-
PM Narendra Modi: అసలైన అభివృద్ధి ముందుంది
జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీ తమ పదేళ్లకాలంలో దేశంలో జరిగిన అభివృద్ధిని ఆకలి పుట్టించే స్టార్టర్గా అభివరి్ణంచారు. అసలైన అభివృద్ధి భోజనం ముందుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజస్థాన్లోని చురులో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. భారత సైన్యాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ఇదే కాంగ్రెస్ అసలైన మనస్తత్వమని విపక్ష పార్టీపై మోదీ విమర్శలు గుప్పించారు. ‘ ఇప్పుడున్న నయా భారత్ శత్రువును ఇంట్లోకి చొరబడి మరీ దెబ్బ కొట్టగలదు. శత్రువు గడ్డపైనా దాడి చేసే సరికొత్త భారత్ ఆవిష్కృతమైంది’ అని అన్నారు. ‘‘ గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమే. అది భోజనాల వేళ ఆకలి పుట్టించే స్టార్టర్ మాత్రమే. అసలైన మెయిన్ కోర్సు భోజనం(అభివృద్ధి) ముందుంది. చేయాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఉంది. ఇంకా ఎన్నో కలలున్నాయి. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి మనం’ అని అన్నారు. -
చదువులతల్లి పట్ల దారుణం: చైల్డ్ లైన్ ఫిర్యాదుతో వెలుగులోకి!
అత్యాచార బాధితురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారానికి గురైన బాలికను 12వ తరగతి పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. రాజస్థాన్లో అజ్మీర్లో ఒకప్రైవేట్ పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు చైల్డ్ హెల్ప్లైన్నంబర్కు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 12 బోర్డు పరీక్షలకు తనను హాజరుకానివ్వలేదంటూ అజ్మీర్లోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఆరోపించింది. గత ఏడాది సామూహిక అత్యాచారానికి గురయ్యావు కాబట్టి, పరీక్షకు హాజరైతే వాతావరణం చెడిపోతుందని పాఠశాల అధికారులు చెప్పారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. అడ్మిట్ కార్డ్ ఇవ్వ లేదని బాధితురాలు తెలిపింది. అడ్మిట్ కార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు, అధికారులు ఇకపై పాఠశాల విద్యార్థిని కాదని తెలిపారు. అయితే దీనిపై మరో టీచర్ను సంప్రదించగా, ఆమె చైల్డ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయమని సూచించింది. అయితే బాధిత విద్యార్థిని గత నాలుగు నెలలుగా పాఠశాలకు రాకపోవడంతో ఆమెను పరీక్షకు అనుమతించడం లేదని పాఠశాల అధికారులు వాదించారు. అయితే ఆమె స్కూలుకు హాజరుకావడాన్ని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనను లోపలికి రానీయకుండా నిషేధించారని ఇంటి నుండే చదువుకోవాలని సూచించిందని అందుకే ఇంట్లో ఉండే పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు అంజలీ శర్మతో వాపోయింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు అజ్మీర్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ (సిడబ్ల్యుసి) కేసు నమోదు చేసింది, విచారణ తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అంజలి శర్మ వెల్లడించారు. శిశు సంక్షేమ శాఖ కూడా కేసు నమోదు చేసింది. 10వ తరగతి పరీక్షలలో 97 శాతం స్కోర్ సాధించిన బాధితురాలు ఇపుడు కూడామంచి మార్కులు తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. కానీ పాఠశాల నిర్లక్ష్యం వల్ల ఏడాది సమయం వృథా అవుతుందేమోనని భయపడుతోంది. కాగా గతేడాది అక్టోబర్లో విద్యార్థినిపై ఆమె మామ, మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.దీనిపై విచారణ నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికా విద్య, మహిళల భద్రత గురించి ఎంత మాట్లాడు తున్నా, ఎంత ప్రచారం కల్పిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదనీ, మరీ ముఖ్యంగా విద్య నేర్పే పాఠశాల్లో ఇలాంటి దారుణం ఏమిటి అనే విమర్శలకు తావిస్తోంది. -
ఇంటి వద్ద ఓటింగ్ నేటి నుంచే..
