-
ఆసియా పారా క్రీడల్లో ‘రవి’ ప్రభంజనం
కె.కోటపాడు (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన తెలుగోడు చైనాలో జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో తన సత్తా చాటాడు. సిల్వర్ మెడల్ సొంతం చేసుకుని అందరి ప్రశంసలు పొందాడు. అనకాపల్లి జిల్లా, కె.కోటపాడు మండలం వారాడ శివారు చిరికివానిపాలెం గ్రామానికి చెందిన రొంగలి రవి ఆసియా పారా క్రీడల షాట్పుట్ విభాగంలో రజత పతకం సాధించాడు. చైనాలోని హాంగ్జౌలో ఆసియా పారా క్రీడా పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన పోటీల్లో ఎఫ్–40 షాట్పుట్ విభాగంలో పాల్గొన్న రవి 9.92 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ఈ పోటీల కోసం ఏడాదిన్నరగా బెంగళూరులోని సాయి అకాడమీలో శిక్షణ పొందినట్టు రవి ‘సాక్షి’కి తెలిపాడు. పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఈ పోటీలో ఇరాక్ దేశానికి చెందిన క్రీడాకారునికి గోల్డ్ మెడల్ దక్కిందని తెలిపాడు. స్వగ్రామంలో ఆనందం దేశం మెచ్చేలా రవి సిల్వర్ మెడల్ సాధించడంతో సొంత గ్రామం చిరికివానిపాలెంలో సందడి చోటుచేసుకుంది. అందరిలా ఎత్తుగా లేనన్న భావన మనసులోకి రానివ్వకుండా చిన్నప్పటి నుంచి డ్వార్్ఫ(దివ్యాంగుల క్రీడలు) క్రీడల్లో ఉత్తమ ప్రతిభను చాటేందుకు నిరంతరం శ్రమించేవాడని గ్రామస్థులు తెలిపారు. తల్లిదండ్రులు రొంగలి దేముడుబాబు, మంగ వ్యవసాయం చేసుకుంటూనే కుమారుడు క్రీడల్లో పాల్గొనేందుకు ప్రోత్సాహించారు. రవి చైనా నుంచి ఈనెల 28న దేశానికి రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రధాని అభినందన రవిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్(ట్విట్టర్) ద్వారా అభినందించారు. అతడిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. కేంద్ర క్రీడా శాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా రవికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. -
భయానక చిత్రం
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ (భయానక చిత్రం) అనేది ఉపశీర్షిక. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీ విష్ణు ఆవిష్కరించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ–‘‘పూర్తి స్థాయి హారర్ నేపథ్యంలో ‘పిండం’ ఉంటుంది. ఈ చిత్ర కథ ప్రస్తుతం, 1990, 1930.. ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. స్క్రీన్ ప్లే హైలైట్గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్ను ఈ నెల 30న రిలీజ్ చేస్తాం. నవంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి. -
రాయలసీమ నేపథ్యంలో సినిమా..అక్టోబరు 6న విడుదల
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. హీరో నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీ ప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించారు. ఈ సినిమాను అక్టోబరు 6న విడుదల చేస్తున్నట్లు యూనిట్ వెల్లడించింది. ‘‘రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్: రాజశేఖర్ సుద్మూన్, సంగీతం: జశ్వంత్ పసుపులేటి, నేపథ్య సంగీతం: సనల్ వాసుదేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: నరేష్ మాదినేని, లైన్ ప్రోడ్యూసర్: చందు కొత్తగుండ్ల. -
రీలిజ్కి సిద్ధమైన సగిలేటికథ.. సెన్సార్ పూర్తి
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్,పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి యూ/ఏ(U/A) సర్టిఫికేట్ జారీ చేశారు.ఈ చిత్రం చాలా న్యాచురల్ గా సగటు ప్రేక్షకుడికి నచ్చేలా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారని చిత్రబృందం పేర్కొంది. అక్టోబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
వాస్తవ ఘటనలతో...
