-
కేంద్రం కీలక నిర్ణయం!..రేషన్ కార్డు దారులకు గుడ్న్యూస్!
రేషన్ కార్డ్ హోల్డర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేసే గడువును మార్చి 31 నుంచి జూన్ 30,2023కి పొడిగించింది. ఈ పొడిగింపుపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (డీఎఫ్పీడీ) అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిత్యవసర వస్తువుల్ని రేషన్ కార్డు ద్వారా సబ్సీడీగా పొందవచ్చు. దీంతో పాటు పాస్పోర్ట్, పాన్ కార్డ్ ఎలా గుర్తింపు కార్డ్గా వినియోగించుకుంటామో.. ఈ రేషన్ కార్డ్ను అలాగే ఉపయోగించుకునేందుకు వీలుంది. అయితే దేశంలో నిజమైన రేషన్ కార్డ్ లబ్ధి దారుల్ని గుర్తించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డ్కు ఆధార్ కార్డ్ను జత చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డ్లు ఉంటే వాటిని రద్దు చేయడం, ఎక్కువ ఆదాయం అర్జిస్తూ రేషన్ కార్డు వినియోగిస్తుంటే ఆ రేషన్ కార్డ్లను క్యాన్సిల్ చేయనుంది. నిజమైన లబ్ధిదారులకు నిత్యవసర వస్తువుల్ని అందించనుంది. రేషన్ కార్డ్కు ఆధార్ లింక్ ఇలా చేయండి ♦ ముందుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్)వెబ్సైట్ను సందర్శించాలి. ♦ అందులో ఆధార్ కార్డ్ నెంబర్,రేషన్ కార్డ్ నెంబర్ తో పాటు ఫోన్ నెంబర్ వంటి వివరాల్ని నమోదు చేయాలి. ♦ అనంతరం కంటిన్యూ ఆప్షన్పై ట్యాప్ చేయాలి ♦ కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ♦ ఓటీపీ ఎంటర్ చేస్తే రేషన్ కార్డ్కు ఆధార్ లింక్ అవుతుంది ఆఫ్లైన్లో రేషన్ కార్డ్ - ఆధార్ లింక్ ఇలా చేయండి ♦ కుటుంబసభ్యుల ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు, రేషన్ కార్డ్ జిరాక్స్లు, బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు, కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో రేషన్ కార్యాలయానికి వెళ్లాలి ♦ అక్కడ ఆధార్ కార్డ్ డేటా బేస్లో మీ వివరాలని గుర్తించేలా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి ♦ ఆధార్ డేటా బేస్లో ఉన్న మీ వివరాలు మ్యాచ్ అయితే ఎస్ఎంఎస్ వస్తుంది. ♦ అనంతరం రేషన్ కార్డ్కు ఆధార్ కార్డ్ను జత చేస్తారు. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి గుడ్ న్యూస్! -
వచ్చేనెల నుంచి చిరుధాన్యాల పంపిణీ
సాక్షి, అమరావతి : బియ్యం కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాల పంపిణీకి రంగం సిద్ధంచేస్తోంది. తొలిదశలో వచ్చేనెల నుంచి పైలట్ ప్రాజెక్టు కింద రాయలసీమ జిల్లాల్లో అమలుచేయనుంది. లబ్ధిదారులకు ప్రతినెలా ఇచ్చే రేషన్లో రెండు కేజీల బియ్యం బదులు రాగులు, జొన్నలు సరఫరా చేస్తుంది. ఇందులో భాగంగా పౌరసరఫరాల సంస్థ తొలిసారిగా చిరుధాన్యాలైన రాగులు, జొన్నలను మద్దతు ధరకు (రాగులు–రూ.3,578.. జొన్నలు రూ.2,970 (హైబ్రిడ్), రూ.2,990 (మల్దండి))కొనుగోలు చేస్తోంది. రైతులను చిరుధాన్యాల సాగువైపు ప్రోత్సహించేందుకు ఉత్పత్తులను కొ నుగోలు చేసిన వెంటనే నగదు చెల్లింపులు చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చింది. కర్ణాటక నుంచి రాగుల సేకరణ రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ నుంచి రాగుల ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థ కర్ణాటక ప్రభుత్వం నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ద్వారా 25 వేల టన్నుల రాగులను సేకరిస్తోంది. మరోవైపు.. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే జొన్నల కొనుగోలు నిమిత్తం పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలు తెరిచింది. అయితే, మద్దతు ధర కంటే మార్కెట్ రేటు ఎక్కువగా ఉండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జొన్నల పంపిణీకి వీలుగా, రైతులకు మరింత మేలు చేసేలా మద్దతు ధరను పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. లబ్దిదారుల ఆసక్తి మేరకు.. ఇక రాయలసీమ జిల్లాల్లోని బియ్యం కార్డుదారుల ఆసక్తి మేరకు ప్రతినెలా ఒక కేజీ నుంచి రెండు కేజీల వరకు రాగులను అందించనున్నారు. ఇప్పటికే జొన్నలు ప్రైవేటు మార్కెట్కు తరలిపోవడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సేకరణ నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటివరకు 500 టన్నులే సేకరించింది. దీంతో భవిష్యత్తులో రైతులకు మరింత మేలు చేసేందుకు వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా చిరుధాన్యాల సాగు ప్రోత్సాహాకానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలో డిమాండ్, సప్లైకు అనుగుణంగా సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులకు అవగాహన కల్పించనుంది. పేదలకు బలవర్థకమైన ఆహారం రాష్ట్రంలో ప్రజలకు బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీఎం జగన్ సంకల్పానికి అనుగుణంగా వచ్చేనెల నుంచి పేదలకు చిరుధాన్యాలు పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో రాగుల నిల్వలు అందుబాటులో లేకపోవడంతో కర్ణాటక నుంచి సేకరించి ఇక్కడ పంపిణీ చేస్తాం. ఇప్పటికే జొన్నల సేకరణ చేపట్టాం. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ మంత్రి విస్తీర్ణం పెంచేలా చర్యలు రాష్ట్రంలో రేషన్ కింద రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నాం. బియ్యం కార్డుదారుల అవసరానికి అనుగుణంగా పంట ఉత్పత్తులు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి రేటు ఉంది. జొన్నలకు పౌల్ట్రీ రంగంలో డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ సేకరణ నెమ్మదిగా ఉంది. అందుకే మద్దతు ధర పెంచాలని కేంద్రానికి లేఖ రాశాం. – హెచ్.అరుణ్కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ -
రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఏడాది పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది. ఇప్పటిదాకా కిలో రూ.1కే అందిస్తున్న బియ్యాన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు (ఏడాది కాలం) ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో 1.46 కోట్ల బియ్యం కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆహార భద్రత చట్టం కిందకు వచ్చే (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డుదారులందరికీ ఏడాదిపాటు ఉచిత బియ్యం అందించనున్నట్టు ప్రకటించింది. ఏపీలో ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులతో సమానంగా నాన్ ఎన్ఎస్ఎఫ్ఏ కార్డుదారులకు కూడా ఉచితంగా బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ శనివారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బియ్యం పంపిణీ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రేషన్ దుకాణాలు, ఎండీయూ వాహనాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇది ఒక్క బియ్యానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ 1967కు లేదా 18004250082 నంబర్ను సంప్రదించవచ్చని చెప్పారు. ఉచిత బియ్యం పంపిణీపై విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టి, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
రేషన్కార్డుకు ఆస్తి పన్ను నంబర్ లింక్
సాక్షి, చెన్నై: రేషన్ కార్డుకు ఆస్తి పన్ను నంబరు లింక్ చేయడానికి నగర పాలక, స్థానిక సంస్థలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని గుర్తింపు కార్డులకు, ప్రభుత్వ రాయితీ, పథకాలకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత నెల రోజులుగా విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం శరవేగంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రేషన్ కార్డుకు ఆస్తి పన్ను నంబర్ను లింక్ చేయాలన్న నిర్ణయానికి నగర పాలక, స్థానిక సంస్థలు వచ్చాయి. బియ్యం కార్డు కలిగి ఉన్న రేషన్కార్డుదారులు ఏ మేరకు సొంతిళ్లను కలిగి ఉన్నారో, వారి ఆస్తుల వివరాలు రాబట్టేందుకు ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. లగ్జరీ కార్లు, బంగళాలు కలిగి ఉన్న వారు సైతం రేషన్ ద్వారా ప్రభుత్వ రాయితీలను పొందుతూ వస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టడం లక్ష్యంగా ఈ లింక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన ఎస్ఐ -
కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్!
కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో తీసుకుని రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ పథకం గడువుని పొడిచింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 2023 డిసెంబర్ వరకు ఉచిత రేషన్ అమలు కానుంది. దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి 5 కిలోల వరకు అందజేయనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజనను జాతీయ ఆహార భద్రతా చట్టంలో డిసెంబర్ 2023 వరకు విలీనం చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని క్యాబినెట్ సమావేశం తర్వాత ఆహార మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుత పొడిగింపు నిర్ణయం అమలు తర్వాత, ఈ స్కీమ్ ప్రయోజనం NFSA (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద లబ్ధిదారులకు ప్రయెజనాలను అందివ్వనున్నారు. 2020 నుంచి ప్రత్యేక PMGKAY పథకం కింద ప్రజలకు లబ్ధిచేకూరేది. నివేదికల ప్రకారం, దీంతో 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. దీని వలన ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది. ఇటీవల ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించగా.. తాజాగా మరో ఏడాదికి ప్రయోజనాన్ని పెంచింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్ఫోన్! -
'నా పేరు సరిచేయండి' మహా ప్రభో! కుక్కలా మొరుగుతూ నిరసన
ప్రభుత్వాధికారులతో పనిపడినా లేక ఏదైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలన్న ఒక పట్టాన పని అవ్వదు. మన పనులన్ని పక్కన పెట్టుకుని వారి చుట్టు కాళ్లు అరిగేలా తిరిగితే గానీ పనవ్వదు అందరికి తెలిసిందే. అందువల్లే ప్రజలు ప్రభుత్వాధికారులంటేనే చాలా భయపడతారు. అచ్చం అలానే ఒక వ్యక్తి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా పని అవ్వకపోయేసరికీ విచిత్రమైన రీతిలో నిరసనలో అధికారుల వెంట తిరిగి అనుకున్నది సాధించాడు. వివరాల్లోకెళ్తే....బెంగాల్లోని శ్రీకాంత్ కుమార్ దత్తా అనే వ్యక్తికి తన రేషన్ కార్డులో పేరు తప్పుగా పడింది. దీంతో దూరే ప్రభుత్వ కార్యాలయం వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. శ్రీకాంత్ కుమార్ దత్తా బదులు శ్రీకాంత్ మెండల్ అనే పడింది. దీంతో సదరు వ్యక్తి వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీకాంతో దత్తా అని మార్చారు. దీంతో అతను మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఈసారి ఏకంగా శ్రీకాంతి కుమార్ కుత్తాగా మార్చారు. హిందీలో కుత్తా అంటే కుక్క అని అర్థం. దీంతో సదరు వ్యక్తి వినూత్నంగా కుక్కలా మొరుగుతూ...దురే సర్కార్ ప్రభుత్వా కార్యాలయంలోని అధికారుల చుట్టు ఆ రేషన్ కాగితాలతో తిరుగుతూ వివరిస్తాడు. అందులో భాగంగానే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అని గుర్తు ఉన్న కారులోని అధికారుని చూసి అతన్ని వెంబడించి....తన కాగితాలను కారు విండోలోంచి ఇచ్చి తన సమస్యను కుక్కలా అరుస్తూ వివరించాడు. సదరు అధికారి రెండు రోజుల్లో పేరు సరిచేస్తామని తనకు హామి ఇచ్చారని తెలిపాడు శ్రీకాంత్. తన పేరు రేషన్ కార్డులో పదేపదే తప్పుగా ప్రింట్ అవుతుండటంతో తో విసిగిపోయి ఇలా విచిత్రమైన రీతిలో నిరసన వ్యక్తం చేస్తూ తన సమస్యను వివరించినట్లు చెప్పాడు. అంతకుముందు ఒక అధికారికి తన మొర వినిపించానని, అతను భయపడి పారిపోయాడని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఐసీయూలో చక్కర్లు కొట్టిన ఆవు.. పేషంట్స్ సంగతేంటి?) -
భారీ షాకిచ్చిన కేంద్రం.. 10 లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఇదే!
తప్పుడు సమాచారంతో రేషన్ కార్డులు పొందిన వారందరికి కేంద్రం షాక్ ఇవ్వనుంది. ఇటువంటి కార్డ్లను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం 10 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయబోతోంది. దీనిపై సమీక్ష ప్రక్రియ ఇంకా కొనసాగుతోందట. అయితే రాబోయే రోజుల్లో దీని సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చుని సమాచారం. 10 లక్షల కార్డులు కట్! ఇప్పటివరకు ప్రభుత్వం 10 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులగా గుర్తించింది. ఈ జాబితాను స్థానిక రేషన్ డీలర్లకు పంపనుంది. ఈ నకిలీ లబ్ధిదారుల పేర్ల జాబితాను తయారు చేసి, అలాంటి కార్డుదారుల నివేదికను జిల్లా కేంద్రానికి పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమాచారాన్ని పరిశీలించిన తర్వాత అటువంటి లబ్ధిదారుల రేషన్ కార్డులను రద్దు చేయాలని సంబంధిత శాఖకు తెలపనుంది. వీళ్లంతా అనర్హులే ఎన్ఎఫ్ఎస్ఏ (NFSA) ప్రకారం వీరు రేషన్ పొందేందుకు అనర్హులుగా ప్రకటించింది. ఆదాయపు పన్ను చెల్లించే వారు, 10 బిగాల కంటే ఎక్కువ భూమి ( 6 ఎకరాల భూమి) ఉన్న వ్యక్తుల కార్డులను రద్దు చేయనుంది. వీటితో పాటు రేషన్ను ఉచితంగా విక్రయిస్తూ కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఈ విషయంపై సీరియస్ అయిన ప్రభుత్వం వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లో చాలా వరకు రేషన్ కార్డులు దుర్వినియోగం జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొంత కాలంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, ప్రాధాన్యత కలిగిన పసుపు, గులాబీ రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా ఐదు కిలోల బియ్యం ఉచితంగా లభిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫోన్పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
AP: ఒంటరిగా ఉంటున్నారా?.. ఈ ఆప్షన్ మీ కోసమే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనర్హత (ఇన్ ఎలిజిబుల్) కారణంగా రైస్ కార్డు కోల్పోయిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆరు దశల ధ్రువీకరణ (సిక్స్ స్టెప్ వెరిఫికేషన్) అనంతరం కొత్తకార్డు మంజూరుకు పౌరసరఫరాల శాఖ అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్ప్లిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. చదవండి: రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ వీరితోపాటు విడాకులు తీసుకుని సంతానం లేని ఒంటరి వ్యక్తులు సైతం తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తే రైస్ కార్డు ఇవ్వనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుంటూ రైస్ కార్డుల దరఖాస్తులను స్వీకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సూచించింది. -
కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్!
