-
విక్రేతల మధ్య సమాన పోటీ ఉండాలి
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఈ–కామర్స్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో ఈ రంగంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్న, పెద్ద విక్రేతల మధ్య సమాన పోటీ ఉండేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం రాజస్తాన్లోని జైపూర్లో జరిగిన జీ20 దేశాల వాణిజ్య, పెట్టుబడి శాఖ మంత్రుల సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ధరలు, ఫిర్యాదుల విషయంలో వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. డిజిటలీకరణ ద్వారా ఈ–కామర్స్ రంగంలో దేశాల మధ్య కార్యకలాపాలు సులభతరం అవుతాయని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) అనేది ఒక గేమ్–చేంజర్ అని మోదీ అభివరి్ణంచారు. దీనిద్వారా డిజిటల్ మార్కెట్ప్లేస్ వ్యవస్థను సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, సానుకూలతను ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం.. మునేశ్ గుర్జర్ సస్పెండ్
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మునేశ్ గుర్జర్కు బిగ్ షాక్ తగిలింది. గుర్జర్పై రాజస్థాన్ ప్రభుత్వం వేటువేసింది. ఓ భూమి లీజ్ వ్యవహారంలో ఆమె భర్త లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ గెహ్లాట్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. మేయర్ మునేశ్ గుర్జర్ భర్త సుశీల్ గుర్జర్ ఓ భూమి లీజ్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుల నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీక అధికారులకు చిక్కాడు. మేయర్ స్వగృహంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో మేయర్ మునేశ్ గుర్జర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇక, ఆమె ఇంటి నుంచి ఏసీబీ అధికారులు రూ.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. లంచం వ్యవహారంలో మేయర్ హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు నంబర్ 43 కార్పొరేటర్ పదవి నుంచి కూడా సస్పెండ్ చేసింది. మరోవైపు.. ఈ కేసులో నారాయణ్ సింగ్, అనిల్ దూబే అనే మరో ఇద్దరిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. నారాయణ్ సింగ్ నివాసంలోనూ మరో రూ.8 లక్షల నగదు లభ్యమైనట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రాజస్థాన్లోని కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇది దోపిడీ, అబద్ధాల ప్రభుత్వమని మండిపడింది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్లో ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మేయర్ లంచం కేసు వ్యవహారం హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది. Breaking News: Mayor Munesh Gurjar निलंबित। कहा, 'कांग्रेस के बड़े नेता ने साज़िश कर फंसाया है'! pic.twitter.com/AajGDCt6IO — Rajasthan Tak (@Rajasthan_Tak) August 6, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో కీలక పరిణామం.. ఎన్సీపీలో మళ్లీ చీలిక..? -
రాజస్థాన్ కోటలో ఆత్మహత్యల పరంపర.. ఈ ఏడాది ఇప్పటికే 18.. ఆందోళనలో నిపుణులు!
రాజస్థాన్లోని కోట జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర నిరంతరం కొనసాగుతోంది. తాజాగా బీహార్కు చెందిన భార్గవ్ ఆత్మహత్యతో కోట కోచింగ్ సెంటర్లలో విద్యనభ్యసిస్తూ ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల జాబితాలో మారోపేరు చేరింది. తమ కుమారుడు భార్గవ్ మిశ్రా మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కోటకు వచ్చిన మృతుని కుటుంబ సభ్యుల రోదన అక్కడున్నవారి హృదయాలను కలచివేసింది. జేఈఈ కోచింగ్ కోసం వచ్చి.. 17 ఏళ్ల భార్గవ్ మిశ్రా ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ కోసం 4 నెలల క్రితమే బీహార్లోని చంపారణ్ నుంచి కోట నగరానికి వచ్చాడు. ఇక్కడి మహావీర్ నగర్ ప్రాంతంలోని పీజీలో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో జేఈఈ కాంపిటీటివ్ పరీక్ష కోసం సిద్ధం అవుతున్నాడు. తాజాగా భార్గవ్ తండ్రి కుమారునికి ఫోన్ చేయగా, కుమారుడు ఫోన్ తీయలేదు. ఎంతసేపు ప్రయత్నించినా కుమారుడు ఫోన్ రిసీవ్ చేసుకోకపోవడంతో తండ్రి కుమారుని ఇంటి యజమానికి ఈ విషయం తెలిపాడు. ఉరి వేసుకున్న స్థితిలో భార్గవ్ వెంటనే ఇంటి యజమాని గది తలుపులు తట్టాడు. లోపలి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని కిటికీలో నుంచి గదిలోనికి తొంగిచూడగా, భార్గవ్ మిశ్రా ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే అతను ఈ సమాచారాన్ని మహావీర్ నగర్ పోలీసులకు తెలియజేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారి అవధేష్ కుమార్ మాట్లాడుతూ గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం దానిని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వైట్హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం! మెడికల్, ఇంజినీరింగ్ కోచింగ్ సెంటర్ల ఫ్యాక్టరీలు నడిచే కోటకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు తరలివస్తుంటారు. వీరు ఇంజినీర్లు లేదా డాక్టర్లు కావాలన్న తమ కలను నెరవేర్చుకునేందుకు తాపత్రయ పడుతుంటారు. ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే హామీలను నమ్మి, ఇక్కడ కోచింగ్ తీసుకుంటుంటారు. ఈ ఏడాది ఈ ప్రాంతంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపధ్యంలో కోట కోచింగ్ సెంటర్ల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. 18కి చేరిన విద్యార్థుల ఆత్మహత్యలు భార్గవ్ మిశ్ర ఆత్మహత్యతో ఈ ఏడాది ఇక్కడ విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 18కి చేరింది. ఇది అందరిలోనూ ఆందోళనను మరింతగా పెంచుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోచింగ్ సెంటర్లకు పలు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులలో మోటివేషన్ తీసుకు వచ్చే చర్యలు చేపట్టాలని కోరింది. జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటు చేసి నిపుణుల సాయంతో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. స్థానిక పోలీసులు కూడా డెడికేటెడ్ స్టూడెంట్ సెల్ను ప్రారంభించారు. దీని ద్వారా విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఏ సమయంలోనైనా తమకు ఫోన్ చేసి, తమ సహాయం తీసుకోవచ్చని విద్యార్థులకు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం 2లక్షలకు పైగా విద్యార్థులు కోటలో వివిధ కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్కు దేహశుద్ది! -
రాజస్తాన్లో దారుణం.. అత్యంత పాశవికం, బాలికపై హత్యాచారం
జైపూర్: రాజస్తాన్లో భిల్వారాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు రాక్షసులు 14 ఏళ్ల బాలికను చంపి, బొగ్గు బట్టీలో కాల్చేశారు. బుధవారం ఉదయం మేకల కాపలాకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె సోదరుడు, గ్రామస్తులు వెతుకులాట మొదలుపెట్టారు. రాత్రికి గ్రామ సమీపంలోని మండుతున్న ఒక బట్టీలో బాలిక చేతి గాజు, ఎముక ముక్కలు..ఆ పక్కనే బాలిక చెప్పులు వారికి కనిపించాయి. దీంతో, వారు బట్టీలు నిర్వహించే కల్బేరియా తెగకు చెందిన అయిదుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికపై అత్యాచారం చేశాక, చంపి కొలిమిలో పడేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను ప్రశ్నిస్తున్నట్లు కోట్రి పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పారు. -
అందాల పోటీల్లో మెరిసిన చంద్రగిరి సంజన..
