Advertisement
Rajastan royals
-
ఇదేం చెత్త కెప్టెన్సీ బాబు.. రోహిత్కు ఇచ్చేయ్!లేదంటేనా?
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడో ఓటమి చవి చూసింది. వాంఖడే వేదికగా రాస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ పరంగా ముంబై దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ రాజస్తాన్ బౌలర్ల దాటికి గజగజలాడింది. రాజస్తాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, స్పిన్నర్ చాహల్ చెరో మూడు వికెట్లలో ముంబైని దెబ్బతీయగా.. బర్గర్ రెండు, అవేష్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. తిలక్ వర్మ 32 పరుగులతో పర్వాలేదన్పించాడు. అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్(54 నాటౌట్) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక వరుసగా మూడో మ్యాచ్లోనూ ముంబై ఓటమి పాలవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను నెటిజన్లు మరోసారి దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇక చాలు హార్దిక్ వెంటనే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది సీజన్లో ముంబై సారథిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్క్ చూపలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ముంబై ఘెర ఓటములను చవిచూసింది. కెప్టెన్గా తన వ్యూహాలను అమలు చేయడంలో హార్దిక్ విఫలమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించి మళ్లీ రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేదంటే ఈ ఏడాది సీజన్లో ముంబై ఒక్క మ్యాచ్లోనూ గెలవదంటూ పలువరు అభిప్రాయపడుతున్నారు. Caption this 😌#hardikpandya #MIvRR #RohitSharma #IPL2024 pic.twitter.com/VehA7QAgFx — Tanay (@tanay_chawda1) April 1, 2024 Aankh hai bhari bhari aur tum bakloli kar ke mja le rhe ho 😭😂 don't know if Mumbai Indians win any match this season. But fans are finding ways to entertain themselves.#MIvRR #MIvsRR #MumbaiIndians #RohitSharma #HardikPandyapic.twitter.com/nQL2c4LiHO — RanaJi🏹 (@RanaTells) April 1, 2024 -
వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్! వీడియో వైరల్
ఐపీఎల్-2024 సీజన్ మరో 10 రోజుల్లో షురూ కానుంది. మార్చి 22న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. ఈ ధనాదన్ లీగ్ కోసం అన్ని జట్లు తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టేశాయి. ప్రత్యేక ప్రాక్టీస్ క్యాంప్లను ఏర్పాటు చేసుకుని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్ జట్టు సైతం నాగ్పూర్లోని తమ హైఫెర్మాన్స్ సెంటర్లో ప్రీటోర్నమెంట్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. నెట్స్లో రాజస్తాన్ జట్టు చెమటోడ్చుతుంది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఎక్కువ సేపు నెట్స్లో గడుపుతున్నట్లు తెలుస్తోంది. నెట్స్లో శాంసన్ నో లూక్ షాట్స్ను ప్రాక్టీస్ను చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియాలో శాంసన్ బంతిని చూడకుండానే భారీ సిక్స్లు కొడుతున్నట్లు కన్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఏడాది సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. చదవండి: గర్ల్ఫ్రెండ్ను పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్.. ఫోటోలు వైరల్ T-15 🔥⏳ pic.twitter.com/p3QtgqQheX — Rajasthan Royals (@rajasthanroyals) March 10, 2024 -
తండ్రిది పాన్ షాప్.. గ్లవ్స్ కొనేందుకు కూడా డబ్బులు లేవు! ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు
ఐపీఎల్.. ఎంతో మంది యువ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. చాలా మంది క్రికెటర్ల జీవితాలను మార్చేసింది. అనామిక క్రికెటర్లను కోటీశ్వరలను చేసింది. తాజాగా ఈ జాబితాలోకి విధర్బ ఆటగాడు శుభమ్ దూబే చేరాడు. ఐపీఎల్-2024 వేలంతో దుబే కోటీశ్వరుడు అయిపోయాడు. ఈ వేలంలో దుబేను రూ.5.8 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగొలు చేసింది. అయితే దూబే ఈ స్ధాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కనీసం మంచి గ్లవ్స్ కొనేందుకు కూడా ఇబ్బంది పడ్డ దూబే.. ఇప్పుడు జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్రూమ్ను పంచుకోనున్నాడు. ఈ క్రమంలో ఎవరీ శుభమ్ దూబే అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఎవరీ శుభమ్ దుబే..? 29 ఏళ్ల శుభమ్ దూబే నాగ్పూర్లోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి బద్రీప్రసాద్ దూబె పాన్ షాప్ను నిర్వహించేవాడు. అతడి సోదరుడు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దిరి సంపాదనపైనే దుబే కుటంబం ఇప్పటివరకు జీవనం గడుపుకుంటూ వచ్చింది. అయితే చిన్నతనం నుంచే దూబే క్రికెట్పై మక్కువ ఎక్కువ. కానీ క్రికెట్ కొనుకోవడానికి కూడా అతడి దగ్గర డబ్బులు లేకపోయేవి. ఈ సమయంలో విధర్బ మాజీ క్రికెటర్, దివంగత సుదీప్ జైస్వాల్ దుబేలోనే టాలెంట్ను గుర్తించారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన సుదీప్ జైస్వాల్ అడ్వకేట్ XI అనే క్రికెట్ క్లబ్ను నడిపేవాడు. ఆర్ధిక స్ధోమత లేని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అన్ని విధాల సాయం ఈ క్లబ్ తరపున సుదీప్ చేసేవాడు. ఆటగాళ్ల శిక్షణ, టోర్నీలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులను సుదీప్ భరించేవాడు. దూబేకు కూడా అర్ధికంగా సాయం చేసి మెంటార్గా వ్యవహరించాడు. అతడి పరిచయమే దుబే కెరీర్ను మలుపు తిప్పింది. దీంతో విదర్భ అండర్-19, అండర్-23 జట్లలో చోటు దక్కించుకున్న శుభమ్.. సత్తా చాటి సీనియర్ జట్టులోకి వచ్చాడు. అయితే దుబే ఫస్ట్క్లాస్ క్రికెట్లో మాత్రం ఇప్పటివరకు అరంగేట్రం చేయలేదు. కానీ టీ20ల్లో మాత్రం దుబేకు మంచి రికార్డు ఉంది. లోయరార్డ్లో వచ్చి పవర్ హిట్టింగ్ చేసే సత్తా అతడికి ఉంది. ఈ ఏడాది ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శుభమ్ దూబే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్ల్లో 222 పరుగులు చేశాడు. ఓవరాల్గా ఇప్పటివరకు 20 టీ20లు ఆడిన దుబే 485 పరుగులు చేశాడు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో వన్డే.. తిలక్పై వేటు! ఆర్సీబీ ప్లేయర్ అరంగేట్రం -
ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్లో ఇంతే! తీసి పడేయండి..
