Rajampeta
-
రాజంపేట: రీపోలింగ్ జరగాలి
సాక్షి, రాజంపేట: రాజంపేట మండలం లోని వైబీఎన్పల్లె, డీబీఎన్పల్లె, శవనవారిపల్లె, కొల్లావారిపల్లె, మిట్టమీదపల్లెలోని 170, 172, 171, 196,199, 192,193 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగి, తమకు అనుకూలంగా మలుచుకున్నారని, అందువల్ల వాటిలో రీపోలింగ్ నిర్వహిం చాలని వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి విన్నవించారు. పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్ఓ నాగన్నకు వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా మేడా మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతవరణంలో వినియోగించుకోలేకపోయారంటే ఇందులో పోలీసులు వైఫల్యం ఉందన్నారు.గ్రామాల్లోకి వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు జనరల్ ఏజెంటగా వెళితే రాకుండా అడ్డుకోవడం ఎలాంటి సంస్కృతికి దారితీస్తుందన్నారు. ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ రాజంపేట చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈ సారి దౌర్జన్యకర వాతవరణంలో పోలింగ్ జరగడం విచాకరమన్నారు. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటే వారిలో ఓడిపోతున్నామనే భయం వెంటాడుతోందన్నారు. తాము కోరుతున్న పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరపాల్సిన ఆవశ్యకత ఉందని, దీనిని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. టీడీపీ ఎన్నికుట్రలు చేసినా వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. ఈ రాష్ట్రానికి సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి కావడం తధ్యమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాపినేని విశ్వనాథ్రెడ్డి, పోలిమురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా పోలింగ్ సందర్భంగా వచ్చిన పిర్యాదులపై విచారణ చేయడం జరుగుతుందని ఆర్వో నాగన్న ఇక్కడి విలేకరులకు తెలియచేశారు. -
రాజంపేటలో స్థానికేతరుల మకాం
సాక్షి, రాజంపేట: రాజంపేటలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా అనే అనుమానాలు ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రాజంపేట నియోజకవర్గంలో స్థానికేతరులు భారీగా చొరబడినట్లు ప్రచారం జరుగుతోంది. పక్క నియోజకవర్గమైన రైల్వేకోడూరు నుంచి గత నెల నుంచి రాజంపేట టౌన్, నందలూరుతో వివిధ మండలాల్లో ఒక వర్గం చేరినట్లు తెలుస్తోంది. ఈ వర్గం ప్రతినిధుల కనుసన్నల్లోనే డబ్బు, మద్యం యథేచ్ఛగా పంపిణీ జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల (ఓ సామాజికవర్గం) అధికారులు పెద్దగా దృష్టి సారించలేదన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రతిపక్షపార్టీకి చెందిన వారినే టార్గెట్ చేసుకొనే ఆకస్మికదాడులు, కేసులో బనాయిస్తున్నారనే అపవాదును ఇప్పటికే పోలీసులు మూటకట్టుకున్నారు. అధికారపార్టీవైపు వారు కన్నెత్తిచూడటంలేదన్న విమర్శలున్నాయి. నాన్లోకల్తోపాటు అసాంఘికశక్తులు దిగిపోయారా? పక్క నియోజకవర్గం నుంచి స్థానికేతరులతోపాటు అసాంఘికశక్తులు వచ్చారనే ప్రచారాలు ఓటర్లను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతి మండలంలో స్ధానికేతరులతో పాటు అసాంఘికశక్తులు రంగంలో ఇప్పటికే దిగిపోయినట్లు తెలుస్తోంది. ఓవర్గంతో కలిసిపోవడమే కాకుండా అధికారపార్టీ నాయకుల అండదండలతో స్థ్ధానికంగా పెత్తనం సాగిస్తున్నారు. పోలింగ్ రోజున ఎటువంటి దుశ్చర్యలకు దిగుతారో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో కర్ణాటక నుంచి అక్రమమద్యం దిగుమతి చేసిన తరహాలో ఈసారి కూడా రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారులు స్ధానికంగానే మద్యం సరఫరాపై దృష్టి సారించారు. కానీ కర్ణాటక నుంచి తెప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వైనాలపై దృష్టి సారించాల్సి ఉంది. నియోజకవర్గంలో స్ధానికేతరుల ఓటర్ల నమోదుపై అనుమానాలు.. పొరుగు ప్రాంతాలకు చెందిన స్ధానికేతరులు అధికారపార్టీకి అండగా నిలిచేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజంపేటలో నాన్లోకల్ అరాచకశక్తులు చెలరేగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే భయం స్ధానికుల్లో నెలకొంది. రెండువేల నుంచి మూడు వేల వరకు స్ధానికేతరులను కొంతమంది రెవెన్యూ సిబ్బంది సహకారంతోఓటర్లుగా చేర్చినట్లు ఎన్నికల సంఘాలకు ఫిర్యాదులు వెళ్లాయి. వీరు ఓటింగుకు వచ్చిన సందర్భంలో బూత్లలో అభ్యంతరాలు వ్యక్తమయ్యే పరిస్ధితుల్లో ఘర్షణలకు దారితీసే అవకాశముందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎన్నికల సంఘం, పోలీసుశాఖ దృష్టి సారించాలని, వెనువెంటనే ఈ విషయంపై జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ దృష్టి సారించాలని ఓటర్లు కోరుతున్నారు. -