చంద్రగిరి (తిరుపతి రూరల్): జాతీయ స్థాయి అందాల పోటీల్లో చంద్రగిరి యువతి మెరిసింది. ఈ నెల 16న జైపూర్లో జరిగిన ‘స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా–2023’ పోటీలలో చంద్రగిరికి చెందిన సంజన మిస్ ఇండియా కిరీటం కైవశం చేసుకుంది. కాగా, ఫైనల్స్లో 47 మంది పాల్గొనగా.. వారిలో స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియాగా సంజన ఎంపికైంది. ఆ వివరాలను ఆమె తల్లిదండ్రులు గురువారం మీడియాకు తెలిపారు. చంద్రగిరి మాజీ ఎంపీటీసీ అల్లతూరు మోహన్ మనమరాలైన సంజన మోడలింగ్పై మక్కువ పెంచుకుంది. 2023 మేలో బెంగళూరులో ప్రిలిమినరీ రౌండ్లో 300 మందికి పైగా బాలికలు జూమ్ కాల్లో పాల్గొనగా.. ఫైనల్స్కు 57 మంది ఎంపికయ్యారు. వారిలో సంజన ఒకరు. ఈ నెల 16 నుంచి జైపూర్లో జరిగిన గ్రాండ్ ఫైనల్లో 47 మంది పాల్గొనగా.. వారిలో సంజన మొదటి స్థానం పొందింది. ఇది కూడా చదవండి: మీ ఓటు ఉందా?.. చెక్ చేసుకోండి -
బైక్కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!
ఎక్కడైనా దేవునికి గుడి కట్టి పూజలు చేయడం ఆనవాయితీ.. హిందూ సంప్రదాయం ప్రకారం పంచ్ భూతాలను కూడా పూజిస్తారు. అయితే వీటన్నింటికి భిన్నంగా రాజస్థాన్లో ఒక 'బైకు'కి గుడి కట్టి పూజలు చేస్తున్నారు. ఇంతకీ ఆ బైకుకి ఎందుకు గుడి కట్టారు. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 1980 చివరలో 'ఓం సింగ్ రాథోడ్' అనే యువకుడు తనకు ఎంతగానో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్సైకిల్పై ప్రయాణించేటప్పుడు ఒక చెట్టుకు ఢీ కొట్టి ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పాలీ జిల్లాలోని చోటిలా గ్రామ సమీపంలో జరిగింది. బుల్లెట్ బాబా.. ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు ఆ బైకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ బుల్లెట్ బైక్ మరుసటి రోజు వెళ్లి ప్రమాదం జరిగిన చోటుకే చేరినట్లు తెలిసింది. ఇది ఎవరో ఆకతాయిల పని అని భావించి పోలీసులు మళ్ళీ ఆ బైకుని స్టేషన్కి తీసుకెళ్లారు. మళ్ళీ మునుపటి మాదిరిగానే ప్రమాదం జరిగిన చోటుకే చేరింది. ఈ సంఘటన మొదట్లో అందరిని భయానికి గురిచేసింది. ఆ తరువాత ఇందులో ఏదో దైవత్వం ఉందని గ్రహించి స్థానికులు ఓం సింగ్ రాథోడ్కు నివాళులర్పించాలని నిర్ణయించుకున్నారు. ఓం సింగ్ రాథోడ్ ఆత్మ బుల్లెట్ బైకు మీద తిరుగుతుందని భావించి స్థానికులు ప్రమాదం జరిగిన స్థలాన్నే స్థానికులు దేవాలయంగా మార్చారు. ఆ ప్రదేశంలో బుల్లెట్ బైకుకి పూజలు చేయడం ప్రారంభించారు. బుల్లెట్ మోటార్సైకిల్కు ఓం సింగ్ రాథోడ్ గౌరవార్థం 'బుల్లెట్ బాబా' అని పేరు పెట్టారు. ప్రతి రోజూ ఎంతో మంది భక్తులు ఈ మందిరాన్ని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు. (ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..) ఈ బుల్లెట్ బాబా ఆలయంలో అగరవత్తులు వెలిగించడం, మోటార్ సైకిల్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, మద్యం పోయటం వంటివి అక్కడి ఆచారం. ఈ విధంగా చేస్తే భక్తులకు ప్రయాణ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగవని ఘాడంగా విశ్వసిస్తారు. ఈ గుడికి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు, సందర్శకులు వస్తుంటారు. కొంతమంది మోటార్సైకిల్దారులు, సాహస యాత్రికులు మరియు ఆధ్యాత్మిక ఔత్సాహికులు తమ ప్రయాణ ప్రయాణంలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. (ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!) View this post on Instagram A post shared by Royalenfieldholic® 𝟮𝟬𝟬𝗸🎯 (@royalenfieldholic) -
‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి’
రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించిన ఒక ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఒక వితంతు వృద్ధ మహిళ మృతిచెందినట్టు నిర్థారిస్తూ ఆమెకు రావాల్సిన పెన్షన్ నిలిపివేశారు. ఈ నేపధ్యంలో బాదామ్దేవి అనే ఆ వృద్ధురాలు తన సమస్య పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. పెన్షన్ నిలిపివేసి.. తాను బతికే ఉన్నానని, తనను గుర్తించి, తనకు తిరిగి పెన్షన్ ఇప్పించాలని వేడుకుంటోంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తనకు పెన్షన్ నిలిపివేశారని ఆమె ఆరోపించింది. ఇప్పుడు ఆమె తాను బతికే ఉన్నానని, అధికారులు నిర్థారించిన విధంగానైనా తనకు డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతోంది. 2023 జనవరి 20న తనకు పెన్షన్ నిలిపివేశారని, కారణం అడిగితే చనిపోయావని అన్నారని ఆమె తన వినతిపత్రంలో పేర్కొంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించినా.. 20 ఏళ్లుగా తాను పెన్షన్ అందుకుంటున్నానని, అయితే ఈ ఏడాది దానిని నిలిపివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను ఈ ఏడాది జనవరి 6న లైఫ్ సర్టిఫికెట్ సమర్పించానని అయినా అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే తాను జీవించివున్నా ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశానన్నారు. కాగా ఆమె దరఖాస్తును చూసిన అధికారులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారి సుభమ్ గుప్త మాట్లాడుతూ ఈ విషయమై దర్యాప్తునకు ఆదేశించామన్నారు. ఇది కూడా చదవండి: 16 ఏళ్లకే చదువుకు టాటా.. నేడు ఏటా రూ.100 కోట్లు సంపాదిస్తూ.. -
పొలిటికల్ స్టంట్.. కాంగ్రెస్కు బిగ్ ఆఫరిచ్చిన ఆప్
ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు ఒకతాటిపైకి రావాలని వ్యూహరచన చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా బిగ్ ఆఫర్ ఇచ్చింది. వివరాల ప్రకారం.. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ చేయకుంటే తాము మధ్యప్రదేశ్, రాజస్ధాన్లో పోటీకి దూరంగా ఉంటామని ఆప్ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆప్ జాతీయ ప్రతినిధి, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందాన్ని ఓకే అంటే తాము రెడీ ఉన్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కార్, ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ మరోసారి విజయం సాధిస్తే దేశం నియంతృత్వంలోకి వెళుతుందన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్ధలను ఉసిగొల్పి విపక్ష నేతలను జైళ్లలో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఆప్ ఆలోచనలను కాంగ్రెస్ కాపీ కొడుతున్నదని ఆరోపించారు. ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఆప్ ఐడియాలు, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మాటలేంటి..? -
