-
విశాఖలో ‘రెడ్’ చిత్రం విజయోత్సవం
-
స్క్రిప్ట్ చదివే నిర్మాతలు ఇద్దరే!
‘స్రవంతి’ రవికిశోర్గారికి నేను చాలా రుణపడి ఉంటాను. స్క్రిప్ట్ను మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకూ చదివే నిర్మాతలు ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు రామానాయుడుగారు, మరొకరు రవికిశోర్గారు. నా కెరీర్ మొదట్లోనే నాలుగు సినిమాలు రవికిశోర్గారితో పనిచేసే అదృష్టం నాకు దక్కింది’’ అంటూ రవికిశోర్కి పాదాభివందనం చేశారు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ‘రెడ్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘రామ్ను ‘దేవదాస్’ సినిమాలో చూసినప్పుడు రవికిశోర్గారితో మెరుపుతీగలా ఉన్నాడు అన్నాను. చూసినంత సులువు కాదు.. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సినిమాలో నటించటం’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ– ‘‘మా పెదనాన్నగారితో చాలా సినిమాలు చేశాను. కానీ స్టేజ్ మీద ఎప్పుడూ ఆయన గురించి మాట్లాడలేదు. నా దృష్టిలో ‘రెడ్’ సినిమాకి రియల్ హీరో పెదనాన్న రవికిశోర్గారు. ఈ సినిమాని చంటిబిడ్డలా కాపాడుతూ వచ్చారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రవికిశోర్గారికి, మంచి విజువల్స్ ఇచ్చిన సమీర్రెడ్డి గారికి థ్యాంక్స్’’ అన్నారు కిశోర్ తిరుమల. ఈ కార్యక్రమంలో మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నివేదా పేతురాజ్, ఆర్ట్ డైరెక్టర్ ఏయస్ ప్రకాశ్, ఎడిటర్ జునైద్ తదితరులు పాల్గొన్నారు. రవికిశోర్కి పాదాభివందనం చేస్తున్న త్రివిక్రమ్ -
లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలనుంది
‘‘తెలుగు సినిమాల్లో రెండో హీరోయిన్ పాత్రలే చేస్తున్నారెందుకు? అని అడుగుతున్నారు.. నేను నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తా.. ప్రాధాన్యం ఉంటే చాలు.. అది మొదటి హీరోయినా? రెండో హీరోయినా? అనేది చూడను’’ అన్నారు హీరోయిన్ నివేదా పేతురాజ్. రామ్ హీరోగా, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నివేదా పేతురాజ్ చెప్పిన విశేషాలు. ► వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ చేశాను. కిశోర్గారి దర్శకత్వంలో ‘చిత్రలహరి’ ఇప్పుడు ‘రెడ్’ సినిమా చేశా. వీరిద్దరి ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. వీళ్ల సినిమాలంటే కథ ఏంటి? నా పాత్ర ఏంటి? అని అడగకుండా ఒప్పుకుంటా. ► ‘రెడ్’ సినిమాలో నాది ఇన్నోసెంట్ పోలీస్ పాత్ర. కానీ బయటకు రఫ్గా ఉంటాను. పోలీస్ పాత్ర కోసం ప్రత్యేకించి హోమ్వర్క్ చేయలేదు. ఎందుకంటే తమిళంలో ఓ సినిమాలో పోలీస్ పాత్రలో నటించాను. ఆ అనుభవం ఈ పాత్రకి బాగా ఉపయోగపడింది. ► ‘చిత్రలహరి’లో నాది చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. ‘అల వైకుంఠపురములో’ చిత్రం చేసినందుకు ఎలాంటి బాధ లేదు. ఆ సినిమా చాలామందికి రీచ్ అయింది. ‘రెడ్’ సినిమాలో నాది పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర. ఇందులో రామ్ చేసిన రెండు పాత్రలతో నాకు సీన్లు ఉన్నాయి కానీ హీరోయిన్లతో లేవు. ► నాకు కామెడీ పాత్రలంటే ఇష్టం. అయితే తెలుగులో అన్నీ సీరియస్ పాత్రలే వస్తున్నాయి. అది కూడా హోమ్లీగా ఉండేవే. గ్లామరస్ రోల్స్ చేయడానికి అభ్యంతరం లేదు. ఏ ఇండస్ట్రీలో అయినా ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్లు ఎక్కువ రోజులు ఉండలేరు. అందుకే ఉన్నన్ని రోజులూ అన్ని రకాల పాత్రలూ చేయాలనుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి అన్ని పాత్రలూ చేస్తున్నారు. నాకూ ఆయనలా చేయాలనుంది. నాకు లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలనుంది. ► కెరీర్ ప్రారంభంలో తమిళ్లో వరుసగా ఎనిమిది సినిమాలు ఒప్పుకున్నాను. అవి ఎందుకు ఒప్పుకున్నానా? అని ఆ తర్వాత అనిపించింది. ఇప్పుడు ఏ పాత్ర నాకు సరిపోతుందో దాన్నే ఎంచుకుంటున్నాను. ∙‘విరాటపర్వం’లో నాది అతిథి పాత్ర. విశ్వక్ సేన్ ‘పాగల్’లో నా పాత్ర సరదాగా ఉంటుంది. మరో తెలుగు సినిమా సైన్ చేశాను. -
ప్రతి పాత్ర కథకు కనెక్ట్ అయ్యుంటుంది