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మిడిలార్డర్ బ్యాటర్ దీపక్ హుడా తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో మరోసారి హుడా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో 4 బంతులు ఎదుర్కొన్న దీపక్.. కేవలం 2 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన హుడా 6.50 సగటుతో కేవలం 39 పరుగులు మాత్రమే సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో 17 పరుగులు అత్యధిక స్కోర్గా ఉన్నాయి. గతేడాది సీజన్లో మాత్రం హుడా అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో మాత్రం తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇక దారుణ ప్రదర్శన కనబరుస్తున్న హుడా నెటిజన్లు మండిపడుతున్నారు. అదే విధంగా వరుసగా విఫలమవతున్నప్పటికీ హుడాకు.. లక్నో ఎందుకు ఛాన్స్లు ఇస్తుందో ఆర్ధం కావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది.. అతడు ఎందుకు వస్తున్నాడో తెలియదు, ప్రతీ మ్యాచ్లో ఒకటే ఆటతీరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్తాన్ రాయల్స్పై 10 పరుగుల తేడాతో లక్నో విజయం సాధిచింది. ఈ ఏడాది సీజన్లో లక్నోకు ఇది నాలుగో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో లక్నో 8 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. చదవండి: Sanju Samson: 'గెలవాల్సిన మ్యాచ్ను పోగొట్టుకున్నాం.. ఇదో గుణపాఠం' #KLRahul: 'డికాక్ను మిస్ అవుతున్నా.. ఏం చేయలేని పరిస్థితి!' -
డేవిడ్ వార్నర్ నువ్వు ఐపీఎల్ కి వేస్ట్
-
IPL 2023: ఆ జట్టు బాగుంది.. ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండు: రిక్కీ పాంటింగ్
IPL 2023: ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2023లో గతేడాది చాంపియన్ గుజరాత్ టైటాన్స్, రన్నరప్ రాజస్తాన్ రాయల్స్ ఆధిపత్యం కొనసాగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్లో విజేతలను అంచనా వేయడం కష్టమేనన్న పాంటింగ్.. మిగతా జట్లతో పోలిస్తే రాజస్తాన్ రాయల్స్ మాత్రం మెరుగ్గా కనిపిస్తోందని పేర్కొన్నాడు. రిక్కీ పాంటింగ్ మార్గదర్శనంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంతో ఐపీఎల్-2022ను ముగించిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి యాక్సిడెంట్ కారణంగా పంత్ పదహారో ఎడిషన్కు దూరం కాగా.. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఈక్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్లేని లోటును అధిగమించి మెరుగైన ప్రదర్శన కనబరిచాలని పట్టుదలగా ఉంది. ఇందుకు సంబంధించి హెడ్కోచ్ పాంటింగ్ ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. రాజస్తాన్ ఫేవరెట్.. ఎందుకంటే ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఇది నిజంగా చాలా కఠినమైన ప్రశ్న.. ఐపీఎల్లో ఏ జట్టు డామినేట్ చేస్తుందన్న విషయాన్ని కచ్చితంగా అంచనా వేయలేం. గతేడాది అద్భుతంగా రాణించిన గుజరాత్.. ఏకంగా టైటిల్ విజేతగా నిలిచింది. ఇక రాజస్తాన్ రాయల్స్ను తక్కువ చేయలేం. ఆ జట్టు పటిష్టంగా ఉంది. ఈసారి కూడా వారి ఎంపిక చాలా బాగుంది. టీ20లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అయితే, జట్ల బలాబలాలను విశ్లేషిస్తే నాకైతే రాజస్తాన్ రాయల్స్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది. రాజస్తాన్ ఈసారి ఫేవరెట్గా బరిలో దిగనుంది’’ అని పాంటింగ్ పేర్కొన్నాడు. వారికి ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. కాగా అరంగేట్ర సీజన్లోనే హార్దిక్ సేన ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు, రెండోసారి ఫైనల్ చేరిన సంజూ శాంసన్ బృందం రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక యువ ఆటగాళ్ల విషయానికొస్తే.. తమ ప్లేయర్లు యశ్ ధుల్, అమన్ ఖాన్ ఈసారి అద్భుతంగా రాణిస్తారని రిక్కీ పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. Neymar: ఆన్లైన్ పేకాటలో 9 కోట్లు మాయం.. నెయ్మర్ కన్నీటిపర్యంతం! -
IPL 2023: రూ. 13 కోట్లకు పైగా! ఈసారి ఆరెంజ్ క్యాప్ సన్రైజర్స్ బ్యాటర్కే!
IPL 2023- Orange Cap Holder Prediction: ‘‘నేనైతే ఆరెంజ్ క్యాప్ అతడికే దక్కుతుంది అనుకుంటున్నా. టోర్నీ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శనతో బెస్ట్ ప్లేయర్ అవుతాడని భావిస్తున్నా. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుస్తాడనే నమ్మకం ఉంది’’ అంటూ ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ అన్నాడు. ఇంగ్లండ్ యువ కెరటం, సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. 24 ఏళ్ల హ్యారీ బ్రూక్.. ఇంగ్లండ్ తరఫున ఇప్పటికే ‘ఆల్ ఫార్మాట్’ ఆటగాడిగా గుర్తింపు సంపాదించాడు. ఇక పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు ఆడిన 99 మ్యాచ్లలో 148.32 స్ట్రైక్రేటుతో 2432 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో జరిగిన మినీ వేలంలో సన్రైజర్స్ హైదరబాద్ ఫ్రాంఛైజీ కళ్లు చెదిరే మొత్తానికి బ్రూక్ను సొంతం చేసుకుంది. అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి ఏకంగా 13.25 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో హ్యారీ బ్రూక్పై అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. అతడు జట్టులో ఉండటం వల్ల మిడిలార్డర్లో సన్రైజర్స్కు మంచి ‘బూస్టింగ్’ లభిస్తుంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ వేలంలో అవలంబించిన వ్యూహాల గురించి మాట్లాడుతూ.. ‘‘వేలంలో సన్రైజర్స్ ఆచితూచి వ్యవహరించింది. బ్రూక్ను కొనుగోలు చేసి మంచి పనిచేసింది. వాళ్లకు అతడు కీలక బ్యాటర్ కానున్నాడు’’ అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో బ్రూక్పై ప్రశంసలు కురిపించిన స్టీవ్ హార్మిసన్.. ఐపీఎల్-2023 సీజన్లో అతడు అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. కాగా ఏప్రిల్ 2న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్తో సన్రైజర్స్ ఐపీఎల్-2023లో మొదటి మ్యాచ్ ఆడనుంది. సన్రైజర్స్ జట్టు ఇదే స్వదేశీ ఆటగాళ్లు ►రాహుల్ త్రిపాఠి ►అభిషేక్ శర్మ ►వాషింగ్టన్ సుందర్ ►భువనేశ్వర్ కుమార్ ►కార్తీక్ త్యాగి ►నటరాజన్ ►అబ్దుల్ సమద్ ►ఉమ్రాన్ మలిక్ ►మయాంక్ అగర్వాల్ ►అన్మోల్ ప్రీత్ సింగ్ ►మయాంక్ మర్కండే ►వివ్రాంత్ శర్మ ►మయాంక్ దాగర్ ►సమర్థ్ వ్యాస్ ►సన్వీర్ ►ఉపేంద్ర సింగ్ ►నితీశ్ కుమార్ రెడ్డి. విదేశీ ఆటగాళ్లు ►ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ►గ్లెన్ ఫిలిప్స్ ►మార్కో జాన్సెన్ ►ఫజల్ హఖ్ ఫారుఖీ ►హ్యారీ బ్రూక్ ►హెన్రిచ్ క్లాసెన్ ►ఆదిల్ రషీద్ ►అకీల్ హొసీన్. చదవండి: ICC ODI WC 2023: 'ఆడేది మెగాటోర్నీ అలా కుదరదు'.. ప్లాన్ బెడిసికొట్టిందా? Virat Kohli: 'ముందుచూపు తక్కువ.. కొన్న కార్లను అమ్మేసుకున్నా’ 𝗛𝗔MME𝗥𝗥𝗬NG 🔨#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/MKJGNYE13E — SunRisers Hyderabad (@SunRisers) March 25, 2023 -
ప్లేఆఫ్స్లో మాత్రం ఖచ్చితంగా రాణిస్తాను: జోస్ బట్లర్
ఐపీఎల్-2022 ఫస్ట్ హాఫ్లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ దుమ్మురేపాడు. ఫస్ట్ హాఫ్లో అతడు మూడు సెంచరీలు నమోదు చేశాడు. ఒకానొక సమయంలో 2016లో విరాట్ కోహ్లి (973) సాధించిన అత్యధిక పరుగుల రికార్డును అధిగమిస్తాడని అనిపించింది. అయితే సెకెండ్ హాఫ్లో మాత్రం బట్లర్ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అతడు తన చివరి మూడు మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. అయితే వరుసగా విఫలమవుతున్నప్పటికీ.. ప్లేఆఫ్స్లో మాత్రం ఖచ్చితంగా ఫామ్లోకి వస్తానని బట్లర్ తెలిపాడు. "ఐపీఎల్లో నా ఫామ్పై నేను సంతోషించాను. అయితే గత కొన్ని మ్యాచ్లలో మాత్రం కొంచెం నిరాశ చెందాను. టోర్నమెంట్ మొదటి బాగంలో నేను అత్యుత్తమంగా ఆడాను. ప్లేఆఫ్లో మాత్రం ఖచ్చితంగా రాణిస్తాను" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బట్లర్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన బట్లర్.. 629 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. ఇక మే24న ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి క్వాలిఫైయర్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. చదవండి: Virender Sehwag: 'అప్పుడు జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా.. ఇప్పుడు అర్ష్దీప్ సింగ్' -
Andre Russell: ఆఖరి ఐదు మ్యాచ్ల్లో మా తడాఖా ఏంటో చూపిస్తాం..