బిపర్జోయ్ విలయం.. ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు
కఛ్(గుజరాత్): గత పదిరోజులుగా భయాందోళనకు గురిచేస్తున్న తీవ్ర తుపాను బిపర్జోయ్ ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్లో తీరాన్ని తాకింది. గంటకు 125 కిమీ నుంచి 140 కిమీ వేగంతో కఛ్ జిల్లాలోని జఖౌ పోర్టు సమీపంలో సౌరాష్ట్ర, కచ్ తీరాలను దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. బిపర్జోయ్ తుపాను గుజరాత్లో తీరం తాకిన తర్వాత అతి తీవ్రమైన కేటగిరి నుంచి తీవ్ర స్థాయికి తగ్గిందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం తుపాను సముద్రం నుంచి భూమి వైపు కదిలిందని సౌరాష్ట్ర-కచ్ వైపు కేంద్రీకృతమై ఉందని తెలిపింది. బిపర్జోయ్ తీవ్రత 105-115 కి.మీ.కి తగ్గిందని పేర్కొంది. గుజరాత్ విధ్వంసం తర్వాత తుపాన్ రాజస్థాన్కు మళ్లిందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. రాజస్థాన్ మీదుగా తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు . ఇది వాయువ్య దిశగా కదులుతున్నందున జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. చదవండి: గుజరాత్లోని కఛ్, సౌరాష్ట్ర తీర ప్రాంతాల్లో కుంభవృష్టి కాగా తుపాను సృష్టించిన విలయానికి ఇప్పటి వరకు 22 మంది గాయపడ్డారని, 23 జంతువులు చనిపోయాయని గుజరాత్ రిలీఫ్ కమిషనర్ అలోక్ పాండే తెలిపారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, 524 చెట్లు నేలకొరిగాయని తెలిపారు. దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అయితే భావ్నగర్ జిల్లాలో చిక్కుకున్న మేకలను రక్షించే ప్రయత్నంలో పశువుల యజమాని, అతని కుమారుడు మరణించినట్లు పీటీఐ పేర్కొంది. #WATCH | Gujarat: Trees uprooted and property damaged in Naliya amid strong winds of cyclone 'Biparjoy' pic.twitter.com/d0C1NbOkXQ — ANI (@ANI) June 16, 2023 తుపాను నేపథ్యంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ సహా అన్ని సాయుధ బలగాలు గుజరాత్ స్థానిక ప్రజలకు సహాయం అందించడానికి సన్నద్ధం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, భారత వాయు సేన, నేవీ, ఆర్మీ బలగాలు, తీరగస్తీ దళాలు, బీఎస్ఎఫ్ సిబ్బంది తుపాను సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని పేర్కొంది. తీర ప్రాంతాలకు చెందిన లక్ష మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపింది. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్తాన్లోని పలు ప్రాంతాలకు సైతం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదే విధంగా బిపర్జోయ్ తుపాను కారణంగా శుక్రవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది. తుఫాను పీడిత ప్రాంతాలలో ముందుజాగ్రత్త చర్యగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని ఆసల్యంగా నడుపుతున్నట్లు పేర్కొంది. రద్దైన రైళ్ల జాబితా #WRUpdates #CycloneBiparjoyUpdate For the kind attention of passengers. The following trains of 16/06/2023 have been Fully Cancelled/Short-Originate by WR as a precautionary measure in the cyclone-prone areas over Western Railway.@RailMinIndia pic.twitter.com/NcxSLeqK7a — Western Railway (@WesternRly) June 16, 2023 -
రైతు బిడ్డగా ఓ వరుడి ఆలోచన..మండపానికి ఏకంగా 51 ట్రాక్టర్లతో..
ఓ వరుడి వినూత్న ఆలోచన అందర్నీ ఆలోచింపచేసేలా చేసింది. తమ వివాహాన్ని వెరైటీగా లగ్జరీగా జరుపుకోవాలనుకుంటారు చాలామంది. ఐతే దానికో విలువ, అర్థం వచ్చేలా జరుపుకునేవారు కొందరే. ఇక్కడ ఓ వరుడు తమ ప్రధానవృత్తి వ్యవసాయం అందుకు తగ్గట్టగుగా తన వివాహ ఊరేగింపు ఉండాలనుకున్నాడు. అందుకోసం ఒకటి రెండు కాదు ఏకంగా 51 ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున్న ఊరేగింపుగా వెళ్లాడు. ఇందులో ఓ ట్రాక్టర్ని వరుడే స్వయంగా నడపగా..మిగతావి బంధవులు స్నేహితులు నడిపారు. ఈ ఘటన రాజస్తాన్ బార్మర్లో జరిగింది. వివరాల్లోకెళ్తే..గూడమలాని గ్రామానికి చెందిన ప్రకాష్ చౌదరికి రోలి గ్రామానికి చెందిన మమతతో వివాహం నిశ్చయం అయ్యింది. వధువు ఇల్లు వరుడి ఇంటికి సుమారు 51 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో వరడు వధువు గ్రామానికి అంతే సంఖ్యలో 51 ట్రాక్టర్లతో పెద్ద ఊరేగింపుగా వెళ్లి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. వారంతా అలా రావడం చూసి వధువు తరుపు వారు కూడా ఆశ్చర్యపోయారు. ఈ మేరకు వరుడు ప్రకాశ్ మాట్లాడుతూ..నా కుటుంబం ప్రధాన వృత్తి వ్యవసాయం. అందరూ వ్యవసాయమే చేస్తారు. అలాగే ట్రాక్టర్ను రైతుకు గుర్తింపుగా భావిస్తారు. మా నాన్న పెళ్లి ఊరేగింపుకి ఒక ట్రాక్టర్ ఉపయోగించారు. నేనెందుకు 51 ట్రాక్టర్లు ఉపయోగించకూడదు అని అనుకుని ఇలా చేసినట్లు వివరించాడు వరుడు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు తండ్రి జేతారామ్ మాట్లాడుతూ..ట్రాక్టర్ను భూమి కొడుకుగా పరగణిస్తాం. మా నాన్న, తాతయ్యల ఊరేగింపు ఒంటెలపై సాగింది. అదీగాక మా కుటుంబంలో ఇప్పటికే 20 నుంచి 30 ట్రాక్టర్లు ఉన్నాయి. నా రైతు మిత్రులతో కలిసి ఇన్ని ట్రాక్టర్లను ఏర్పాటు చేశాం. ట్రాక్టర్లతోనే వ్యవసాయం చేస్తున్నప్పుడూ వాటిపై ఎందుకు ఊరేగింపు చేయకూడదన్న ఆలోచనతో ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు జేతారామ్. #WATCH | Rajasthan: A bridegroom arrived with 51 tractors as part of his wedding procession, from Sewniyala to Borwa village in Barmer district. The 1-km long wedding procession had around 150 guests and was led by the bridegroom who himself was driving a tractor. (08.06.2022) pic.twitter.com/euK16AO9LQ — ANI (@ANI) June 9, 2022 (చదవండి: దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? ఒక సారి మీ సబ్బు సంగతి తేల్చండి) -
అలా జరిగేసరికి..ముఖ్యమంత్రి సంయమనం కోల్పోయి.. మైక్ విసిరి..