జైపూర్: రాజస్థాన్లో లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి ప్రారంభమవుతోంది. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుండగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో 58,000 మందికి పైగా ఓటర్లు ఇంటి వద్ద ఓటింగ్ను ఎంచుకున్నారని, వీరిలో 35,542 మంది మొదటి దశ లోక్సభ ఎన్నికల కోసం నమోదు చేసుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా ఇటీవల తెలిపారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లకు ఇంటి ఓటింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. రాజస్థాన్లో మొదటి దశ లోక్సభ ఎన్నికల కోసం నమోదైన 35,542 మంది ఓటర్లలో 26,371 మంది సీనియర్ సిటిజన్లు ఉండగా 9,171 మంది దివ్యాంగులు ఉన్నారు. "ఇప్పటి వరకు, 58,000 మంది అర్హతగల ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు. వీరిలో 43,638 మంది సీనియర్ సిటిజన్లు, 14,385 మంది దివ్యాంగులు ఉన్నారు" అని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. రాజస్థాన్లో రెండు దశల్లో ఏప్రిల్ 19, 26 తేదీలలో పోలింగ్ జరుగుతుంది. -
Lok Sabha Elections 2024: అబద్ధాల సర్దార్ మోదీ: ఖర్గే
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముమ్మాటికీ అబద్ధాల సర్దార్ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మన దేశ భూభాగంలోకి చైనా ప్రవేశిస్తుంటే మోదీ నిద్రపోతున్నారని ధ్వజమెత్తారు. గురువారం రాజస్తాన్లోని చిత్తోర్గఢ్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే మాట్లాడారు. దేశ క్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోని ప్రధానమంత్రి.. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని దూషించడంలో తీరిక లేకుండా ఉంటున్నారని ధ్వజమెత్తారు. 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకుంటున్న మోదీ మన దేశ భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఖర్గే ఆరోపించారు. మోదీ గ్యారంటీల డ్రామా సార్వత్రిక ఎన్నికల దాకా కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత ఏమీ ఉండదన్నారు. ఓటమి భయంతోనే విపక్షాలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. -
గ్రామీణ యువతికి ఆరు నెలల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
రాజస్థాన్లోని గ్రామీణ ప్రాంత యువతులు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము యువకులకు ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కల్పన దీనికి ఉదాహరణగా నిలిచారు. రాజస్థాన్లోని ఫతేపూర్ షెఖావతి పరిధిలోని రినౌ గ్రామానికి చెందిన కల్పనా బిర్దా ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువతి. ఆమె తొలుత సీహెచ్ఎస్ఎల్లో క్లర్క్ ఉద్యోగం సంపాదించింది. తరువాత ఆడిటర్గా ఉద్యోగం దక్కించుకుంది. ఇప్పుడు సీజీఎస్టీలో ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేజిక్కించుకుంది. కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో కల్పన పెద్దది. బనస్థలి విద్యాపీఠ్లో చదువు పూర్తి చేసింది. కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. కల్పన తండ్రి మహిపాల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె తల్లి పొలం పనులతో పాటు ఇంటిపనులకు కూడా చేస్తుంది. కల్పన ఇన్స్పెక్టర్గా ఎంపికకావడంతో వారి ఇంటిలో ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. కల్పన మీడియాతో మాట్లాడుతూ తాను పోటీపరీక్షల కోసం తొలుత ఢిల్లీలో కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నానని, ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్నానని తెలిపింది. చదువుతో పాటు ఎప్పటికప్పుడు రివిజన్ కూడా చేసుకునేదానినని, ఈ రివిజన్ కారణంగానే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగానని తెలిపింది. -
అసెంబ్లీ ఉప ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలతోపాటు జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్లోని బగిదోర అసెంబ్లీ నుంచి సుభాష్ తంబోలియాకు టికెట్ ఇవ్వగా, గాండే అసెంబ్లీ నుంచి దిలీప్ కుమార్ వర్మను పోటీకి దింపింది. ఏప్రిల్ 26న రాజస్థాన్లోని బగిదోర అసెంబ్లీలో ఉప ఎన్నిక జరగనుండగా, గాండే అసెంబ్లీకి మే 20న ఉప ఎన్నిక జరగనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. దాదాపు 96.8 కోట్ల మంది ప్రజలు 12 లక్షలకు పైగా పోలింగ్ స్టేషన్లలో రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఏప్రిల్ 19 నుంచి లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. రాజస్థాన్లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫేజ్ 1లో ఏప్రిల్ 19న 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 స్థానాలకు రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2019 లోక్సభ ఎన్నికలలో కాషాయ పార్టీ 24 సీట్లు గెలుచుకోగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే పొందగలిగింది. -
ముఖేష్ సర్ప్రైజ్ గిఫ్ట్ : ఆనంద్ మహీంద్ర ఫిదా!
