను మనం చూడబోతున్నాం. రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్, బీటింగ్ ది రిట్రీట్ వేడుకలు ఇప్పటికే అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో జరిగాయి. భారతదేశ రాజ్యాంగానికి 1950, జనవరి 26న ఆమోదం లభించింది. దీనికి గుర్తుగా ప్రతియేటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారతదేశానికి 1947లో బ్రిటిష్వారి నుండి స్వాతంత్ర్యం లభించినప్పటికీ, 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో భారత్ ఒక సార్వభౌమ అధికారం కలిగిన గణతంత్ర దేశంగా గుర్తింపు పొందింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించారు. ప్రతీయేటా జరిగే గణతంత్ర దినోత్సవం.. ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే భారతీయ పౌరుల శక్తిని గుర్తుచేస్తుంది. ప్రతీ సంవత్సరం దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుగుతుంటాయి. ఆ రోజు రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం సైనిక, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. గణతంత్ర దినోత్సవం నాడు భారత రాష్ట్రపతి దేశంలోని అర్హులైన పౌరులకు పద్మ అవార్డులను అందిస్తారు. వీర సైనికులకు పరమవీర చక్ర, అశోక్ చక్ర ప్రదానం చేస్తారు. రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యక్ష ప్రసారాలు దేశ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ - లోక్తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది. జనవరి 26.. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఇవి 90 నిమిషాల పాటు జరుగుతాయి. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరుకానున్నారు. -
విద్యా సంస్కరణలకు అద్దంపట్టేలా రాష్ట్ర శకటం
సాక్షి, న్యూఢిల్లీ : 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో భాగంగా జనవరి 26న న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని ప్రదర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దంపట్టేలా ‘‘ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను మార్చడం – విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం’’ అనే ఇతివృత్తంతో శకటాన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలను తీసుకురావడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తోందని, తద్వారా విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. ఇప్పటికే 62 వేల డిజిటల్ క్లాస్రూమ్ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించింది. ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ఇంగ్లిష్ ల్యాబ్, ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, స్మార్ట్ టీవీ, డిజిటల్ క్లాస్ రూమ్లు, ప్లే గ్రౌండ్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఈ అంశాన్ని అందరినీ ఆకట్టుకునేలా శకటంలో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించి 55 సెకెన్ల నిడివిగల థీమ్ సాంగ్ రూపొందించామని, శకటం పరేడ్లో ప్రదర్శనకు సిద్ధమైందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
Republic Day: జెండాల గౌరవం కాపాడండి : కేంద్రం
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సమీపిస్తుండటంతో మువ్వన్నెల జెండాల వాడకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. జెండా వందన కార్యక్రమాలు పూర్తయ్యాక కాగితపు జెండాలను ఇష్టం వచ్చినట్లుగా నేలపై పారేయకూడదని కోరింది. జెండా గౌరవానికి భంగం కలగకుండా వాటిని గౌరవ ప్రదంగా, రహస్యంగా డిస్పోజ్ చేయాలని సూచించింది. ఈ విషయంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అన్ని ఇతర ఈవెంట్లలో వాడే జెండాలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. జనవరి 26న దేశం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదీచదవండి.. సభలో మోదీ నినాదాలు.. అసౌకర్యానికి గురైన సిద్ధరామయ్య -
ఢిల్లీ పరేడ్కు అసామాన్యులు
ఈసారి గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు తెలంగాణ నుంచి ‘అసామాన్యులు’ హాజరై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒకరు హైదరాబాద్ స్వీపర్ నారాయణమ్మ. మరొకరు కోదాడ మొబైల్ షీ టాయిలెట్ నిర్వహిస్తున్న నాగలక్ష్మి. ప్రజల కోసం భిన్నమైన ఉపాధుల్లో అంకితభావంతో పని చేస్తున్న వీరిద్దరూ ‘శ్రమయేవ జయతే’కు నిజమైన ప్రతీకలు. నారాయణమ్మ, నాగలక్ష్మిల పరిచయం. నారాయణమ్మ దినచర్యను చూస్తే కర్మయోగుల దినచర్యలా అనిపిస్తుంది. తెల్లవారుజాము నాలుగ్గంటలకు నిద్ర లేస్తుందామె. స్నానపానాదులు ముగించుకుని గంటసేపు గురుధ్యానం చేసి కొద్దిగా టీ తాగి ఆరు గంటలకంతా బంజారాహిల్స్లోని కాలనీలో రోడ్లు ఊడ్చే పనిలోకి వస్తుంది. పెదాల మీద ఏదో ఒక జానపదగీతమో, గురు తత్వమో, స్మరణో లేకుండా నారాయణమ్మ కనిపించదు. అందుకే ఆమెను అందరూ ‘సింగింగ్ స్వీపర్’ అంటారు. 22 సంవత్సరాలుగా నగరాన్ని తన చేతులతో శుభ్రం చేస్తూ స్వస్థతనిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా భజనలకు, భక్తి కార్యక్రమాలకు హాజరయ్యి ముక్తిమార్గాన్ని చూపుతూ నారాయణమ్మ చేస్తున్న సేవ సామాన్యం కాదు. అందుకే ఆమెను రిపబ్లిక్ డేకి ఢిల్లీ పంపాలని జి.హెచ్.ఎం.