రామ్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా కిశోర్ తిరుమల చెప్పిన విశేషాలు. ► ‘ఇస్మార్ట్ శంకర్’లో మాస్గా కనిపించారు రామ్. ఆ తర్వాత వచ్చే ఈ సినిమాలోనూ అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటుందనుకున్నాం. అలా ఒక పాత్ర, నా స్టైల్ ఆఫ్ హీరోలా మరో క్యారెక్టర్ ఉంటుంది. రామ్తో నేను తెరకెక్కించిన మొదటి సినిమా (నేను శైలజ) లవ్, తర్వాత ఫ్రెండ్షిప్ (ఉన్నది ఒకటే జిందగీ). ఇప్పుడు తనతో చేసిన మూడో సినిమా ‘రెడ్’లో చాలా షేడ్స్ ఉన్నాయి. ► మాములుగా హీరోకి రెండు క్యారెక్టర్లు ఉంటే ఒకటి సాఫ్ట్, రెండోది రఫ్ అన్నట్లు ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలా ఉండదు. రామ్లో కొత్త యాంగిల్ కనబడుతుంది. అలాగే దర్శకుడిగా నాలోనూ కొత్త యాంగిల్ చూస్తారు. హీరో బాగా డ్యాన్స్ చేస్తాడు కాబట్టి ఓ మాస్ పాట పెట్టాం. రామ్, నేను రెండు సినిమాలు చేశాం కాబట్టి మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ► ఈ సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ కథకు కనెక్ట్ అయ్యుంటుంది. ముగ్గురు హీరోయిన్లదీ మంచి క్యారెక్టరైజేషన్. నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్, మాళవికా శర్మ పాత్రలు ఆకట్టుకుంటాయి. అయితే నివేదా పాత్ర ఇంకొంచెం బలంగా ఉంటుంది. ► జనరల్గా థ్రిల్లర్ సినిమా అంటే ఒక మీటర్లో ఉంటుంది. అయితే థ్రిల్లర్ ప్రధానంగా సాగే ‘రెడ్’ సినిమా అలా అనిపించదు. ఈ చిత్రంలో డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండటంతో పక్కా కమర్షియల్ చిత్రంలా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగా ఉంటుంది. ► అప్పట్లో చెన్నైలో ఉండటంవల్ల ఓ తమిళ సినిమా చేశాను. ఆ తర్వాత తెలుగు మీద దృష్టి పెట్టాను. లాక్డౌన్లో శర్వానంద్ కోసం ఓ కథ, మరో రెండు స్క్రిప్ట్లు తయారు చేసుకున్నాను. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశాను. -
తేదీ ఖరారు
సంక్రాంతి రేసులో నిలవడానికి పలు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో రామ్ ‘రెడ్’ సినిమా ఒకటి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. రవికిశోర్ మాట్లాడుతూ – ‘‘దేవదాసు’, ‘మస్కా’ తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇది. ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం. మా సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ పోతినేని. -
థియేటర్కి వెళితే కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం
‘‘చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుండి ‘ఇస్మార్ట్ శంకర్’లో విశ్వరూపం చూపించి, మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు రామ్. ఇప్పుడు ‘రెడ్’తో దాన్ని రెండింతలు చేసుకోనున్నాడు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. రామ్ హీరోగా, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ‘రెడ్’ చిత్రం ట్రైలర్ని విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘చాలా సున్నితంగా, క్లాస్గా కనిపించే కిశోర్ తిరుమల ‘రెడ్’ చిత్రంతో తాను మాస్ చిత్రాలు రాయగలను, తీయగలనని నిరూపించుకున్నాడు. రామ్కి ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ‘రెడ్’ పెద్ద హిట్ అవ్వబోతోంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం అందరికీ మంచి సక్సెస్ని, గుర్తింపుని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కిశోర్ తిరుమల. రామ్ మాట్లాడుతూ– ‘‘ఇంట్లో పూజ గది ఉన్నా గుడికే వెళతాం.. వంట చేసుకోగలిగినా హోటల్కి వెళుతుంటాం.. అలాగే ఎన్ని ఓటీటీ వేదికలున్నా థియేటర్లకే వచ్చి సినిమాలు చూస్తాం. థియేటర్లలో సినిమా చూస్తూ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం. ప్రేక్షకులందరూ జాగ్రత్తలు పాటిస్తూనే థియేటర్లకు రావాలని కోరుతున్నాం’’ అన్నారు. నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము), నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నాజర్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
రెడ్మిక్సర్ బంగారం పేరిట మోసం