ఐపీఎల్ 2022 సీజన్లో గతేడాది రన్నరప్ కోల్కతా నైట్ రైడర్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 3 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. కేకేఆర్ ప్రదర్శన గత ఐదు మ్యాచ్ల్లో మరీ దారుణంగా ఉంది. ఆ జట్టు చివరిగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ ఆవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుత సీజన్లో ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. A special message for the fans from Big Dre! 💜#AndreRussell • #KnightsInAction presented by @glancescreen | #KKRHaiTaiyaar #KKRvRR #IPL2022 pic.twitter.com/IaZheaz4th — KolkataKnightRiders (@KKRiders) May 2, 2022 ఈ నేపథ్యంలో ఇవాళ (మే 2) రాజస్థాన్ రాయల్స్తో జరుగబోయే కీలక మ్యాచ్కు ముందు కేకేఆర్ తమ ట్విట్టర్ హ్యాండిల్లో ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ ఫ్యాన్స్కు సందేశమిచ్చాడు. ప్రస్తుత సీజన్లో తాము ఆడాల్సిన చివరి ఐదు మ్యాచ్లను ఐదు ఫైనల్స్గా భావిస్తామని, ఈ మ్యాచ్ల్లో తమ తడాఖా ఏంటో ప్రత్యర్ధులకు చూపిస్తామని శపథం చేశాడు. తాము ఫ్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశాల ఇంకా సజీవంగానే ఉన్నాయని, ప్లే ఆఫ్స్ రేసులో నిలిచేందుకు చివరివరకు తమ పోరాటం సాగిస్తామని పేర్కొన్నాడు. క్లిష్ట సమయాల్లో తమను ఉత్సాహపరుస్తూ అండగా నిలిచిన అభిమానులకు రసెల్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఇదిలా ఉంటే, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే.. వారు ఆడబోయే తదుపరి ఐదు మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సి ఉంది. శ్రేయస్ సేన తమ తర్వాతి మ్యాచ్ల్లో కఠినమైన ప్రత్యర్థులను ఢీకొట్టాల్సి ఉంది. ఇవాళ (మే 2) రాజస్థాన్ రాయల్స్, ఆతర్వాత పటిష్టమైన లక్నో సూపర్ జెయింట్స్ (రెండు మ్యాచ్లు), సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లతో కేకేఆర్ తలపడాల్సి ఉంది. చదవండి: రాజస్థాన్పై కేకేఆర్ ప్రతీకారం తీర్చుకునేనా..? గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..? -
రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో ఎన్ఎఫ్ఎల్, ఎన్బీఏ స్టార్ల పెట్టుబడులు
ముంబై: విశ్వవ్యాప్త ఆదరణతో టాప్ క్రికెట్ లీగ్గా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పుడు అమెరికన్ల పెట్టుబడుల్ని ఆకర్షించడంలో సఫలమైంది. ఐపీఎల్ తొలి చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ జట్టులో అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) దిగ్గజం లారీ ఫిట్జెరాల్డ్, స్టార్ ప్లేయర్ కెల్విన్ బీచుమ్, నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) స్టార్ క్రిస్ పాల్ పెట్టుబడులు పెట్టారు. ‘అమెరికా ఎలైట్ అథ్లెట్లు క్రిస్ పాల్, ఫిట్జెరాల్డ్, కెల్విన్లను పెట్టుబడులు పెట్టేలా మా ఫ్రాంచైజీ ఆకర్షించింది. ఈ ముగ్గురు తాజాగా మా స్టేక్ హోల్డర్ల జాబితాలో చేరారు. మైనార్టీ ఇన్వెస్టర్లుగా మా బోర్డులో భాగమయ్యారు’ అని రాజస్తాన్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. మనోజ్ బదాలేకు చెందిన ‘ఎమర్జింగ్ మీడియా వెంచర్స్’ ఈ ఫ్రాంచైజీ యజమాని కాగా... అమెరికన్ దిగ్గజాలు తమ ఫ్రాంచైజీలో భాగస్వాములవడం సంతోషంగా ఉందని బదాలే అన్నారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ అయ్యిందని చెప్పుకొచ్చారు. పెద్ద స్టార్లతో గొప్ప మేలే జరుగుతుందన్నారు. ‘రాజస్తాన్ను ఓ ప్రొఫెషనల్ ఫ్రాంచైజీగా తయారు చేయాలనే ఆలోచనతో ఇందులో భాగమయ్యాను’ అని ఫిట్జెరాల్డ్ తెలిపాడు. ఐపీఎల్ ఎంతగా ఎదిగిందో తెలుసని, విలువ పరంగా ఈ లీగ్ అంతకంతకూ వృద్ధి చెందుతోందని, నిజంగా ఇలాంటి విశేష ప్రాచుర్యంగల లీగ్తో జట్టుకట్టడం ఆనందంగా ఉందని క్రిస్ పాల్ అన్నాడు. రాయల్స్ ఇటీవల విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది బార్బడోస్ ట్రైడెంట్స్, సీఎంజీ కంపెనీలు రాజస్తాన్లో పెట్టుబడులు పెట్టాయి. -
జోస్ బట్లర్ విధ్వంసం.. 9 ఫోర్లు.. 9 సిక్స్లతో.. ఏకంగా!
ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో బట్లర్ మరో అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో బట్లర్ 65 బంతుల్లో 116 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 9 సిక్స్లు ఉన్నాయి. ఈ ఏడాది సీజన్లో బట్లర్ మూడో సెంచరీ నమోదు చేశాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన బట్లర్ 491 పరగులు సాధించి.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. కాగా వరుస సెంచరీలతో అదరగొడుతున్న బట్లర్పై నెటిజన్లతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ప్రపంచంలోనే బట్లర్ అత్యత్తుమ టీ20 ఆటగాడు" అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ట్విట్ చేశాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ స్పందిస్తూ.. "బట్లర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డుకు బట్లర్ చేరువలో ఉన్నాడు అని పేర్కొన్నాడు. కాగా ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో రాజస్తాన్ ఢిల్లీపై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా జోస్ బట్లర్ (65 బంతుల్లో 116; 9 ఫోర్లు, 9 సిక్స్లు) నిలిచాడు. చదవండి: IPL 2022: ధోని ఫినిషింగ్ టచ్కు జడేజా ఫిదా.. ఏం చేశాడంటే.. ? Buttler’s breathtaking form continues with another sensational ton! 👏#PPpedia pic.twitter.com/GC40YMyXIU — parthiv patel (@parthiv9) April 22, 2022 No one is anywhere close to batting like @josbuttler in T20 cricket at the moment .. Incredible .. #IPL2022 — Michael Vaughan (@MichaelVaughan) April 22, 2022 That's that from Match 34. @rajasthanroyals take this home by a 15-run win. Scorecard - https://t.co/IOIoa87Os8 #DCvRR #TATAIPL pic.twitter.com/D2JXBfMTSp — IndianPremierLeague (@IPL) April 22, 2022 -
'రిటైర్డ్ ఔట్'.. ఇది ఆరంభం మాత్రమే : అశ్విన్
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2022లో రిటైర్డ్ ఔట్ అయిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో అశ్విన్ కొత్త సంప్రదాయానికి తెరదీశాడు. తాజాగా రిటైర్డ్ ఔట్పై అశ్విన్ స్పందించాడు. ''రిటైర్డ్ ఔట్ అనేది పాత పద్దతే.. ఐపీఎల్లో మాత్రం కొత్తది. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వాటిని తీసుకురావాలి.. అందుకు ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఆ పనిని నాతోనే ప్రారంభించాను. ఇది ఆరంభం మాత్రమే.. ఇలాంటి రిటైర్డ్ ఔట్లు ఐపీఎల్లో ఇకపై చాలానే చూడనున్నారు. రిటైర్డ్ ఔట్ అయిన తొలి బ్యాటర్గా నేను చరిత్ర లిఖించి ఉండొచ్చే.. కానీ క్రికెట్ అంటేనే ప్రయోగాలకు వేదిక.. అలాంటి గేమ్లో ఒక ఆటగాడు ఒక దానిపై నిల్చోవద్దు. రకరకాల ప్రయోగాలు చేస్తూ రావాలి. ఒకప్పుడు ఐపీఎల్లో నేను మన్కడింగ్ చేసినప్పుడు అందరూ తప్పు బట్టారు.. విమర్శించారు. కానీ అదే మన్కడింగ్ను ఇవాళ చట్టబద్ధం చేశారు. మార్పు అనేది మంచికే.. అవసరానికి మాత్రమే వాడితే బాగుంటుంది. ఒక రకంగా టి20 క్రికెట్ను ఫుట్బాల్తో పరిగణించవచ్చు. అది 90 నిమిషాల ఆట అయితే.. టి20 క్రికెట్ మూడు గంటల ఫార్మాట్. ఫుట్బాల్లో ఒక ఆటగాడు గాయపడినప్పుడు అతనికి సబ్స్టిట్యూట్గా వచ్చే ఆటగాడు గోల్ చేస్తే అది నైతికం. కానీ క్రికెట్లో ఇంకా ఆ రూల్ లేదు. ఆటగాడు గాయపడితే అతని స్థానంలో వచ్చే ఆటగాడు కేవలం సబ్స్టిట్యూట్ ఫీల్డర్ తప్ప.. బ్యాట్స్మన్గా, బౌలర్గా క్రీజులోకి రాలేడు. అందుకే రిటైర్డ్ ఔట్ అనేది మంచి పద్దతే. ఒక రకంగా మన తర్వాత వచ్చే బ్యాట్స్మన్ బాగా ఆడతాడనుకుంటే అతనికి అవకాశం ఇవ్వడం కోసం మనం ఔటైనా తప్పు లేదు. అందుకోసం కావాలని ఔట్ అయితే మాత్రం తప్పు.. రిటైర్డ్ ఔట్గా వెళితే ఎవరు అభ్యంతరం చెప్పరు. నేను దాన్నే ఫాలో అయ్యాను. చరిత్రను ఎవరో ఒకరు తిరగరాయాలంటారు.. నాకు తెలిసి నేను చేసింది అదేనేమో.. ఇకపై ఐపీఎల్లో మరిన్ని రిటైర్డ్ ఔట్లు చూడొచ్చు'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక లక్నోతో మ్యాచ్లో అశ్విన్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. 23 బంతుల్లో 28 పరుగులు వద్ద ఉన్నప్పుడు అసౌకర్యంగా ఫీలైన అశ్విన్ రిటైర్డ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. రిటైర్డ్ ఔట్ అంటే.. అంపైర్ అనుమతి లేకుండానే గ్రౌండ్ వీడడం.. ఒక రకంగా సదరు బ్యాట్స్మన్కు మళ్లీ బ్యాటింగ్ చేసే చాన్స్ ఉండదు. చదవండి: ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్ IPL 2022: కోహ్లి ఔట్ వెనుక ధోని మాస్టర్ ప్లాన్.. -
'తమాషానా.. అలాంటి క్రికెటర్పై జీవితకాల నిషేధం విధించాలి'
టీమిండియా ఆటగాడు.. రాజస్తాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యజ్వేంద్ర చహల్ ఒక విదేశీ క్రికెటర్ నుంచి ఎదురైన చేదు అనుభవం గురించి ఇటీవలే పంచుకున్న సంగతి తెలిసిందే. జట్టు సహచర ఆటగాళ్లు రవిచంద్ర అశ్విన్, కరుణ్ నాయర్లకు తన జీవితంలో జరిగిన దుర్ఘటనను, అందులో నుంచి బయటపడిన తీరును చహల్ వివరించాడు. తాగిన మైకంలో సహచర క్రికెటర్ తనను 15వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు తోసేయబోయాడంటూ.. తృటిలో ప్రాణాలు కాపాడుకున్నాని చహల్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం ట్విటర్లో షేర్ చేయగా వైరల్గా మారింది. అయితే చహల్ ఆ క్రికెటర్ ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా చహల్కు జరిగిన చేదు అనుభవంపై టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇలాంటి పిచ్చి పని చేసిన ఆ క్రికెటర్ను జీవితకాలం నిషేధించడమే సరైనదని పేర్కొన్నాడు. ‘'ఈ ఘటనలో దోషిని కఠినంగా శిక్షించాలి. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి అలా చేయడం ఆందోళనకరం. ఇది ఫన్నీ విషయం కానే కాదు. ఇలాంటి విషయం వినడం నాకైతే ఇదే మొదటిసారి. ఈరోజు గనక అలాంటి ఘటన జరిగితే సదరు ఆటగాడిపై జీవితకాలం నిషేధం విధించాలి. వీలైనంత త్వరగా ఆ వ్యక్తిని మానసిక పునరావికాస కేంద్రానికి పంపించాలి. సదరు ఆటగాడిని క్రికెట్ మైదానం దగ్గరికి రానివ్వకపోవడమే మంచిది. ఇదే సమయంలో ఆటగాళ్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు త్వరగా రిపోర్టు చేయాలి. ఇది తమాషా విషయం కాదు. అవినీతి నిరోధక శాఖకు అవినీతి అధికారుల గురించి చెప్పినట్టు.. ఇలాంటి మానసిక రోగుల గురించి కూడా తెలియజేయాలి.'’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇదంతా 2013లో చోటుచేసుకుంది. అప్పుడు యజ్వేంద్ర చాహల్ ముంబై జట్టులో ఉన్నాడు. చాహల్ ను తోసేయబోయింది విదేశీ ప్లేయర్ అని అతడు హింట్ ఇచ్చాడు. ఆ సమయంలో ముంబైలో ఉన్న విదేశీ ఆటగాళ్లలో ఏడెన్ బ్లిజర్డ్, జేమ్స్ ఫ్రాంక్లిన్, కీరన్ పొలార్డ్, లసిత్ మలింగ, మిచెల్ జాన్సన్, డ్వేన్ స్మిత్ లు ఉన్నారు. మరి వీరిలో చాహల్ ను బాల్కనీ నుంచి తోసేయాలనుకున్నది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: Yuzvendra Chahal: ఆ క్రికెటర్ తాగిన మైకంలో నన్ను... చహల్ షాకింగ్ కామెంట్స్.. చచ్చేవాడిని! Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV — Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022 -
ఆ ఆటగాడికి బౌలింగ్ చేస్తే రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే!