సి. అధికారులు నిశ్చయించారు. ‘ఇది విని మావాళ్లంతా చాలా సంతోషించారు. మంచి కర్మల ఫలితం ఇది’ అంటుంది నారాయణమ్మ. బావులు తవ్వుతూ రంగారెడ్డి జిల్లా యాచారంకు చెందిన నారాయణమ్మ భర్తతో కలిసి బావులు తవ్వే పనికి వెళ్లేది. అది చాలా శ్రమతో కూడిన పని. అయినా పదిహేను ఇరవై రోజుల్లో బావిని తవ్వి జలను బయటకు తేవడంలో ఆమెకు తృప్తి కలిగేది. తర్వాత జెసీబీలు వచ్చాయి. బావుల స్థానంలో బోర్లు వచ్చాయి. దాంతో పొట్ట చేత్తో పట్టుకుని హైదరాబాద్ చేరుకుంది నారాయణమ్మ. అప్పటికే తల్లి స్వీపర్గా చేస్తుండంతో తన పని కూతురికి అప్పజెప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే పనిలో కొనసాగుతూ ఉంది నారాయణమ్మ. నెలకు 14 వేలు వస్తాయి. కొడుకు లారీ డ్రైవర్గా చేస్తున్నాడు. కూతురిని స్వీపర్ ఉద్యోగంలోనే పెట్టించింది. జీవుడే దేవుడు నారాయణమ్మకు భక్తి ఎక్కువ. పెళ్లయినప్పటి నుంచి భర్తతో కలిసి దేశంలోని గుళ్లన్నీ తిరిగేది. సంపాదించినది అంతా తీర్థయాత్రలకే ఖర్చు పెట్టింది. ‘కాని గుళ్లన్నీ తిరిగాక జీవుడిలోనే దేవుడు ఉన్నాడని గ్రహించాను. కరీంనగర్ జిల్లాకు చెందిన నిత్యానంద రాజేశ్వరాచార్యుల దగ్గర గురుబోధ తీసుకున్నా. నన్ను నేను ఆత్మజ్ఞానిగా మార్చుకున్నా. మనిషి చిత్తం విచిత్రం. అతను లోకాన్ని తరచి చూసి ముక్తిపొందాలంటే గురువును తెలుసుకుని గురుబోధతో నడుచుకోవాలి. అజ్ఞానాన్ని తవ్వి బయట పారేయాలి’ అంటుంది నారాయణమ్మ. ఆమెకు రోకటి పాటల దగ్గరి నుంచి మంగళహారతి పాటల వరకూ కరతామలకం. రామయణ, భారతాలను కూడా పాటలుగా పాడుతుంది. వేమన పద్యాల నుంచి సంస్కృత పద్యాల వరకూ అన్నీ చెబుతుంది. ఆమె ధారణకు, ఆధ్యాత్మిక అవగాహనకు ఎవరైనా నమస్కరించాల్సిందే. కోదాడలో అమూల్యసేవ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాగలక్ష్మి నిర్వహించే మొబైల్ షీ టాయిలెట్ కనిపిస్తుంది. 30 ఏళ్ల ఈ డబుల్ డిగ్రీ హోల్డర్ కోదాడ మునిసిపల్ ఉద్యోగిగా మొబైల్ టాయిలెట్ను నిర్వహించడానికి, తిప్పడానికి ఏ మాత్రం సిగ్గుపడదు. ‘ఐదేళ్లుగా ఈ టాయిలెట్ను నిర్వహిస్తున్నాను. ఆటోకు బిగించిన టాయిలెట్ను రోజూ నేను ఉదయం ఎనిమిదన్నర నుంచి పట్టణంలో తిప్పుతాను. గుళ్ల దగ్గర, బస్టాండ్ దగ్గర, మార్కెట్ దగ్గర అవసరాన్ని బట్టి ఉంచుతాను. పనుల కోసం పల్లెల నుంచి వచ్చిన స్త్రీలు తగిన టాయిలెట్లు లేక ఇబ్బంది పడతారు. వారు నా మొబైల్ టాయిలెట్ను చూడగానే ఎంతో రిలీఫ్ ఫీలవుతూ ఉపయోగిస్తారు. నేను గమనించేదేమిటంటే ఆ ఒత్తిడి తీరాక వారు చల్లగా బతకమ్మా ఆని ఆశీర్వదించడం. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు ఎంతో సంతోషపడతారు’ అంటుంది నాగలక్ష్మి. ఈ మొబైల్ టాయిలెట్ ఉపయోగించుకోవడానికి ఏమీ రుసుము చెల్లించనక్కర లేదు. మధ్యాహ్నం వరకూ ఈ వాహనాన్ని నడిపే నాగలక్ష్మి మధ్యాహ్నం భోజన విరామం తీసుకుని మళ్లీ సాయంత్రం వరకూ తిప్పుతుంది. ‘మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది’ అంటుందామె. ఆమె అంకితభావాన్ని గమనించిన జి.హెచ్.ఎం.సి. అధికారులు ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రతినిధిగా ఢిల్లీకి పంపుతున్నారు. -
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ మరోసారి బెదిరింపులు
ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను ఈ రిపబ్లిక్ డే రోజు హత్య చేస్తానని బెదిరింపులు చేశాడు. జనవరి 26న భగవంత్ మాన్పై గ్యాంగ్స్టర్లు ఏకమై దాడికి దిగాలని పన్నూ కోరారు. గ్యాంగ్స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నదని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. పన్నూ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు పన్నూ గతంలో భారతీయ సంస్థలు, అధికారులపై అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. గత నెల, డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి చేస్తానని వీడియోను విడుదల చేశాడు. అదే క్రమంలో పార్లమెంట్పై డిసెంబర్ 13న ఆగంతకులు కలర్ బాంబు షెల్స్తో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ మరొక బెదిరింపు వీడియో ఇటీవల బయటపడింది. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో వెళ్లాలనుకుంటున్న ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బెదిరింపులు చేశాడు. ఎయిరిండియా బెదిరింపు వీడియోపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పన్నూపై కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే -
ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు బంపరాఫర్!
వినియోగదారులకు ఫ్లిప్కార్ట్ శుభవార్త చెప్పింది. ఫ్లిప్కార్ట్ తర్వలో ఈ ఏడాది తన తొలి ప్రత్యేక సేల్ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14 నుంచి జనవరి 19 వరకు కొనసాగనుంది. ఇక ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ ఐఫోన్15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12, పిక్సెల్ 7ఏ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, మోటరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 5జీ, పిక్సెల్ 8, వివో టీ2 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో, వివో టీ2ఎక్స్, పోకో ఎక్స్ 5, రియల్ మీ 11, రెడ్మీ 12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐఫోన్ 15పై డిస్కౌంట్ ఇస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.79,900 నుండి ఉండగా ఫ్లిప్కార్ట్ రూ.72,999కే అమ్ముతుంది. విజయ్ సేల్స్ ఐఫోన్ 15 సిరీస్ 128జీబీ ఇంట్రర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 70,900కి అమ్ముతుంది. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు పొందవచ్చు. తద్వారా దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఫోన్లతో పాటు ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లపై కూడా వరుసగా 75 శాతం, 65 శాతం తగ్గింపు ఉండనుంది. ఈ డిస్కౌంట్లపై ఫ్లిప్కార్ట్ మరిన్ని వివరాల్ని వెల్లడించాల్సి ఉంది. -
గణతంత్ర వేడుకల్లో ఈశాన్య విద్యార్థినుల బ్యాండ్!