సాక్షి, కాకినాడ: సాధారణ బంగారం కంటే విలువైన బంగారం తమ వద్ద ఉందని నమ్మించి ఒక వ్యక్తిని మోసం చేసిన ముఠా గుట్టును సర్పవరం పోలీసులు రట్టు చేశారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాకినాడ డీఏస్పీ భీమారావు, సీఐ గోవిందరాజు ఈ వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాధితుడు ఆడారి నాగులుకు ఫోన్ ద్వారా కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. బంగారం కంటే ఎక్కువ విలువైన రెడ్మిక్సర్ బంగారం తమ వద్ద ఉందని, దీని విలువ రూ.10 లక్షలు ఉంటుందని నమ్మించారు. తమకు డబ్బులు అర్జెంట్గా అవసరమవడంతో రెడ్మిక్సర్ బంగారాన్ని రూ.4 లక్షలకే ఇచ్చేస్తామని చెప్పారు. ఆ మాటలు నమ్మిన నాగులు ఆగస్టు 23న సర్పవరం పూల మార్కెట్ వద్ద ఆ వ్యక్తులకు నగదు అందజేశాడు. అనంతరం వారు రెడ్మిక్సర్ బంగారం ఇవ్వలేదంటూ 27వ తేదీన సర్పవరం పోలీసు స్టేషన్లో అతడు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై కృష్ణబాబు కేసు నమోదు చేశారు. సీఐ గోవిందరాజు తన సిబ్బందితో కలిసి ఈ కేసు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ముందుగా అందిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి 7 సమయంలో అచ్చంపేట జంక్షన్ వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సామర్లకోట మండలం అయోధ్యరామపురానికి చెందిన గున్నాబత్తుల శివ, అచ్చంపేట గ్రామానికి చెందిన వీరంరెడ్డి వీర వెంకట రమణ, సామర్లకోట పట్టణానికి చెందిన రొంగల శేషుకుమార్, పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన మోటుపల్లి శివనారాయణ, పెద్దాపురానికి చెందిన కలగా హరీష్ ఉన్నారు. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి రూ.1.65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంతో సీఐ గోవిందరాజు, ఎస్సై కృష్ణబాబు, ఏఎస్సై నాగేశ్వరరావు, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, రూప్కుమార్, సతీష్కుమార్ సహకరించారని పేర్కొంటూ డీఎస్పీ భీమారావు వారికి అభినందనలు తెలిపారు. -
ఆరంభ లాభాలు ఆవిరి : తీవ్ర ఒడిదుడుకులు
సాక్షి, ముంబై : అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. అయితే ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఆరంభంలో 150 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 23 పాయింట్లు లాభాలకు పరిమితమై 34411 వద్ద ఉంది. 10300 స్థాయిని అధిగమించిన నిఫ్టీ కూడా 11 పాయింట్ల లాభంతో 10178 వద్ద కొనసాగుతోంది. వరుస లాభాలనుంచి ట్రేడర్ల లాభాల స్వీకరణతో బ్యాంకు నిఫ్టీ కూడా నష్టాల్లోకి జారుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. వొడాఫోన్, టైటన్, ఎస్బీఐ, హెచ్ డీఎఫ్ స , గెయిల్ నష్ట పోతున్నాయి. -
సినీ ఇండస్ట్రీపై రామ్ ఆసక్తికర ట్వీట్
‘సినీ ఇండస్ట్రీలో ఓ విషయం ఉంది. సినిమా అనేది కొందరికి ఫ్యాషన్, చాలా మందికి వ్యాపారం.. మిగిలిన వారందరికీ అదొక ఆట’ అంటూ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆయన హీరోగా నటించిన ‘రెడ్’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ‘రెడ్’ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్ వేదికగా విడుదల చేస్తారని అనేక వార్తలు వస్తున్న తరుణంలో రామ్ చేసిన ట్వీట్తో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రామ్ ట్వీట్లో అంతర్యం ఏమిటో తెలియక టాలీవుడ్ వర్గాలు తికమకపడుతున్నాయి. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్లు హీరోయిన్లుగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. The thing about the Movie Industry is.. It’s a Passion for a few.. a Business for most.. & a Gamble for the rest.. Everyone sees it from their own perspective..#OTT #Theatrical #RAndoMthoughts — RAm POthineni (@ramsayz) May 18, 2020 చదవండి: వైరల్: చిరు ఎత్తుకున్న ఆ హీరో ఎవరు? ఎన్టీఆర్ బర్త్డే: చిన్న సర్ప్రైజ్ ఉంది -
అప్పుడు దిమాక్ ఖరాబ్.. ఇప్పుడు డింఛక్