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఇంధనంతో పాటు కూరగాయల ధరలు మండుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ పథకాన్ని మరో 6 నెలల పాటు పొడిగించే యోచనలో ఉంది. ఇందులో చాలా మంది అనర్హులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పారదర్శకంగా అమలయ్యేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. రద్దు దిశగా రేషన్ కార్డులు రేషన్ కార్డు రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం మీరు అనర్హులుగా తేలితే మీ రేషన్ కార్డు కూడా రద్దవుతుంది వీటతో పాటు ప్రభుత్వం మరో విజ్ఞప్తి కూడా చేస్తోంది. అనర్హులు ఎవరైనా, వారి రేషన్ కార్డును వారి స్వంతంగా రద్దు చేయాలని లేదంటే ప్రభుత్వం గుర్తించి రేషన్ రద్దుతో పాటు వారిపై చర్యలు కూడా తీసుకోనున్నట్లు తెలిపింది. రూల్స్ ఏంటో చూద్దాం.. మీ సొంత ఆదాయంతో సంపాదించిన 100 చదరపు మీటర్ల ప్లాట్/ఫ్లాట్ లేదా ఇల్లు, ఫోర్ వీలర్ వెహికిల్/ట్రాక్టర్, ఆయుధాల లైసెన్స్, కుటుంబ ఆదాయం రెండు లక్షల కంటే ఎక్కువ (గ్రామంలో), అదే నగరంలో సంవత్సరానికి మూడు లక్షలు ఉంటే, అలాంటి వారు వారి రేషన్ కార్డును ప్రభుత్వ సంబంధిత కార్యాలయంలో సరెండర్ చేయాలి. మరిన్ని నెలలు ఉచిత రేషన్ మీడియా నివేదికల ప్రకారం, ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని మరో 3 నుంచి 6 నెలల వరకు పెంచనున్నట్లు సమాచారం. అయితే, దీనివల్ల ప్రభుత్వానికి 10 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. -
Kukatpally: తొలగించిన రేషన్ కార్డులకు.. తిరిగి ధృవీకరణ!
సాక్షి, హైదరాబాద్: పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డు ఉందంటే వారిలో కొండంత ధీమా కలుగుతుంది. అలాంటిది ఇటీవల రద్దయిన రేషన్ కార్డులకు కొత్తగా సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో రీ వెరిఫికేషన్ నిర్వహిస్తుండటంతో వారిలో ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో రేషన్ కార్డులు రద్దయిన వారిలో అర్హులుంటే గుర్తించేందుకు సర్వే చేపట్టారు. తొలగించిన కార్డుల్లో చిరునామా ఆధారంగా కాలనీలో అధికారులు సర్వే చేపట్టి ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలిస్తున్నారు. ప్రజల్లో ఆశలు.. ► కోర్టు ఆదేశాల మేరకు అధికారులు రేషన్ కార్డులు రీ వెరిఫికేషన్ చేస్తూ ఉండటంతో రద్దయిన తమ రేషన్ కార్డు మళ్లీ వస్తోందని, దీంతో బియ్యం, గోధుమలు ఇతర సరుకులు తెచ్చుకోవచ్చునని అసలైన లబ్ధిదారులు ఆశ పడుతున్నారు. ► 2016 సంవత్సరంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశీలన జరిపి కార్డులు తొలగించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నేడు కోర్టు ఆదేశాలతో రద్దయిన కార్డులు మళ్లీ జారీ చేసేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు మళ్లీ తిరుగుతున్నారు. ► నాటి ఫోన్ నంబర్ ఆధారంగా ఫోన్ చేస్తే పేర్లు కలవడం లేదు. మరి కొందరు తెలిపిన చిరునామాలో ఉండటం లేదు. రీ వెరిఫికేషన్లో పేర్లు ఉన్నవారిలో కొందరికి కార్డులు ఉన్నాయి. మరి కొందరు చనిపోయారు. ► బాలానగర్ కేంద్రంగా సివిల్ సప్లై కార్యాలయం పరిధిలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్ మండలాలు ఉన్నాయి. ► ఈ మూడు మండలాల్లో 35,200 కార్డులు రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కార్డుల వెరిఫికేషన్ జరుగుతోంది. సర్వే ఇలా... ► రద్దయిన రేషన్ లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి వారి కోసం డేటాను రేషన్ షాపుల నుంచి సేకరించాలి. ► జాబితాలను రేషన్ డీలర్ల వద్ద ప్రదర్శించాలి. ► రద్దయిన కార్డుదారులకు సంబంధించి వారి చిరునామాను గుర్తించాలి. లేదా ఫోన్ ద్వారా సంప్రదించాలి. రీ వెరిఫికేషన్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. ► ఎవరైనా తిరిగి రేషన్ కార్డు పొందేందుకు అర్హులని తేలితే వెంటనే వారి వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. అంతేకాకుండా గతంలో ఎందుకు కార్డును రద్దు చేశారో ఆ కారణాలను సైతం నమోదు చేయాలి. కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా సర్వే... ► రద్దయిన రేషన్ కార్డుదారులకు మళ్లీ కార్డులను జారీ చేసేందుకు అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు రీ వెరిఫికేషన్ చేపట్టగా కొందరు అధికారులు మాత్రం ఈ సర్వేను అక్కడక్కడ మాత్రమే చేపడుతూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ► కొందరు అయితే రేషన్ డీలర్ల దగ్గర కూర్చొని ఎన్క్వైరీ చేసి వెళ్లి పోతున్నారే తప్ప తమ దగ్గరకు అసలు కార్డు రీ వెరిఫికేషన్ అధికారులు రాలేదని ప్రజలు వాపోతున్నారు. ► అధికారులు క్షేత్ర స్థాయిలో తిరిగి అర్హులైన పేద ప్రజలందరికీ రద్దయిన కార్డులు మళ్లీ వచ్చే విధంగా చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రతి లబ్ధిదారుకి రేషన్ కార్డు అందేలా చర్యలు మా అధికారులు కార్డుల రీ వెరిఫికేషన్ను ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ సర్వే ద్వారా ప్రతి ఒక్కరికీ న్యా యం జరుగుతుంది. అర్హులై న వారందరికీ కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అ నుగుణంగా పనిచేస్తున్నాం. రీ వెరిఫికేషన్లో కార్డులు ఇచ్చి వారికి రేషన్ అందజేస్తాం. – డి.నందిని, ఏఎస్ఓ, బాలానగర్ -
