-
హేమ బుకాయింపు..
-
బెంగళూరు రేవ్ పార్టీ.. జైలు నుంచి హేమ విడుదల
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమ ఇవాళ విడుదలయ్యారు. ఈ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ లభించడంతో కొద్దిసేపటి క్రితమే జైలు నుంచి బయటికి వచ్చారు. కాగా.. బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటి హేమ బెయిల్ కోసం పిటిషన్ వేయగా స్థానిక కోర్టు మంజూరు చేసింది.నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అయితే, హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
‘మా’లో హేమప్రాథమిక సభ్యత్వం సస్పెన్షన్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దీంతో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఆమెప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. హేమ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసే విషయమై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు ΄్యానెల్ సభ్యులతో బుధవారం సమావేశం నిర్వహించారట. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ‘మా’ కార్యదర్శి రఘుబాబు ఓ లేఖ విడుదల చేశారు.మే నెలలో బెంగళూరు రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల నివేదికలో నిర్ధారణ కావడంతో ‘మా’ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు ‘మా’ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె నుంచి స్పందన లేకపోవడంతో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు, విచారణ తేలేవరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుందన్నట్లు హేమకు ‘మా’ లేఖ పంపినట్లు తెలిసింది. -
Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్
-
హేమకు వైద్య పరీక్షలు.. అలా కనిపించి షాక్ ఇచ్చిన నటి!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆమెకు పాజిటివ్ రావడంతో పోలీసులు నోటీసులిచ్చారు. మొదటిసారి అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేదు. హేమకు పోలీసులు రెండోసారి నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులిచ్చారు. దీంతో ఇవాళ సీసీబీ పోలీసుల ఎదుట ఆమె హాజరయ్యారు. విచారణ పూర్తయిన అనంతరం హేమను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం హేమకు ప్రభుత్వాస్పత్రిలో హేమకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వైద్య పరీక్షలకు హేమ బురఖా ధరించి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. ఈ కేసులో హేమను రేపు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు. రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు తీసుకున్నారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధిఖి, వాసు, అరుణ్కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.#Tollywood actress #Hema has been arrested by @CCBBangalore wen she came in Burqa to appear today after two notices in related to to Rave party which was held in #anekal, #bengaluru . Including Hema, more than 80+ people tested positive with Drug in 101 samples collected. pic.twitter.com/qxvQAUIFtx— Madhu M (@MadhunaikBunty) June 3, 2024 -
నటి హేమ అరెస్ అదనపు కేసులు నమోదు
-
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్
సాక్షి, బెంగళూరు: బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమ సీసీబీ పోలీసులు ఎదుట సోమవారం హాజరైంది. గత నెల 20న బెంగళూరు శివారులోని ఓ ఫామ్హౌస్లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే! మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది. బుకాయించినా దొరికిపోయిందిఅయితే మొదట ఆ రేవ్ పార్టీకి, తనకు సంబంధం లేదని బుకాయించింది. కానీ తనకు జరిపిన రక్త పరీక్షల్లో ఆమె డ్రగ్స్ తీసుకుందని రుజువైంది. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలంటూ హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే ఈమెని అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నారు.మాదకద్రవ్యాల విక్రయంకాగా బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధిఖి, వాసు, అరుణ్కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.చదవండి: ఉపాసన ఇంటికి చేరిన బుజ్జి.. క్లీంకార కోసం స్పెషల్ గిఫ్ట్ -