ఇస్మార్ట్ శంకర్తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ‘రెడ్’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ రోజు హీరో రామ్ బర్త్డే. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని రామ్ అభిమానులకు కానుకగా ‘రెడ్’ చిత్రంలోని ‘డింఛక్’ అనే మాస్ సాంగ్ గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ పాటను మణిశర్మ కంపోజ్ చేయగా సాకేత్, కీర్తనలు పాడారు. జానీ మాస్టర్ డ్యాన్స్ కొరియగ్రఫీ, కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఇక ఈ సాంగ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని ‘దిమాక్ ఖరాబ్’ సాంగ్ రేంజ్లో హిట్టయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ లవ్ ట్రాక్కు ప్రేక్షకులను విశేష ఆదరణ లభించిన విషయం తెలసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తన పుట్టిన రోజు వేడుకలకు అభిమానులు దూరంగా ఉండాలని రామ్ పిలుపునిచ్చారు. అభిమానుల ఆరోగ్యం, సంతోషమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని.. అదే తనకు ఇచ్చే అసలైన పుట్టిన రోజు కానుకగా భావిస్తానని రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక తమ హీరో పిలుపు మేరకు ఆయన బర్త్డే వేడుకలకు రామ్ అభిమానులు దూరంగా ఉన్నారు. అయితే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ హీరోకు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. రామ్ కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ ‘రెడ్’ చిత్రం తమిళ హిట్ ‘తడమ్’కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. చదవండి: ఇన్నాళ్లకు కౌశల్కు సినిమా అవకాశం బాలయ్య కోసం భారీగా శత్రు గణం Here’s the teaser of one of my fav songs from #RedTheFilm 💥 #DinchakSong 💥https://t.co/UU5Zns38JH I had a blast on sets filming this..I’m sure you guys will have a blast at the theatres watching this. 🔥 Love..#RAPO pic.twitter.com/qE9qi0qevZ — RAm POthineni (@ramsayz) May 15, 2020 -
మా `రెడ్` యూనిట్కు అలాంటి అనుభవాలే..
‘‘కొన్ని సంఘటనలను అవతలివాళ్లు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మరికొన్నిసార్లు నమ్మబుద్ధి కాదు. ఆ మాటల్లో అతిశయోక్తులు ధ్వనిస్తాయి. కానీ అలాంటి సంఘటనలు మన జీవితంలో ఎదురైనప్పుడు? అవే దృశ్యాలు మళ్లీ మళ్లీ కళ్ల ముందు మెదులుతుంటాయి. ఇప్పుడు మా `రెడ్` యూనిట్ సభ్యులకు కూడా అలాంటి అనుభవాలే మెదిలినట్టు. మా`రెడ్`టీమ్లో ఈ మధ్య దీనికి సంబంధించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది`` అని అంటున్నారు ప్రముఖ నిర్మాత `స్రవంతి` రవికిశోర్. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం`రెడ్`. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇందులో హీరోగా నటించారు. ఫిబ్రవరి లో ఈ చిత్రంలోని రెండు పాటల చిత్రీకరణ ఇటలీలో జరిగింది. కోవిడ్-19తో అల్లాడుతున్నఇటలీ గురించి, అక్కడ ఆ వైరస్ సోకడానికి కొన్నాళ్ల ముందు గడిపిన క్షణాల గురించి`స్రవంతి` రవికిశోర్ వివరించారు. (‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’) `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ.. ``సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో -5 డిగ్రీల ఉష్ణోగ్రతతో, ఎటుచూసినా స్వచ్ఛంగా సుందరంగా ఉంటుంది డోలమైట్స్. ఈ పర్వత తీర ప్రాంతంలో ఇప్పటిదాకా పలు హాలీవుడ్ సినిమాల షూటింగులు జరిగాయి. తెలుగు సినిమాల షూటింగ్లు ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు రామ్తో తీస్తున్న `రెడ్` షూటింగ్ అక్కడ చేద్దామని మా డైరక్టర్ కిశోర్ తిరుమల అన్నారు. అప్పటికే ఆ ప్రాంతం గురించి తెలుసు కాబట్టి వెంటనే ఓకే అనుకున్నాం. రెండు పాటలు చిత్రీకరించడానికి టీమ్తో ఇటలీ చేరుకున్నాం. టుస్కాన్, ఫ్లారెన్స్, డోలమైట్సలో హీరో రామ్, హీరోయిన్ మాళవికా శర్మ మీద పాటలు చిత్రీకరించాం. ఇటీవల రిలీజ్ చేసిన ‘నువ్వే నువ్వే’ లిరికల్ సాంగ్లో లేక్గార్డ్ అందాలు కూడా కనిపిస్తాయి. లేక్గార్డ్ ప్రస్తావన ఎందుకంటే... ఈ ప్రాంతం బెర్గామోకి కేవలం గంటం పావు ప్రయాణ దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఇటలీలో కోవిడ్-19కి ఎపిక్ సెంటర్గా బెర్గామో గురించి అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి15న లేక్ గార్డలోనూ, ఫిబ్రవరి 16న డోలమైట్స్లోనూ షూటింగ్ చేశాం. మేం అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆరు రోజులకు... అంటే ఫిబ్రవరి 22న డోలమైట్స్కు బ్రిటిష్ స్కై టీం వెళ్లీంది’’ అని చెప్పారు. (ఇలాంటి కేస్ ఇదే ఫస్ట్ టైమ్..) ఇక ‘‘అక్కడికి వెళ్లిన 22 మందిలో 17 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పటిదాకా సుందరంగా, అద్భుతమైన అనుభవంగా అనిపించిన డోలమైట్ గురించి ఆలోచించగానే మమ్మల్ని కరోనా కలవర పెట్టింది. కేవలం వారం రోజులు ముందుగా అక్కడి నుంచి వచ్చిన మా యూనిట్ అంతా సురక్షితంగా ఉంది. ఇలాంటి విషయాల గురించి ఆలోచించినప్పుడు అదృష్టం కాక మరేంటి? అని అనిపిస్తుంది. ఈ విషయాన్నే అక్కడ పాటలకు కొరియోగ్రఫీ చేసిన శోభి మాస్టర్, మా యూనిట్ సభ్యులు గుర్తుచేస్తున్నారు. ఇటలీలోనే కాదు మన దగ్గరా కరోనా కలవరపెడుతోంది. ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవడమే మన ముందున్న కర్తవ్యం. మానవాళి సురక్షితంగా ఉండాల్సిన ఈ తరుణంలో వినోదం గురించి ఆలోచించడాన్ని మేం కూడా వాయిదా వేశాం. అయితే ఏప్రిల్ 9న ‘రెడ్’ విడుదల చేయాలనుకున్నాం కానీ ప్రస్తుతం పరిస్థుతులు అనుకూలంగా లేవు. సమాజం మామూలు స్థితికి వచ్చాక, అప్పుడు `రెడ్` విడుదల గురించి ప్రకటిస్తాం. కరోనా కోరల్లో చిక్కుకోకుండా ఉండాలంటే అందరూ ఇళ్లల్లోనే ఉండాలి. పరిశుభ్రతను పాటించాలి`` అని అన్నారు. (ఆనందంగా ఉన్నప్పుడే వినోదం ) కాగా రామ్, నివేదా పేతురాజ్,మాళవికా శర్మ, అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్న చిత్రం ‘రెడ్’. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: జునైద్, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్, దర్శకత్వం: కిశోర్ తిరుమల. -
డైలామా ఏం లేదు.. క్లారిటీ ఇచ్చిన రామ్
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా యావత్ దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీపై భారీగానే పడింది. లాక్డౌన్ నేపథ్యంలో విడుదల కావాల్సిన చిత్రాలు వాయిదాపడ్డాయి. వేసవి సెలవులను ఉపయోగించుకోవాలని టాలీవుడ్ దర్శకనిర్మాతలు భారీ ప్రణాళికలు రచించుకున్నారు. కానీ లాక్డౌన్ కారణంగా వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్, వి సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నా లాక్డౌన్ కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే కొన్ని చిన్న సినిమాలు డిజిటల్ ఫ్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తుండగా.. మరికొన్ని పెద్ద సినిమాల దర్శకనిర్మాతలు, హీరోలు ఓటీటీ ప్లాట్ఫాంపై రిలీజ్ చేసేందుకు డైలామాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో ఎక్కువగా వినిపిస్తున్న చిత్రం రామ్ పోతినేని చిత్రం ‘రెడ్’. అన్నీ అనుకున్నట్లు సాగితే ‘రెడ్’ చిత్రం ఏప్రిల్ 9న విడుదల అయ్యేది. కానీ కుదర లేదు. అయితే దర్శకనిర్మాతలు డిజిటల్ బాట వైపు మొగ్గు చూపుతున్నారని, కానీ హీరో రామ్ డైలామాలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రామ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘అలాంటిదేం లేదు! రామ్ ఎలాంటి సందిగ్థంలో లేడు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక దూరం పాటిస్తూ, ఇంట్లోనే ఉంటున్నాడు. అభిమానులు ‘రెడ్’ సినిమాను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు’ అని తెలిపాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్లు హీరోయిన్లుగా నటించారు. స్రవంతి మ´వీస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. చదవండి: బన్ని కోసం బాలీవుడ్ నుంచి.. బాలయ్య సినిమాలో లేడీ విలన్? -
వారసుడు వచ్చాడు : హీరో రామ్