రాజస్తాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బార్మర్ జిల్లా పర్యటనలో విచిత్రమైన పరిణామం ఎదురైంది. దీంతో ఒక్కసారిగా అసహనం కోల్పోయి మైక్ విసిరేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. నిజానికి ఆశోక్ గెహ్లాట్ బార్మర్లో రెండు రోజులు పర్యటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పథకాల గురించి మహిళల నుంచి ఫీడ్ బ్యాక్ కోసం వారితో సంభాషిస్తుండగా ఈ విచిత్ర పరిణామం ఎదురైంది. ఆ కార్యక్రమంలో ఆ పథకాలన ప్రయోజనాల గురించి వారిని ఆరా తీస్తున్నారు గెహ్లాట్. సరిగ్గా ఆ టైంలో మైక్ సరిగా పనిచేయడం మానేసింది. దీంతో గెహ్లాట్ బార్మర్ జిల్లా కలెక్టర్ నిలబడి ఉన్న ఎడమవైపు మైకుని విసిరారు. పోలీస్ సూపరింటెండెంట్ ఎక్కడ ఉన్నారంటూ.. మండిపడ్డారు. ఎస్పీ, కలెక్టర్ ఒకేలా కనిపిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇంతలో ఓ మహిళ మైక్ ఇవ్వడంతో..శాంతించి కాస్త నిదానంగా దానితో మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట హల్చల్ చేయడమే గాక సీఎం కలెక్టర్పైకి మైక్ విసిరేశారని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే దీనిపై స్పందించింది. ఆయన జిల్లా కలెక్టర్లపై మైక్రోఫోన్ విసరలేదంటూ ఆ వ్యాఖ్యలను ఖండించింది. Ashok Gehlot gets angry and throws Mike(not working) at an official pic.twitter.com/fa3d5Ea4h1 — Hemir Desai (@hemirdesai) June 3, 2023 (చదవండి: ఒడిశా రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు) -
ఎన్నికల ఎఫెక్ట్: సొంత జిల్లాల్లో ‘నో పోస్టింగ్’..
సాక్షి, న్యూఢిల్లీ: సొంత జిల్లాల్లో అధికారులకు పోస్టింగులు ఇవ్వొద్దంటూ త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనునన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. అధికారుల బదిలీలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను వారి సొంత జిల్లాల్లో కొనసాగించరాదని, పోస్టింగులు ఇవ్వకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్లకు మించి ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను సైతం కొనసాగించవద్దని ఆదేశాలిచ్చింది. వచ్చే ఆరు నెలల్లో పదవీ విరమణ పొందే అధికారులను బదిలీ చేయాల్సిన అవసరం లేదని, వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉండే అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను జూలై 31లోగా తమకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇది కూడా చదవండి: బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా గళమెత్తిన బీజేపీ ఎంపీ.. ‘ఒక మహిళగా అభ్యర్థిస్తున్నా’ -
ముఖేష్ అంబానీ తరచూ సందర్శించే ఆలయమిదే.. ప్రాధాన్యత ఏంటంటే
దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖేష్ అంబానీ లగ్జరీ లైఫ్ గురించి చాలా కథనాలు వినిపిస్తుంటాయి. అయితే ముఖేష్ అంబానీ ఆధ్మాత్మికతపై అమితమైన మక్కువ చూపిస్తారనే విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. దేశంలోని చాలా ఆలయాలకు తరచూ ముఖేష్ అంబానీ వెళుతుంటారు. వీటిలో ఒకటే నాథద్వారాలో కొలువైన శ్రీనాథ్ దేవాలయం. రాజస్థాన్లోని నాథద్వారాలోని ఆలయానికి ముఖేష్ అంబానీ చాలాకాలంగా వస్తున్నారు. అంబానీ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ముఖేష్ అంబానీ మాత్రమే కాకుండా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ లాంటి బడా స్టార్లు కూడా ఇక్కడికి వస్తుంటారు.ఈ మందిరానికున్న ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నాథద్వారా ప్రాంతం ఉదయపూర్కు సమీపంలో ఉంది. ఈ ప్రాంతానికి రైలులో లేదా విమానంలో ఉదయ్పూర్ చేరుకున్నాక అక్కడి నుంచి ఆలయానికి వెళ్లవచ్చు. ఈ ఆలయంలో శ్రీకృష్టుని అవతారమైన శ్రీనాథుడు కొలువైవున్నాడు. రాజస్థాన్కు చెందిన ప్రజలు ఇక్కడికి తరచూ వస్తుంటారు. శ్రీనాథ మందిర నిర్మాణం 17వ శతాబ్ధంలో జరిగింది. ఆలయాన్ని మహారాజా రాజాసింగ్ కట్టించారు. ఆలయానికి విశాల ప్రాంగణం ఉంది. అలయంలోనికి ప్రవేశించేందుకు నలువైపులా ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో శ్యామల వర్ణంలోని శ్రీనాథుడు కొలువైవున్నాడు.హోలీనాడు ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. లెక్కకు మించిన జనం ఆలయం వద్దకు చేరుకుంటారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు.ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకునేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఆలయ పరిసరాల్లో భక్తులకు వసతి సౌకర్యం కూడా లభిస్తుంది. ఇటీవలికాలంలో ఇది పర్యాటక స్థలంగానూ అభివృద్ధి చెందుతోంది. -
సీఎం గెహ్లాట్ను టెన్షన్ పెడుతున్న పైలట్ డెడెలైన్.. ఖర్గే ప్లాన్ ఏంటి?