నికిత శ్రీ, పృథ్వీరాజ్ (పెళ్లి), థర్టీ ఇయర్స్ పృథ్వీ, నాగమహేష్, జయవాణి కీలక పాత్రల్లో టీవీ రవి నారాయణన్ దర్శకత్వంలో ‘భ్రమర’ సినిమా షురూ అయింది. జి. మురళీ కృష్ణ నిర్మిస్తున్నారు. తొలి సీన్కి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత బెక్కం వేణు గోపాల్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత టి. రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భ్రమర’’ అన్నారు టీవీ రవి నారాయణన్. ఈ చిత్రానికి సహనిర్మాత: కల్యాణ్ చక్రవర్తి. -
ఆ నమ్మకం ఉంది – ఏయం రత్నం
‘‘7/జీ బృందావన కాలనీ’ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్లో కూడా అంతే పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. రవి హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలోనే ‘7/జీ బృందావన కాలనీ’ రెండో భాగాన్ని అక్టోబర్ నుంచి ప్రారంభిస్తున్నాం’’ అని నిర్మాత ఏయం రత్నం అన్నారు. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘7/జీ బృందావన కాలనీ’. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఏయం రత్నం నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను ఈ నెల 22న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ వేడుకలో రవికృష్ణ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చూడగానే మళ్లీ రవి పాత్రలోకి వెళ్లిపోయాను. ఈ సినిమా రెండో భాగానికి ముందు మరోసారి ‘7/జీ బృందావన కాలనీ’ మ్యూజిక్ చూపించేలా ఈ చిత్రం రీ రిలీజ్ జరుగుతోంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సోనియా అగర్వాల్, నటుడు సుమన్ శెట్టి మాట్లాడారు. -
టాలీవుడ్ తెరపై మరో డ్రగ్ మరక
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లోని విఠల్నగర్లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులకు గత నెల 31న అక్కడి సర్వీస్ ఫ్లాట్లో చిక్కిన వారిలో ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డి ఉండగా... గురువారం పట్టుబడిన వారిలో ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి ఉన్నారు. హీరో నవదీప్, ‘షాడో’ చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటి తదితరులు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఐసీసీసీలో టీఎస్–నాబ్ ఎస్పీ (వెస్ట్) డి.సునీతా రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నాప్చాట్లో గాడ్ హెడ్స్ పేరుతో... నెల్లూరుకు చెందిన బి.బాలాజీ గతంలో ఇండియన్ నేవీలో అధికారిగా పని చేశాడు. కంటికి తీవ్రమైన గాయం కావడంతో మెడికల్లీ అన్ఫిట్ అయ్యాడు. దీంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచుగా హైదరాబాద్కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్లో రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా ఇతడికి హైదరాబాద్తో పా టు బెంగళూరు డ్రగ్ పెడ్లర్స్తో సంబంధాలు ఏర్ప డ్డాయి. దీంతో హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఫామ్హౌస్లు, గెస్ట్ హౌస్ల్లో రేవ్ పార్టీలు ఏర్పాటు నిర్వహించేవాడు. స్నాప్చాట్లో గాడ్ హెడ్స్ పేరుతో ఐడీ క్రియేట్ చేసి దీని ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఈ యాప్లో మెసేజ్ చదవగానే డిస్అప్పియర్ అయ్యే ఆప్షన్ ఉండటంతోపాటు కస్టమర్లకు ప్రత్యేక కోడ్లు ఇవ్వడం ద్వారా దందా సాగించాడు. గత నెల 31న ఇతడితోపాటు రమణారెడ్డి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగా పని చేస్తున్న డి.మురళిని అరెస్టు చేశారు. వీరిని విచారించడంతో ఈ డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. నైజీరియన్ల ద్వారా రామ్ కిషోర్కు... బాలాజీ ముగ్గురు నైజీరియన్లతోపాటు నగరానికి చెందిన రామ్ కిషోర్ వైకుంఠం (పరారీలో ఉన్నాడు) నుంచి డ్రగ్స్ ఖరీదు చేసేవాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమోబీ చికోడి మొనగాలు, ఇక్బావే మైకేల్, థామస్ అనఘకాలు నుంచి బాలాజీకి కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ అందుతున్నాయి. డ్రగ్ పార్టీల నిర్వహణకు బాలాజీకి రమణా రెడ్డి ఫైనాన్స్ చేస్తుండేవాడు.ఇతడికి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఖాతా ఉంది. ఇందులో ప్రస్తుతం రూ.5.5 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతోపాటు రమణారెడ్డి, బాలాజీలకు ఉన్న ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. వీటిని స్వాధీనం చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసిన 18 మంది కస్టమర్లలో సినీ రంగానికి చెందిన వారితోపాటు పబ్లు, స్నూకర్ పార్లర్ల నిర్వా హకులు ఉన్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో స్నాట్ పబ్ నిర్వహించే సూర్య, జూబ్లీహిల్స్లో టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రో నిర్వహించే అర్జున్, గుంటూరులో స్నూకర్ పార్లర్ నిర్వహించే పీఎస్ కృష్ణ ప్రణీత్ కీలకం. వీరు తమ సంస్థల్లోనే