యంగ్ హీరో రామ్ పోతినేని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్తోపాటు, సినీ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు ఆయన సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పుతూ ఉంటాడు. తాజాగా రామ్ ఓ సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. వారసుడు వచ్చాడు అని పేర్కొన్న రామ్.. తన నెప్యూ సిద్దాంత్ పోతినేనితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. (చదవండి : ఇలాంటి కేస్ ఇదే ఫస్ట్ టైమ్..) సినిమాల విషయానికి వస్తే.. ఇస్మార్ట్ శంకర్ విజయంతో మంచి జోష్లో ఉన్న హీరో రామ్.. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెడ్ చిత్రంలో నటిస్తున్నారు. ‘రెడ్’ షూటింగ్ చివరి దశకు చేరకోవడంతో చిత్రం బృందం ప్రమోషన్స్ను మొదలుపెట్టింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. (చదవండి : ‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’) Varasudu Vachaadu ❤️ ....my lil baby nephew Sidhanth Pothineni! Love #RAPO pic.twitter.com/q2ls4smiRd — RAm POthineni (@ramsayz) March 5, 2020 -
‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రెడ్’. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో మూవీ ప్రమోషన్స్ను మొదలు పెట్టింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో అస్త్రాన్ని విడుదల చేసేందుకు సమయాత్తమవుతోంది. చిత్రంలోని తొలి సాంగ్ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మార్చి 6న సాయంత్రం 5 గంటలకు సినిమాలోని ‘నువ్వే నువ్వే’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్ను విడుదల చేయనున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేశారు. ఇక మణిశర్మ శైలిలో ఈ మెలోడీ సాంగ్ ఉండబోతోందని చిత్ర బృందం తెలిపింది. ఇక కిశోర్ తిరుమల-రామ్ కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక ఈ సాంగ్ కూడా హిట్టయిందంటే ‘రెడ్’ జోరుకు బ్రేకులు ఉండవని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సమీర్రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. చదవండి: ‘ఆయన రావడం మా అదృష్టం’ ‘బాధకు బ్రాండ్స్తో పనేంటి డాడీ’ -
ఇలాంటి కేస్ ఇదే ఫస్ట్ టైమ్..
రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘రెడ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. తాజాగా ‘రెడ్’ టీజర్ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ‘క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేసు చూడటం ఇదే ఫస్ట్ టైమ్’ అనే డైలాగ్తో ప్రారంభమైన చిత్ర టీజర్.. చివరివరకు ఇంట్రెస్టింగ్ సాగింది. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్.. క్లాస్, మాస్ లుక్స్లో అదరగొట్టినట్టుగా టీజర్ను చూస్తే తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్తో సత్తా చాటిన రామ్.. ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ తర్వాత రామ్, కిశోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ‘రెడ్’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. -
రెడ్ టీజర్ రిలీజ్కు ముహూర్తం ఖరారు
ఇస్మార్ట్ శంకర్తో బ్లాక్బస్టర్ అందుకున్న రామ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్’. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకుడు. ఇందులో రామ్ తన కెరీర్లోనే తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్లో హీరోను చూసిన అభిమానులు ‘సంథింగ్ ఇంట్రెస్టింగ్’ అంటూ సినిమాపై ఆసక్తిని కనబరుస్తున్నారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ‘రెడ్’ సినిమా టీజర్ విడుదలకు చిత్రయూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. (రొమాంటిక్కి గెస్ట్) ఫిబ్రవరి 28 సాయంత్రం 5 గంటలకు టీజర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులోని డోలమైట్స్లో మైనస్ ఐదు డిగ్రీల వాతావరణంలో హీరోహీరోయిన్లపై పాటను చిత్రీకరించారు. ఇక్కడ షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం రెడ్ కావడం విశేషం. కొన్నిపాటలు, కీలక సన్నివేశాలను ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్ రెడ్డి, ఫైట్స్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్స్ (పది వేల అడుగుల ఎత్తులో...) -
పది వేల అడుగుల ఎత్తులో...