టి20 క్రికెట్ అంటేనే వేగానికి పెట్టింది పేరు. మూడు గంటల్లో ముగిసే మ్యాచ్లో బ్యాట్స్మన్ ఫోర్లు, సిక్సర్లు బాదడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పవర్ హిట్టింగ్ చేసే నేపథ్యంలో బౌలర్లకు, ఫీల్డర్లకు దెబ్బలు తగిలే అవకాశాలుంటాయి. తాజాగా ఐపీఎల్ 2022 సందర్భంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రాజస్తాన్ రాయల్స్కు చెందిన రియాన్ పరాగ్.. జిమ్మీ నీషమ్ బౌలింగ్లో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా బంతి నీషమ్ వైపు దూసుకొచ్చింది. సరైన సమయంలో నీషమ్ కిందకు వంగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే రాజస్తాన్ రాయల్స్కు పెద్ద దెబ్బ పడేదే. అయితే ఇదంతా మ్యాచ్లో కాకుండా ప్రాక్టీస్ సమయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ నీషమ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ''రియాన్ పరాగ్కు బౌలింగ్ చేస్తే నేను క్రికెట్కు గుడ్బై చెప్పినట్లే.. ఎందుకంటే కొద్దిలో నాకు ప్రమాదం తప్పింది. అతను కసితో ఉన్నాడు.. తలలు పగలడం ఖాయం'' అంటూ పేర్కొన్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి రెండు గెలిచి.. ఒకదాంట్లో ఓడింది. ఆదివారం(ఏప్రిల్ 10) లక్నో సూపర్ జెయింట్స్తో రాజస్తాన్ తలపడనుంది. చదవండి: IPL 2022: బౌండరీ కొట్టి నిమిషం కాలేదు.. ఇంత మతిమరుపా! IPL 2022: తెవాటియా సిక్సర్ కొట్టగానే ఎగిరి గంతేసిన అమ్మాయి.. ఇంతకీ ఎవరామె?! pic.twitter.com/CWo2e5oTA9 — Prabhat Sharma (@PrabS619) April 9, 2022 -
ఆ క్రికెటర్ తాగిన మైకంలో నన్ను... చహల్ షాకింగ్ కామెంట్స్
IPL 2022- Rajasthan Royals Players: ‘‘నిజానికి ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. 2013లో ఈ ఘటన జరిగింది. అప్పుడు నేను ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాను. బెంగళూరులో మ్యాచ్ ఆడాము. ఆ తర్వాత హోటల్కు చేరుకున్నాం. నా సహచర ఆటగాడు ఒకరు బాగా తాగేసి ఉన్నాడు. తాగిన మైకంలో నన్ను తన దగ్గరకు పిలిచాడు. ఒక్కసారిగా నన్ను ఎత్తిపట్టుకుని బాల్కనీ నుంచి వేలాడదీశాడు. తన చుట్టూ నేను చేతులు వేసి పట్టుకుని ఉన్నాను. ఏమాత్రం పట్టు కోల్పోయినా 15వ అంతస్తు నుంచి కిందపడిపోయే వాడినే. అప్పటికే చాలా మంది అక్కడికి చేరుకున్నారు. నన్ను ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడేశారు. స్పృహ కోల్పోయిన నాకు నీళ్లు ఇచ్చి కుదుటపడేలా చేశారు’’ అని టీమిండియా ఆటగాడు, రాజస్తాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు. సహచర ఆటగాళ్లు రవిచంద్ర అశ్విన్, కరుణ్ నాయర్తో కలిసి తన జీవితంలో జరిగిన దుర్ఘటనను, అందులో నుంచి బయటపడిన తీరును వివరించాడు. బయటకు వెళ్లినపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని చహల్ చెప్పుకొచ్చాడు. తాను అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని, తనకు అదొక పునర్జన్మ లాంటిదని పేర్కొన్నాడు. దయచేసి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశాడు. అయితే తనకు ఆ పరిస్థితి కల్పించిన క్రికెటర్ ఎవరన్న విషయాన్ని మాత్రం చహల్ బయటపెట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. కాగా 2013 తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వచ్చిన చహల్ చాలా కాలం పాటు ఆ ఫ్రాంఛైజీతోనే కొనసాగాడు. అయితే, ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో రాజస్తాన్ చహల్ను కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్లో రాజస్తాన్ గెలిచిన రెండు మ్యాచ్లలో చహల్ తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: IPL 2022: కోహ్లి స్టైల్లో బదోని సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV — Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022 -
మ్యాక్స్వెల్ టెన్షన్ పోగొట్టేందుకు కోహ్లి ఏం చేశాడంటే!
ఐపీఎల్ 2022లో మంగళవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. దినేశ్ కార్తిక్ విధ్వంసకర బ్యాటింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్)కు తోడూ షాబాజ్ అహ్మద్(26 బంతుల్లో 45, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) నిలకడ చూపించడంతో ఆర్సీబీ విజయం సాధించింది.ఒక దశలో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించిన ఆర్సీబీని కార్తీక్, షాబాజ్ అహ్మద్లు కలిసి విజయతీరాలకు చేర్చారు. చివర్లో షాబాజ్ ఔటైనా కార్తిక్ ఫినిషర్గా మ్యాచ్ను ముగించాడు. అయితే చేజింగ్ సమయంలో ఏ జట్టుకైనా టెన్షన్ ఉండడం సహజం. ఆర్సీబీ డ్రెస్సింగ్రూమ్లోనూ అది స్పష్టంగా కనిపించింది. జట్టు స్కోరు 114/5 ఉన్నప్పుడు కార్తిక్ బౌండరీ బాదాడు. బౌండరీ లైన్ కవర్ చేసిన కెమెరాలు డ్రెస్సింగ్ రూమ్వైపు తిరిగాయి. సరిగ్గా ఇదే సమయంలో కోహ్లి మ్యాక్స్వెల్ వద్దకు వచ్చి ' ఇట్స్ ఓకే మ్యాక్సీ' అంటూ మెడ, భుజ భాగంలో మసాజ్ చేశాడు. మ్యాక్సీ కూడా తన టెన్షన్ తీరినట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Courtesy: IPL Twitter ఇక ఈ మ్యాచ్లో కోహ్లి శాంసన్ మెరుపు వేగానికి రనౌట్గా వెనుతిరిగాడు. కెప్టెన్ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత కోహ్లి నుంచి ఆశించిన ఇన్నింగ్స్ ఒక్కటి రాలేదు. పెళ్లి వేడుకతో బిజీగా గడిపిన మ్యాక్స్వెల్ ఇటీవలే జట్టుతో కలిశాడు. ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు మ్యాక్సీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వరుసగా రెండో విజయం అందుకున్న ఆర్సీబీ.. మ్యాక్స్వెల్ రాకతో రెట్టింపు బలాన్ని సాధించనట్లయింది. గత సీజన్లో మ్యాక్సీ ఆర్సీబీ తరపున 500 పైచిలుకు పరుగులు సాధించాడు. చదవండి: IPL 2022: కోహ్లి రనౌట్.. చహల్ భార్య ధనశ్రీ సెలబ్రేషన్స్.. మరీ ఇంత సంతోషమా? వైరల్ kolhi maxwell 😭😭 #RCBvsRR pic.twitter.com/8jEAn9io8b — _DJANGO_ (@dace7735) April 5, 2022 -
ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్కు బిగ్షాక్
ఆర్సీబీతో మ్యాచ్లో ఓటమితో షాక్లో ఉన్న రాజస్తాన్ రాయల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ కౌల్టర్నీల్ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్తాన్ యాజమాన్యం ట్విటర్ వేదికగా స్వయంగా ప్రకటించింది. కాగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన తొలి మ్యాచ్లో కౌల్టర్ నీల్ ఆడాడు. ఆటలో చివరి ఓవర్ బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రస్తుతం అతనికి రెస్ట్ అవసరమని వైద్యులు దృవీకరించారు. కౌల్టర్ నీల్ తాను కోలుకునే వరకు స్వదేశంలో రీహాబిటేషన్లో గడపనున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ రాయల్స్.. ''తొందరగా కోలుకో.. మనం మళ్లీ కలుద్దా ఎన్సీఎన్(నాథన్ కౌల్టర్ నీల్)'' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా కౌల్టర్ నీల్కు ప్రత్యామ్నాయంగా ఎవరని ఎంపిక చేస్తుందన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన కౌల్టర్ నీల్ 48 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు. ఆ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్ మెగావేలంలో రాజస్తాన్ రూ. 2 కోట్లకు నాథన్ కౌల్టర్ నీల్ను దక్కించుకుంది. కౌల్టర్ నీల్ ఐపీఎల్లో 38 మ్యాచ్లాడి 48 వికెట్లు పడగొటగ్టాడు. ఐపీఎల్లో మధ్యలోనే వైదొలగడం కౌల్టర్ నీల్కు ఇది రెండోసారి. ఇంతకముందు 2014లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ఆడుతున్న సమయంలో తొడ కండరాల గాయంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక కండరాల గాయంతో 2021 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. మంగళవారం రాత్రి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ ఓటమి పాలైంది. ఒక దశలో మ్యాచ్లో పట్టు చిక్కినప్పటికి.. దినేశ్ కార్తిక్ విధ్వంసానికి తోడూ.. షాబాజ్ అహ్మద్ నిలకడైన ఆటతీరుతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 10న లక్నో సూపర్ జెయింట్స్తో ఆడనుంది. చదవండి: Jos Buttler: 'నాకు అన్నీ తెలుసు.. అంపైర్తో పని లేదు' Ayush Badoni: ఆ ఆటగాడు పెను సంచలనం.. నాలుగేళ్ల క్రితం ట్వీట్ వైరల్ Until we meet again, NCN. 💗 Speedy recovery. 🤗#RoyalsFamily | #HallaBol | @coulta13 pic.twitter.com/XlcFUcTg5L — Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2022 -
ఆర్సీబీ తప్పు చేసింది.. కోహ్లి అవుటైతే మరీ ఇంత సంతోషమా?
అన్నదమ్ములైనా, ప్రాణ స్నేహితులైనా.. వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు ఒక్కసారి మైదానంలో దిగారంటే ప్రత్యర్థులుగా మారిపోవాల్సిందే! తమ జట్టుకు న్యాయం చేసే క్రమంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు తీవ్రంగా పోటీ పడాల్సిందే! ఆ సమయంలో ఎలాంటి సెంటిమెంట్లకు తావుండదు మరి! రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... . అనవసరపు సింగిల్కు ప్రయత్నించి అనూహ్య రీతిలో అవుటైన సంగతి తెలిసిందే. తొమ్మిదో ఓవర్లో యజువేంద్ర చహల్ విల్లేకు బంతిని సంధించగా.. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ పాదరసంలా కదిలి బాల్ను చహల్ వైపునకు వేశాడు. వెంటనే బంతిని అందుకున్న చహల్ బెయిల్స్ను పడగొట్టాడు. దీంతో కోహ్లి రనౌట్గా వెనుదిరిగాడు. కాగా గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన చహల్కు ఆ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లితో అనుబంధం ఉంది. ఐపీఎల్తో పాటు టీమిండియాలో ఇద్దరూ ఎన్నో మ్యాచ్లలో కలిసి ఆడారు. కోహ్లి సలహాలు, సూచనల మేరకు చహల్ తన ప్రణాళికలు అమలు చేసేవాడు. అయితే, మెగా వేలం నేపథ్యంలో ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో రాజస్తాన్ చహల్ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీతో ఆడిన తొలి మ్యాచ్లోనే చహల్ అదరగొట్టాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉండగా.. కోహ్లి రనౌట్కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కోహ్లి రనౌట్, ఆ వెంటనే తర్వాతి బంతికే విల్లీ అవుటయ్యాడు. ఈ క్రమంలో చహల్ భార్య ధనశ్రీ వర్మ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. పట్టరాని సంతోషంతో ధనశ్రీ ఎగిరి గంతేసిన విధానం చూసి.. ‘‘అయ్యో.. చహల్ను రిటైన్ చేసుకోలేదని ఆర్సీబీపై అంతగా పగబట్టారా వదినమ్మా? కోహ్లి అవుట్ అయితే మరీ ఇంత ఆనందమా? లేదంటే ఆర్సీబీ వికెట్లు పడగొడుతున్నందుకా?’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా చహల్ ఇటీవల మాట్లాడుతూ..వాస్తవానికి ఆర్సీబీనే తనను రిటైన్ చేసుకునేందుకు గానీ, వేలంలో తిరిగి దక్కించుకునేందుకు గానీ ఆసక్తి చూపలేదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధనశ్రీ సంబరాలు చూసి.. ‘‘చహల్ ఎంతగా బాధపడ్డాడో.. ఇప్పుడు ధనశ్రీ ఆనందం చూస్తే అర్థమవుతోంది. చహల్ను వదిలేసి ఆర్సీబీ తప్పుచేసింది’’ అంటూ మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: IPL 2022: ‘అత్యుత్తమ ఫినిషర్’.. కెరీర్ ముగిసిపోలేదని నాకు నేనే చెప్పుకొన్నా! ఇప్పుడిలా.. Dhanashree reaction after #yuzvendrachahal take david willey wickets #RRvsRCB pic.twitter.com/9nCYIY6GKX — swadesh ghanekar (@swadeshLokmat) April 5, 2022 When @imVkohli got out look at her reaction 😭😭😢😢 !! #RCBvsRR #RRvsRCB #RRvRCB #RCBvRR #Chahal #Kohli #RR #RCB #IPL #IPL2022 #ViratKohli pic.twitter.com/2QSNijcsdw — Akash (@Raju_SSMB) April 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: శభాష్ షహబాజ్... సూపర్ కార్తీక్.. భళా ఆర్సీబీ!