రహస్య గదులు ఏర్పాటుచేసి డ్రగ్స్ వినియోగానికి సహకరిస్తూ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్లు ఆఫ్ చేసుకున్న నవ్దీప్, రవి బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిలో ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారూ ఉన్నట్లు టీఎస్ నాబ్ గుర్తించింది. హీరో నవదీప్, షాడో, రైడ్ చిత్రాల నిర్మాత రవి ఉప్పలపాటి, మోడల్ శ్వేత, మాజీ ఎంపీ దేవరకొండ విఠల్రావ్ కుమారుడు సురేశ్ రావ్, ఇంద్రతేజ్, కార్తీక్లతోపాటు కలహర్రెడ్డి ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు బెంగళూరులో జరిగిన డ్రగ్ పార్టీకి హాజరయ్యారనే విషయం 2021లో వెలుగులోకి వచ్చి కలకలం సృష్టించింది. ఈ పార్టీ నిర్వాహడుకు కలహర్రెడ్డే కావడం గమనార్హం. మరోపక్క ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేసిన 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు ఉంది. నిందితుల కోసం ఏసీపీ కె.నర్సింగ్రావు, ఇన్స్పెక్టర్ పి.రాజేష్, కానిస్టేబుల్ సత్యనారాయణ తదితరుల బృందం గాలించింది. అమోబీ చికోడి, ఇక్బావే మైకేల్, థామస్తోపాటు సురేశ్ రావ్, కొల్లి రామ్చంద్, కూరపాటి సందీప్, అనుగు సుశాంత్ రెడ్డి, కృష్ణ ప్రణీత్లను పట్టుకుంది. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. నవదీప్, రవి ఉప్పలపాటి సహా మిగిలిన నిందితులు తమ ఫోన్లు ఆఫ్ చేసుకుని, కుటుంబంతో సహా పరారయ్యారు. -
తెలుగు ట్రావెలర్ రవితో స్పెషల్ ఇంటర్వ్యూ
-
ప్రపంచాన్ని చుట్టిన తెలుగు వీరుడు..
-
అట్టా.. ఎట్టాగా పుట్టేసినావు...
రవి మహాదాస్యం, విషికా లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించారు. జశ్వంత్ పసుపులేటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘‘అట్టా ఎట్టాగా పుట్టేసినావు..’ అంటూ సాగేపాటని మ్యూజిక్ డైరెక్టర్ రధన్ రిలీజ్ చేశారు. రాజశేఖర్ సుద్మూన్, జశ్వంత్ పసుపులేటి రాసిన ఈపాటను యశ్వంత్ నాగ్, కమల మనోహరిపాడారు. ‘‘హీరో, హీరోయిన్ తొలి చూపులోనే ప్రేమలో పడే సీన్లో వచ్చేపాట ఇది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది: రామ్గోపాల్ వర్మ
‘‘సగిలేటి కథ’ సినిమా ట్రైలర్ నాకు చాలా ఎగ్జయిటింగ్గా అనిపించింది. ‘ఏదో జరిగే..’ పాటని అందంగా తీశారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ. రవి మహాదాస్యం, విషికా లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. నటుడు నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించారు. జశ్వంత్ పసుపులేటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఏదో జరిగే..’ వీడియో సాంగ్ని రామ్గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. ‘‘నేను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి వర్మగారే’’ అన్నారు దేవీప్రసాద్ బలివాడ. ‘‘రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్ సుద్మూన్. ‘‘ఏదో జరిగే..’ పాట అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అశోక్ మిట్టపల్లి. సి స్పేస్ కో ఫౌండర్ పవన్ మాట్లాడారు. -
చాలా విలువైనది
హృతిక్ శౌర్య, తన్వి నేగి జంటగా రవి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ అనేది ట్యాగ్ లైన్. ఫ్లిక్ నైన్ స్టూడియోస్పై ఫ్లిక్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాకి ‘ఓటు’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ‘‘ఓటు విలువ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. త్వరలో మా చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: ఎస్. రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: రామకృష్ణ. -
అనకాపల్లి కలెక్టర్కు గౌరవ డాక్టరేట్
సాక్షి, అనకాపల్లి: పరిపాలనా దక్షతకు గుర్తింపు వచ్చింది. అంకిత భావానికి కితాబు లభించింది. సేవాతత్పరతకు అరుదైన గౌరవం దక్కింది. పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ తొలి గౌరవ డాక్టరేట్ను అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్శెట్టికి ప్రదానం చేసింది. శనివారం విశాఖలో జరిగిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మూడో స్నాతకోత్సవంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ గౌరవ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ అర్చన భట్టాచార్య డాక్టరేట్ను అందించారు. ఐటీడీఏ పీఓగా, జేసీగా, కలెక్టర్గా గిరిజనులకు అందించిన సేవలు, ఆయన హయాంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలన దక్షతకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. రవి పట్టాన్శెట్టి ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘స్వస్థ భారత్’లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అనకాపల్లి జిల్లా నుంచి అందుకున్న అవార్డును కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇనిస్టిట్యూట్ భూ వివాదంపరిష్కారంలో కీలక పాత్ర పెట్రో