ఢిల్లీ: ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. కాగా, రాజస్థాన్ రాజకీయాలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాజస్థాన్లో మరోసారి అధికారంలోకి రావాలంటే సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే.. అశోక్ గెహ్లాట్ , సచిన్ పైలట్తో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు. ఢిల్లీలో నేడు ఇరువురు నేతలతో ఖర్గే వేర్వేరుగా భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు, వారిమధ్య ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగునున్నట్లు తెలుస్తున్నది. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి 15 రోజుల్లో విచారణ జరిపించాలని ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి సచిన్ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఖర్గే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న అవినీతి, ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షల పేపర్ల లీకేజీ తదితర అంశాలపై విచారణ చేపట్టాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. ‘అవినీతికి వ్యతిరేకంగా తాను, సీఎం గెహ్లాట్ పోరాడాం. కానీ ఇప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధరా రాజే హయాంలో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలి. ప్రస్తుతం ఉన్న రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రద్దు చేసి కొత్త కమిషన్ను ఏర్పాటు చేయాలి. పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలి. 15 రోజుల్లోగా గెహ్లాట్ సర్కారు ఈ డిమాండ్లపై స్పందించాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తా’ అని పైలట్ హెచ్చరించారు. ఆ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. మరోవైపు.. అశోక్ గెహ్లాట్పై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన జన సంఘర్షణ్ పేరుతో అజ్మీర్ నుంచి జైపూర్ వరకు ఐదు రోజుల పాదయాత్ర నిర్వహించారు. గెహ్లాట్ ప్రభుత్వం కనుక విచారణ చేపట్టని పక్షంలో తాను చేపట్టబోయే ఆందోళన మూలంగా తలెత్తే ఎలాంటి పరిణామాలకు భయపడబోనని, చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడుతానని సచిన్ పైలట్ తెగేసి చెప్పారు. అంతటితో ఆగకుండా సీఎం గెహ్లాట్ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని కాకుండా వసుంధరా రాజేను తన నాయకురాలిగా భావిస్తున్నాడంటూ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇది కూడా చదవండి: అమిత్ షా ఎంట్రీ.. ఇక మణిపూర్లో ఏం జరగనుంది? -
కర్ణాటక రిజల్ట్ ఎఫెక్ట్.. కాంగ్రెస్ కీలక నిర్ణయం!
ఢిల్లీ: ఇటీవల జరిగిన హిమాచల్ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికార బీజేపీకి ఎత్తులకు చెక్ పెడుతూ కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాలుగు రాష్ట్రాల కాంగ్రెస్ కీలక నేతలతో ఈనెల 24వ తేదీన సమావేశం కానున్నారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది కాలంలో తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, మధ్యప్రదేశ్లో అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కమల్నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరారు. దీంతో, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మరోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కొనసాగుతోంది. మరోసారి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. రాజస్థాన్లో కూడా సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విబేధాలు పార్టీ అధిష్టానానికి, కాంగ్రెస్ శ్రేణులకు తలనొప్పిగా మారింది. ఇక, తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పాదయాత్రలు చేస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో పర్యటించారు. ఇది కూడా చదవండి: రూ.2,000 నోట్ల మార్పిడి ఇలా... బ్యాంక్ అకౌంట్ ఉండాలా? -
ప్రభుత్వ కార్యాలయంలో రూ. 2 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం..
ఓ ప్రభుత్వ కార్యాలయంలో రూ. 2 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం బయట పడటం తీవ్ర కలకలం రేపింది. అదీకూడా దేశంలో రెండు వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న వేళ ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన రాజస్తాన్లో జైపూర్లోని యోజన భవన్లో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కార్యాలయం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీజీపీ, పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ్లతో కలిసి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్తాన్ ప్రభుత్వాధికారుల ప్రభుత్వ భవనమైన యోజన భవన్లో బేస్మెంట్లో లెక్కల్లోకిరాని ఈ నగదు, బంగారాన్ని గుర్తించారు పోలీసులు. భవనం బేస్మెంట్లోని అల్మార్్లో ఉంచిన బ్యాగులో ఈ నగదు, బంగారం ఉన్నట్లు వెల్లడించారు. అందులో సుమారు రూ. 2.31 కోట్లకు పైగా నగదు, ఒక కిలో బంగారం బిస్కెట్లు ఉన్నాయని తెలిపారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేయడమే గాక ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు పోలీసుల కమిషనర్ ఆనంద్ కుమార్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ..సమీపంలోని సీసీఫుటేజ్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. సీఎం అశోక్ గెహ్లాట్కు కూడా ఇదే విషయమే సమాచారం అందించామని శ్రీ వాస్తవ చెప్పారు. #WATCH | Jaipur, Rajasthan: Around Rs 2.31 crores of cash and 1 kg of gold biscuits have been found in a bag kept in a cupboard at the basement of the Government Office Yojana Bhawan. Police have seized these notes and further investigation has been started. CCTV footage is being… pic.twitter.com/xanN2NQhi7 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 19, 2023 (చదవండి: పేరుకే ఎమ్మెల్యేని.. వీఏఓ కూడా పట్టించుకోవడం లేదు!) -
మరో భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ సన్నాహాలు
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల్లో భారీ విజయం సాధించి మంచి జోరుమీద ఉన్న కాంగ్రెస్ అదే ఊపును జాతీయ ఎన్నికల్లో కొనసాగించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మరో భారత్ జోడో యాత్రకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో భారీ విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ అక్కడ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై గట్టిగా కసరత్తు చేస్తోందని చెప్పారు. ఈ ఫలితాలు ప్రతిపక్ష ఐక్యతకు సందేశం మాత్రమే గాక జాతీయ స్థాయిలో మనం కలిసి పనిచేయాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోందన్నారు. అయితే కొన్ని రాష్ట్రాలతో సైద్ధాంతిక విభేదాలతో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఇతర ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల అనంతరం పొత్తులు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అయితే తాము కేరళలో సీపీఎంతో లేదా తెలంగాణ బీఆర్ఎస్తో పొత్తులు పెట్టుకోలేమని తేల్చి చెప్పారు. అయితే ఈ పొత్తు ఎన్నికల తర్వాత లేదా ఒక్కోసారి ముందస్తుగా కూడా ఉండొచ్చన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను ఆ పదవిని చేపట్టే అవకాశం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. దీని గురించి ఖర్గేని ప్రశ్నించకండి, పుకార్లను నమ్మవద్దని అన్నారు. రాజస్తాన్లోని కాంగ్రెస్ నాయకుల మధ్య రగులుతున్న వివాదాన్ని సైతం క్రమబద్ధీకరిస్తాం అని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో ఇదే జోరుని కొనసాగించేలా దేశవ్యాప్తంగా మరో ప్రచారానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. తాము ఈసారి తూర్పు నుంచి పడమర వరకు పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. గతేడాది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించి, బీజేపీని సునాయాసంగా మట్టికరిపించిందన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ అతని పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ను రూపొందించేలా ఈ ఫలితం ప్రతిపక్ష కూటమి ఓ కొత్త ఊపునిచ్చిందని వేణుగోపాల్ అన్నారు. (చదవండి: నెక్స్ట్ ప్రధాని రాహుల్! దాన్ని ప్రజలే నిర్ణయిస్తారు: ప్రియాంక గాంధీ) -
రాజస్తాన్లోని కాంగ్రెస్కు షాక్ మీద షాక్..కలకలం రేపిన వ్యక్తి..