కొందరు వ్యక్తులు నిస్వార్థంగా జనం కోసం చేసే పనులు విశేషంగా నిలుస్తాయి. ప్రకృతిమీద, మానవాళి మీద వారి ప్రేమను చెప్పకనే చెబుతాయి. రాజస్థాన్కు చెందిన ముఖేష్ అలాంటి కోవలోకే వస్తారు. బోగన్ విల్లా మొక్కలతో అందమైన షెల్టర్ తయారుచేసిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బెటర్ ఇండియా షేర్ చేసిన ఈ వీడియో పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్రను కూడా ఆకట్టుకుంది. రాజస్తాన్లోని భిల్ వారాకుచెందిన ముఖేష్ జనానికి చక్కటి గిఫ్ట్ అందించాడు. 12 సంవత్సరాలకు పైగా కష్టపడి బోగన్విల్లా మొక్కలతో షెల్టర్ను అందంగా తీర్చి దిద్దాడు. గులాబీ రంగులో విరబూసిన ఈ పువ్వులు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఇది అందంగా ఉండటమే కాదు అందరికీ నీడను పంచుతోంది. Over 12 years, Mukesh turned a Bougainvillea shrub into, literally, a pavilion, giving shade to all travellers. One individual, passionately built a thing of beauty. Sustainability may eventually come from the collection of such individual deeds…pic.twitter.com/l2XhN918UY — anand mahindra (@anandmahindra) March 28, 2024 -
తొలిసారి ఆ రెండు వర్గాలకు కాంగ్రెస్ టిక్కెట్లు నిల్!
రాజస్థాన్లో లోక్సభ టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ తొలిసారిగా ప్రత్యేక వైఖరి అవలంబించింది. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో ఎక్కడా కూడా బ్రాహ్మణ, ముస్లిం అభ్యర్థులకు అవకాశం కల్పించలేదు. అయితే కుల, మతాల ప్రాతిపదికన కాకుండా సర్వే ఆధారంగానే టిక్కెట్లు కేటాయించామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ గతంలో చాలాసార్లు బ్రాహ్మణ కార్డును ప్లే చేసింది. ఇప్పడు పార్టీ తన వైఖరిని మార్చుకోవడం పలువురు నేతలకు ఆగ్రహం తెప్పించింది. రాజస్థాన్ చరిత్రలో ముస్లిం, బ్రాహ్మణ అభ్యర్థికి కూడా కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడం ఇదే తొలిసారి. సర్వ బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు సురేశ్ మిశ్రా మాట్లాడుతూ కాంగ్రెస్కు బ్రాహ్మణుల ఓట్లు అక్కర్లేదని తెలుస్తోంది. జైపూర్ నుంచి బ్రాహ్మణ నేతకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు కోటి మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారున్నారని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత వరుణ్ పురోహిత్ మాట్లాడుతూ బ్రాహ్మణ వర్గానికి కాంగ్రెస్ గౌరవం ఇవ్వనప్పుడు ఓటమిని చవిచూసిందన్నారు. అయితే రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్రూమ్ అధ్యక్షుడు జస్వంత్ సింగ్ గుర్జార్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సర్వే, ఫీడ్బ్యాక్, డిమాండ్ మేరకు టిక్కెట్లు ఇచ్చామన్నారు. కులం, సంఘం లేదా తరగతి ఆధారంగా టిక్కెట్లు ఇవ్వలేదన్నారు. -
రాజసమంద్ బరిలో మేవార్ రాజ కుటుంబీకురాలు
రానున్న లోక్సభ ఎన్నికల కోసం రాజస్థాన్లో బీజేపీ తన అభ్యర్థుల ఐదో జాబితాను ప్రకటించింది. ఇందులో రాజసమంద్ సీటు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మహిమా విశేష్వర్ సింగ్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో ఈ స్థానం నుంచి దియా కుమారి ఎంపీగా ఉన్నారు. 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈ స్థానానికి సుదర్శన్ రావత్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఎవరీ మహిమా విశేష్వర్ సింగ్? మేవార్ రాజు మహారాణా ప్రతాప్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవార్ సతీమణే ఈ మహిమా విశేష్వర్ సింగ్. మహిమా సింగ్ భర్త విశ్వరాజ్ సింగ్ మేవార్ నాథ్ద్వారా బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో మహిమ తన భర్త విజయానికి విశేష కృషి చేశారు. రాజ్సమంద్ పార్లమెంటరీ సీటులో 2019లో జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారిని పోటీకి దింపిన బీజేపీ ఇప్పుడు మేవార్ రాజకుటుంబానికి మహిమా సింగ్ బరిలోకి దించింది. జగదీశ్వరి ప్రసాద్ సింగ్ ఇంట్లో 1972 జూలై 22న జన్మించిన మహిమా సింగ్ మేవార్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో ఉన్న సింధియా కన్యా విద్యాలయంలో చదివారు. కాలేజీ విద్యను ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో పూర్తి చేశారు. ఆమె మనస్తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. -
రసాయన కర్మాగారంలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం!
రాజస్థాన్లోని జైపూర్ పరిధిలో గల బస్సీలోని షాలిమార్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. గాయపడిన ఇద్దరిని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళానికి చెందిన వాహనాలు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మృతులను మనోహర్, హీరాలాల్, కృష్ణలాల్ గుర్జార్, గోకుల్ హరిజన్లుగా పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో చేరిన వారిని ఇంకా గుర్తించలేదు. పరిశ్రమలోని బాయిలర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక దళం, రెస్క్యూ టీం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. -
సగం టార్గెట్ ఇవే.. నిలిచేదెవరు.. గెలిచేదెవరు?