యూనివర్సిటీ పున:ప్రారంభంలో కలెక్టర్ రవి పట్టాన్శెట్టి కీలక పాత్ర పోషించారు. తాత్కాలిక క్యాంపస్ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఉండగా.. సబ్బవరం వంగలి గ్రామంలో వర్సిటీని నిర్మించేందుకు రూ.855 కోట్లు మంజూరయ్యాయి. దీనికోసం 201.08 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ చేశారు. మధ్యలో సుమారు 20 ఎకరాల వరకు రైతులు తమకు అన్యాయం జరిగిందని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్మాణ పనులకు ఆటంకం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అనకాపల్లి కలెక్టర్ రవిపట్టాన్ శెట్టి నిర్వాసితులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీంతో హైకోర్టు వర్సిటీ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం, పెట్రో యూనివర్సిటీకి అవరోధాలు తొలగిపోవడం జరిగింది. 2022 డిసెంబర్ 23న పనులు పున:ప్రారంభించారు. ప్రస్తుతం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశారు. పనులు కూడా జరుగుతున్నాయి. -
'సగిలేటి కథ' అందరికి నచ్చుతుంది
కథ బాగుంటే చిన్నా-పెద్ద అనే తేడా లేకుండా ఆ చిత్రానికి బ్రహ్మరథం పడతారు తెలుగు ప్రేక్షకులు. ఈ మధ్య విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ‘సామజవరగమనా’, ‘బేబీ’ చిత్రాలే అందుకు మంచి ఉదాహరణలు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలైన భారీ విజయం సాధించాయి.‘సగిలేటి కథ’ చిత్రం కూడా కచ్చితంగా అందరికి నచ్చుతుందని ధైర్యంగా చెబుతోంది చిత్రబృందం. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి 'రాజశేఖర్ సుద్మూన్' దర్శకత్వం వహించారు. అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మించారు. ప్రస్తుతం, ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే 1.5 మిలియన్ల వ్యూస్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. త్వరలోనే ఒక మంచి లవ్ సాంగ్ తో ప్రేక్షకులని అలరించబోతున్నామని వెల్లడించింది. ట్రైలర్ కంటే, మూవీ ఇంకా బాగా ఆకట్టుకుంటుందని ధైర్యంగా చెబుతున్నారు. సెప్టెంబర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కన్నకొడుకే కాలయముడు.. రోకలితో..
మంచిర్యాల: మద్యం మత్తులో జరిగిన తగవు ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. తండ్రీకొడుకుల మధ్య జరిగిన గొడవలో కన్నతండ్రినే కుమారుడు రోకలితో మోది హత్యచేసిన ఘటన కౌటాల మండల కేంద్రంలోని నదిమాబాద్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన పంబాల పర్వతాలు (51) పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి కుమారుడు రవి, కుమార్తె స్వప్న సంతానం. రవి మద్యానికి బానిస కావడంతో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా పర్వతాలు ఇటీవల గేదెను కొనుగోలు చేశాడు. సోమవారం తండ్రి ఇంట్లోలేని సమయంలో రవి గేదెను తీసుకెళ్లి సంతలో విక్రయించాడు. వచ్చిన డబ్బులతోనే మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న తండ్రి కుమారుడిని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రవి విచక్షణ కోల్పోయి తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. వంటగదిలో ఉన్న రోకలితో తండ్రి తలపై బాదడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని కౌటాల సీఐ సాధిక్ పాషా పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మృతునికి భార్య వెంకక్క ఉన్నారు. -
రవి దహియాకు షాక్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ రవి దహియా ఆసియా క్రీడలకు అర్హత సాధించలేకపోయాడు. టోక్యో ఒలింపిక్స్లో రజతం, కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, వరుసగా మూడేళ్లు ఆసియా చాంపియన్గా నిలిచిన రవి దహియా (57 కేజీలు) ఆదివారం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో ఆతీశ్ తోడ్కర్ (మహారాష్ట్ర) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. అయితే ఈ విభాగంలో అమన్ సెహ్రావత్ విజేతగా నిలిచి ఆసియా క్రీడల బెర్త్ను దక్కించుకున్నాడు. ఇతర విభాగాల్లో దీపక్ పూనియా (86 కేజీలు), విక్కీ (97 కేజీలు), యశ్ (74 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు), విశాల్ కాళీరామన్ (65 కేజీలు) విజేతలుగా నిలిచారు. 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియాకు నేరుగా ఆసియా క్రీడల్లో ఆడే అవకాశం కల్పించడంతో విశాల్ ‘స్టాండ్బై’గా ఉంటాడు. -
మంత్రిపై అవినీతి ఆరోపణలు.. డిస్మిస్ చేసిన గవర్నర్