రాజస్తాన్లో కాంగ్రెస్కి ఊహించని విధంగా షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. అక్కడ కాంగ్రెస్లో అంతర్గత పోరుతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్కి వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ నిరసకు దిగిన ఘటన మరువుక మునుపే మరో గట్టి దెబ్బను ఎదుర్కొంటోంది కాంగ్రెస్. బీజేపీ కాంగ్రెస్పై వరుస అవినీతి ఆరోపణల చేస్తున్న తరుణంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తోంది. జైపూర్లోని 38 ఏళ్ల రామ్ ప్రసాద్ మీనా అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ వ్యక్తి ఓ హోటల్ యజమానితో భూవివాదంలో చిక్కుకున్నాడు. ఈ మేరకు తన స్థలం నుంచి తనను ఖాళీ చేయమంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ కాంగ్రెస్ మంత్రి మహేశ్ జోషి తోపాటు మరికొందరూ వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ ఓ వీడియో సందేశాన్ని రికార్డు చేశాడు బాధితుడు. వాస్తవానికి మీనా అనే వ్యక్తి దశాబ్దానికి పైగా ఆలయ ట్రస్ట్కి చెందని భూమిలోనే నివశిస్తున్నాడు. ఆ వీడియోలో.. "తాను కేబినేట్ మంత్రి మహేష్ జోషి, అతని సహచరులు కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నా. వారు నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో వేధించారు. వేరే మార్గం లేక ఇలా చేస్తున్నా". అని పేర్కొన్నాడు బాధితుడు మీనా. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే అదనుగా బీజేపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ. కాంగ్రెస్పై విరుచుకుపడింది. జోషి రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అంతేగాక బాధితుడు వర్గానికి చెందని బీజేపీ రాజ్యసభ్య సభ్యుడు కిరోరి లాల్ మీనా చనిపోయిన వ్యక్తికి మద్దతు ఇస్తూ..డిమాండ్ నెరవేరే వరకు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించమని చెప్పారు. కాగా, సచిన్పైలట్ బాధితుడి కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ.. సదరు రాజ్యసభ సభ్యుడు కిరోరి లాల్ మీనాతో కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఈఘటన ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి. (చదవండి: 'మహమ్మారి ఇంకా ముగియలేదు'..అప్రమత్తంగా ఉండండని కేంద్రం లేఖ) -
అతని వైపుకి కాంగ్రెస్ టర్న్ తీసుకోదు! ఎందుకంటే..
రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా భరత్పూర్లో బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వైపుకి కాంగ్రెస్ టర్న్ తీసుకోదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ వైపే కాంగ్రెస్ మొగ్గు చూపుతుందని. ఎందుకంటే కాంగ్రెస్ ఖజనాను నింపడంలో గెహ్లాట్ సహకారమే ఎక్కువ కాబట్టి అంటూ సెటైర్లు వేశారు. ఆ విషయంలో సచిన్ పైలట్ సహకారం తక్కువ అని దీంతో అతని వైపు మెజార్టీ సభ్యులు ఉండరన్నారు. అంతేగాదు గెహ్లాట్ రాజస్తాన్ ప్రభుత్వాన్ని అవినీతికి అడ్డాగా మార్చి దోచుకున్నారన్నారు. ఆ అవినీతి సొమ్ము కాంగ్రెస్ పార్టీ ఖజానాకు పోయిందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన 2008లో జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషిగా విడుదల చేయడంపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రాజస్తాన్లో త్రీడీ ప్రభుత్వం ఉందని, మూడు 'డీ'లు అర్థం ఏమిటంటే.. డాంగే(అల్లర్లు), దుర్వ్యవర్(అన్యాయంగా ప్రవర్తించడం), దళితులపై ధౌర్జన్యాలు అంటూ కొత్త అర్థాలను ఆపాదిస్తూ విరుచుకుపడ్డారు. అలాగే ప్రజలు ఎన్నికలలో ఈ పభ్రుత్వాన్ని తరిమికొడతారని, అసెంబ్లీలో బీజేపీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాగా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనితీరు, పార్టీ సిద్ధాంతాలు, ఆయనకు ఉన్న ప్రజాధరణ తదితరాల కారణంగానే ఎన్నికల బరీలోకి దిగుతోందన్నారు. ఆశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్తాన్ చరిత్రలోని అవినీతి ప్రభుత్వాల్లో ఒకటని, దీంతో ప్రజలు విసిగిపోయారంటూ అమిత్ షా కాంగ్రెస్పై విరుచుకపడ్డారు. కాగా, సచిన్ పైలట్ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తామని పెలట్ని హెచ్చరించింది కూడా. (చదవండి: పరువు నష్టం కేసులో రాహుల్కి ఉపశమనం..ప్రత్యక్ష హాజరుకు మినహాయింపు) -
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయవద్దు అని అధిష్టానం సూచన
-
టార్గెట్ 2024.. బీజేపీ మరో కీలక నిర్ణయం
దేశంలో 2024లో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే ఎలక్షన్ ప్లాన్ షురూ చేసింది. దేశంలో బీజేపీ అధికారంలోలేని రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది. ఈ క్రమంలో మూడు రాష్ట్రాల్లో కొత్తగా బీజేపీ అధ్యక్షులను నియమించింది. ఆయా రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా పనిచేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్ర యూనిట్లకు కొత్త చీఫ్ల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, లోక్సభ ఎంపీ సీపీ జోషి రాజస్థాన్ బీజేపీ చీఫ్గా నియమితులయ్యారు. ఇక, బీహార్కు సంజయ్ జైస్వాల్ స్థానంలో బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు సామ్రాట్ చౌదరిని రాష్ట్ర చీఫ్గా అధిష్టానం ఖరారు చేసింది. కాగా, రాజస్థాన్లో జైపూర్లోని అంబర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్న సతీష్ పూనియా స్థానంలో సీపీ జోషికి అవకాశం ఇచ్చారు. మరోవైపు, బీజేపీ ఒడిశా యూనిట్ అధ్యక్షుడిగా మాజీ రాష్ట్ర మంత్రి మన్మోహన్ సమాల్ స్థానం దక్కించుకున్నారు. भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने राजस्थान में श्री सीपी जोशी, बिहार में श्री सम्राट चौधरी, ओड़िशा में श्री मनमोहन सामल और दिल्ली में श्री वीरेन्द्र सचदेवा को पार्टी का नया प्रदेश अध्यक्ष नियुक्त किया है। pic.twitter.com/l9AN7X8suM — BJP (@BJP4India) March 23, 2023 -
వింత ఘటన: 56 బ్లేడులు మింగిన వ్యక్తి!
కొంతమందికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. వాళ్లు హార్మోన్ల లోపం వల్ల అలా ప్రవర్తిస్తుంటారే లేక మరేదైన కారణమా అనేది ఎవరికీ అంతుపట్టదు. కానీ ఆయా పనులు వాళ్ల ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంటాయి. అచ్చం అలాంటి ఘటనే రాజస్తాన్లో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే..రాజస్తాన్కి చెందిన 25 ఏళ్ల యువకుడు అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. అతను తన నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్లో ఉంటున్నాడు. ఒక రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉన్నటుండి ఆ యువకుడు రక్తపు వాంతులు చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ నర్సిరామ్ దేవాసి ఆయువకుడి సమస్యం ఏంటో తెలుసుకునేందుకు ఎక్స్రే తీయించారు. అందులో ఆ వ్యక్తి కడుపులో ఏదో లోహం ఉన్నట్లు తేలింది. దీంతో అతనికి సోనోగ్రఫీ, ఎండోస్కోపీ నిర్వహించాగా..డాక్టర్లకి ఆ వ్యక్తి కడుపులో బ్లేడ్లు ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించి దాదాపు 56 బ్లేడులు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. అతను బ్లేడ్లను కవర్లతో సహా తిన్నాడని అందువల్లే అవి తింటున్నప్పుడూ నొప్పిగానీ, రక్తస్రావం గానీ జరగలేదరని చెప్పారు. అయితే అవి కడుపులోపలకి చేరాక కాగితం మొత్తం కరిగిపోయి బ్లేడ్లు ఉండటంతో.. క్రమంగా ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభించింది. దీంతో వ్యక్తి లోపల గ్యాస్ ఏర్పడి మనిషి వికారం వచ్చి వాంతులు రావడం జరిగిందని అన్నారు. ఐతే అతను ఆ బ్లేడు తినేటప్పుడే వాటిని రెండుగా విడగొట్టి మరీ తిన్నాడని చెప్పారు. అతను ఇలా చేయడానికి గల కారణాలేంటో తమకు తెలియదని అతడి బంధువులు చెబుతున్నారు. (చదవండి: వీడి కథేంటో.. కారు డిక్కీలో కూర్చొని డబ్బులు విసిరేస్తూ..!) -
జైసల్మేర్ టు మంగళూరు
మంగళూరుకు షిఫ్ట్ అయ్యారు జైలర్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొం దుతున్న సినిమా ‘జైలర్’. శివరాజ్కుమార్, మోహన్లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా కీలకపా త్రలు పో షిస్తున్న చిత్రం ఇది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో రజనీ, మోహన్లాల్, జాకీ ష్రాఫ్ల కాంబినేషన్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ‘జైలర్’ షూటింగ్ మంగళూరులో జరుగుతోంది. రజనీ, శివరాజ్కుమార్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ను చెన్నైలో ప్లా న్ చేశారట. -
కెమెరా ముందు కుడితే లక్షలు వస్తున్నాయి
‘నీ విద్య నువు సరిగా నేర్చుకో... డబ్బు, గుర్తింపు అవే వస్తాయి’ అంటోంది ఈ టైలరమ్మ. బట్టలు కొత్తగా కుట్టడం కూడా లక్షలు తెచ్చి పెడతాయా? .. పెడతాయి. పల్లెటూళ్లో వ్యవసాయం చేసుకుంటూ రాత్రిళ్లు కుట్టు పని చేసిన ధోలీ యూ ట్యూబ్లో అందరూ టాలెంట్ ప్రదర్శించడం చూసి తను కూడా టైలరింగ్ను యూ ట్యూబ్లో చూపెట్టింది. రకరకాల స్త్రీల దుస్తులను కట్ చేసి కెమెరా ముందు కుడుతుండేసరికి లక్షల మంది ఫాలోయెర్లు ఏర్పడ్డారు. కుట్టడానికి ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి. యూ ట్యూబ్ నెల తిరిగే సరికి చెక్ పంపుతోంది. అవార్డులు కూడా మొదలయ్యాయి. కత్తెర, టేప్తో ఒక మహిళ సాధించిన విజయం ఇది. నవ్యమైన ఐడియానే ఆమె విజయానికి కారణం. ‘కొందరు విధిని నమ్ముకుని కూచుంటారు. కొందరు మాత్రం తమ విధిరాతను తామే రాసుకుంటారు’ అంటుంది ధోలి. ఈమె ఇప్పుడు రాజ్ మసంద్లో ఉంటుంది. ఇది రాజస్థాన్లోని ఒక మోస్తరు సిటీ. కాని అక్కడి నుంచే దేశం మొత్తానికి తెలిసింది. ఇంకా చెప్పాలంటే ఎక్కడెక్కడైతే భారతీయులు ఉన్నారో అక్కడి వారికి కూడా తెలిసింది. దానికి కారణం బట్టలు కుట్టడంలో ధోలికి ఉండే విశేష ప్రతిభ, సృజనాత్మకత. వేగం. కొత్తదనం. స్త్రీలు ధరించే అన్ని రకాల వస్త్రాలను మరింత కొత్తగా ఎలా చేయవచ్చో, ఎలా ఆకర్షణీయంగా మలచవచ్చో ధోలి చేసే వీడియోల్లో చూడొచ్చు. కొందరు విద్యను దాచుకుంటారు. కాని ధోలి తనలాంటి స్త్రీలు టైలరింగ్ నేర్చుకుని తమ కాళ్ల మీద తాము నిలబడాలని తెలిసిందంతా చెప్పేస్తుంది. అందుకే ఆమెకు అంత ప్రచారం. మన్నన. బాల్య వివాహం చేసుకుని ధోలిది రాజస్థాన్లోని భరత్పూర్. తండ్రి వ్యవసాయం చేసేవాడు. వెనుకబడిన ్రపాంతం కావడంతో 10 సంవత్సరాలకే పెళ్లి చేసి ఈడేరాక అత్తారింటికి పంపాడు. 18 ఏళ్లు వచ్చేసరికి ధోలి ముగ్గురు పిల్లల తల్లి. అత్తారింటిలో పెద్ద కోడలు కావడం వల్ల బండెడు చాకిరీ ఉండేది. పగలు పొ లంలో కూలి పని చేసేది. పాలు పితికి అమ్మేది. చిన్నప్పటి నుంచి టైలరింగ్ అంటే ఆసక్తి ఉండటం వల్ల నేర్చుకోవడంతో రాత్రిళ్లు కరెంటు లేని ఇంట్లో కిరోసిన్ దీపం కింద కుట్టేది. కాని బతుకు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగానే ఉండేది. సిటీకి మారాక కొన్ని కారణాల వల్ల పట్నమైన రాజ్ మసంద్కు ధోలి కాపురం మార్చింది. అక్కడ టైలరింగ్ మొదలెట్టింది. 2016లో యూట్యూబ్ ఆమె దృష్టికి వచ్చింది. అందులో రకరకాల వ్యక్తులు తమకు తెలిసిన విద్యలు వీడియోలు చేసి పెట్టడం గమనించింది. ‘నేనెందుకు నా టైలర్ విద్యను ప్రదర్శించకూడదు’ అని వీడియోలు చేసి పెట్టింది. రోడ్డు మీద ఉండే తన ఇంటిలో రోడ్డు రణగొణ ధ్వనుల మధ్య ఆ వీడియోలు చేసి అప్లోడ్ చేసింది. కాని అంతగా గుర్తింపు రాలేదు. ధోలి ఆగలేదు. వీడియోలు బాగా గమనించి ఎలా చేయాలో తెలుసుకుని 2017లో ‘ఘోరి ఫ్యాషన్ డిజైనర్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచింది. 