ఉచిత బియ్యం ఉఫ్! సాక్షాత్తు లబ్ధి దారులే అమ్ముకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. కరోనా నేపథ్యంలో నిరుపేదలు అకలితో అలమటించవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కల్యాణ్ యోజన పథకం లక్ష్యం నీరుగారుతోంది. సాక్షాత్తూ లబ్ధిదారుల కుటుంబాలు ఉచితం బియ్యాన్ని కారుచౌకగా చిరు వ్యాపారులకు అమ్ముకోవడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఆహార భద్రత (రేషన్) కార్డులోని సభ్యుడి (యూనిట్)కి 10 కిలోల చొప్పున సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబానికి కనీసం 30 కిలోల నుంచి 60 కిలోల బియ్యం వరకు ఉచితంగా పంపిణీ జరుగుతోంది. ఉచిత బియ్యంపై అనాసక్తి ఉన్నప్పటికీ డ్రా చేయకుంటే కార్డు ఇన్ యాక్టివ్లో పడిపోయి రద్దవుతుందన్న అపోహతో అవసరం లేని లబ్ధి కుటుంబాలు సైతం బియ్యం డ్రా చేసి చిరు, వీధి వ్యాపారులకు కారుచౌకగా అప్పజేప్పేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో బస్తీల్లో కొనుగోలు కేంద్రాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం పీడీఎస్ బియ్యం నిల్వలు అధికమై డిమాండ్ తగ్గడంతో కిలో రూ.5 నుంచి 8 వరకు ధర మించి పలకడం లేదు. పౌరసరఫరాల, పోలీసు అధికారుల మొక్కుబడిగా తనిఖీలు, దాడులు చేస్తుండటంతో క్వింటాళ్లకొద్దీ అక్రమ నిల్వలు పట్టుబడుతున్నాయి. గత రెండేళ్ల నుంచి.. కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఉచిత రేషన్ కోటా కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి అయిదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కోటా కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో అయిదు కిలోలు కలిపి పది కిలోల చొప్పున అందిస్తూ వస్తోంది. ఉచిత బియ్యం పథకం కాలపరిమితి ముగుస్తున్నా.. కేంద్రం పథకాన్ని పొడిగిస్తూ వస్తోంది. అవసరం ఉన్నవారు సగమే.. హైదరాబాద్ మహా నగరంలోని ఆహార భద్రత కార్డు లబ్ధి కుటుంబాల్లో పీడీఎస్ బియ్యం వండుకొని తినేవారు సగమే. మిగిలిన సగం కుటుంబాలు కేవలం అల్పాహారం ఇడ్లీ, దోసెలు, పిండి వంటలకు మాత్రమే రేషన్ బియ్యం వినియోగిస్తుంటారు. వాస్తవంగా వారి అవసరాలకు నెలకు నాలుగు కిలోల కంటే మించవు. రేషన్ బియ్యం అవసం లేకున్నా.. క్రమం తప్పకుండా డ్రా చేసి కారు చౌకగా దళారులకు ముట్టజెప్పడం సర్వసాధారణంగా మారింది. ప్రతి నెలా.. కోటా ఇలా గ్రేటర్లోని హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల పరిధిలో సుమారు 16 లక్షల ఆహార భద్రత కార్డు లబ్ధి కుటుంబాలు ఉండగా, అందులో 55.63 లక్షల లబ్థిదారులు ఉన్నారు. ప్రతి నెలా ఉచిత బియ్యం కోటా కింద 111 మెట్రిక్ టన్నులు విడుదలవుతున్నాయి. (చదవండి: ఆర్టీసీలో కనిష్టంగా రూ. వెయ్యి పెన్షన్) -
నవీకరణ.. నవ్విపోదురు గాక!
సరూర్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ మలయ్యకు అయిదుగురు సంతానం. రేషన్ కార్డులో కుటుంబ సభ్యులుగా భార్యాభర్తలతోపాటు మరో ఇద్దరి (పిల్లల) పేర్లు మాత్రమే ఉన్నాయి. అయిదేళ్ల క్రితం మిగిలిన కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం మీ సేవ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల జాబితాలో మిగతావారి పేర్లు చేరలేదు. దీంతో నెలవారీ రేషన్ బియ్యంతో పాటు వివిధ రెవెన్యూ ధ్రువీకరణ పత్రాలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. సాక్షి హైదరాబాద్: గత అయిదేళ్లుగా ఆహార భద్రత (రేషన్ ) కార్డులో నవీకరణ (మార్పులు, చేర్పులు) కోసం ఆన్లైన్ ద్వారా నమోదైన దరఖాస్తులు పెండింగ్లో మగ్గుతూనే ఉన్నాయి. పౌరసరఫరా శాఖ అధికార లాగిన్లో కార్డులోని యూనిట్లు (పాత సభ్యులు) తొలగించేందుకు అవకాశం ఉన్నప్పటికీ కొత్త యూనిట్ల (అదనపు సభ్యులు)ను ఆమోదించేందుకు అనుమతి లేకుండా పోయింది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతున్నా కార్డుల్లో యూనిట్లు (సభ్యులు) పెరగకపోవడం పేదల పాలిట శాపంగా పరిణమించింది. రాష్ట్ర ఆవిర్భావానంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు రద్దు చేసి వాటిని పూర్తిగా ఆహార భద్రత కార్డులుగా బదిలీ చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ కార్డులు మంజూరు చేసింది. ఏడాది పాటు కార్డులో చేర్పు లు, మార్పులు ప్రక్రియ సైతం కొనసాగించి అర్ధంతరంగా నిలిపివేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రి య మాత్రం కొనసాగిస్తోంది. దీంతో రోజురోజుకూ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ధ్రువీకరణ పత్రాలకు తిప్పలు.. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సంక్షేమ ఉపకాల వేతనాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఉపకార వేతనాల కోసం కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. రెవెన్యూ అధికారులు వార్షిక ఆదాయ నిర్ధారణ కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా పరిగణించి ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేస్తారు. రేషన్ కార్డులో పేర్లు లేని కారణంగా ధ్రువీకరణ పత్రం జారీ సమస్యగా తయారైంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేక సంక్షేమ ఉపకార వేతనాలకు అర్హత కోల్పోతున్నారు. అయిదేళ్ల వయసు దాటితే.. ఆహార భద్రత చట్టం ప్రకారం కుటుంబంలోని సభ్యుల వయసు అయిదేళ్లు పైబడితేనే యూనిట్గా పరిగణిస్తారు. కార్డులు మంజూరైన నాటికి అయిదేళ్లలోపు సభ్యులు అర్హత సాధించలేక పోయారు. ఆ తర్వాత సభ్యులుగా చేరి్పంచేందుకు దరఖాస్తు చేసుకుంటే నమోదు ప్రక్రియ మాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. కార్డు కలిగిన కుటుంబాల్లో కొత్త సభ్యుల సంఖ్య పెరుగుతున్నా.. కార్డులో మాత్రం యూనిట్లుగా నమోదు కాని పరిస్థితి నెలకొంది. గ్రేటర్ జిల్లాల పరిధిలో సుమా రు 2.13 లక్షల కుటుంబాల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కనీసం క్షేత్ర స్థాయి విచారణలో 55 శాతానికిపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, విచారణ పూర్తయి ఏఎస్వో లు, ఎమ్మార్వో లాగిన్లో 25 శాతం దరఖాస్తులు, డీఎస్వో లాగి¯న్లో 20 శాతం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు ఆన్లైన్ నివేదిక స్పష్టం చేస్తోంది. (చదవండి: ఇంజనీరింగ్ పట్టాతో ఎగిరిపోవాల్సిందే.. ఉద్యోగం వచ్చినా వద్దే వద్దు) -
ఆహార భద్రత చట్టం అమలు బాధ్యత అధికారులదే..