చెన్నై: తమిళనాడులో మరోసారి ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆవినీతి ఆరోపణల నేపథ్యంతో అరెస్ట్ అయిన మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించారు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి. ఈ మేరకు గురువారం రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ‘జాబ్స్ పర్ క్యాష్, మనీలాండరింగ్తో సహా అనేక అవినీతి కేసుల్లో మంత్రి సెంథిల్ బాలాజీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సెంథిల్ను గవర్నర్ మంత్రివర్గం నుంచి ఆయన్ను తొలగించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి’ అని రాజ్ భవన్ ప్రకటనలో పేర్కొంది. కాగా జూన్ 14న తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖల మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చెన్నైలోని మంత్రి అధికారిక నివాసాలు, కార్యాలయాల్లో 18 గంటలపాటు సోదాలు, విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంది. ఈ సమయంలో గుండెపోటు రావడంతో ఆయనకు శస్త్ర చికిత్స అనివార్యమైంది. కావేరి ఆస్పత్రిలో డాక్టర్ ఏఆర్ రఘురాం బృందం ఐదు గంటల పాటు శ్రమించి సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ విజయవంతం చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీ దర్యాప్తు చేస్తున్న క్రిమినల్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దివంగత సీఎం జయలలిత హయాంలో(2011-2016) రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీపై లంచాలు తీసుకుని ఉద్యోగాలిచ్చినట్లు (క్యాష్ పర్ జాబ్స్) కుంభకోణం కేసు ఉంది. ఇందులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. చదవండి: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. ఆ రోజే వరంగల్కు రాక సెంథిల్ బాలాజీ రాజకీయ ప్రస్థానం బాలాజీ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున కరూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో కరూర్ నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి దివంగత జె. జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2015లో జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ కుటుంబ సభ్యుడితో విభేదాలు రావడంతో కేబినెట్ నుంచి తొలగించారు. 2016 ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అన్నాడీఎంకే ప్రభుత్వంలో కేబినెట్ హోదా లభించలేదు. 2017లో అనర్హత వేటు అన్నాడీఎంకేలో చీలిక తర్వాత బాలాజీ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్కు మద్దతు తెలిపాడు. 2017లో ముఖ్యమంత్రిని మార్చాలంటూ అప్పటి గవర్నర్కు పిటిషన్ అందించినందుకు.. అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేసిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. బాలాజీ 2018లో డీఎంకేలో చేరి అరవకురిచ్చి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్లీ 2019లో అదే నియోజకవర్గం నుంచి, 2021లో కరూర్ నుంచి గెలిచారు. సీఎంకు సన్నిహిత వ్యక్తిగా బాలాజీ ముఖ్యమంత్రి స్టాలిన్కు సన్నిహిత వ్యక్తిగా పేరుగాంచడంతో మంత్రి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల అన్నాడీఎంకే నుంచి మారినప్పటికీ అతనికి ముఖ్యమైన శాఖలను కేటాయించాడు. అనంతరం బాలాజీపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి గెలుపొందిన ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. టెండర్ల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగాయని బార్ యజమానులు ఆయనపై ఆరోపణలు గుప్పించారు. కొంతమంది బార్ యజమానులు అతని పేరు మీద నెలవారీ రక్షణ డబ్బును డిమాండ్ చేశారని కూడా ఆరోపించారు. -
వెంచర్ను దున్నిన కేసులో టీడీపీ నేతల అరెస్టు
చక్రాయపేట: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలంలోని సురభి గ్రామం నాగలగుట్టపల్లెలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ను దౌర్జన్యంగా దున్నేసిన కేసులో ఎనిమిది మంది టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్చేశారు. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవితోపాటు వందలాది మంది ఆయన అనుచరులు ఇటీవల నాగలగుట్టపల్లెలో రియల్ ఎస్టేట్ వెంచర్ను ట్రాక్టర్తో దున్నేసి వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. బీటెక్ రవి, స్థానిక టీడీపీ మండల అధ్యక్షుడు మహేశ్వరరెడ్డితోపాటు సుమారు 200 మందిపై బాధిత వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మంగళవారం శంకర్రెడ్డి, యోగీశ్వరరెడ్డి, కుమార్రెడ్డి, వెంకటవిజయభాస్కర్రెడ్డి, రామాంజులరెడ్డి, రెడ్డెయ్య, శ్రావణ్కుమార్రెడ్డి, రాజేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చక్రాయపేట ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. వెంచర్ను దున్నేసినవారిలో ఇప్పటి వరకు 32మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. వారిలో ఎనిమిది మందిని అరెస్టు చేయగా, మిగిలినవారి కోసం గాలిస్తున్నామన్నారు. ఈ ఘటనలో పాల్గొన్నవారిని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులైన బీటెక్ రవితోపాటు మహేశ్వరరెడ్డి, మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. -
పులివెందుల చక్రాయపేటలో టీడీపీ నేత బీటెక్ రవి దౌర్జన్యం
-
కర్నాటక: అభ్యర్థుల ఎంపికలో కొత్త ప్రయోగం.. సీటీ రవి స్పందన ఇదే..