దేశవ్యాప్తంగా లోక్సభ సార్వత్రిక ఎన్నికల కాక మొదలైంది. వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకుని హాట్రిక్ కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటే ఈసారి ఎలాగైనా ఎన్డీఏ కూటమి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ సహా ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కువ లోక్సభ సీట్లు ఏ కూటమి గెలుచుకుంటే ఆ కూటమికే అధికారం ఖాయమని చెప్పవచ్చు. ఉత్తర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్లో 80 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 1, బీజేపీ 62, ఎస్పీ 5, ఇతరులు 12 సీట్లు గెలుచుకున్నారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్, మాయావతి కీలక నేతలు. వారణాసీ, రాయ్బరేలి, మైన్పురీ కీలక నియోజకవర్గాలు. అయోధ్య రామాలయం, కుల సమీకరణాలు, నిరుద్యోగం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. బిహార్ బిహార్లో 40 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 39 స్థానాలను, యూపీఏ 1 సీటు గెలుచుకున్నాయి. బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, సుశీల్ మోదీ, తేజస్వీ యాదవ్ కీలక నేతలు. హాజీపూర్, పట్నా సాహిబ్, పాటలీపుత్ర కీలక నియోజకవర్గాలు. కుల సమీకరణాలు, హిందూత్వ వాదం, నిరుద్యోగం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. రాజస్థాన్ రాజస్థాన్లో 25 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 25 స్థానాలనూ ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. భజన్లాల్ శర్మ, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ కీలక నేతలు. జోధ్పూర్, కోటా-బూందీ కీలక నియోజకవర్గాలు. కుల సమీకరణాలు, రైతుల సమస్యలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. పంజాబ్ పంజాబ్లో 13 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 8 స్థానాలు, ఎన్డీఏ కూటమి 4, ఆప్ 1 సీటు గెలుచుకున్నాయి. పంజాబ్ అసెంబ్లీలో 117 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. భగవంత్మాన్, సుఖ్బీర్సింగ్ బాదల్, సునీళ జాఖడ్ కీలక నేతలు. అమృత్సర్, గురుదాస్పుర్ కీలక నియోజకవర్గాలు. రైతు సమస్యలు, శాంతి భద్రతలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. హరియాణా హరియాణాలో 10 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. హరియాణా అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్, జేజేపీ, ఐఎన్ఎల్డీ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. మనోహర్లాల్ ఖట్టర్, నాయబ్సింగ్ సైనీ, భూపీందర్ హుడా, కుమారి శెల్జా, ఓంప్రకాశ్ చౌతాలా కీలక నేతలు. రోహ్తక్, కురుక్షేత్ర కీలక నియోజకవర్గాలు. రైతుల సమస్యలు, హిందూత్వ వాదం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. ఢిల్లీ ఢిల్లీలో 7 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 7 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్, వీరేందర్ సచ్దేవ, అర్విందర్ సింగ్ కీలక నేతలు. న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ కీలక నియోజకవర్గాలు. సీఏఏ, ఆప్-కాంగ్రెస్ జట్టు కట్టడం ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో 5 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 5 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. పుష్కర్సింగ్ ధామీ, కరణ్ మాహరా కీలక నేతలు. హరిద్వార్, నైనిటాల్-ఉద్దమ్ సింగ్ నగర్ కీలక నియోజకవర్గాలు. యూసీసీ, నిరుద్యోగం, మహిళలపై నేరాల పెరుగుదల ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 4 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 68 స్థానాలు ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. సుఖ్విందర్ సింగ్ సుఖ్ఖూ, రాజీవ్ బిందల్ కీలక నేతలు. హమీర్పుర్, మండి కీలక నియోజకవర్గాలు. అయోధ్య రామాలయం, కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. జమ్మూకశ్మీర్ ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్లో 5 లోక్సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 2 స్థానాలు, నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు గెలుచుకున్నాయి. భారతీయ జనతా పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కీలక నేతలు. ఆర్టికల్ 370 రద్దు, తగ్గుతున్న ఉగ్రవాద ఘటనలే ఇక్కడ ప్రస్తుత ఎన్నికల అంశాలు. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఇంకా కొలిక్కిరాకపోవడంతో అధికారికంగా ఇంకా అసెంబ్లీ సీట్ల సంఖ్య ఖరారు కాలేదు. -
చార్భుజనాథ్ ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఒకరు మృతి!
రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో జరిగిన చార్భుజనాథ్ ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనతో ఇక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒక వర్గానికి చెందినవారు ఈ రాళ్లదాడికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్తోర్గఢ్ జిల్లాలోని రష్మీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహూనా గ్రామంలో దశమి సందర్భంగా చార్భుజనాథ్ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు పట్టణంలోని ప్రధాన మార్కెట్ సమీపంలోకి రాగానే ఏదో ఒక విషయమై వాగ్వాదం జరిగి రాళ్లదాడి చోటచేసుకుంది. ఈ ఘటనలో శ్యామ్ చిపా అనే వ్యక్తి మృతి చెందాడు. నవీన్ జైన్ అనే మరో వ్యక్తి గాయపడినట్లు సమాచారం. -
యువరాజ్ సింగ్ పోరాటం వృధా.. లెజెండ్స్ టైటిల్ నెగ్గిన ఉతప్ప జట్టు
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న తొలి లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీని రాజస్థాన్ కింగ్స్ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో రాబిన్ ఉతప్ప సారధ్యం వహిస్తున్న రాజస్థాన్.. యువరాజ్ సింగ్ నాయకత్వంలోని న్యూయార్క్ సూపర్స్టార్ స్ట్రయికర్స్ను 20 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూయార్క్ను గెలిపించేందకు యువరాజ్ సింగ్ చివరివరకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. ఆష్లే నర్స్ (41 బంతుల్లో 97), హ్యామిల్టన్ మసకద్జ (30 బంతుల్లో 56) చెలరేగడంతో నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూయార్క్ బౌలర్లలో జేరోమ్ టేలర్ 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ ప్రదీప్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూయార్క్.. యువరాజ్ సింగ్ మెరుపు అర్దశతకంతో (22 బంతుల్లో 54) మెరిసినప్పటికీ ఓటమిపాలైంది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూయార్క్ ఇన్నింగ్స్లో కపుగెదెర (30), గుణరత్నే (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో పర్విందర్ అవానా, జకాతి, బిపుల్ శర్మ, చతురంగ డిసిల్వ, ఆష్లే నర్స్ తలో వికెట్ పడగొట్టారు. -
పట్టాలు తప్పిన సబర్మతి రైలు
జైపూర్: రాజస్థాన్లో సబర్మతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. గూడ్స్ రైలును ఢీకొట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అజ్మీర్లోని మడర్ రైల్వేస్టేషన్లో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సబర్మతి రైలులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. #WATCH | Rajasthan: Four coaches including the engine of a passenger train travelling from Sabarmati-Agra Cantt derailed near Ajmer. Further details awaited. pic.twitter.com/fX9VeLKw2e — ANI (@ANI) March 18, 2024 సబర్మతి సూపర్ఫాస్ట్ డ్రైవర్ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అది గూడ్స్ రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనపై నార్త్ వెస్టర్న్ రైల్వే ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేసింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. ప్రమాదానికి సంబంధించి వివరాల కోసం హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇదీ చదవండి.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం -
ప్రమాద గాయాలతోనే పరీక్షలకు..
ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి విద్యార్థులకు ఎంతో కీలకమైనవి. అందుకే ఈ పరీక్షలను మిస్సవ్వకూడదని భావిస్తారు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ముగ్గురు ప్రమాదం బారినపడినా పరీక్షలను ఎంతో ధైర్యంగా రాశారు. జైపూర్కు చెందిన ముగ్గురు విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు బైక్పై ఇంటి నుంచి బయలుదేరారు. అయితే దారిలో వారి బైక్ ప్రమాదానికి గురైంది. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న పరీక్షలకు హాజరయ్యేందుదుకు ఆ విద్యార్థులు ఉదయం 7:45 గంటలకు బైక్పై బయలుదేరారు. అయితే సెంటర్కు చేరుకునేలోగా వారి బైక్ను ప్రయాణికుల వ్యాన్ ఢీకొంది. దీంతో ఆ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వారి గాయాలకు డ్రెస్సింగ్ చేశారు. అదే పరిస్థితిలో వారు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. తమకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అక్కడి ఉపాధ్యాయులను అభ్యర్థించాక వారికి అందుకు అనుమతిచ్చారు. వారి కాళ్ల నుంచి రక్తం కారుతున్నా వారు పరీక్ష రాయడం విశేషం. తరువాత వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ విద్యార్థుల ధైర్యాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు తెలియజేస్తూ ఈ విద్యార్థులు ఓ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వారని తెలిపారు. వీరిని మన్పురా మచాడీ నివాసి లోకేష్ యాదవ్, ఉదయపురియా నివాసి అంకిత్ గుర్జార్, ఏకలవ్య ఫుల్వాడియాగా గుర్తించారు. ముగ్గురూ ఒకే బైక్పై పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రయాణికులు వాహనం వీరి బైక్ను ఢీకొన్నదని పోలీసులు తెలిపారు. -