హిందూపురం/లేపాక్షి: కేంద్ర ఆహార భద్రత చట్టం–13 అమలు బాధ్యత అధికారులదేనని ఆహార భద్రత కమిషన్ సభ్యురాలు కృష్ణమ్మ స్పష్టం చేశారు. స్థానిక లక్ష్మీపురంలోని వైఎస్సార్ ఆరోగ్యకేంద్రం, సింగిరెడ్డిపల్లిలోని అంగన్వాడీ కేంద్రం, సీపీఐ కాలనీలోని కస్తూరిబా విద్యాలయ, ఎంఎల్ఎస్ పాయింట్, చౌకధాన్య డిపోలను గురువారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రూ.వేల కోట్ల వ్యయంతో ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నాయన్నారు. ఆహార భద్రత కింద అమలులో ఉన్న వివిధ పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ఇందులో నాన్ ఎఫ్ఏసీ కింద సుమారు 56లక్షల కార్డుల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికీ రేషన్కార్డు అందజేస్తామన్నారు. ఎక్కడైనా అర్హులైన కార్డు రాకపోయినా, రేషన్ బియ్యంలో పంపిణీలో అవకతవకలు, నాణ్యత ప్రమాణాలు లోపించినా వెంటనే ఫుడ్కమిషన్ టోల్ఫ్రీ నంబర్ (155235)కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపించినా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ప్రధానమంత్రి మాతృయోజన పథకం కింద మొదటి, రెండవ కాన్పులకు అందిస్తున్న పారితోషికానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందజేస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్ను గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయాన్ని గురువారం సాయంత్రం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ విశేషాలను వివరించారు. కార్యక్రమంలో డీఎస్ఓ వంశీ«కృష్ణారెడ్డి, డీఎం అశ్వత్థనారాయణ, ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి, నోడల్ ఆఫీసర్ గాయత్రి, సీడీపీఓ నాగమల్లేశ్వరి, డాక్టర్ ఆనంద్, తహసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ డీఈఓ రంగస్వామి, ఏడీ నాగరాజు, ఈడీ దివాకర్రెడ్డి, ఎంఈఓ గంగప్ప, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: కులాంతర వివాహంతోనే హత్య) -
రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త.. వాటి లింక్ గడువు పొడిగింపు!
న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డు కలిగిన వారికి శుభవార్త అందించింది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనుసంధానానికి గడువును పొడిగించింది. దీంతో, ఇంకా ఆధార్ కార్డుతో లింక్ కానటువంటి రేషన్ కార్డుదారులకు కూడా రేషన్ సరుకులు లభించనున్నాయి. దీని వల్ల చాలా మందికి ఊరట కలగనుంది. ఆధార్ కార్డులను రేషన్ కార్డుతో అనుసంధానించే గడువును ప్రభుత్వం మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారుల సౌలభ్యం కోసం పలు రకాల నిర్ణయాలు తీసుకుంటుంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం కూడా ఇందులో భాగమనే చెప్పుకోవచ్చు. దీని వల్ల లక్షల మందికి ప్రయోజనం కలుగుతోంది. మరీ ముఖ్యంగా వలస కూలీలకు, కార్మికులకు ఈ పథకం వల్ల ప్రయోజనం లభిస్తోంది. దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందొచ్చు. అయితే ఈ ప్రయోజనాలు పొందాలని భావించే వారు కచ్చితంగా రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. అధికారిక నివేదికల ప్రకారం, ఈ పథకం కింద 80 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఫిబ్రవరి మధ్య నాటికి, 96 శాతం మంది లబ్ధిదారులు ఓఎన్ఓఆర్సీ కింద నమోదు చేసుకున్నారు. ఆధార్-రేషన్ కార్డు లింక్ గడువును డిసెంబర్ 31, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు పొడిగించారు. ఇప్పుడు, మరల కేంద్రం జూన్ 30, 2022 వరకు పొడగించింది. (చదవండి: కలిసొచ్చిన రష్యా-ఉక్రెయిన్ వార్..! తొలిసారి టాప్-5 క్లబ్లోకి భారత్..!) -
‘మీ కుమారుడు చనిపోయినట్లు చూపుతోంది.. మేమేం చేయలేం’
Anantapur: రేషన్ కార్డులో కుమారుడి పేరు నమోదు చేసుకోవడానికి వెళ్తే.. మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్లైన్లో చూపుతోందని చెప్పడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. హంప గ్రామానికి చెందిన దూదేకుల కుల్లాయమ్మ, మస్తాన్వలి మూడేళ్ల క్రితం జీవనోపాధి కోసం అనంతపురానికి వెళ్లారు. ఇంటర్ చదువుతున్న కుమారుడు కుల్లాయప్ప పేరు రేషన్కార్డులో నమోదు చేయించుకునేందుకు వారు స్వగ్రామానికి వచ్చారు. జనన ధృవీకరణ పత్రం తీసుకుని అనంతపురం సచివాలయానికి వెళ్లారు. అయితే అక్కడ సిబ్బంది ‘మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్లైన్లో చూపుతోంది. మేమేం చేయలేం’ అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కార్డులో పేరు నమోదు చేసి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. చదవండి: (ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..) -
81 కోట్ల రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా పెద ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందిస్తున్న ఉచిత రేషన్ కార్యక్రమాన్ని మార్చి 2022 వరకు పొడగిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ 'ఉచిత రేషన్ కార్యక్రమాన్ని 2022 మార్చి వరకు అందించడానికి 'ప్రధాని గరీబ్ కళ్యాణ్ అన్నా యోజనను పొడిగించాలని కేంద్రం కేబినెట్ నిర్ణయించినట్లు ఠాకూర్ తెలిపారు. గతేడాది కోవిడ్-19 వల్ల విధించిన లాక్డౌన్ దృష్ట్యా పెదప్రజలకు ఉచితంగా రేషన్ అందించడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకెఏవై)ని మార్చి 2020లో ప్రకటించారు. 2020 ఏప్రిల్లో ఈ పథకం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్కారణంగా ఈ ఏడాది జూన్ వరకు పొడగించారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల పేదలు ఇబ్బంది పడకుండా.. జూన్లో మరో ఐదు నెలలు( 2021 నవంబర్ 30 వరకు) పొడిగించారు. ఇప్పుడు మళ్లీ మరో నాలుగు నెలలు పొడగించారు. దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద గుర్తించిన 81 కోట్ల రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి ఉచితంగా రేషన్ సరఫరా చేస్తుంది. ప్రతి నెల 5 కిలోల ఆహార ధాన్యాలను(గోధుమ/బియ్యం) ఉచితంగా పంపిణీ చేస్తుంది. Cabinet decides to extend additional free 5-kg foodgrains scheme by four months till March 2022: Union Minister Anurag Thakur — Press Trust of India (@PTI_News) November 24, 2021 (చదవండి: వర్క్ఫ్రమ్ హోం.. గూగుల్కు ఉద్యోగుల ఝలక్!) -
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరిస్తాం
-
రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ కొత్త రూల్స్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్) పథకంలో అనర్హులు చేరుకుండా అరికట్టడానికి కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. అలాగే, పెరుగుతున్న మోసాన్ని తనిఖీ చేయడం కోసం కేంద్రం ఇటీవల ఈ పథకానికి నమోదు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా అవసరమైన పత్రాలలో మార్పులు చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ పథకంలో జాయిన్ అయ్యేందుకు రిజిస్టర్ చేసే లబ్ధిదారుని రేషన్ కార్డును తప్పనిసరి చేసింది. అంతేకాకుండా, లబ్ధిదారులు అవసరమైన పత్రాల సాఫ్ట్ కాపీని కూడా పోర్టల్లో సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు తప్పనిసరి ఇక నుంచి రేషన్ కార్డు లేకుండా పీఎం కిసాన్ పథకంలో జాయిన్ అయ్యే అవకాశం లబ్ధిదారునికి లేదు. పీఎం కిసాన్ కింద రిజిస్టర్ చేసుకోవడానికి, ఈ పథకం కింద ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తుదారుడు వారి రేషన్ కార్డు నంబర్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, డిక్లరేషన్ ఫారంతో సహా ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసిన కాపీలను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా మోసపూరిత కార్యకలాపాలను అరికట్టవచ్చు అని కేంద్రం భావిస్తుంది. (చదవండి: బ్లాక్చైన్ టెక్నాలజీతో యువత బంగారు భవిష్యత్కు భరోసా!) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అందించే 10వ వాయిదా తేదీని కూడా కేంద్రం నిర్ణయించింది. డిసెంబర్ 15, 2021 నాటికి లబ్ధిదారుని ఖాతాలో నగదు జమ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కేంద్రం చేస్తుంది. ఈ పథకం కింద ప్రయోజనాలు పొందాలనుకునే కొత్త రైతులు ఆ తేదీలోపు ముందస్తుగా నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం గత ఏడాది 25 డిసెంబర్ 2020న రైతులకు డబ్బును బదిలీ చేసింది. పీఎం కిసాన్ యోజన కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఏటా రూ.6,000 లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా లబ్ధిదారుని ఖాతాకు బదిలీ చేస్తుంది. (చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు గుడ్న్యూస్.. రూ.342కే రూ.4 లక్షల బెనిఫిట్!) -
నో వ్యాక్సిన్-నో రేషన్ తప్పుడు ప్రచారం: ప్రజల్లో గందరగోళం
-
‘వ్యాక్సిన్.. పింఛన్ కట్’ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు స్పష్టంచేశారు. అలాంటి దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారంతో ఆందోళనకు గురికావొద్దని సూచించారు. తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలాఉండగా, వ్యాక్సిన్ తీసుకోనివారికి రేషన్, పింఛన్ నిలిపివేస్తామని శ్రీనివాసరావు ప్రకటించినట్లుగా మంగళవా రం భారీగా ప్రచారమైన సంగతి తెలిసిందే. చదవండి: మహమ్మారి ఎఫెక్ట్: రెండేళ్లు తగ్గిన భారతీయుల ఆయుర్దాయం -
అమ్మా.. రేషన్ కార్డు వచ్చిందా.. లబ్ధిదారుకు ఎమ్మెల్యే ఫోన్..
అనంతపురం సెంట్రల్: ‘హలో అనురాధమ్మనా మాట్లాడేది. నేను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని మాట్లాడుతున్నా. రేషన్కార్డు కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నావు కదా కొత్త కార్డు వచ్చిందా.’ అంటూ స్వయంగా ఓ లబ్ధిదారుకు ఫోన్ చేసి ఎమ్మెల్యే ఆరా తీయడం అందరినీ ఆశ్చర్యపరచింది. శనివారం నగరంలో రహమత్నగర్లోని 27వ సచివాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ లబ్ధిదారురాలికి నేరుగా ఫోన్ చేశారు. సమస్య పరిష్కారమయిందా లేదా అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారు మాట్లాడుతూ.. రేషన్కార్డు వచ్చిందని, పింఛన్కు దరఖాస్తు చేసుకున్నా రావడం లేదని తెలిపారు. బాధ్యతగా సేవలందించండి అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. అర్హత ఉంటే వెంటనే పథకాలు అందించాలని ఆదేశించారు. ‘స్పందన’ ఫిర్యాదులను రికార్డుల్లో నమోదు చేసి.. పరిష్కారం అయిన వెంటనే పొందుపర్చాలని సూచించారు. దాదాపు 3 నెలలుగా ఫిర్యాదులు రికార్డుల్లో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులుగా నియమితులై రెండు సంవత్సరాలు పూర్తవుతోందని.. నేటికీ సరిగా విధులు నిర్వహించకపోవడమేంటని ప్రశ్నించారు. వచ్చామా.. పోయామా అంటే కుదరదని... ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ప్రతి ఇంటికీ వెళ్లాలని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను ఆదేశించారు. ఒక సమస్యపై ప్రజలు తరుచూ తిరగకుండా, సమస్య పరిష్కారమయేంత వరకూ సచివాలయ ఉద్యోగులదే బాధ్యతని తెలియజేశారు. దీర్ఘకాలికంగా ప్రకాష్రోడ్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్న రైల్వే ట్రాక్ డ్రెయినేజీ సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. ప్రకాష్రోడ్డు ప్రాంతానికి సంబంధించి సచివాలయం రహమత్నగర్లో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కార్యాలయాన్ని మార్చాలని చెప్పారు. అర్హత ఉన్న అందరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న వయస్సుల్లోనే ఉద్యోగాల్లోకి వచ్చిన మీరు ప్రజలకు జవాబుదారిగా పనిచేయాలని సూచించారు. కోట్లాది రూపాయలను సచివాలయ వ్యవస్థపై సీఎం వెచ్చిస్తున్నారని, ఆయన నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. -
రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్తో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల రేషన్ కార్డుకు సంబంధించిన సేవలు దేశవ్యాప్తంగా ఉన్న 3.70 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు మీరు మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) ద్వారా రేషన్ కార్డుకు సంబంధించిన అనేక సేవలను యాక్సెస్ చేసుకోవచ్చునని డిజిటల్ ఇండియా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. "డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్తో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న 3.70 లక్షల కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ భాగస్వామ్యం వల్ల దేశవ్యాప్తంగా 23.64 కోట్లకు పైగా రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని" కేంద్రం ట్విటర్ ఖాతా ద్వారా పేర్కొంది. ఈ భాగస్వామ్యం ఒప్పందం వల్ల దేశవ్యాప్తంగా 23.64 కోట్లకు పైగా రేషన్ కార్డు దారులు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా రేషన్ కార్డు సంబధించిన 6 రకాల సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు.(చదవండి: ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!) .@CSCegov_, under the @GoI_MeitY has signed a MoU with the @fooddeptgoi to enable ration card services through 3.70 Lakh CSCs across the country. The partnership is expected to benefit over 23.64 crore ration card holders across the country. pic.twitter.com/OIbutQClC3 — Digital India (@_DigitalIndia) September 16, 2021 సీఎస్సీలలో అందుబాటులో ఉండే 6 రకాల రేషన్ కార్డు సేవలు రేషన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయవచ్చు. మీ రేషన్ కార్డు డూప్లికేట్ ప్రింట్ పొందవచ్చు. మీ రేషన్ లభ్యత గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను చేయవచ్చు. రేషన్ కార్డు పోయినట్లయితే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
ఏపీ: దరఖాస్తు చేసిన మూడు గంటల్లోనే రేషన్ కార్డు!