27 కోట్ల వ్యూస్ టైలరింగ్ పని నేర్చుకోవాలని చాలా మంది స్త్రీలకు ఉంటుంది. కొత్త కొత్త ఫ్యాషన్స్ ఫాలో కావాలని మరికొంత మంది స్త్రీలకు ఉంటుంది. వీరంతా వెంటనే ధోలి చేస్తున్న వీడియోలను ఇష్టపడి చానల్కు సబ్స్క్రయిబ్ చేశారు. ఏ బట్టను ఏ మోడల్తో ఎలా కుట్టాలో ధోలి చకచకా చెప్తూ కుట్టి చూపుతుంది కాబట్టి వాటిని ఫాలో కాసాగారు. కుర్తీలు, అనార్కలి డ్రస్సులు, బ్లౌజ్లు... ఒకటని ఏముంది చాలా కొత్తరకంగా ధోలి డిజైన్లు ఉంటాయి. యూ ట్యూబ్ నుంచి తొలి పారితోషికంగా 11 వేల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు ఆమెకు 16 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఇప్పటికి 700 వీడియోలు చేసి అప్లోడ్ చేసింది. వీటికి 27 కోట్ల వ్యూస్ వచ్చాయి. యూ ట్యూబ్ నుంచి నెలకు లక్షకు పైగా పారితోషికం అందుతోంది. అంటే ధోలి ఎంత సక్సెస్ఫుల్ టైలరమ్మో అర్థం చేసుకోవచ్చు. తన ప్రచారం కోసం ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ అకౌంట్లు తెరిచింది. రోజుకు 20 రూపాయల నుంచి ఒకప్పుడు పల్లెటూళ్లో రాత్రిళ్లు బట్టలు కుడితే అతి కష్టమ్మీద రోజుకు 20 రూపాయలు వచ్చేవి. ఇవాళ ధోలి కేవలం తన ప్రతిభ, సృజనాత్మకతతో పాటు సోషల్ మీడియా సహాయంగా పెద్ద సంపాదన చూస్తోంది. రాజ్ మసంద్లో మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుంది. ఆమెను పిలిచి అవార్డులు ఇచ్చి గౌరవిస్తున్నారు. ‘ఎదుటి వారిని ఓడించడం కంటే మనం గెలవడం ముఖ్యం అనుకోవాలి. మనలోని ప్రతికూల భావాలను తీసేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం’ అంటుంది ధోలి. -
బాధితులా..? నిందితులా..? విచిత్రమైన ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ‘బోగస్’ కరెన్సీతో హవాలా వ్యాపారం చేసిన కోల్కతాలో స్థిరపడిన రాజస్థాన్ గ్యాంగ్ చేతిలో మోసపోయిన నగర వ్యాపారులు మహ్మద్ యూనుస్, వెంకట శర్మ విషయంలో నగర పోలీసులకు కొత్త సందేహాలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో వీళ్లను బాధితులుగా భావించాలా..? నిందితులుగా పరిగణించాలా..? అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. అక్రమద్రవ్య మార్పిడికి పాల్పడటం, పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయడం వంటి చర్యల కారణంగా అధికారులు చట్ట ప్రకా రం తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. భారీ మొత్తం నగదు రూపంలో... డీమానిటైజేషన్ తర్వాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఏ లావాదేవీలో అయినా రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో మార్పిడి జరగకూడదు. ఆదాయపు పన్ను శాఖ సాధారణ ప్రజల కంటే వ్యాపారుల విషయంలో దీన్ని నిశితంగా గమనిస్తుంటుంది. ఈ కేసులో బాధితులుగా ఉన్న వారిలో మహ్మద్ యూనుస్ నాంపల్లిలోని మెజిస్టిక్ హోటల్లో భాగస్వామిగా ఉండగా, వెంకట్ శర్మ మాదాపూర్లో ఐకాన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను నిర్వహిస్తున్నారు. వీరిని కన్హయ్య లాల్ నేతృత్వంలోని బృందం గతేడాది డిసెంబర్ 24, 26 తేదీల్లో మోసం చేసి రూ.30 లక్షలు, రూ.50 లక్షలు చొప్పున కాజేసింది. వ్యాపారులు ఈ స్థాయిలో నగలు లావాదేవీలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అప్పు పేరుతో తప్పుడు ఫిర్యాదు... కన్హయ్య లాల్ గ్యాంగ్ చేతిలో మోసపోయిన ఈ ద్వయం నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సందర్భంలో ఎక్కడా కూడా హవాలా దందా విషయం పేర్కొనలేదు. కన్హయ్య లాల్, రామావతార్, భరత్కుమార్, రామకృష్ణ శర్మలు తమ నుంచి అప్పుగా డబ్బు తీసుకోవడం కొన్నాళ్లుగా సాగుతోందని పేర్కొన్నారు. కొన్ని రోజుల అవసరానికి వాడుకుని ఆపై తిరిగి ఇస్తుంటారని, గతేడాది డిసెంబర్లో ఇలానే రూ.80 లక్షలు తీసుకుని నకిలీ నోట్లు ఇచ్చారని తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. నిందితులను పట్టుకుని, విచారించిన తర్వాతే పోలీసులకు అసలు విషయం తెలిసింది. భారీ మొత్తం నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంది. పోలీసులకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కోర్టు అనుమతితో ఇరువురిపై ఐపీసీలోని 182 సెక్షన్ ప్రకారం కేసు నమోదుకు ఆస్కారం ఉంది. ఈ అంశాలపై ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. తెలివిగా వ్యవహరించిన నిందితులు... ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న కన్హయ్య లాల్ సహా నలుగురు చాలా తెలివిగా వ్యవహరించారు. నగర వ్యాపారులను మోసం చేయాలని పథకం వేసుకున్న వీళ్లు దాని కోసం నకిలీ కరెన్సీ తయారు చేయలేదు. అలా చేస్తే ఈ కేసులు ఐపీసీలోని 489 సెక్షన్ కింద నమోదవుతాయి. దాంతో తీవ్రత పెరిగిపోవడంతో పాటు గరిష్టంగా పదేళ్ల శిక్షపడే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసిన నలుగురూ నకిలీ కరెన్సీకి బదులు ‘బోగస్’ది తయారు చేశారు. కలర్ జిరాక్సు తీసిన రూ.2 వేలు, రూ.500 నోట్లను కరెన్సీ సైజులో కట్ చేసిన తెల్లకాగితాలకు అటు–ఇటు పెట్టారు. మధ్యలో ఉన్న కాగితాలకు కనిపించే చివర్లలో మాత్రం కరెన్సీ రంగు పూశారు. ఈ కారణంగానే కేసులు కేవలం ఐపీసీలోని 420 (మోసం) సెక్షన్ కింద నమోదయ్యాయి. దీని తీవ్రత తక్కువ కావడంతో పాటు నేరం నిరూపితమైనా శిక్ష ఏడేళ్ల వరకే ఉంటుంది. ఫలితంగా బెయిల్ తర్వగా లభిస్తుంది. (చదవండి: నాకిప్పుడే పెళ్లి వద్దు సార్ అంటూ పోలీసులకు వీడియో.. పెళ్లిలో ట్విస్ట్)