Bharat Shakti: అబ్బురపర్చిన ‘భారత్ శక్తి’ విన్యాసాలు..వీక్షించిన మోదీ (ఫొటోలు)
-
విషాదం.. కరెంట్ షాక్తో 14 మంది చిన్నారులకు గాయాలు
జైపూర్: మహాశివరాత్రి రోజు విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్లోని కోటాలో శివరాత్రి పర్వదినాన ఏర్పాటు చేసిన వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి 14 మంది చిన్నారులు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన చిన్నారులు వాళ్ల కుటుంబీకులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. చాలా బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఒకరికి 100శాతం శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కరెంట్ షాక్కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే విద్యుత్ షాక్కు హైటెన్షన్ ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరు పిల్లలకు 50 నుంచి 100 శాతం కాలిన గాయాలు, మిగిలిన వారు 50 శాతం కంటే తక్కువ కాలిన గాయాలు తగిలినట్లు పేర్కొన్నారు. -
లైంగిక కోరిక.. కాదన్నందుకు వ్యక్తిని హత్య చేసిన స్నేహితులు
సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. మంచి, మర్యాద మరిచి నీచానికి తెగబడుతున్నారు. అసభ్యంగా ప్రవర్తించి మానవత్వానికి మాయని మచ్చగా మారుతున్నారు. తాజాగా రాజస్థాన్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. లైంగిక కోరిక(ఓరల్ సెక్స్) తీర్చలేదని తోటి స్నేహితులే ఓ వ్యక్తిని హత్య చేశారు.. ఈ దారుణం బరన్ జిల్లాలో తొమ్మిది రోజుల క్రితం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 26న ఓం ప్రకాష్ బైర్వా(40), అతని స్నేహితులు మురళీధర్ ప్రజాపతి, సురేంద్ర యాదవ్తో కలిసి మద్యం సేవించారు. అనంతరం ముగ్గురు ప్రజాపతి సోదరుడిని చూడటానికి సమీపంలోని గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ప్రజాపతి, మురళీధర్ తమతో ఓరల్ సెక్స్ చేయాలని బైర్వాను బలవంతం చేశారు. అందుకు అతను ససేమిరా అనడంతో బలమైన ఆయుధంతో నరికి చంపారు. అనంతరం మృతదేహాన్ని ఓ చెరువులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు సురేంద్ర యాదవ్, మురళీధర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని విచారిస్తుండగా.. మరొరకు అరెస్ట్ భయంలో విషం తాగడంతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బరన్ ఎస్పీ రాజ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. కాగా ప్రజాపతి రోడ్డు పక్కన దాబా నడుపుతుండగా, సరేంద్ర యాదవ్ దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు అని బరన్ సిటీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రాంవిలాస్ తెలిపారు. చదవండి: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంట్లోనే వరుడి హత్య.. తండ్రి పనేనా? -
820 కోట్ల స్కామ్! 67 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: ఐఎంపీఎస్ లావాదేవీల ముసుగులో జరిగిన భారీ కుంభకోణాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో తాజాగా సీబీఐ సోదాలు నిర్వహించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూకో బ్యాంక్లో జరిగిన భారీ కుంభకోణంలో కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ గురువారం పలుచోట్ల తనిఖీలు చేపట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని ఏడు నగరాల్లో 67 చోట్ల సోదాలు జరుపుతోంది. యూకో బ్యాంక్లోని వివిధ ఖాతాల్లో సుమారు 820 కోట్ల అనుమానాస్పద ఐఎంపీఎస్ లావాదేవీలకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ దాడులు చేస్తోంది. వివిధ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయిన సొమ్మును మళ్లీ వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈ సోదాల్లో భాగంగా యూకో బ్యాంక్, ఐడీఎఫ్సీకి చెందిన 130 పత్రాలను అధికారులు సీజ్ చేశారు. అలాగే మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. 30 మంది అనుమానితులను కూడా విచారించినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు పేర్కొన్నారు. కాగా గత ఏడాది నవంబర్ 10 నుంచి13 మధ్య ఏడు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 14,600 ఖాతాల నుంచి తమ బ్యాంక్కు చెందిన 41,000 ఖాతాలలో ఐఎంపీఎస్ అంతర్గత లావాదేవీలు తప్పుగా జరిగినట్లు గుర్తించిన యూకో.. సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా నవంబర్ 21న కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. దీని ఫలితంగా బదిలీ చేసిన బ్యాంక్ ఖాతాల నుంచి డెబిట్ కాకుండానే యూకో బ్యాంక్ ఖాతాల్లో రూ. 820 కోట్లు జమ అయ్యాయి. దీంతో డబ్బులు పడ్డాయని తెలిసిన చాలా మంది ఖాతాదారులు వారి ఖాతాలలోని ఆకస్మిక మొత్తాన్ని విత్డ్రా కూడా చేసుకున్నారు. ఇక 2023 డిసెంబర్లోనూ కోల్కతా, మంగళూరులోని యూకో బ్యాంక్ అధికారులకు చెందిన 13 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది. చదవండి: సవాల్ విసిరితే.. దేనికైనా సిద్ధమే: రాజ్నాథ్ సింగ్ -
8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం!