మెరకముడిదాం: విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలోని గరుగుబిల్లి గ్రామానికి చెందిన ఇజ్జిరోతు సూర్యనారాయణ రేషన్కార్డు కోసం గ్రామ సచివాలయంలో శనివారం మధ్యాహ్నం 1 గంటకు దరఖాస్తు చేసుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి ఎం.స్వర్ణలత లబ్ధిదారుడికి సాయంత్రం 4 గంటలకల్లా రేషన్కార్డు అందజేయడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. దరఖాస్తు చేసిన 3 గంటల వ్యవధిలోనే కార్డు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇవీ చదవండి: సబ్ రిజిస్ట్రార్ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర వ్యవసాయ రంగానికి ఏపీ ప్రభుత్వం సేవలు.. దేశంలోనే నంబర్ వన్ -
‘కార్డుదారులకు సజావుగా బియ్యం పంపిణీ’
గుడివాడ: ఆంధ్రప్రదేశ్లో 36,31,216 కార్డుదారులకు రేషన్ డీలర్ల ద్వారా పీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. గురువారం గుడివాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 1,48,56,590 బియ్యం కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల్లోని ఒక్కో కుటుంబ సభ్యుడికి 5 కేజీలు చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ సక్రమంగా సాగుతోందన్నారు. కర్నూలు జిల్లాలో 29.16%, ప్రకాశం జిల్లాలో 24.08%, వైఎస్సార్ కడప జిల్లాలో 25.71%, అనంతపురం జిల్లాలో 27.60%, పశ్చిమ గోదావరి జిల్లాలో 24.60%, చిత్తూరు జిల్లాలో 27.92%, గుంటూరు జిల్లాలో 25.50%, విజయనగరం జిల్లాలో 24.15%, శ్రీకాకుళం జిల్లాలో 17.76%, నెల్లూరు జిల్లాలో 17.46% పంపిణీ ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. -
వలస కార్మికులకు భద్రత ఏది?
లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల దుఃస్థితిపై సంవత్సరం పైగా విచారించిన సుప్రీంకోర్టు జూన్ 28న తన తీర్పును వెలువరించింది. జాతీయ ఆహార పథకం కింద దేశంలో ఎక్కడినుంచైనా రేషన్ పొందడానికి వలసకార్మికులకు అనుమతించాలని, దీనికోసం ‘ఒకే దేశం, ఒకే రేషన్’ కార్డు పథకాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ 2021 మే 6 నాటికి ఈ పథకం కింద 50 వేలమంది మాత్రమే లబ్ధి పొందారని వార్తలు. పైగా వలస కార్మికులకు రేషన్ ఇవ్వడానికి చాలా చోట్ల తిరస్కరించారని కూడా తేలింది. ప్రభుత్వాలు ప్రకటిస్తున్న కార్మిక సంక్షేమ పథకాలన్నీ...అసంఘటిత కార్మికులకు మేలు చేయడంలో విఫలమవుతున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం తన శక్తిని మొత్తంగా దీనిపై కేంద్రీకరిస్తే యావద్దేశం దానిగురించి ఘనంగా చెప్పుకుంటుంది. వలస కార్మికులకు ముష్టి అవసరం లేదు. వారు కోరుకుంటున్నదల్లా... సంఘటిత కార్మికుల్లాగే క్రమబద్ధమైన పని వాతావరణం, కాస్త ప్రాథమిక భద్రత మాత్రమే. వలస కార్మికుల కేసుగా అందరికీ తెలిసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తన తీర్పును తాజాగా వెలువరించింది. గతేడాది లాక్డౌన్ కాలంలో భారీవలసల సందర్భంగా వలస కార్మికుల దుఃస్థితిని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేసింది. సెకండ్ వేవ్ సమయంలోనూ దీనిపై విచారణ కొనసాగింది. జూన్ 28న ఉన్నత న్యాయస్థానం 7 పాయింట్లతో 80 పేజీల తీర్పును ప్రకటించింది. వీటిలో అయిదు అంశాలు–వలస కార్మికుల ఆహార భద్రతకు హామీ ఇవ్వడానికి సంబంధించినవి. వలస కార్మికులకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఉదారంగా వ్యవహరించి రేషన్ కార్డు లేని వారికి కూడా ఆహారం అందించాలని, సబ్సిడీ ధాన్యం కేటాయింపును పెంచాలని కోర్టు తీర్పు ఆదేశించింది. జాతీయ ఆహార పథకం కింద దేశంలో ఎక్కడినుంచైనా రేషన్ పొందడానికి వలసకార్మికులకు అనుమతించాలని, దీనికోసం ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు పథకాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. వీటిలో చివరి అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది సుదీర్ఘకాలంగా చేస్తూవస్తున్న డిమాండే. న్యాయస్థానం తన తీర్పును ప్రభుత్వ యంత్రాంగం ఎలా అమలుచేస్తుందనే అంశంపై నిశితంగా పర్యవేక్షించాలని ఎవరైనా కోరుకుంటారు. కాగా వన్ నేషన్, వన్ రేషన్ కార్డు అనే పథకాన్ని అమలు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి న్యాయస్థానం హామీ తీసుకున్నట్లు కనిపిస్తోంది. గత సంవత్సరం కోవిడ్–19 ఫస్ట్ వేవ్ తర్వాత ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. 2020 జూన్ 6న తన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే గత సంవత్సర కాలంలో ఈ పథకం కింద చాలా కొద్ది మాత్రమే లబ్ధి పొందారని ప్రభుత్వ డేటానే చూపిస్తోంది. 2021 మే 6 నాటికి ఈ పథకంలో భాగంగా 50 వేలమంది మాత్రమే లబ్ధి పొందారని ఇంటెగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నివేదించింది. ఈ పథకం కింద వలస కార్మికులకు రేషన్ ఇవ్వడానికి దేశంలో పలుచోట్ల తిరస్కరించిన ఉదంతాలెన్నో ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. లబ్ధిదారులకు ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. వలస కార్మికుల నమోదు వీటన్నింటిని పక్కనబెట్టి చూస్తే, వలస కార్మికులకు ఆహార భద్రతపై హామీ ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగినది. పైగా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు వలస కార్మికులు కాస్త ఎక్కువగానే కడుపు నింపుకుని సాధారణ పనులను నిర్వహించవచ్చు. ఇక తీర్పులోని చివరి రెండు అంశాలను ప్రాథమికంగా విమర్శించాల్సి ఉంది. ఈ రెండూ వలస కార్మికుల నమోదుకు సంబంధించినవి. ఇదే చాలా ముఖ్యమైనది.