IPL 2022 RCB Vs RR- Shahbaz, Dinesh Karthik- ముంబై: 170 పరుగుల ఛేదనలో బెంగళూరు స్కోరు ఒకదశలో 87/5... మరో 45 బంతుల్లో 83 పరుగులు చేయాలి... ఐపీఎల్లో పెద్దగా అనుభవం లేని షహబాజ్ అహ్మద్, చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని దినేశ్ కార్తీక్ క్రీజ్లో ఉన్నారు. దాంతో ఆర్సీబీ విజయంపై అంతా అపనమ్మకం! అయితే వీరిద్దరు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెలరేగారు. 33 బంతుల్లోనే 67 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మంగళవారం జరిగిన పోరులో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (47 బంతుల్లో 70 నాటౌట్; 6 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా, హెట్మైర్ (31 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), పడిక్కల్ (29 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. బట్లర్, హెట్మైర్ నాలుగో వికెట్కు 51 బంతుల్లో అభేద్యంగా 83 పరుగులు జోడించారు. అనంతరం బెంగళూరు 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. షహబాజ్ అహ్మద్ (26 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్లు), దినేశ్ కార్తీక్ (23 బం తుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) మెరిశారు. చివర్లో దూకుడు... ఓపెనర్గా వచ్చి చివరి వరకు క్రీజ్లో ఉన్నా బట్లర్ ఆడింది 47 బంతులే... బట్లర్ ఎంత బలంగా కొట్టినా బంతి ఫీల్డర్లను దాటలేదు, ఫలితంగా ఒక్క ఫోర్ కూడా లేదు... రెండు సార్లు క్యాచ్లు మిస్! బ్యాటింగ్కు అసలు ఏమాత్రం అనుకూలించని పిచ్పై నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేయకుండా బట్లర్ పట్టుదలగా నిలవడం వల్లే జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. కొద్దిసేపు పడిక్కల్, చివర్లో హెట్మైర్ అతనికి అండగా నిలిచి ఇన్నింగ్స్లో కీలకపాత్ర పోషించారు. కీలక సమయంలో రెండు లైఫ్లు బట్లర్ నిలదొక్కుకునేలా చేశాయి. 10 పరుగుల వద్ద ఆకాశ్ దీప్ రిటర్న్ క్యాచ్ వదిలేయగా, 11 పరుగుల వద్ద విల్లీ అంచనా తప్పి క్యాచ్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. బట్లర్, పడిక్కల్ రెండో వికెట్కు 49 బంతుల్లో 70 పరుగులు జోడించగా, సామ్సన్ (8) ప్రభావం చూపలేకపోయాడు. 18 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 127 పరుగులు. అయితే చివరి 2 ఓవర్లలో 42 పరుగులతో రాయల్స్ పండగ చేసుకుంది. సిరాజ్ వేసిన 19వ ఓవర్లో బట్లర్ 2 సిక్స్లు సహా 19 పరుగులు రాగా, ఆకాశ్ దీప్ వేసిన 20వ ఓవర్లో బట్లర్ రెండు, హెట్మైర్ ఒక సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. కోహ్లి రనౌట్... ఛేదనలో ఆర్సీబీకి సరైన ఆరంభం లభించింది. డుప్లెసిస్ (20 బంతుల్లో 29; 5 ఫోర్లు), రావత్ (25 బంతుల్లో 26; 4 ఫోర్లు) వేగంగా పరుగులు రాబట్టడంతో పవర్ప్లేలో స్కోరు 48 పరుగులకు చేరింది. ఒకదశలో వీరిద్దరు ఏడు బంతుల వ్యవధిలో ఐదు ఫోర్లు కొట్టారు. అయితే చహల్ తన తొలి ఓవర్లోనే డుప్లెసిస్ను అవుట్ చేసి రాయల్స్కు మొదటి వికెట్ అందించాడు. ఆ తర్వాత బెంగళూరు పరుగు వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. అనవసరపు సింగిల్కు ప్రయత్నించి కోహ్లి (5) అనూహ్యంగా రనౌట్ కాగా, తర్వాతి బంతికే విల్లీ (0) వెనుదిరిగాడు. రూథర్ఫర్డ్ (5) కూడా విఫలం కావడంతో ఆర్సీబీ 87 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. బెంగళూరు ఆశలు కోల్పోయిన ఈ స్థితిలో షహబాజ్, కార్తీక్ భాగస్వామ్యం ఒక్కసారిగా మ్యాచ్ను మలుపు తిప్పింది. వీరిద్దరి దూకుడైన ఆటతో ఆర్సీబీ విజయం దిశగా దూసుకుపోయింది. అశ్విన్ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్తో కార్తీక్ జోరు మొదలు పెట్టగా, ప్రసిధ్ బౌలింగ్లో షహబాజ్ ఫోర్, సిక్స్ బాదాడు. బౌల్ట్ ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ తో చెలరేగిన షహబాజ్ అదే ఓవర్లో అవుటైనా... కార్తీక్ నిలబడి బెంగళూరును గెలిపించాడు. చదవండి: Ravi Shastri: "అతడు యార్కర్ల కింగ్.. ప్రపంచకప్లో అతడి సేవలను కోల్పోయాం" What a sensational win! 👌 👌 Second victory on the bounce & 2⃣ more points in the bag for @RCBTweets as they beat #RR by 4⃣ wickets. 👏 👏 Scorecard ▶️ https://t.co/mANeRaZc3i #TATAIPL | #RRvRCB pic.twitter.com/VJMRJ1fhtP — IndianPremierLeague (@IPL) April 5, 2022 -
జోస్ బట్లర్ ఖాతాలో మరో సెంచరీ
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ ఐపీఎల్లో మరో సెంచరీ సాధించాడు. అదేంటి ఆర్సీబీతో మ్యాచ్లో బట్లర్ హాఫ్ సెంచరీ కదా చేశాడు అనే డౌట్ రావొచ్చు. కానీ బట్లర్ సెంచరీ పూర్తి చేసింది సిక్సర్ల విషయంలో. అవును ఆర్సీబీతో మ్యాచ్లోనే బట్లర్ ఐపీఎల్లో వంద సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. బట్లర్ వంద సిక్సర్లు పూర్తి చేయడానికి ఐపీఎల్లో 69 ఇన్నింగ్స్లు అవసరం అయ్యాయి. ఓవరాల్గా ఐపీఎల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న 26వ ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. ఇక ఈ జాబితాలో క్రిస్ గేల్(357 సిక్సర్లు) తొలి స్థానంలో ఉండగా.. ఏబీ డివిలియర్స్(251 సిక్సర్లు), రోహిత్ శర్మ(232 సిక్సర్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 222 సిక్సర్లతో ఎంఎస్ ధోని నాలుగు, పొలార్డ్ 215 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కోహ్లి(212 సిక్సర్లు), సురేశ్ రైనా(203 సిక్సర్లు), డేవిడ్ వార్నర్(201 సిక్సర్లు) వరుసగా ఉన్నారు. ఇక బట్లర్ తన భీకర ఫామ్ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బట్లర్ చివరి వరకు నిలిచి ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆఖరి రెండు ఓవర్లలో హెట్మైర్తో కలిసి 42 పరుగులు పిండుకున్న బట్లర్ ఓవరాల్గా 47 బంతుల్లో 6 సిక్సర్లతో 70 పరుగులు నాటౌట్గా నిలిచాడు. బట్లర్ ఇన్నింగ్స్లో ఒక్క ఫోర్ కూడా లేకపోవడం విశేషం. బట్లర్ 70 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి చదవండి: Jos Buttler: 'నాకు అన్నీ తెలుసు.. అంపైర్తో పని లేదు' -
'నాకు అన్నీ తెలుసు.. అంపైర్తో పని లేదు'
ఐపీఎల్ 2022లో భాగంగా ఆర్సీబీ, రాజస్తాన్ మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజస్తాన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని హర్షల్ పటేల్ అద్బుతంగా వేశాడు. స్లో యార్కర్గా వచ్చిన ఆ బంతి బట్లర్ ప్యాడ్లను తాకింది. ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయగానే అంపైర్ ఔటిచ్చాడు. కానీ బట్లర్ క్రీజు నుంచి ఇంచు కూడా కదల్లేదు. ఎందుకంటే అది ఔట్ కాదని బట్లర్కు ముందే తెలుసు. వాస్తవానికి బంతి బట్లర్ ప్యాడ్లను తాకడానికి ముందే బ్యాట్ను తాకింది. కానీ అంపైర్ అది గమనించకుండానే ఔట్ ఇచ్చాడు. బట్లర్ రివ్యూకు వెళ్లగా.. అల్ట్రాఎడ్జ్లో బంతి ప్యాడ్లను తాకడానికి ముందు బ్యాట్ను తాకినట్లు తేలింది. దీంతో అంపైర్ తన తప్పు తెలుసుకొని బట్లర్ నాటౌట్ అని ప్రకటించాడు. ఇది చూసిన అభిమానులు.. బట్లర్, అంపైర్ మధ్య మీమ్స్ క్రియేట్ చేశారు. నాకు అన్ని తెలుసు.. అంపైర్తో పని లేదు.. బట్లర్ కాన్ఫిడెంట్కు ఫిదా.. ఔట్ అని ప్రకటించినా క్రీజు నుంచి ఇంచు కూడా కదల్లేదు.. అంటూ కామెంట్స్ చేశారు. 37 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బట్లర్ ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో బట్లర్ వరుస సిక్సర్లు సంధించాడు. అలా 47 బంతుల్లోనే 6 సిక్సర్లతో 70 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. హెట్మైర్, బట్లర్ కలిసి చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు పిండుకోవడంతో 18వ ఓవర్ వరకు 127/3గా ఉన్న స్కోరు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 169/3గా మారింది. చదవండి: IPL 2022 RR Vs RCB: కోహ్లి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ pic.twitter.com/hPUlxzVrTp — Sam (@sam1998011) April 5, 2022 -
కోహ్లి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు కోహ్లి స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. అప్పటికే పడిక్కల్ 38 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓవర్ ఆఖరి బంతిని పడిక్కల్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ ఎడ్జ్కు తగలడంతో సరిగ్గా కనెక్ట్ కాలేదు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లి వెనక్కి పరిగెట్టి విల్లులా తిరిగి రెండు చేతులతో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోహ్లి స్టన్నింగ్ క్యాచ్ కోసం క్లిక్ చేయండి -
IPL 2022: దినేశ్ కార్తిక్ సంచలన ఇన్నింగ్స్.. ఆర్సీబీ ఘన విజయం
-
ఆర్సీబీకి రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు వెన్నుపోటు!