దేశంలో శివరాత్రి ఉత్సాహం నెలకొంది. శుక్రవారం జరిగే శివరాత్రి పూజలకు భక్తులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాజస్థాన్లోని బన్స్వారా జిల్లాకు చెందిన లక్షలాది మంది భక్తులకు శివరాత్రి ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఇక్కడ కొలువైన శివుడు ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శనమిచ్చి అదృశ్యమవుతాడు. దీనివెనుకగల ఆసక్తికర కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బన్స్వారా జిల్లాలో మహి, అనస్ నదుల సంగమం వద్ద 200 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుత శివాలయం ఉంది. సంవత్సరంలో ఏడెనిమిది నెలల పాటు ఈ ఆలయం కనుమరుగువుతుంది. ఈ ఆలయం నాలుగు అడుగుల నీటిలో మునిగి ఉంటుంది. ఏళ్ల తరబడి ఇలా జరుగుతున్నా ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లకపోవడం విశేషం. ఈ ఆలయం ఇలా మునిగిపోవడానికి గల కారణం గుజరాత్లోని కడనా డ్యామ్లోకి చేరిన నీరు ఈ ఆలయ ప్రాంతంలో నిలిచిపోవడం. ఇటుక, రాయి, సున్నంతో నిర్మితమైన ఈ ఆలయం సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయంగా పేరొందింది. ఈ ఆలయం బన్స్వారాకు 70 కి.మీ. దూరంలో ఉంది. ఫిబ్రవరి, మార్చిలలో ఈ ప్రాంతంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం కనిపిస్తుంది. శివరాత్రి సమయంలో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని, శివుణ్ణి దర్శించుకుంటారు. నదుల సంగమ తీరం కావడంతో ఈ ఆలయానికి సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయం అనే పేరు వచ్చింది. -
Rajasthan : డబుల్ జీరో! కాంగ్రెస్ ‘సున్నా’ రాత మారేనా?
రాజస్థాన్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు గానూ 24 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. రాజస్థాన్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా రాష్ట్రంలో 34.6 శాతం ఓట్లు సాధించింది. సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ.. మార్చి 7న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుందని చెప్పారు. అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నామని, అతి త్వరలోనే పేర్లను ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా గెలుపు గుర్రాలను గుర్తించినట్లు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ తెలిపారు. రాజస్థాన్లో పొత్తుల భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకంపై మాట్లాడుతూ.. “రాజస్థాన్లో పొత్తు ఎవరితో, ఎలా ఉండాలో నిర్ణయించే ఇండియా కూటమితో పాటు మాకు ఏఐసీసీ కమిటీ ఉంది” అన్నారు. 2019లో ఎన్డీఏ క్లీన్స్వీప్ 2019 లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం 25 స్థానాలకు గానూ 24 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. ఈ పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామి కావడం విశేషం. అంటే అన్ని స్థానాలను ఎన్డీఏ కూటమి క్లీన్స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 59 శాతం ఓట్లు సాధించింది. రాజస్థాన్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా రాష్ట్రంలో 34.6 శాతం ఓట్లను సాధించగలిగింది. కాగా 2018లో రెండు లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2014లో ‘జీరో’ సీట్లు అంతకు ముందు 2014 సార్వత్రికలో ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లోక్సభ స్థానాల్లో ఖాతా తెరవలేకపోయింది. అప్పుడు కూడా ఎన్డీఏ క్లీన్స్వీప్ చేసింది. మొత్తం 25 సీట్లలో 21 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. 55.6 శాతం ఓట్లు సాధించింది. ఇక ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్ 30.7 శాతం ఓట్లు తెచ్చుకుంది. 2019 ఎన్నికలను పరిశీలిస్తే 47 శాతం ఓట్లతో 20 సీట్లు గెలుపొందగా, బీజేపీ 36.6 శాతం ఓట్లతో కేవలం 4 స్థానాలే గెలిచింది. మరి ఈసారైనా కాంగ్రెస్ ‘సున్నా’ రాత మారుతుందో లేదో చూడాలి. -
రూ. 2 కోట్లకు ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షా పత్రాలు!