పూర్తి ఆధారాలతో హేమను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
రేవ్ పార్టీకి వెళ్దామనుకున్నా.. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా: నటి
జబర్దస్త్ షోతో జనాలకు దగ్గరైంది రీతూ చౌదరి. ఈ మధ్య యాంకర్గా బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఈవెంట్కు వెళ్లింది. అక్కడ తనకు రేవ్ పార్టీకి వెళ్లాలని ఉండేదన్న ఆకాంక్షను బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. నాకు నిజంగా రేవ్ పార్టీ అంటే తెలియదు. అసలు అదేంటో తెలియక రేవ్ పార్టీకి నాకెప్పుడు ఆహ్వానం పంపుతారా? నన్నెప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూశాను. రేవ్ పార్టీ అంటే ఏంటో తెలీదుకానీ తెలిశాక వద్దనుకుంటున్నాను. ఇప్పటికీ దానిపై నాకు పూర్తి అవగాహన లేదు. ఛానల్స్ చూసి అంతో ఇంతో తెలుసుకున్నాను. డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాలు తీసుకుంటారని తెలిశాక రేవ్ పార్టీకి వెళ్లడం అవసరం లేదనుకున్నాను. సినిమా ఇండస్ట్రీలోని వాళ్లు డ్రగ్స్ తెలిసి తీసుకుంటున్నారో, తెలియక తీసుకుంటున్నారో వాళ్లకే తెలియాలి. పోలీసులకు దొరికిపోయాక మనమేం చెప్తాం అంది. రీతూ చౌదరి ప్రస్తుతం దావత్ షో చేస్తోంది. అలాగే త్వరలోనే సరికొత్త షోతో ముందుకు రానున్నట్లు వెల్లడించింది. తన చేతిలో ఒక సినిమా కూడా ఉన్నట్లు తెలిపింది.అడ్డంగా దొరికిన హేమఇకపోతే ఇటీవల బెంగళూరులోని ఓ ఫామ్హౌస్లో రేవ్ పార్టీ జరిగింది. అర్ధరాత్రి దాటినా పార్టీ జరుగుతుండటంతో పోలీసులు ఫామ్హౌస్పై రైడ్ చేశారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పలువురినీ అరెస్ట్ చేశారు. అందుటో టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా ఉంది. అయితే మొదట్లో తాను ఇంట్లో ఉన్నట్లు వీడియోలు రిలీజ్ చేస్తూ బుకాయించిన హేమ తర్వాత మాత్రం అడ్డంగా దొరికిపోయింది. తన ఒరిజినల్ పేరు కృష్ణవేణి పేరుతో పార్టీకి హాజరైందని, తన రక్తనమూనాల్లోనూ డ్రగ్స్ ఉన్నట్లు తేలిందని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది.చదవండి: బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా? -
రేవ్ పార్టీ.. నోటీసులను లెక్కచేయని హేమ
-
రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
శివాజీనగర: ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు సీసీబీ పోలీసులు మరో నోటీసు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని మొదటిసారి నోటీసు పంపగా, జ్వరం వచ్చినందున రాలేనని హేమ తెలిపారు. మంగళవారం రెండో నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్పారు. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వాసు, అరుణ్, సిద్ధికి, నాగబాబుతో పాటుగా ఐదుగురికి మే 27న 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం నుంచి వారిని సీసీబీ విచారణ చేపట్టింది. రేవ్ పార్టీ, డ్రగ్స్ సరఫరా వెనక ఉన్న వారిని తెలుసుకునే లక్ష్యంగా వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. -
వైరల్ ఫీవర్ పేరిట పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా
-
డ్రగ్స్ కేసులో ఎంతోమంది దొరికినా సినీ పరిశ్రమ పైనే ఎందుకు టార్గెట్ ?
-
రేవ్ పార్టీ కేసులో కీలక అరెస్టులు
-
రేవ్ పార్టీ కేసు: బెంగళూరు పోలీసులకు హేమ లేఖ.. విచారణకు డుమ్మా
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేడు నిందితులను బెంగళూరు క్రైమ్ బ్యాంచ్ పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని హేమ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖలో హేమ.. ఈ కేసులో తాను హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు తెలిపారు. అయితే, హేమ లేఖను సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్స్లో తేలింది. దీంతో, వారంతా ఈరోజు విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. అయితే రేవ్ పార్టీకి తాను హాజరుకాలేదని వీడియోలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. అలాగే, వారి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసు బ్యాంక్ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసులో వాసు ప్రధాన అనుచరుడు చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