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన లిస్టులో 52 మంది కొత్త అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలో కర్నాటకలో పలువురు సీనియర్లకు బీజేపీ అధిష్టానం హ్యాండిచ్చింది. కాగా, 224 అసెంబ్లీ స్థానాలకు గాను 189 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్ను మంగళవారం రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి అభ్యర్థుల ఎంపికపై కీలక ప్రకటన చేశారు. తాను చిక్మంగుళూరు నుంచి బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీ బలంగా ఉందన్నారు. ఏప్రిల్ 20వ తేదీన రెండో లిస్టులో మిగత అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలిపారు. బీజేపీ ఎప్పుడూ ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉంటుదని స్పష్టం చేశారు. అందులో భాగంగానే 52 మంది కొత్త అభ్యర్థులకు ఎన్నికల్లో అవకాశం ఇచ్చినట్టు వెల్లడించారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక, బీజేపీ అభ్యర్థులపై అరుణ్ సింగ్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. 52 మంది కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించాము. వారిలో 8 మంది మహిళలు, 9 మంది డాక్టర్లు, ఐదుగురు లాయర్లు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ముగ్గురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎనిమిది మంది సామాజిక కార్యకర్తలు ఉన్నారని స్పష్టం చేశారు. కాగా, కర్నాటక మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజేంద్రన్కు కూడా టికెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మాజీ బెంగళూరు పోలీసు కమిషనర్ భాస్కర్ రావు.. చామరాజ్పేట్ నుంచి పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు, రాష్ట్ర మంత్రులైన శశికళ జోలాయి, ఆర్ అశోక్, ప్రభో చౌహాన్, శంకర్ మునియాకప్ప, మునిరత్న, ఎస్టీ సోమశేఖర్, వీసీ పాటిల్, వరిటీ వాసురాజ్, ముర్గేష్ నిరాణి, సీసీ పాటిల్, సునీల్ కుమార్, శివరామ్ హెబ్బార్లకు టిక్కెట్లు ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విశ్వసర్ హెగ్డేకు కూడా టికెట్ దక్కింది. ఇక, మొదటి లిస్ట్ అభ్యర్థుల్లో లింగాయత్-51, వొక్కలింగ-41, కుర్బా-7, ఎస్సీ-30, ఎస్టీ-16, ఓబీసీ సామాజికవర్గం నుంచి 32 మందికి టిక్కెట్లు ఇచ్చారు. ఇదిలా ఉండగా, రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ నిరాకరించడంతో బెలగావి నార్త్లోని సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే అనిల్ బెనకే మద్దతుదారులు మంగళవారం సాయంత్రం నిరసనలకు దిగారు. అలాగే, ఎమ్మెల్యే మహదేవప్ప యాదవ్కు టిక్కెట్ నిరాకరించడంపై బెళగావిలోని రామ్దుర్గ్ నియోజకవర్గంలో ఆయన మద్దతుదారులు నిరసన తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన చిక్క రేవణ్ణకు టికెట్ దక్కింది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించడంతో బీజేపీ అధిష్టానం ఆయనను ఢిల్లీకి పిలిచి మాట్లాడుతున్నట్టు సమాచారం. -
‘మేడారం గోవిందరాజుల’ పూజారి హత్య
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని గోవిందరాజుల గద్దె వద్ద పూజారిగా వ్యవహరిస్తున్న గబ్బగట్ల రవి(45)ని సోమవారంరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన దబ్బగట్ల రవి అత్తగారి గ్రామమైన మేడారంలో స్థిరపడ్డారు. వీరిది గోవిందరాజుల గద్దె పూజారుల కుటుంబం. ఈ కుటుంబీకులు వారానికి ఒకరు చొప్పున గద్దె వద్ద పూజలు నిర్వహిస్తుంటారు. తనవంతు వారంలో రవి భక్తులకు బొట్టు పెట్టి పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే రవి హత్య జరగడం మేడారంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావులు మంగళవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా వివరాలు సేకరించారు. బైక్పై తిరిగిన వారే హత్య చేశారా? గోవిందరాజుల పూజారి రవి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తు