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ చిత్రం తర్వాత రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలోని రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని అందమైన ప్రదేశాల్లో రామ్, మాళవికా శర్మలపై రెండు పాటలు చిత్రీకరించాం. శోభి మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఇటలీలోని టుస్కాన్, ఫ్లారె¯Œ ్స, డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులోని డోలమైట్స్లో మైనస్ ఐదు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. డోలమైట్స్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం మాదే. ఇటలీలో ప్రతి ఏటా జరిగే వెనీడియా కార్నివాల్లో పాటలో కొంత భాగాన్ని చిత్రీకరించాం. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్లో ఆ పాట చిత్రీకరిస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం క్లాస్, మాస్ని ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 9న సినిమాని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు కృష్ణ పోతినేని. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్ రెడ్డి. -
ఆటా పాటా
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. ఈ చిత్రంలో కథానాయికలుగా నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమాను కృష్ణా పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రవికిషోర్ మాట్లాడుతూ–‘‘నేను... శైలజా, ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాల తర్వాత రామ్–కిషోర్ కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ఇది. సంగీత దర్శకుడు మణిశర్మ తొలిసారి మా సంస్థలో పని చేస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, గోవా లొకేషన్స్లో జరిపిన షూటింగ్స్తో టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం ఇటలీలోని టస్క్, ప్లారెన్స్, డోలోమైట్స్ లాంటి ప్రాంతాల్లో రెండు పాటలను చిత్రీకరించే పనిలో ఉన్నాం. శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ నెల 20వరకు ఇటలీ షెడ్యూల్ జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి మరో పాటను చిత్రీకరిస్తే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తవుతుంది. ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. రామ్ కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ ‘రెడ్’ చిత్రం తమిళ హిట్ ‘తడమ్’కు రీమేక్. -
రుచించని బడ్జెట్, మార్కెట్లు ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 680 పాయింట్లు కుప్పకూలి 40043 వద్ద, నిఫ్టీ 214 పాయింట్లు పతనమై 11748 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. హెచ్యూఎల్, టీసీఎస్, నెస్లే, ఏసియన్ పెయింట్స్ మాత్రమే స్వల్పంగా లాభపడుతున్నాయి. కేంద్ర బడ్జెట్ కారణంగా శనివారం సాధారణ సెలవు అయినప్పటికీ ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆరంభంలో బలహీనంగా ఉన్న మార్కెట్లు తరువాత దాదాపు 120 పాయింట్లకు పైగా పుంజుకున్నాయి. బడ్జెట్ ప్రసంగం మొదలైనప్పటినుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. చివరకు వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ టాక్స్, ఆటో రంగం పై జీఎస్టీ తగ్గింపు లాంటి ఆశాజనక వార్తలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు వెల్లువెత్తాయి. (మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1.7 లక్షల కోట్లు...) డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్ ఐడీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం -
బర్త్డే స్పెషల్
రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రెడ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇందులో నివేదా పేతురాజ్ కథానాయికగా నటించనున్నారు. శనివారం నివేదా పుట్టినరోజు సందర్భంగా ఆమెను కథానాయికగా ఖరారు చేసిన విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఆమె పుట్టినరోజు వేడుకలు కూడా ‘రెడ్’ చిత్రబృందం సమక్షంలో గోవాలో జరిగాయి. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. -
థ్రిల్లింగ్ రెడ్
రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘రెడ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్లో జరిగింది. రామ్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘రామ్కు ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సూపర్హిట్ అందించిన పూరి జగన్నాథ్గారికి థ్యాంక్స్. మా బ్యానర్లో రామ్ ఇప్పటివరకు చాలామంచి సినిమాలు చేశారు. ‘రెడ్’ కూడా మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని భావిస్తున్నాను. నవంబర్ 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారం భిస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 9న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఓ సినిమా సోల్ను తీసుకుని, అందులో మార్చులు చేసి ‘రెడ్’ సినిమాను తెరకెక్కిస్తాం’’ అన్నారు. ‘‘కెరీర్లో తొలిసారి థ్రిల్లర్ జానర్లో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని రామ్ అన్నారు. ‘‘రామ్తో మూడోసారి సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థ్రిల్లర్కు వాణిజ్య పరమైన అంశాలు జోడించి కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మణిశర్మగారు మా సినిమాకు సంగీతం అందిస్తున్నందుకు చాలా సంతోషం’’ అన్నారు కిశోర్ తిరుముల. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, అనిల్ సుంకర, రామ్ ఆచంట, కృష్ణ పోతినేని పాల్గొన్నారు. -