బనశంకరి: ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట రేవ్ పార్టీ. బెంగళూరు నగరంలో నిర్వహించిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో అధిక మంది తెలుగువాళ్లే ఉన్నారని అందులోనూ రాజకీయ, సినీప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అసలు రేవ్ పార్టీలు అంటే ఏమిటి, ఇందులో కేవలం సెలబ్రెటీలే ఎందుకు పాల్గొంటారు, ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు, ఎందుకు సంపన్నులకు అంత వెర్రి అని ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్కాగా.. క్లారిటీ ఇచ్చే యత్నమే ఈ కథనం. నైట్ క్లబ్లు, పబ్లు అనే పాశ్చాత్య సంస్కతి దేశంలో వేళ్లూనుకున్నాయి. సెలబ్రెటీలు, బడాబాబులు.. వాటిలో తనివితీరా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అంతకుమించి కావాలనుకునేవారి కోసం రేవ్ పార్టీలు రెడీగా ఉంటాయి. రేవ్ పార్టీ అనే సంస్కృతి 1950లో ఇంగ్లండ్లో ప్రారంభమై మెల్లగా ప్రపంచమంతా విస్తరించింది. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తల్లో పెద్ద హాల్, లేదా ఎక్కడైనా చుట్టూ మూసి ఉన్న ప్రదేశంలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్సులు చేయడం, కావలసినంత మద్యం తాగడమే. ఆ షోలో నృత్యాలు చేసే కళాకారులు కూడా ఉండేవారు. అయితే..రానురాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తుంది. ఇందులోకి విచ్చలవిడి సంస్కృతి ప్రవేశించింది. నెమ్మదిగా ఈ రేవ్ పార్టీల్లోకి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జత అయ్యాయి. అతిథులు ఈ పారీ్టల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేయడం ఉంటాయని సమాచారం. అన్నింటికీ తెగించేవారే ఈ పార్టీల్లో పాల్గొంటారని సమాచారం. అన్ని రకాల హడావుడిముంబై, చెన్నై, బెంగళూరు,హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఈ కల్చర్ పెరిగిపోతుంది. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీలు చేసుకోవడం సబబే, కానీ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకోవడం, అరుపులు, కేకలతో స్థానికులకు ఇబ్బంది పెట్టడం చట్ట విరుద్ధమే అవుతుంది. పైగా డ్రగ్స్, జూదం వంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు అడుగు పెడుతున్నారు. సాధారణమైనా, రేవ్ అయినా పార్టీలపై పోలీసులు రైడ్చేసి అందులో డ్రగ్స్ వినియోగం ఏమైనా జరిగిందా లేదా అన్నది చూస్తారు. అశ్లీలత జరిగిందా, మైనర్లు పాల్గొన్నారా అన్నది కూడా ఆరాతీస్తారు. అనుమానం ఉంటే రక్తం, వెంట్రుకల నమూనాలను తీసుకుని టెస్టులకు పంపిస్తారు. ఆపై కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. డ్రగ్స్ వాడినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు ఉంటాయి. టికెట్ చాలా రేటు సాధారణంగా రేవ్ పార్టీలంటే చాలా ఖరీదైన వ్యవహారం. బెంగళూరులో జరిగిన రేవ్పార్టీకి ఎంట్రీ ఫీజు సుమారు రూ.50 లక్షలు అని ప్రచారం సాగుతోంది. ఇంత డబ్బు పోసి టికెట్ కొనాలి. వాటిని చాలా గోప్యంగా నిర్వహిస్తారు. ఈ పారీ్టలో పరిమిత సంఖ్యలో పాల్గొనేలా ప్లాన్ చేస్తారు. అతిథుల అభిరుచులను బట్టి పార్టీలో ఏర్పాట్లు ఉంటాయి. మద్యం, డ్రగ్స్, ఇంకా కొన్ని అంశాలు లభిస్తాయి. రేవ్పార్టీని బడా బాబుల ఫాంహౌస్, గెస్ట్ హౌస్లలో నిర్వహిస్తారు. 24 గంటల నుంచి 3 రోజుల వరకు కొనసాగవచ్చు. ఆహారం, ఆల్కహాల్ వంటి అన్ని వసతులూ లభిస్తాయి. ఊహల్లో మాత్రమే లభించే రకరకాల ఫాంటసీ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నా ఆశ్చర్యం లేదు. అందుకే అంత మోజు అంటారు. పార్టీలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు అనుమతించరు.ఉద్యానగరిలో దందా గత కొన్నేళ్లుగా సిలికాన్ సిటీలో రేవ్పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అనువైన వాతావరణం ఉండడమే కారణం. రెండేళ్ల క్రితం నగర పోలీసులు దాడిచేసి పలువురు సినీ సెలబ్రెటీలను అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్ను కూడా పట్టుకున్నారు. టెక్కీలు, ధనవంతును లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఖరీదైన పార్టీలను సాగిస్తున్నారు. వాటి నిర్వాహకులకు అటు నాయకులు, ఇటు ఖాకీలతో సంబంధాలు ఉండడంతో చూసీచూడనట్లు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవో కొన్నిసార్లు మాత్రమే దాడులు జరుగుతున్నాయి. కొన్నిరోజులు హడావుడి జరగడం, ఆపై సద్దుమణగడం షరా మామూలుగా మారుతోంది. -
బెంగళూరు రేవ్ పార్టీ.. ఈసారి బతికిపోయానన్న నవదీప్..!
బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు ఉన్నట్లు మొదట సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలొచ్చాయి. నటుడు శ్రీకాంత్, హేమ పేర్లు బయటికి రావడంతో వాళ్లిద్దరూ బయటికి వచ్చి క్లారిటీ ఇచ్చారు. కానీ హేమ ఆ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. ఆ తర్వాత జరిగిన బ్లడ్ శాంపిల్స్ టెస్ట్లో హేమకు పాజిటివ్ రావడంతో నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.అయితే గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమయంలో హీరో నవదీప్ పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను నటిస్తోన్న కొత్త సినిమా లవ్ మౌళి ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. ఈసారి మీరు ఫేక్ న్యూస్లో కనిపించడం లేదు కదా సార్ అని కొందరు ప్రశ్నించారు. ఇలాంటి వార్తలొచ్చినప్పుడు మీ పేరు కూడా వినిపించేది కదా సార్ అని అడగడంతో నవదీప్ స్పందించారు.ఈ సారి అంతా మంచే జరిగిందని.. ఈ ఒక్కసారి తనను వదిలేశారని నవదీప్ నవ్వుతూ సమాధానామిచ్చాడు. రేవ్ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆ పార్టీ వేరు వేరు దేశాల్లో వేరే విధంగా ఉంటుందన్నారు. రొమాంటిక్ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన లవ్ మౌళి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో భావన సాగి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ జూన్ 7న విడుదల కానుంది. -
రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు మంచు విష్ణు సపోర్ట్
-
హేమకు మద్దతు ప్రకటించిన మంచు విష్ణు
బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్హౌస్లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నటి హేమ పేరు బయటకు రావడంతో టాలీవుడ్లో సంచలనంగా మారింది. తాజాగా రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. ఈ క్రమంలో హేమ బ్లడ్ షాంపిల్స్లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో హేమ మే 27న విచారణకు వెళ్లనున్నట్లు సమాచారం.బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు తన ఎక్స్ పేజీలో ఒక ట్వీట్ చేశారు. నటి హేమపై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాలు ఆపాలని ఆయన కోరారు. ఆమెపై ఇంకా నేరం రుజువు కాలేదని ఆయన గుర్తుచేశారు. ఎవరికి వారే హేమ తప్పుచేసినట్లు నిర్ధారిస్తే ఎలా అని ప్రశ్నించారు. శ్రీమతి హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించబడాలి. ఆమె కూడా ఒక తల్లి, భార్య అని గుర్తించాలి. ఇలాంటి పుకార్ల ఆధారంగా చేసుకుని ఆమెను దూషించడం అన్యాయం.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను తప్పకుండా ఖండిస్తుంది. ఒకవేళ హేమ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలను పోలీసులు ఇస్తే ఆమెపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు, దయచేసి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండాలి.' అని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు.Regarding the recent drug-related case at a rave party, few media outlets and individuals are making baseless allegations about actress Ms.Hema.I urge everyone to refrain from jumping to conclusions and spreading unverified information. Ms.Hema deserves to be presumed innocent…— Vishnu Manchu (@iVishnuManchu) May 25, 2024 -
రేవ్ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు
యశవంతపుర: బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్హౌస్లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని సోమవారం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు సినీ నటి హేమ సహా పలువురికి నోటీసులు ఇచ్చారు. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. వీరిలో పలువురు తెలుగు, కన్నడ సినీ నటీనటులు, ఇంజనీర్లు, తదితరులు ఉన్నారు.ఈ నేపథ్యంలో తెలుగు నటి హేమతో పాటు 86 మందికీ బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసి మే 27న విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 19న వాసు అనే వ్యక్తి పుట్టిన రోజు పేరుతో ‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరుతో రేవ్ పార్టీని నిర్వహించాడు. ఇందులో 100 మందికి పైగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దాడి చేయగా ఎండీఎంఎం మాత్రలు, కొకైన్, హైడ్రో గంజాయి లభించాయి. ఐదుగురి బ్యాంకు ఖాతాలు సీజ్ రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన వాసు, అరుణ్కుమార్, నాగబాబు, రణధీర్బాబు, మహ్మద్ అబూబక్కర్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాను హైదరాబాద్లో ఉన్నానని, పార్టీలో లేనని హేమ పలు వీడియోల ద్వారా బుకాయించినా పోలీసులు అన్ని ఆధారాలు చూపించి విచారణకు రావాలని ఆదేశించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఖాతాలను సీజ్ చేయాలని నిర్ణయించారు. -
డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
బెంగళూరు రేవ్ పార్టీలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని సీసీబీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. నగర శివారులో గత ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి సుమారు 106 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి చెందిన రక్త నమూన పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు గుర్తించారు. తాజాగా వారందరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.టాలీవుడ్కు చెందిన సినీ నటి హేమ, ఆశూ రాయ్లకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు అరుణ్ చౌదరి, చిరంజీవి, క్రాంతి, రాజశేఖర్,సుజాత, రిషి చౌదరి, ప్రసన్న, శివాని జైశ్వాల్లకు కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరందరూ కూడా మే 27న విచారణకు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదేశించారు. వీరికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు..? ఇంకా ఎవరెవరితో డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయోనని విచారించనున్నారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఐదుగురుని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
బెంగళూరు రేవ్ పార్టీ..టీడీపీ లీలలు..లోకేష్ అనుచరులు అరెస్ట్..