లు రవిని బైక్పై ఎక్కించుకుని సోమవారం మేడారంలో తిరిగారని, మద్యం కూడా సేవించారని స్థానికులు చెబుతున్నారు. ఆ ఇద్దరిలో ఓ మహిళ కూడా ఉందని అంటున్నారు. తమ పర్సు పోయిందని, దానిని వెతుకుదామంటూ రవిని బైక్పై తీసుకెళ్లారని, ఆ పర్సు విషయమై స్థానికంగా పలువురిని వాకబు కూ డా చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో మేడారం రోడ్డు పక్కన ఉన్న ఓ షెడ్డు వద్ద రాత్రి వంట కూడా చేసుకున్నారని, మద్యం తాగించిన అనంతరం రవి తలపై బండరాళ్లతో కొట్టి చంపి ఉంటారని, ఆయన చెప్పులు ఘటనాస్థలానికి దూరంగా పడి ఉండటంతో అంతకుముందు పెనుగులాట కూడా జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులతో పూజారి రవికి ఇంతకుముందే పరిచయముందా అనే విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సోమవారం రాత్రి స్థానికంగా కరెంట్ సరఫరా లేదని, ఇదే అదనుగా రవిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో క్వార్టర్ మందు సీసా, పచ్చడి ప్యాకెట్ పడి ఉన్నాయి. -
అమెరికా ఎయిర్ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా చౌధరి
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్ రవి చౌధరి చరిత్ర సృష్టించారు. అమెరికా రక్షణ శాఖలో ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి భారతీయ అమెరికన్ ఈయనే. రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్లోని ఈ అత్యున్నత పదవికి రవి చౌధరిని నామినేట్ చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన సిఫారసును సెనేట్ 65–29 ఓట్ల తేడాతో బుధవారం ఆమోదించింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన డజనుకు పైగా సభ్యులు సైతం రవి చౌధరికి మద్దతివ్వడం విశేషం. రవి అమెరికా ఎయిర్ ఫోర్స్లో 1993–2015 నుంచి 22 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆపరేషనల్, ఇంజినీరింగ్, సీనియర్ స్టాఫ్ అసైన్మెంట్లు వంటి వైవిధ్యమైన అంశాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ)లోని అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి డైరెక్టర్ కూడా వ్యవహరించారు. సి–17 పైలట్గా అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధ విధుల్లో పాలుపంచుకున్నారు. సిస్టమ్స్ ఇంజినీర్ కూడా అయిన చౌధరి నాసాలోనూ పనిచేశారు. -
పాత కలెక్టర్పై కొత్త కలెక్టర్కు ఫిర్యాదు
జగిత్యాల: చేపట్టిన అభివృద్ధి పనికి బిల్లు చెల్లించలేదంటూ ఒక సర్పంచ్ పాత కలెక్టర్పై ప్రస్తుత కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట సర్పంచ్ తునికి నర్సయ్య కథనం ప్రకారం.. కలెక్టర్ రవి జగిత్యాల జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో దమ్మయ్యపేటలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. బడికి ప్రహరీ నిర్మించాలని ఆ సమయంలో సర్పంచ్కు సూచించి.. బిల్లులు సైతం వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే 150 మీటర్ల పొడవుతో సర్పంచ్ గోడ నిర్మించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు బిల్లు లు విడుదల కాలేదు. ఈలోగా కలెక్టర్ రవి బదిలీపై వేరే జిల్లాకు వెళ్లిపోయారు. దీంతో ప్రహరీ నిర్మాణ బిల్లులు ఇంకా తనకు రాలే దని సర్పంచ్ నర్సయ్య సోమవారం ప్రజావాణిలో అప్పటి కలెక్టర్ రవిపై ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషాకు ఫిర్యాదు చేశారు. -