హీరో రామ్ ‘రెడ్’ చిత్రం ప్రారంభం
-
ఆ సిన్మా పూర్తికాలేదు.. ఎలా విడుదల చేస్తారు: రానా
దీపావళికి ముందు రోజు ఆ తర్వాత కొత్త లుక్స్ విడుదల సందడి సాగింది. కొత్తగా వచ్చిన ఆ స్టార్స్ చిత్రాల విశేషాల్లోకి వస్తే... ఇప్పటివరకు ఒంటరిగానే దర్శనం ఇచ్చిన రాజా ఈ దీపావళి పండగకి జంటగా కనిపించి ప్రేమ గొడుగు కింద కాస్తంత చోటు దక్కించుకున్నాడు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.‘‘ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ పాట పాడారు. ఈ పాట పూర్తిగా రెట్రో ఫీల్ని కలిగిస్తుంది. విడుదల చేసిన పోస్టర్స్కు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో టీజర్ను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్ను విడుదల చేశారు. డిసెంబరు 20న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. భారతీయ సైనికుడి పాత్రలో రానా నటిస్తున్న చిత్రం ‘1945’. శివకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాజరాజన్ నిర్మాత. ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసి, సినిమాను జనవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘సినిమాను పూర్తి చేయడంలో నిర్మాత సఫలం కాలేదు. ఏడాదిగా వారిని నేను కలవలేదు. ఇదొక అసంపూర్ణమైన సినిమా. ఇప్పుడు పోస్టర్ను విడుదల చేశారు. మోసం చేసి సంపాదించాలనుకోవడమే వారి ఆలోచన అనుకుంటా’’ అని ఈ చిత్రం గురించి సోషల్ మీడిమాలో రానా పేర్కొన్నారు. ‘‘షూటింగ్ కోసం చాలా ఖర్చు చేశాను. పూర్తి కాని సినిమాను ఎవరూ విడుదల చేయరు. సినిమా పూర్తయిందా? లేదా? అనే విషయాన్ని ఆడియన్స్ నిర్ణయిస్తారు’’ అని నిర్మాత పేర్కొన్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ హిట్ను ఖాతాలో వేసుకున్న రామ్ మరో మాస్ ఫిల్మ్ చేయడానికి రెడీ అయ్యారు. రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘రెడ్’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘స్రవంతి’ రవికిశోర్ ఈ సినిమాను నిర్మిస్తారు. పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫైట్స్ కొరియోగ్రఫీ చేస్తారు. వెండితెర భీష్మగా కనిపించనున్నారు నితిన్. ఆయన హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలో రష్మిక మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను విడుదల చేశారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘భీష్మ’లో రష్మిక, నితిన్ -
ఎరుపు రంగులో వర్షం
చెన్నై ,టీ.నగర్: కూడలూరులో ఎరుపు రంగులో వర్షం కరువడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నీటిని అధికారులు పరిశీలనకు తీసుకెళ్లారు. నీలగిరి జిల్లా, కూడలూరు సమీపంలో నాడుకాని గ్రామం ఉంది. దీని సరిహద్దు ప్రాంతాలైన నాడుకాని, ముండా, కూవత్తిపొళిల్లలో సోమవారం రాత్రి గంటకు పైగా వర్షం కురిసింది. ఈ వర్షపు నీరు ఎరుపు రంగులో ఉండడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు. కొందరు నీటిని పాత్రల్లో, బాటిల్స్లో సేకరించారు. ఈ విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు అక్కడికి వచ్చి స్థానికులు సేకరించిన నీటిని వింతగా తిలకించారు. ఈ నీటిలో తడిసిన చాలా మందికి ఒంటిపై దురదలు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న రెవెన్యూశాఖ అధికారులు ప్రజలు బాటిళ్లలో సేకరించిన నీటిని పరిశోధనల కోసం తీసుకెళ్లారు. -
లాభాల స్వీకరణ :మార్కెట్ల వెనకడుగు
సాక్షి, ముంబై: లాభాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలలోకి ప్రవేశించాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దాదాపు 100పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ అమ్మకాల ఒత్తిడితో కుదేలవుతోంది. 194 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ 35,911 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు క్షీణించి10,763 వద్ద ట్రేడవుతోంది. దీంతో కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిల (సెన్సెక్స్ 36వేలు, నిఫ్టీ 10800 స్థాయి) దిగువకు చేరాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో రియల్టీ, ఐటీ, పీఎస్యూ బ్యాంక్స్ బలహీనంగాఉన్నాయి. అటు మెటల్, ఎఫ్ఎంసీజీ స్వల్పంగా లాభాపడుతున్నాయి. మెటల్ కౌంటర్లలో హిందాల్కో, ఎన్ఎండీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్, వేదాంతా, హింద్ కాపర్ 2-1 శాతం మధ్య లాభపడ్డాయి. ఇక ఐటీ షేర్లు టీసీఎస్, మైండ్ట్రీ, టాటా ఎలక్సీ, నిట్ టెక్, ఇన్ఫోసిస్ కూడా నష్టపోతున్నాయి. రియల్టీ కౌంటర్లలో శోభా డీఎల్ఎఫ్, ఒబెరాయ్, ప్రెస్టేజ్, ఇండియాబుల్స్, సన్టెక్ నష్టపోతున్నాయి. వీటితోపాటు టాటా మోటార్స్, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్, ఇన్ఫ్రాటెల్, ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, గెయిల్, అదానీ పోర్ట్స్, ఆర్ఐఎల్ లాంటి దిగ్గజాలు బలహీనంగా ఉన్నాయి. మరోవైపు ఐటీసీ, యూపీఎల్, ఓఎన్జీసీ, ఐవోసీ, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్పీసీఎల్ టాప్ విన్నర్స్గా ఉన్నాయి.