రాజస్థాన్లో మరో అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షను గత గెహ్లాట్ ప్రభుత్వం నిర్వహించింది. 2021 సెప్టెంబరులో ఈ పరీక్షను మూడు దశల్లో నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో చీటింగ్ జరిగినట్లు తాజాగా వెల్లడైంది. గత ఏడాది మే నెలలో ఈ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. విజయం సాధించినవారు ప్రస్తుతం రాజస్థాన్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇన్నాళ్లకు ఈ పరీక్షలో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పరీక్షలో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది అభ్యర్థులు మోసపూరితంగా ఉత్తీర్ణులయ్యారని ఆధార పూర్వకంగా తేలిందని కేబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా తెలిపారు. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు 42 మంది భాగస్వాములు పేర్లు వెల్లడయ్యాయి. వీరిలో 20 మందిని అరెస్టు చేశారు. రాజధాని జైపూర్లోని హస్నుపర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి ఈ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ పేపర్ను వాట్సాప్లో పంపారు. ఇందుకోసం సదరు స్కూల్ డైరెక్టర్ పది లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ పేపర్ రూ. 2 కోట్లకు పైగా మొత్తానికి అమ్ముడుపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూత
రాజస్థాన్ క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ జట్టు మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ (40) కన్నుమూశాడు. గతకొంతకాలంగా లివర్ సమస్యలతో బాధపడుతున్న రోహిత్ జైపూర్లోని ప్రైవేటు అసుపత్రిలో నిన్న తుది శ్వాస విడిచాడు. 2014లో ప్రొఫెషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పిన రోహిత్ ఆతర్వాత క్రికెట్ అకాడమీని స్థాపించి, కోచ్గా సేవలందిస్తున్నాడు. రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్, లెగ్ స్పిన్ బౌలర్ అయిన రోహిత్ 2004-2014 మధ్యలో రాజస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రోహిత్ రాజస్థాన్ తరఫున 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 28 లిస్ట్-ఏ మ్యాచ్లు, 4 టీ20లు ఆడాడు. రోహిత్ ఖాతాలో రెండు లిస్ట్-ఏ సెంచరీలు ఉన్నాయి. -
1993 పేలుళ్ల కేసులో ‘డాక్టర్ బాంబ్’ తుండాకు ఊరట!
జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. లష్కరే తోయిబా ప్రధాన సభ్యుడు అబ్దుల్ కరీమ్ తుండాను రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. పేలుళ్ల కేసులకు సంబంధించి.. తుండాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. .. అదే సమయంలో ఈ కేసులో అమీనుద్దీన్, ఇర్ఫాన్ అనే ఇద్దరికి జీవితఖైదు విధించింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరీం తుండా బాగా దగ్గర. బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్నందునే కరీం తుండాను ‘మిస్టర్ బాంబ్’గా పేర్కొంటారు. గతంలో.. లష్కరే తోయిబా, ఇండియన ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, బబ్బర్ ఖాల్సా సంస్థలకు పని చేశాడు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా పేర్కొంటూ పలు ఉగ్రసంస్థలు దేశంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాయి. 1993లో కోటా, కాన్పూర్, సూరత్, సికింద్రాబాద్ స్టేషన్ల పరిధిలో రైళ్లలో జరిగిన పేలుళ్లు యావత్ దేశాన్ని షాక్కి గురి చేశాయి. ఈ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. అయితే వివిధ నగరాల్లో నమోదైన ఈ కేసులంటిని ఉగ్రవాద నిరోధక చట్టం ఆధారంగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. కరీం తుండాను నిర్దోషిగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించడాన్ని.. సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని సీబీఐ భావిస్తోంది. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. కార్పెంటర్ పని చేసే తుండా.. ముంబై పేలుళ్ల తర్వాతే నిఘా సంస్థల పరిశీలనలోకి వచ్చాడు. ఉత్తరాఖండ్ నేపాల్సరిహద్దులో 2013లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశాయి. 1996 పేలుడు కేసుకు సంబంధించి హర్యానా కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. ఇక.. బాంబు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి కరీం తన ఎడమ చేతిని కోల్పోయాడు. -
ఆ చిన్నారికి అరుదైన వ్యాధి.. రూ. 17 కోట్ల సాయం కోసం ఎదురుచూపు!
రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలోని మణియన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అధికారి నరేష్ చంద్ర శర్మ కుమారుడు హృదయాంశ్(22 నెలలు) అరుదైన జన్యుపరమైన వ్యాధి ఎస్ఎంఏ టైప్-2తో బాధపడుతున్నాడు. హృదయాంశ్ తన కాళ్లపై తాను నిలబడలేడు. చికిత్స లో భాగంగా ఆ చిన్నారికి రూ. 17.5 కోట్ల విలువైన ZOLGESMA ఇంజక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. హృదయాంశ్కు రెండు నెలల వ్యవధిలోగా ఈ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. ఇంత స్వల్ప వ్యవధిలో రూ. 17 కోట్ల భారీ మొత్తాన్ని ఏర్పాటు చేయడం హృదయాంశ్ తండ్రి నరేష్ చంద్రకు సాధ్యంకాని పని. ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ యూఆర్ సాహు దీనిపై పలువురు పోలీసు సూపరింటెండెంట్లకు నరేష్ చంద్ర శర్మకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఈ మెయిల్ చేశారు. తన కుమారుని వైద్యం కోసం అవసరమయ్యే సొమ్ము భారీగా ఉండటంతో సామాజిక సంస్థలు, సంఘాలు కూడా ముందుకువచ్చి సహాయం అందించాలని పోలీసు అధికారి నరేష్ చంద్ర శర్మ కోరుతున్నారు.