ఆ ఐదుగురినీ విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్, సిరిసిల్లటౌన్: దుబాయి జైల్లో మగ్గుతున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు తెలంగాణ వాసులను విడుదల చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలిని కోరారు. భారత పర్యటనలో భాగంగా అబ్దుల్ నసీర్ సోమవారం హైదరాబాద్ ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దుబాయ్లో శిక్ష అనుభవిస్తున్న వారి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని కేటీఆర్ అందజేశారు. నేపాల్కు చెందిన దిల్ప్రసాద్రాయ్ మృతి కేసులో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేశ్, రవి, నాంపల్లి వెంకటేశ్, దండుగుల లక్ష్మణ్, హనుమంతులు ప్రస్తుతం దుబాయ్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారని రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. యూఏఈ చట్టాల మేరకు రూ.15 లక్షల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు 2013లో తానే స్వయంగా నేపాల్ వెళ్లి బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు తెలిపారు. బాధిత కుటుంబం నుంచి అన్నిరకాల పత్రాలను 2013లోనే దుబాయ్ ప్రభుత్వానికి అందించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని చెప్పారు. ఈ విషయంలో చొరవచూపాలని కోరారు. హైదరాబాద్ భేష్: యూఏఈ రాయబారి ప్రశంసలు కేటీఆర్తో జరిపిన భేటీలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం, ఐటీ దాని అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా యూఏఈ రాయబారికి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని స్టార్టప్ ఈకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఈకో సిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈలోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్కు పరిచయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి... తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను, హైదరాబాద్ ఈకో సిస్టంలోని స్టార్టప్ సంస్థలను అనుసంధానించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. -
తమిళనాడు Vs తమిళగం దుమారం..వివరణ ఇచ్చిన గవర్నర్
తమిళనాడు రాష్ట్రం పేరు విషయంలో గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు పెద దుమారం రేపాయి. ఏకంగా తమిళనాడు వర్సెస్ తమిళగం అనే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరదించుతూ గవర్నర్ రవి వివరణ ఇచ్చారు. తాను తమిళనాడుకి వ్యతిరేకిని కానని తాను పేరు మార్చాలని సూచించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని నొక్కి చెప్పారు. తన మాటలను అర్థం చేసుకోకుండా కొందరూ అలా కావాలనే వక్రీకరించారన్నారు. తమిళ ప్రజలు, కాశీకి మధ్య గల చారిత్రక సాంస్కృతిక అనుసంధానం గురించి మాట్లాడుతూ..'తమిళగం' అనే పదాన్న ప్రస్తావించానని చెప్పారు. వాస్తవానికి ఆ రోజుల్లో తమిళనాడు లేదన్నారు. అందుకనే చారిత్రక సాంస్కృతిక సందర్భంలో 'తమిళగం' అనే పదాన్ని సముచితమైనదిగా చెప్పేందుకు యత్నించానన్నారు. అంతేగాదు గవర్నర్ తనపై వస్తున్న వ్యతిరేక వాదనలకు ముంగింపు పలికేలా వివరణ ఇస్తూ.." 'తమిళనాడు' అంటే 'తమిళుల దేశం' అని, 'తమిళగం' అంటే 'తమిళుల ఇల్లు' అని అర్థం. 'నాడు' అనే పదానికి అర్థం 'భూమి'. భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాన్ని వర్ణించడానికి ఈ పదాన్ని వాడాలని చాలమంది భావిస్తున్నారు. తమిళనాడు భారతదేశంలో అంతర్భాగం కాదనే కథనాన్ని పురికొల్పే వారికి ఈ వాదన సరితూగవచ్చు. దేశం మొత్తానికి వర్తించేది తమిళనాడు కాదని, అలవాటుగా మారింది. నిజం గెలవాలంటే తమిళగం సరైన పదం. విదేశీయలు పాలన కాలంగా మన సంస్కృతి నాశనమై ఇలా ఈ పదం వచ్చిందని వివరణ ఇచ్చారు. కాగా పొంగల్ వేడుకలకు రాజ్భవన్ ఆహ్వానంలో తమిళ వెర్షన్లో గవర్నర్ని తమిళగ ఆజునర్ లేదా తమిళగం గవర్నర్ అని ప్రస్తావించడం, దానికి తోడు ఆయన కూడా తమిళనాడు పేరు గురించి మాట్లాడటం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను గవర్నర్ రవి ముందుకు తెచ్చారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. అంతేకాదు రవికి వ్యతిరేకంగా అసెంబ్లీలో క్విట్ తమిళనాడు, గెట్ ఔట్ రవి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కూడా. (చదవండి: పెద్దనాన్న ఇంటికి ఉదయ నిధి స్టాలిన్.. ఆనందంతో ఆహ్వానించిన కాంతి అళగిరి)