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ అద్భుత విజయాలు సాధించిన రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్లో ఉండగా.. రెండు మ్యాచ్ల్లో ఒక విజయం.. ఒక ఓటమితో ఆర్సీబీ ఏడో స్థానంలో ఉంది. మరి ఇవాళ జరిగే సమరంలో రాయల్స్ రాజసం చూపిస్తుందా.. లేక ఆర్సీబీ గెలుస్తుందా అనేది చూడాలి. కాగా ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ పురస్కరించుకొని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ సూపర్ మీమ్తో రెచ్చొపోయాడు. గత సీజన్లో చహల్, పడిక్కల్లు ఆర్సీబీ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో మాత్రం వారిద్దరు రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్నారు. ఆర్సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా.. మహాభారతంలో అర్జున పాత్రతో చహల్, పడిక్కల్లను చూపుతూ... భీష్ముని పాత్రలో ఆర్సీబీని ఉంచి ఫోటో రిలీజ్ చేశాడు. ''చహల్, దేవదత్ పడిక్కల్ను చూస్తుంటే ఆర్సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా కనిపిస్తున్నారంటూ'' క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం జాఫర్ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా గత సీజన్ వరకు ఆర్సీబీ తరపున ఆడిన చహల్ ఆ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. కానీ అతన్ని ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోవడం ఆశ్చర్యపరించింది. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ తరపున చహల్ 2 మ్యాచ్ల్లో 5 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక పడిక్కల్ కూడా ఆర్సీబీ తరపున ఐపీఎల్లో సెంచరీ అందుకున్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఆర్సీబీ తరపున పడిక్కల్ కీలక ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. చదవండి: IPL 2022: 'ఎస్ఆర్హెచ్కు 6.5 కోట్లు దండగ.. మరీ దారుణంగా ఆడుతున్నాడు' IPL 2022 RR Vs RCB: అక్కడ టాస్ గెలిస్తేనే విజయం! హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఇలా! .@yuzi_chahal and @devdpd07 playing against RCB tonight. #RRvRCB #IPL2022 pic.twitter.com/QpteUJU6AY — Wasim Jaffer (@WasimJaffer14) April 5, 2022 -
RR Vs RCB: అక్కడ టాస్ గెలిస్తేనే విజయం!
IPL 2022 RR Vs RCB Prediction: ఐపీఎల్-2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఘన విజయం సాధించింది ఆర్ఆర్. తమ ఆరంభ మ్యాచ్లో భాగంగా సన్రైజర్స్తో తలపడ్డ రాజస్తాన్ 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అదే విధంగా రెండో మ్యాచ్లో ముంబైని 23 పరుగుల తేడాతో ఓడించి సత్తా చాటింది. ఈ క్రమంలో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అద్భుత రన్రేటు(2.100)తో ముందుకు దూసుకెళ్లింది. ఇదే జోష్లో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్కు సిద్ధమవుతోంది. హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ రెండు జట్ల ముఖాముఖి పోరులో ఇప్పటి వరకు ఎవరిది పైచేయి, పిచ్ వాతావరణం, తుది జట్ల అంచనా, మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది అన్న విషయాలు గమనిద్దాం. రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తేది, సమయం: ఏప్రిల్ 5, రాత్రి 7: 30 గంటలకు మ్యాచ్ ఆరంభం వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై పిచ్ వాతావరణం: వాంఖడేలో జరిగిన గత మూడు మ్యాచ్లను గమనిస్తే.. చేజింగ్ జట్లే విజయం సాధించాయి. సాయంత్రం ఇక్కడ జరిగే మ్యాచ్లలో మంచు ప్రభావం ఎక్కువ. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పేసర్లకు ఈ పిచ్ అనుకూలమని గత మ్యాచ్లను బట్టి అర్థమవుతోంది. కేకేఆర్ తరఫున ఉమేశ్ యాదవ్, గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ షమీ ఇక్కడ అద్బుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం గమనార్హం. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ ముఖాముఖి రికార్డులు ఐపీఎల్లో ఇప్పటి వరకు 24 మ్యాచ్లలో రాజస్తాన్, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఇందులో పన్నెండింటిలో ఆర్సీబీ విజయం సాధించగా.. రాజస్తాన్ 10 మ్యాచ్లలో గెలుపొందింది. రెండు మ్యాచ్లలో ఫలితం తేలలేదు. ఇక వాంఖడేలో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్లలో రాజస్తాన్ కేవలం ఏడింట ఓడిపోగా.. ఆర్సీబీ 12 మ్యాచ్లకు గానూ ఎనిమిదింట పరాజయం మూటగట్టుకుంది.కాగా ఈ సీజన్లో రాజస్తాన్ రెండింట గెలుపొందగా.. ఆర్సీబీ ఒక మ్యాచ్లో ఓడి, మరో మ్యాచ్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మంళవారం నాటి పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. తుది జట్ల అంచనా: ఆర్సీబీ: ఫాప్ డుప్లెసిసస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తిక్, రూథర్ఫర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ రాజస్తాన్: జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), దేవ్దత్ పడిక్కల్, షిమ్రన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చహల్, ప్రసిద్ కృష్ణ. చదవండి: IPL 2022: రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్.. ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్! Faf’s pep talk to the team, Mike’s assessment, Willey’s team song assignment, Harshal on facing old friend Yuzi, Maxi’s availability and much more, as we preview the #RRVRCB game on @kreditbee presents Game Day.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/rRFAu5PGGn — Royal Challengers Bangalore (@RCBTweets) April 5, 2022 We carry Rajasthan in our hearts. We are #DilSeRoyal. 💗#RoyalsFamily | #RRvRCB pic.twitter.com/ibZp6X4Nk9 — Rajasthan Royals (@rajasthanroyals) April 5, 2022