ఈ ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) క్యాంప్లో మొత్తం 2,274 మంది క్యాడెట్లు పాల్గొననున్నారు. వీరిలో యువతుల భాగస్వామ్యం అధికంగా ఉండనుంది. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ ఈ వివరాలను తెలియజేశారు. ఎన్సీసీలో యువతుల భాగస్వామ్యం ప్రతి సంవత్సరం పెరుగుతోందని అన్నారు. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శిబిరానికి హాజరవుతున్న క్యాడెట్లలో జమ్మూ కాశ్మీర్, లడఖ్కు చెందిన 122 మంది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 177 మంది ఉన్నారని సింగ్ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 45 మంది యువతుల బృందం తొలిసారిగా ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్లో పాల్గొంటున్నదన్నారు. వీరి బ్యాండ్ తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో అలరించనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా బెస్ట్ టీమ్, బెస్ట్ క్యాడెట్, హార్స్ రైడింగ్ మొదలైన పోటీలు నిర్వహించనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ సింగ్ తెలిపారు. కాగా 2023లో దాదాపు నెల రోజులపాటు జరిగిన ఎన్సీసీ శిబిరంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 710 మంది యువతులతో సహా మొత్తం 2,155 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేయబోతున్నాయి. ఒక్కో బృందంలో 144 మంది మహిళా సైనికులు ఉండనున్నారు. వీరిలో 60 మంది ఆర్మీకి చెందిన వారు కాగా, మిగిలిన వారు భారత వైమానిక దళం, భారత నౌకాదళానికి చెందిన వారు ఉంటారని రక్షణ అధికారులు తెలిపారు. ఈ బృందంలో నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన మహిళా అగ్నివీర్ సైనికులు కూడా ఉండనున్నారు. -
రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ నుంచి హాజరవుతున్న ఆరవ అధ్యక్షునిగా మాక్రాన్ నిలవనున్నారు. ఈ ఏడాది ఫ్రాన్స్లో జరిగిన బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన విషయం తెలిసిందే. గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను భారత ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ ఆయన హాజరుకాలేనని వెల్లడించారు. ఆ తర్వాత రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ను ఆహ్వానించినట్లు సమాచారం. ఫ్రెంచ్ మాజీ ప్రధాన మంత్రి జాక్వెస్ చిరాక్ 1976, 1998లో రెండుసార్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, నికోలస్ సర్కోజీ, ఫ్రాంకోయిస్ హోలాండ్ వరుసగా 1980, 2008, 2016లో ఈ వేడుకలకు హాజరయ్యారు. STORY | French President Macron set to be Republic Day chief guest READ: https://t.co/P8euyRpHkB pic.twitter.com/cMuCijvqcl — Press Trust of India (@PTI_News) December 22, 2023 భారత్లో జరిగిన జీ-20 మీటింగ్కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరయ్యారు. ప్రధాని మోదీతో ప్రత్యేక చర్చలు జరిపారు. మధ్యాహ్న భోజన సమావేశంలోనూ పాల్గొన్నారు. భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై పురోగతి దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. గతేడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాలకు విదేశీ నేతలను ఆహ్వానిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021, 2022లో విదేశీ నేతలను ఆహ్వానించలేదు. ఇదీ చదవండి: ఎంపీల సస్పెన్షన్పై నేడు దేశవ్యాప్త నిరసనకు విపక్ష నేతల పిలుపు -
నేడు జెండా ఎగరేస్తాం! జనవరి 26న ఆవిష్కరిస్తాం! ఏంటీ తేడా అంటే..
నేడు జెండా ఎగరేయడానికి జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకిలా? ఈ రోజు ప్రధాని న్యూఢిల్లీలో ఎర్రకోట వద్ద జెండా ఎగరేస్తే..జనవరి 26న మాత్రం రాష్ట్రపతి జెండా ఆవిష్కరిస్తారు. నేడు జెండా ఎగరేసాం అంటాం. మరీ గణతంత్ర దినోత్సవం రోజున మాత్రం జెండా ఆవిష్కరిస్తున్నాం అని అంటాం ఎందుకని? వాటి మధ్య ఉన్న తేడా ఏంటంటే.. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు... అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రావడంతో.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే.. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు మాత్రం రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు... కాబట్టి దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. ( గమనిక: ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ). నేడు ప్రధాని.. ఆ రోజు రాష్ట్రపతి చేయడానికి ప్రధాన కారణం దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling). (చదవండి: అక్కడ మాత్రం అర్థరాత్రే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు) -
లయ తప్పిన రిట్రీట్ ధ్వని