-
బెంగళూరు రేవ్ పార్టీ కేసు: చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్ట్
సాక్షి, బెంగళూరు: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు వాసు ముఖ్య అనుచరుడు, ఈ కేసులో ఏ2గా ఉన్న అరుణ్ కుమార్ను బెంగళూరు క్రైం బ్యాచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరుణ్ ఏ2గా ఉన్నాడు. బర్త్ డే పార్టీ నిర్వహించిన వాసుకు అరుణ్ ముఖ్య అనుచరుడు. కాగా, అరుణ్ కుమార్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే, రేవ్ పార్టీలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, అరుణ్ను పోలీసులు అరెస్ట్చేసి విచారిస్తున్నారు.ఇక, బెంగళూరులోని బీఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి కూడా సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. మరోవైపు.. రేవ్ పార్టీపై పోలీసులు దాడుల నేపథ్యంలో అక్కడి నుంచి పారిపోయిన పూర్ణారెడ్డి అనే వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.ఇదిలాఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీకి వచ్చిన వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో టాలీవుడ్ నటి హేమా, ఆషీరాయ్ కూడా ఉన్నారు. వీరి బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్లను గుర్తించిన విషయం తెలిసిందే. ఇక, మిగతా వారి పేర్లను కూడా పోలీసులు ప్రకటించాల్సి ఉంది. ఇది కూడా చదవండి: బెంగళూరు రేవ్ పార్టీ.. తెలుగు డ్రగ్స్ పార్టీ.. -
బెంగళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతలే కీలక సూత్రదారులు
-
బ్లడ్ శాంపిలా?.. ప్రమాణమా?
నెల్లూరు (దర్గామిట్ట): జూదం, మద్యంతో పాటు అన్ని అవ లక్షణాలు కలిగిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తనను అప్రతిష్ట పాల్జేసేందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ‘బెంగళూరు రేవ్ పార్టితో నాకు సంబంధముందని నిరూపిస్తావా? బ్లడ్ శాంపిల్ ఇస్తావా? లేక ప్రమాణం చేస్తావా?’ అంటూ ఆయన సోమిరెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం మంత్రి కాకాణి విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు తన స్టిక్కర్ ఉందనే ప్రచారంతో సోమిరెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ ఆధ్వర్యంలోనే రేవ్ పార్టీ జరిగిందని, తన పాస్ పోర్ట్ దొరికిందని, గోపాల్ రెడ్డి తనకు సన్నిహితుడని చెత్త ఆరోపణలు చేశారని చెప్పారు.ఈ విషయంపై తాను సోమిరెడ్డికి మరోసారి సవాల్ విసురుతున్నానన్నారు. కారులో నా పాస్పోర్టు దొరికిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాస్పోర్ట్ తన దగ్గరే ఉందని చెబుతూ... కాకాణి దాన్ని మీడియాకు చూపించారు. ఆ కారు తుమ్మల వెంకటేశ్వరరావు పేరుతో ఉందని, ఆ కారుకు తన స్టిక్కర్ ఉందని జరుగుతున్న ప్రచారంపై ఇప్పటికే తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. నెల్లూరు నగరంలోని వేదాయపాళెం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారన్నారు. గోపాల్రెడ్డితో తనకు పరిచయమున్నట్టు ఏ ఆధారమున్నా సోమిరెడ్డి బయట పెట్టాలని డిమాండ్ చేశారు. గోపాల్రెడ్డికి – రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక పోలీసులే స్పష్టం చేశారని, సోమిరెడ్డి మాత్రం రేవ్ పార్టీని తనకు అంట కడుతున్నారన్నారు.క్లబ్కు వెళ్లడం, పేకాటాడటం, డ్రగ్స్ అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు. సోమిరెడ్డి వ్యక్తిత్వంపై గతంలో స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయని, వాటిని ఎప్పుడూ ఆయన ఖండించలేదన్నారు. పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి ప్రయత్నం చేశారని ఆరోపించారు. సోమిరెడ్డిపై తాను చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనన్నారు. గతంలో కోర్టులో చోరీ ఉదంతంపై తనకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు. తన సచ్చిలతను నిరూపించుకునేందుకు ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, మరి సోమిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిరూపించుకునేందుకు ఆయన సిద్ధమా? అని సవాల్ విసిరారు.