ఎలాంటి లక్ష్య బృందానికైనా ఈ పథకం లబ్ధి్ద కలిగించాలని ఎవరైనా భావిస్తే, ముందుగా ఈ లక్ష్య బృందంలోని అందరినీ గుర్తించాల్సి ఉంది. వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఏయే ప్రాంతాల్లో ఉన్నారు అనే అంశంపై ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన లేనందునే ఫస్ట్ వేవ్ కాలంలో వలస కార్మికులు భారీ స్థాయిలో వలస పోయారు. అందుకే వలస కార్మికుల నమోదు అంశంపై న్యాయస్థానం తీర్పు అధికంగా దృష్టి సారించింది. న్యాయస్థానం తన తీర్పును ఎలా ప్రకటించినప్పటికీ, ప్రభుత్వాలూ, పౌర సమాజ సంస్థలూ, సంబంధిత పిటిషన్తో పాక్షికంగా సంబంధంలో ఉండి కోర్టుకు సహకరించిన న్యాయవాదులూ మొత్తంగా క్షేత్ర వాస్తవికతను పూర్తిగా పట్టించుకోలేదనే చెప్పాలి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. తన తొలి తీర్పులో అసంఘటిత కార్మికుల గణన ప్రక్రియను ప్రారంభించడంలో కేంద్ర కార్మిక శాఖ విఫలమైందని దుయ్యబట్టింది. పైగా అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్(ఎన్డీయూడబ్ల్యూ)ని ఏర్పాటు చేయడానికి తుది గడువును కూడా నిర్ణయించింది. తర్వాత అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం (ఐఎస్ఎమ్డబ్ల్యూ యాక్ట్)ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేసినట్లయితే, అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ రూపంలో ప్రత్యేక నమోదు ప్రక్రియ అవసరమే ఉండదు. అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియకు సంబంధించిన గత చరిత్రను న్యాయస్థానం ఎత్తి చూపలేదు. ప్రస్తుత అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తన తొలి అయిదేళ్ల పాలనలో శ్రమయేవ జయతే పేరిట అసంఘటిత కార్మికులను భారీ స్థాయిలో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అసంఘటిత కార్మికులందరి సంఖ్యను గుర్తించి వారికి స్మార్ట్ కార్డులు జారీ చేయడమే దీని లక్ష్యం. అయితే ఈ పథకం వెనుకపట్టు పట్టడానికి ముందు కొంతమందికి కార్డులు జారీ చేశారు. కార్మికుల నమోదు నత్తనడకన సాగుతున్న నిర్మాణ కార్మికుల బోర్డుల నమోదు చరిత్రను కోర్టు పరిశీలించాల్సి ఉంది. అన్ని కార్మిక చట్టాలు ఆయా పనిస్థలాల్లో కార్మికుల పేర్లు నమోదు చేయాలని కోరుతున్నాయి. అయినప్పటికీ ఈ చట్టాల పరిధిలోనే పనికోసం ఒక చోటి నుంచి మరో చోటికి తరలి వెళ్లిపోయే వలస కార్మికులను నమోదు చేయడం జరగలేదు. సంక్షేమ పథకాల అమలు లోపం 1948 ఫ్యాక్టరీల చట్టం ద్వారా నిర్వహిస్తున్న పరిశ్రమలలో అనేకమంది వలస కార్మికులను గణనీయంగా నియమించుకున్నారు. ఈ శక్తిమంతమైన చట్టాన్ని పారిశ్రామిక భద్రత, ఆరోగ్య డైరెక్టరేట్ అమలు చేస్తోంది. కానీ వాస్తవానికి ఈ చట్టం కింద చాలా కొద్దిమంది కార్మికుల పేర్లను మాత్రమే నమోదు చేసింది. గుజరాత్లోని సూరత్ నగరం వేలాది మరమగ్గాలతో కూడిన అతిపెద్ద వస్త్రపరిశ్రమ కేంద్రాల్లో ఒకటి. ఇక్కడి పనిచేసేవారిలో మెజారిటీ ఒడిశా నుంచి వచ్చిన వలస కార్మికులే. కానీ ఈ నగరంలో ఉన్న పరిశ్రమ యూనిట్ల సంఖ్య ఎంత అని ఎవరైనా డైరెక్టరేట్ని అడిగితే సమాధానం శూన్యమే. నగరంలో ఎన్ని మరమగ్గాలు ఉన్నాయి అని తెలిపే కనీస డేటా కూడా దీనివద్ద లేదు. కోర్టు ఈ మొత్తం వ్యవహారంపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలను కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఈ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందుకోవడానికి అనేకమంది కార్మికులు వేచి చూస్తున్నారని తీర్పులోని 70వ పేజీలో న్యాయస్థానం పేర్కొంది. కానీ, ఇవన్నీ కూడా గుర్తింపులేని అసంఘటిత కార్మికులకు మేలు చేయడంలో విఫలమవుతున్నాయి. అందుకే వివిధ రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్న అసంఖ్యాక కార్మిక సంక్షేమ పథకాల సంఖ్యను కుదించి ఒక నమూనా స్కీమ్ను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.వాస్తవానికి గుజరాత్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా అసంఘటిత రంగ కార్మికులకు 20 పథకాలు అవసరం లేదు. వారికి ప్రాథమిక భద్రత, పీఎఫ్, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ వంటివి అవసరం. వీటిని పక్కనబెట్టి వివిధ బోర్డులలో కార్మికుల పేర్లను నమోదు చేసి వివిధ పథకాలను కేటాయించినా అవన్నీ ఆచరణలో విఫలమవుతాయి. దేశంలోని వలస కార్మికులకు ముష్టి అవసరం లేదు. వారు కోరుకుంటున్నదల్లా.. కార్మిక చట్టాలు అందించే క్రమబద్ధమైన పని వాతావరణం, ప్రాథమిక భద్రత మాత్రమే. సుప్రీంకోర్ట్ తన శక్తిని దీనిపై కేంద్రీకరిస్తే దేశం దేశమే దానిగురించి ఘనంగా చెప్పుకుంటుంది. సుధీర్ కటియార్ ‘సెంటర్ ఫర్ లేబర్ రీసెర్చ్ అండ్ యాక్షన్’ సభ్యులు. (‘ది వైర్’ సౌజన్యంతో)