గణతంత్ర దినోత్సవ ముగింపులో చేసే ‘బీటింగ్ రిట్రీట్ మార్చ్’లో సంగీతం మారి ఉండవచ్చు, కానీ బీటింగ్ రిట్రీట్ భావనను మనం పరిరక్షించుకుంటూ వచ్చాము. దాన్ని ఎన్నడూ విదేశీయమైనదిగా మనం భావించలేదు. అది భారతీయ సైన్యంలాగే భారతీయతతో కూడి ఉండేది. మనకు ఈరోజు ఉన్న సైన్యం కూడా బ్రిటిష్ వారు రూపొందించిందే. బీటింగ్ రిట్రీట్కి ఉన్న బ్రిటిష్ మూలం కారణంగా అది మనకు చీకాకు కలిగించలేదు. నిజానికది వారసత్వంగా వచ్చిన విలువలకు, సంప్రదాయాలకు ప్రతీకగా గౌరవం పొందుతోంది కూడా. అయితే ఎప్పటికీ ఈ ప్రాధాన్యం ఉంటుందా? మీరు ఎంత ముసలివాళ్లయితే, అంత ఎక్కు వగా గతాన్ని పట్టుకుని వేళ్లాడతారని చెబు తుంటారు. అది తప్పకుండా నిజమేనని నేను తలుస్తున్నాను. గత వారం గణతంత్ర దినోత్సవ ముగింపు వేళ జరిపే ‘బీటింగ్ రిట్రీట్’పై నా చికాకుతో కూడిన స్పందనకు ఇది ఒక విశ్వస నీయ వివరణలా కనిపిస్తుంది. నేను దాన్ని ఇష్టపడలేదు. కానీ నేను ఈ విషయాన్ని తర్వాత పేర్కొంటాను. ఓ వారం క్రితం నేను చూసిన ఆ కార్యక్రమం నేపథ్యం గురించి మొదట నన్ను వివరించనీయండి. నేను దానిపై ఇలా అనుభూతి చెందుతున్నాను. బీటింగ్ రిట్రీట్ ఒక మిలిటరీ వేడుక. బహుశా రెండవ జేమ్స్ ఇంగ్లండ్ రాజుగా ఉన్నప్పుడు 17వ శతాబ్దంలో ఇది ప్రారంభమైంది. ఒక రాత్రిపూట సైనిక దళాలు తిరోగమిస్తున్నప్పుడు యుద్ధ ముగింపు నకు సంకేతంగా బీటింగ్ రిట్రీట్ని మొదలెట్టారు. 1950లలో భారత దేశం కూడా రిపబ్లిక్ డే ఉత్సవాలకు సంబంధించి మూడురోజుల ముగింపు సందర్భంగా ఈ భావనను బ్రిటిష్ సంప్రదాయం నుంచి అరువు తెచ్చుకుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంగ్లిష్ కవాతుల నుంచి భారతీయులే స్వయంగా స్వరపర్చడం వరకు ‘బీటింగ్ రిట్రీట్ మార్చ్’లో సంగీతం మారి ఉండవచ్చు, కానీ బీటింగ్ రిట్రీట్ భావ నను మాత్రం మనం పరిరక్షించుకుంటూ వచ్చాము. నిజానికి దాన్ని మనం ఆదరిస్తూ వచ్చాము. దాన్ని ఎన్నడూ విదేశీయమైనదిగా మనం భావించలేదు. అది భారతీయ సైన్యంలాగే భారతీయతతో కూడి ఉండేది. పైగా గుర్తుంచుకోండి. మనకు ఈరోజు ఉన్న సైన్యం కూడా బ్రిటిష్ వారు రూపొందించిందే. బీటింగ్ రిట్రీట్కి ఉన్న బ్రిటిష్ మూలం కారణంగా అది మనకు చికాకు కలిగించలేదు. నిజానికది వారసత్వంగా వచ్చిన విలువలకు, సంప్రదాయాలకు ప్రతీకగా గౌరవం పొందుతోంది కూడా. గణతంత్ర దినోత్సవ సందర్భంగా బీటింగ్ రిట్రీట్కే నేను ఎల్ల ప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంటాను. నిస్సందేహంగా, సైనికుల కవాతు కచ్చితత్వం చూసి ఆశ్చర్యపడుతుంటాను. భూమ్యాకర్షణ శక్తిని సైతం డేర్ డెవిల్స్ ధిక్కరించడాన్ని చూస్తూ ఆశ్చర్య చకితుడినవుతుంటాను. నేను దాన్ని తోసిపుచ్చలేను. కానీ రిట్రీట్ సంగీతం; నార్త్, సౌత్ బ్లాక్ వెనుక నిలిపి ఉంచిన బ్యాండ్ల వర్ణరంజితమైన యూనిఫాంలు, రక్షణ గోడ వద్ద ఉన్న ఒంటెలు, చివరగా దిగంతాల వద్ద సూర్యుడు అస్తమించే సమయం ఎల్లప్పుడూ నన్ను వెంటాడుతుంటుంది. నా జ్ఞాపకాల్లో ఎన్నటికీ నిలిచి ఉండిపోయింది ఏమిటంటే రైసినా హిల్స్ని అధిరోహిస్తూ, ‘సారే జహాసే అచ్ఛా... హిందూ సితా హమార హమారా’ అని ఆలపిస్తూ ఉండే రిట్రీటింగ్ బ్యాండ్లు. వారు శిఖరాన్ని సమీపిస్తున్నప్పుడు సూర్యుడు అస్తమించడం ప్రారంభమవుతుంది. వెంటనే లెక్కలేనన్ని పసుపు పచ్చ దీపాలు మొత్తం విస్టాను ప్రకాశవంతం చేసేవి. ఇది ప్రతి ఒక్కరినీ ఆనందంలో ముంచెత్తేది. నేటి పద జాలాన్ని ఉపయోగించి చెప్పాలంటే... అదొక విస్మయం కలిగించే క్షణం. అయ్యో... అది చాలావరకు ఇప్పుడు ఒక చరిత్రగా మిగిలిపోయింది. ఇక అది జరగని పని. ప్రారంభ ప్రయత్నంగా మార్పు చేసిన సంగీతం భయానకమైనది కాకున్నా, కఠోరంగా ఉంటోంది. భార తీయ లేదా బ్రిటిష్ మూలానికి చెందినవైనా సరే పాదతాడనంతో చేసే సైనిక కవాతుల సంగీతం ఇకపై వినిపించదు. దీని స్థానంలో రాగాలు వచ్చి చేరాయి. సైనిక వేడుకల్లో వాటికి తావులేదు. వీటిని ఇంట్లో లేదా కాన్సర్ట్ హాల్లో అయితే బాగా ఆస్వాదించవచ్చు. విజయ్ చౌక్లో సైనిక బ్యాండ్లు ఆలపించేవి కాదు. మరీ ఘోరమైన విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం ఆలపించిన బీటింగ్ రిట్రీట్ రాగం (ఇది సరైన పదమే అయితే) ఏమాత్రం లయబద్ధంగా లేదు. మాధుర్యంతోనూ లేదు. దీంట్లో సంగీతం కంటే రొద మాత్రమే ఎక్కువగా ఉండింది. అది నరకద్వారంలో ఎవరైనా ఊహించే రొదలా ఉండింది కానీ స్వర్గ లోకపు ద్వారాల వద్ద వినిపించే సంగీతంలా లేదు. ఈ ఒక్క మార్పు దాని అర్థాన్ని మాత్రమే కాదు, బీటింగ్ రిట్రీట్ తక్షణ సారాన్నే ధ్వంసం చేసిపడేసింది. అయినా సరే ఎవరైనా దీన్ని పరిగణిస్తారా? దీనిలోని ఇతర అంశాలు కూడా అదృశ్యమైపోయాయి. ఎత్తయిన ప్రాంతంలో ఉన్న గంటల నుంచి వినిపించే దాని శ్రావ్యమైన మాధుర్యం కూడా పరిత్యజించబడింది. భవనాలను వెలిగించే లక్ష లాది పసుపుపచ్చ బల్బుల స్థానంలో బహుళరంగులు గోడలపై ప్రదర్శితమవుతున్నాయి. అంతకు ముందున్నవి ధ్వనింపజేసే ఆశ్చర్యం, ఆనందం స్థానంలో ఇప్పుడు ఒక యాంటీ క్లైమేట్ని తలపించే నీరస మైన అసంతృప్తి చోటు చేసుకుంది. బీటింగ్ రిట్రీట్లోని ఆనాటి మ్యాజిక్ కనుమరుగైనట్లు కనిపిస్తోంది. ఒక సాధారణమైన, ఉత్తేజపూరితం కానిది మాత్రమే మనకు ఇప్పుడు మిగిలింది. ఒకప్పుడు బీటింగ్ రిట్రీట్కి చెందిన అద్భుతం కానీ, మనోహర దృశ్యం కానీ ఇప్పుడు లేవు. మనకు జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. కాలంతోపాటు అవి కనుమరుగైపోతాయి. గత వారం రిట్రీట్ సందర్భంగా వర్షం కురిసినప్పుడు, దేవుళ్లు సైతం విలపిస్తున్నట్లుగా నేను అనుభూతి చెందాను. అది తగిన స్పందనలాగే కనిపించింది. ప్రపంచం మారుతోందనీ, ఆ మార్పు వెనకాలే నేను మిగిలిపోయాననీ గుర్తించాను. అందుకే నేను విషాదంతో ఉన్నాను. అందుకే నేను ఇంత ప్రతికూల దృక్పథంతో ఉంటుండవచ్చు. చివ రగా, నేను ముందుకేసి చూస్తున్నప్పుడు, నా మనస్సును రెండు ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఇక్కడ చుట్టుముట్టడం అనేది సరైన పదం. ఎందుకంటే వాటికి నేను సమాధానం చెప్పలేను మరి. సారే జహా సే అచ్ఛా పాట పాడి ఎంతకాలమైంది! కచ్చితంగా దాని మూలాలే ఆ పాటను అనుమానించేలా చేశాయా? అలాగయితే బీటింగ్ రిట్రీట్ ఎప్పుడు ముగిసిపోతుంది? ఏమైనా దాని వలసవాద చరిత్రను మీరు తోసిపుచ్చలేరు కదా. పైగా అది ఆత్మనిర్భర్ కాదు కూడా మరి. కరణ్ థాపర్ ,వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
దేశభక్తి గీతాన్ని ఆలపించిన మమత!: వీడియో వైరల్
గురువారం 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించకుని అన్ని చోట్ల చాలా ఘనంగా వేడుకలు జరిగాయి. అలానే పశ్చిమ బెంగాల్లో కూడా చాలా వైభవంగా జరిగింది. ఐతే ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించకుని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశభక్తి గీతాన్ని ఆలపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు ఆమె తెల్లటి కాటన్ చీరలో బెంగాల్ కవి ద్విజేంద్రలాల్ సరే రాసిన 'ధోనో ధన్నే పుష్పే భోరా' అనే పాటను ఇతర గాయకులతో కలిసి ఆలపించారు. ఈ పాట బెంగాల్లో ఉన్న వనరులను, అక్కడి వారసత్వాన్ని తెలియజేస్తుంది. మమత ఈ పాటను ఆలపించి తన దేశభక్తిని చాటుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా యునెస్కో వారసత్వ జాబితాలో చేరిన పశ్చిమబెంగాల్లో కోల్కతాలోని ప్రసిద్ధ దుర్గాపూజా ఢిల్లీలోని నిర్వహించిన కవాతులో ప్రదర్శించారు. ట్రాక్టర్ ముందు భాగంలో నారికేళంతో ఉన్న పూర్ణ కలశం దాని ముందు మాతృదేవతా ఆరాధన నమునా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. (చదవండి: ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్లైన్కు భారీ పెనాల్టీ) -
డల్లాస్లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారత 74వ గణతంత్ర దినోత్సవాలు అమెరికాలోని డల్లాస్లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్తర టెక్సాస్లోని ఇర్వింగ్లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్లోని ప్రసాద్ తోటకూర, ఛైర్మన్, రావు కల్వల సెక్రటరీ & బోర్డు సభ్యుడు, దినేష్ హుడా బోర్డు సభ్యుడు & కో-చైర్, ఐఏఎన్టీ బోర్డు సభ్యులు హాజరయ్యారు. -
ఢిల్లీలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
దసరా నుంచి నాని మాస్ పోస్టర్ రిలీజ్.. టీజర్ అప్డేట్ వచ్చేసింది
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సింగరేణి బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మంచి బజ్ను క్రియేట్ చేస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. రిపబ్లిక్ డే సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో నాని ఊరమాస్ లుక్లో కనిపిస్తున్నారు.తెలుగు తో పాటుగా, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది. టీజర్ను ఈనెల 30న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. Get ready for the Mass Blast 💥#DasaraTeaser on January 30th 🔥🔥 In Telugu, Tamil, Kannada, Malayalam & Hindi 💥#Dasara in cinemas from March 30th 💥 Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @sathyaDP @saregamasouth pic.twitter.com/KrkxuM3GVe — SLV Cinemas (@SLVCinemasOffl) January 26, 2023 -
కమల్ కామరాజు 'సోదర సోదరీమణులారా...' ఫస్ట్లుక్ అవుట్
కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సోదర సోదరీమణులారా. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టాగ్ లైన్. ఈ సినిమాతో రఘుపతి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 9 ఈఎమ్ ఎంటర్టైన్మెంట్స్, ఐఆర్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. పక్కా స్క్రిప్ట్తో కేవలం 35రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామా కథాంశంతో తెరకెక్కింది.గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ విడుదలైంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
మాతృభూమి కలకాలం సుభిక్షంగా ఉండాలి.. చిరంజీవి ట్వీట్
యావత్ దేశం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. 1950లో భారత దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిన్నటికి 73 సంవత్సరాలు పూర్తైంది. ఇవాళ 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా దేశభక్తిని చాటుకుంటూ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 'మన భారతీయులందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమూల్యమైన స్వాతంత్ర్య బహుమతి కోసం మరియు ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగాలలో ఒకటైన మా వ్యవస్థాపక తండ్రులను ప్రేమగా స్మరించుకుంటూ సెల్యూట్ చేస్తున్నాము.మన మాతృభూమి కలకాలం సుభిక్షంగా ఉండాలి' అంటూ చిరు ట్వీట్లో రాసుకొచ్చారు. Fondly Remembering & Saluting our founding fathers for the invaluable gift of independence and for one of the greatest constitutions of the world! 🙏🙏 May our Motherland 🇮🇳 be prosperous forever!! 💐 Happy 74th Republic Day to All of us Indians!! 💐🇮🇳🇮🇳 — Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2023 -
రిపబ్లిక్ డే 2023: మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకల ఫొటోలు
-
పాటల్లో దేశభక్తి స్ఫూర్తి.. ఈ పాటలు ఎవర్గ్రీన్!
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గుండెల నిండా దేశభక్తితో జరుపుకునే పండగే ఈ గణతంత్ర దినోత్సవం.బ్రిటీష్ పాలనలో మగ్గిన మన దేశానికి స్వాతంత్ర్యం అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేశ వ్యాప్తంగా పండగలా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గుండెనింగా దేశభక్తి, మనసు ఉప్పొంగేలా అమరవీరుల పోరాటాన్ని వివరించేలా ఎన్నో దేశభక్తి గీతాలు ప్రేక్షకులను సమ్మోహన పరిచాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి జూ. ఎన్టీఆర్, రామ్చరణ్ల వరకు ఎంతో మంది స్టార్ హీరోలు దేశభక్తి కలిగిన సినిమాల్లో నటించారు. తరాలు మారినా ప్రతి భారతీయుడిలోనూ దేశభక్తిని ఉప్పింగించే కొన్ని సినీ పాటల్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ‘మేమే ఇండియన్స్’ గణతంత్ర దినోత్సవ రోజుల్లో టీవీల్లో మనం ఎక్కువగా చూసే సినిమా ‘ఖడ్గం’. ఈ సినిమాలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో పోషించారు. దేశభక్తి చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ.. ఇప్పటికీ ఎవర్గ్రీన్గానే రన్ అవుతోంది. ఇందులోని దేశభక్తి సాంగ్ ‘మేమే ఇండియన్స్’ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని దేశభక్తి పాటలివే.. -
రిపబ్లిక్ డే రోజు టీమిండియా గెలిచిన ఏకైక వన్డే ఏదో గుర్తుందా..?
గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజు భారత క్రికెట్ జట్టు ఏదైన మ్యాచ్ గెలిచిందా..? గెలిచి ఉంటే.. ఆ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపై గెలిచింది..? ఈ వివరాలు 2023 రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని భారత క్రికెట్ అభిమానుల కోసం. వివరాల్లోకి వెళితే.. 2019 న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా భారత జట్టు రిపబ్లిక్ డే రోజున ఓ వన్డే మ్యాచ్ గెలిచింది. చరిత్రలో ఈ రోజున టీమిండియా గెలిచిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం విశేషం. 5 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా మౌంట్ మాంగనూయ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా.. ఆతిధ్య జట్టుపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఒక్క విజయం మినహాయించి రిపబ్లిక్ డే రోజు ఇప్పటివరకు టీమిండియాకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా లభించలేదు. ఈ మ్యాచ్కు ముందు 3 సందర్భాల్లో ఇదే రోజున టీమిండియా వన్డే మ్యాచ్లు ఆడినప్పటికీ, విజయం సాధించలేకపోయింది. Another brilliant performance by the Men in Blue. #TeamIndia wrap the second ODI, win by 90 runs. 2-0 🇮🇳🇮🇳 #NZvIND pic.twitter.com/2fTF9uQ5JM — BCCI (@BCCI) January 26, 2019 1985-86 వరల్డ్ సిరీస్లో భాగంగా తొలిసారి రిపబ్లిక్ డే రోజున అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా.. ఆసీస్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతర్వాత 2000 సంవత్సరంలో ఇదే రోజు, అదే అడిలైడ్లో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఆసీస్ చేతిలోనే రెండోసారి కూడా ఓడింది (152 పరుగుల తేడాతో). 2015 సిడ్నీ వేదికగా రిపబ్లిక్ డే రోజున ఆస్ట్రేలియాతోనే జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. ఇలా.. చరిత్రను తిరగేస్తే, భారత క్రికెట్ జట్టు 2019లో న్యూజిలాండ్పై విజయం మినహాయించి రిపబ్లిక్ డే రోజున ఒక్క విజయం కూడా సాధించలేదు. అందుకు ఈ విజయానికి అంత ప్రత్యేకత. ఇక, ఆ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (87), శిఖర్ ధవన్ (66) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆఖర్లో ధోని (48 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్.. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/45), చహల్ (2/52) మాయాజాలం దెబ్బకు 40.2 ఓవర్లలో 234 పరుగులకే చాపచుట్టేసింది. కివీస్ ఇన్నింగ్స్లో డౌగ్ బ్రేస్వెల్ (57) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
రిపబ్లిక్ డే స్పెషల్: దేశభక్తి చాటే బాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు
భారత రిపబ్లిక్ డే జనవరి 26న వేడుకలు జరగనున్నాయి. ఈ ఏడాది జరిగే గణతంత్ర సంబరాలు చేసుకునేందుకు కోట్లాది ప్రజలు సిద్ధమయ్యారు. అయితే ఒక్కసారి స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వారి చరిత్రలు గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో పుస్తకాలు చదివే సమయం లేకపోయినా.. చరిత్రను తెరపై ఆవిష్కరించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ఈ గణతంత్ర దినోత్సవం రోజున ఎంచక్కా కుటుంబంతో కలిసి చూడాల్సిన స్వాతంత్ర్య పోరాట సినిమాలను కొన్నింటిని మీకు గుర్తు చేస్తున్నాం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశభక్తితో పాటు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాలీవుడ్ టాప్ టెన్ చిత్రాలపై ఓ లుక్కేయండి. అమీర్ ఖాన్ లగాన్ అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన చిత్రం లగాన్. ఈ సినిమాలో అధిక మొత్తంలో బ్రిటీష్ పన్నుల నుంచి ప్రజలను విముక్తి చేయడానికి రైతు చేస్తున్న పోరాటాన్ని చక్కగా తెరకెక్కించారు. అన్యాయమైన వ్యవస్థకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం పొందేందుకు బ్రిటిష్ వారికి ఇష్టమైన క్రీడ అయిన క్రికెట్లో ఓడించడం ఈ చిత్రంలో చూపించారు. షారుఖ్ ఖాన్ స్వదేశ్ షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం స్వదేశ్. నాసాలో పనిచేసే శాస్ర్తవేత్తగా ఇందులో కనిపించారు. ఈ చిత్రంలో హీరో తన అమ్మను చూసేందుకు భారతదేశానికి వచ్చే వస్తాడు. ఆ తరువాత ఇక్కడి పరిస్థితులకు చలించిపోయి స్వేదేశంలోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. నాసా ప్రధాన కార్యాలయంలో చిత్రీకరించబడిన మొదటి భారతీయ చిత్రం స్వదేశ్. రంగ్ దే బసంతి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెరకెక్కించిన సినిమా రంగ్ దే బసంతి. ఈ చిత్రంలో భారతదేశంలోని సామాజిక సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇండియాలోని ఐదుగురు స్వాతంత్ర్య సమరయోధుల కథను డాక్యుమెంట్ చేయడానికి ఒక బ్రిటిష్ విద్యార్థి భారత్కు వస్తాడు. ఇందులో ఐదుగురు భారతీయ విప్లవకారుల పాత్రలు చూపించారు. ఇది బ్రిటీష్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాటం చక్కగా తెరకెక్కించారు. చక్ దే ఇండియా కబీర్ ఖాన్ తెరకెక్కించిన మూవీ చక్ దే ఇండియా. ఈ సినిమాలో దేశభక్తిని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో షారూక్ ఖాన్ భారత మహిళా హాకీ జట్టు కోచ్ పాత్రలో కనిపిస్తారు. ఇండియా కోల్పోయిన తన ఖ్యాతిని తిరిగి కాపాడుకోవాలనే సందేశంతో తెరకెక్కించారు. అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత జట్టు హాకీ జట్టు గెలవాలనే కోరికను బలంగా చూపించారు. రాజీ- ఆలియా భట్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాజీ. రా ఎజెంట్ పాత్రలో ఆలియా భట్ నటించింది. ఈ చిత్రంలో ఇండియాకు కీలకమైన విలువైన సమాచారాన్ని సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఆమె ఒక పాకిస్తాన్ సైనికుడిని వివాహం చేసుకుని ఆ దేశానికి వెళ్లిపోతుంది. దేశం పట్ల ఆమెకున్న ప్రేమతో కుటుంబాన్ని కోల్పోతుంది. ఈ సినిమాలో అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేసరి- సిక్కు సైనికుల కథ సారాంఘరి యుద్ధంలో పోరాడిన వీర సిక్కు సైనికుల కథను ఈ సినిమాలో చూపించారు. అమరులైన వీరికి కేసరి నివాళులు అర్పించారు. పదివేల మంది పష్టూన్ ఆక్రమణదారులతో జరిగిన పోరాటాలను చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 21 మంది సిక్కు సైనికులకు నాయకత్వం వహించిన హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలోని యుద్ధాన్ని ఈ కథలో ఆవిష్కరించారు. భారతదేశ చరిత్రలో గొప్ప యుద్ధాలలో ఇది ఒకటిగా నిలిచింది. మణికర్ణిక- కంగనా రనౌత్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మణికర్ణిక. ఈ చిత్రంలో ఝాన్సీ రాణి పాత్రను ఆమె పోషించింది. ఈస్ట్ ఇండియన్ కంపెనీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఝాన్సీ రాణి చేసిన పోరాటాన్ని చక్కగా తెరకెక్కించారు. ఆమె తిరుగుబాటు బ్రిటీష్ వారిపై విపరీతమైన స్వాతంత్ర్య యుద్ధంగా మారింది. ఝాన్సీ రాణి మణికర్ణిక పాత్రలో కంగనా రనౌత్ మెప్పించింది. యూరి -ది సర్జికల్ స్ట్రైక్ యూరిలో జరిగిన దాడికి ప్రతీకారంగా జరిగిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2016లో కాశ్మీర్లోని ఒక భాగమైన సైనిక స్థావరం యూరీపై మిలిటెంట్లు దాడి చేశారు. ఆ తర్వాత భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆధారంగా రూపొందించబడింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా రూపంలో అమరులైన భారత సైనికులకు ఘన నివాళి అర్పించారు. విక్కీ కౌశల్లో మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ పాత్రలో కనిపించారు. షేర్షా- కార్గిల్ యుద్ధం షేర్షా పాకిస్తాన్పై కార్గిల్ యుద్ధం నాటి సంఘటనల ఆధారంగా షేర్షా మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా కెప్టెన్ విక్రమ్ బాత్రా త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించారు. కెప్టెన్ బాత్రా పాత్రలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. సర్దార్ ఉధమ్ సింగ్- 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం బ్రిటీష్ పాలనలోని 1919 కాలంలో జరిగిన మారణహోమం జలియన్ వాలాబాగ్ ఉదంతం. ఈ మారణకాండకు ప్రతీకారంగా మైఖేల్ ఓ డయర్ను భారతీయ విప్లవకారుడు సర్దార్ ఉధమ్ సింగ్ హత్య చేశారు. అతని జీవిత ప్రయాణాన్ని షూజిత్ సిర్కార్ ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ భారతీయ విప్లవకారుడు ఉధమ్ సింగ్ పాత్రను పోషించాడు. భారతీయ చరిత్రలో నిలిచిపోయిన వీరుడికి ఈ చిత్రం ద్వారా ఘన నివాళి అర్పించారు. -
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ప్రకటించిన కేంద్రం.. ఏపీకి విశిష్ట సేవా అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ను కేంద్రం ప్రకటించింది. ఏపీకి రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కాయి. తెలంగాణకు రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 13 ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. కాగా, జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు.. ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయ్యింది. అనేక రాష్ట్రాల పోటీ మధ్యలో ఏపీ శకటం ప్రబల తీర్థం పరేడ్కు ఎంపికైంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు మొత్తం 17 శకటాలు ఎంపికయ్యాయి. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో.. సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది. చదవండి: రెండో దశ పశువుల అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్ -
Republic Day: విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు.. వాహనాల రూట్ ఇలా..
విజయవాడ స్పోర్ట్స్: ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ నెల 26వ తేదీన గణతంత్ర వేడుకలు జరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో బెంజిసర్కిల్ నుంచి ఆర్టీసీ వై జంక్షన్ వరకు, రెడ్సర్కిల్ నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి వెటర్నరీ జంక్షన్ వరకు ఎలాంటి వాహనాలను అనుమతించమన్నారు. బెంజిసర్కిల్ నుంచి డీసీపీ బంగ్లా వరకు ఆహా్వనితులను మాత్రమే అనుమతిస్తామన్నారు. ప్రజల సౌకర్యార్థం ఈ ఆంక్షలు విధిస్తున్నామన్నారు. వాహనాల రూట్ ఇలా.. ♦ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బెంజిసర్కిల్ రాకపోకలు సాగించే బస్సులు, ఇతర వాహనాలు ఏలూరు రోడ్డు, స్వర్ణప్యాలెస్, దీప్తిసెంటర్, పుష్పాహోటల్, జమ్మిచెట్టు సెంటర్, సిద్ధార్థ జంక్షన్ మార్గాన బందరులాకులు, రాఘవయ్యపార్క్, పాతఫైర్ స్టేషన్రోడ్, అమెరికన్ ఆస్పత్రి, మసీద్రోడ్, నేతాజీబ్రిడ్జి, గీతానగర్, స్క్యూ బ్రిడ్జి మార్గాన్ని అనుసరించాలి. ♦ఐదో నెంబర్ రూట్లో ప్రయాణించే సిటీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ నుంచి బెంజిసర్కిల్కు చేరుకోవాలి. ♦హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు రాకపోకలు సాగించే భారీ, మధ్యతరహా వాహనాలు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్జంక్షన్ మార్గాన్ని అనుసరించాలి. ♦విశాఖపట్నం నుంచి చెన్నైకి రాకపోకలు సాగించే భారీ, మధ్యతరహా వాహనాలు హనుమాన్జంక్షన్, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మార్గాన్ని అనుసరించాలి. ♦గుంటూరు నుంచి విశాఖపట్నంకు రాకపోకలు సాగించే వాహనాలు బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడిబ్రిడ్జి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్జంక్షన్ మార్గాన్ని అనుసరించాలి. ♦చెన్నై నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగించే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నాల్గొండ, నార్కెట్పల్లి మార్గాన్ని అనుసరించాలి. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు.. గణతంత్ర వేడుకలకు విచ్చేసే ఆహా్వనితులు వారి వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు ప్రత్యేక స్థలాలను కేటాయించినట్లు సీపీ తెలిపారు. ♦అ అ పాస్లు కలిగిన వారు స్టేడియం గేట్–2 నుంచి లోపలికి ప్రవేశించి, అక్కడే నిర్ధేశిత ప్రాంతంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. ♦అ1, అ2 పాస్లు కలిగిన వారు గేట్–4 నుంచి ప్రవేశించి హ్యాండ్బాల్ గ్రౌండ్ నందు వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. ♦ఆ1, ఆ2 పాస్లు కలిగిన వారు గేట్–6 నుంచి ప్రవేశించి ఫుట్బాల్ గ్రౌండ్ నందు, స్టేడియానికి ఎదురుగా ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్ నందు వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. ♦మీడియా ప్రతినిధులు గేట్–2 నుంచి స్టేడియం లోపలికి ప్రవేశించాలి. ♦నున్న, సింగ్నగర్, సత్యనారాయణపురం, మాచవరం వైపు నుంచి వచ్చే స్కూల్, కాలేజీ బస్సులు సీతారామపురం జంక్షన్ మీదుగా పుష్పా హోటల్ వరకు చేరుకుని అక్కడ విద్యార్థులను దింపి బస్సులను మధుచౌక్, జమ్మిచెట్టు, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్నందు పార్కింగ్ చేసుకోవాలి. ♦పటమట వైపు నుంచి స్కూల్, కాలేజీ బస్సులు బెంజిసర్కిల్ మీదుగా వెటర్నరీ జంక్షన్ వరకు వచ్చి అక్కడే విద్యార్థులను దింపి బస్సులను నేతాజీ బ్రిడ్జి, స్క్యూబ్రిడ్జి, బెంజిసర్కిల్, నిర్మలజంక్షన్, పాలిక్లినిక్రోడ్డు, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ నందు పార్కింగ్ చేసుకోవాలి. ♦వన్టౌన్, కొత్తపేట, భవానీపురం, ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే స్కూల్, కాలేజీ బస్సులు స్వరాజ్ మైదానంలో పార్కింగ్ చేసుకోవాలి. చదవండి: టీడీపీ నేత గోడి అరుణకు పార్టీలో లైంగిక వేధింపులు.. రాజీనామా ప్రకటన -
Republic Day 2023: ఢిల్లీ కర్తవ్యపథ్లో భారీగా రిపబ్లిక్ డే రిహార్సల్స్ (ఫోటోలు)
-
రిపబ్లిక్ డే పరేడ్లో ఏపీ శకటం ప్రబల తీర్థం
న్యూఢిల్లీ: జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు.. ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయ్యింది. అనేక రాష్ట్రాల పోటీ మధ్యలో ఏపీ శకటం ప్రబల తీర్థం పరేడ్కు ఎంపికైంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు మొత్తం 17 శకటాలు ఎంపికయ్యాయి. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో.. సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ కార్యాలయం వెల్లడించింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మకర సంక్రాంతి సందర్భంగా వీటిని ప్రదర్శిస్తారని.. సంప్రదాయానికి అద్దం పట్టే విధంగా ప్రబల తీర్థం శకటం ఉందని తెలిపింది. గ్రీన్ హరిత విప్లవానికి ఇది ఉదాహరణగా పేర్కొంది. ఏపీ దేశానికి అన్నపూర్ణ, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించింది. కాగా విలువైన సంస్కృతికి నిలయం ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి రిపబ్లిక్ డే పరేడ్కు శకటాలను కేంద్రం ఎంపిక చేస్తుంది. దక్షిణ భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, రాష్ట్రాలకు అవకాశం వచ్చింది. సాక్షి, ఢిల్లీ: రైతే రారాజు అనే ఇతివృత్తంతో రూపొందించిన శకటం.. ప్రభల తీర్థం అని రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కోనసీమ ప్రబల తీర్థం రిపబ్లిక్ డే వేడుకలకు ఎంపికైందని, 400 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉన్న సంస్కృతికి ప్రబల తీర్థం ఒక నిరద్శనమని పేర్కొన్నారాయన. చదవండి: AP: దేశంలో పెద్ద మంచినీటి సరస్సు మన రాష్ట్రంలోనే.. ప్రత్యేకతలివే! -
షావోమి 12 ప్రొపై భారీ తగ్గింపు, ఎక్కడంటే!
సాక్షి, ముంబై: షావోమి రిపబ్లిక్ డే సేల్ భాగంగా స్మార్ట్టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్ సహా ఇతర ఉత్పత్తులను భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా షావోమి 12 ప్రొ 5జీ ధరపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో పాటు ICICI బ్యాంక్ ,ఇండస్ఇండ్ బ్యాంక్ వినియోగదారులు వరుసగా రూ. 3,000 , రూ. 2,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఐదు రోజుల ఈ సేల్లో రోజువారీ 12 గంటల పరేడ్లో నిర్దిష్ట గాడ్జెట్లపై కస్టమర్లు ఈ ఆఫర్ల ప్రయోజనాన్ని పొందగలరు. డీల్లో భాగంగా, వినియోగదారులు షావోమి 12 ప్రొ రూ. 10,000 తగ్గింపు తరువాత రూ. 44,999కి సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లో దీని అసలు ధర రూ. 54,999 (8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్). అలాగే 12 జీబీ ర్యామ్, 254 జీబీ స్టోరేజ్ టాప్-ఎండ్ వేరియంట్ను భారీ తగ్గింపుతో రూ.58,999కి కొనుగోలు చేయవచ్చు. షావోమి అధికారిక భారతదేశ వెబ్సైట్లో ఈసేల్ అందుబాటులో ఉంది. 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తున్న భారతదేశంలోని ఏకైక ఫోన్ ఇదే. ఇంకా 6.7-అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్ షావోమి 12 ప్రొ లోని ప్రధాన స్పెసిఫికేషన్స్. అలాగే 10వేల ధర ఉన్న రెడ్ మీ 10ను 8వేలకే లభ్యం. రూ. 4 వేల తగ్గింపుతో షావోమి నోట్బుక్ను ఈ సేల్ 72999లకే కొనుగోలు చేయవచ్చు.