అగ్రి గోల్డు బాధితులకు అండగా జగన్
సాక్షి, రాజంపేట రూరల్: వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలిచి వైఎస్సార్సీపీనీ అధికారంలోకి తెచ్చుకుందామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ రాష్ట్ర , జిల్లా ఉపాధక్షుడు తుమ్మల రాము అగ్రిగోల్డ్ బాధితులను కోరారు. సోమవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని లోటస్పాండ్లో రాష్ట్ర అధ్యక్షుడు బి. విశ్వనాథ్రెడ్డితో వెళ్లి కలిశామని ఆయన చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు జననేతకు వివరించామన్నారు. అధికారంలోకి రాగానే మూడు నెలలలోపు రూ.1183 కోట్లు కేటాయించి 13 లక్షల మందికి న్యాయం చేస్తానని జగన్ భరోసా ఇచ్చారని రాము తెలియజేశారు. దశల వారిగా ప్రతి కస్టమర్కు డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. నాలుగు సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంటే బాబు ప్రభుత్వం న్యాయం చేయక పోగా అన్యాయం చేసిందని మండిపడ్డారు. 250 మందికి పైగా రైతులు క్షోభతో కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి భాధితుడు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. మంగళవారం నుంచి అగ్రిగోల్డ్ భాధితులు ప్రచా రం చేయాలని కోరారు. జననేతను కలిసిన వారిలో రాజంపేట శాఖ అధ్యక్షుడు పీవీ సుబ్బారావు, ఉపాధ్యక్షుడు తదితరులు ఉన్నారు. -
నా జీవితం..ప్రజాసేవకే అంకితం
ప్ర: రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు? మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు? వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి నేతృత్వంలో అత్యధికమెజార్టీ సాధించే గెలుపు దిశగా దూసుకుపోతున్నాను. వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తోడ్పాటుతోపాటు ప్రజల దీవెన ఉంది. అంతేగాకుండా జననేత జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ విధంగా నా విజయానికి కలిసివచ్చే అంశం. ప్ర: రాజంపేటలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలపై, అలాగే ఇక్కడి ప్రజల మనోగతం ఎలా ఉంది? మా నియోజకవర్గ ప్రజలు మహాతెలివైన వారు. రాజకీయచైతన్యం కలిగిన వారు. ప్రజలు ఇప్పటికే లోకల్ అయిన నావైపే మొగ్గుచూపుతున్నారు. నాన్లోకల్ లీడర్లు వస్తారు.. పోతారు. వారి గోగాకు, పుల్లకూర, ఉప్మా మాటలు రాజంపేట నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్ర: రాజంపేట వాసులు ఫ్యాక్షన్ ప్రభావితం చేసే, కన్నింగ్, మాటల మాయగాళ్లను ప్రజలు నమ్ముతారా? ఫ్యాక్షన్ ప్రభావితం చేసే వ్యక్తులను రాజంపేట ఓటర్లు దూరంపెడతారు. తొలివాగ్గేయకారుడు అన్నమయ్య నడిచిన నేల ఇది. అటువంటి ప్రాంతంలో ఉన్నవారు మంచిని, నిజాయితీని, ధర్మాన్ని ఆచరిస్తారు. కన్నింగ్, మాటలమాయగాళ్ల చేతిలో మోసపోయేందుకు ఇక్కడి ఓటర్లు సిద్ధంగాలేరు. ప్ర: రాజంపేటలో ఎన్నడూలేని రీతిలో ఈ ఎన్నికలో ఓ సామాజికవర్గం పాలిట్రిక్స్ జరుగుతున్నాయి. మైండ్గేమ్, క్యాస్ట్గేమ్ను ఎన్నడూలేని రీతిలో ఇప్పుడు జరుగుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వెలువడుతున్నాయి.దీనిపై మీ స్పందన? నేను అందరివాడిని.. అందరిని ప్రేమగా, ఆప్యాయతగా పలుకురిస్తాను. సామాజికవర్గాల భేదాబిప్రాయాలు లేవు. మైండ్గేమ్, క్యాస్ట్గేమ్లకు నేను దూరం. ఏ కులమైనా.. ఏ మతమైనా అందరూ నావాళ్లే అనుకునే మనసత్త్వం నాది. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవాలనే భావనతో ప్రజాసేవ చేస్తున్నాను. కుట్రలు, కుతంత్రాలకు దూరం. మంచిని ప్రేమిస్తాను. ధర్మాన్ని ఆచరిస్తాను. ప్ర: ఇప్పటి వరకు మీ ప్రజాసేవ కొనసాగిందిలా..! భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళతారు? ప్రజల సొమ్మును దోచుకునే స్వభావం లేదు. సొంత డబ్బులతో ప్రజాసేవచేస్తూ ముందుకెళుతున్నాను. అదే రీతిలో భవిష్యత్తులో ముందుకెళతాను. ప్రజల కోసం నిరంతరం నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. ప్రజలే నా ఉపిరి, శ్వాస అనే భావనతో నడుచుకునేందుకు ఇష్టపడతాను. ప్ర: రాజంపేట అసెంబ్లీ జనానికి రైల్వేకోడూరులో అమలుకాబడిన దుర్మార్గపు రాజకీయశైలి భయం వెంటాడుతోందని భావనలు వెలువడుతున్నాయా? నిజమేనా? నిజమే కదా? చందాలు వసూలు, సుంకాల చెల్లింపులు లాంటివి వస్తే ఇబ్బందిపడతామని వ్యాపారవర్గాలతోపాటు విభిన్న వర్గాలు భయాందోళన చెందతున్నారు. అందుకే కదా స్థానికుడు అయిన నాకే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ప్ర: టీడీపీకి రాజంపేటలో అభ్యర్థులు కరువయ్యారనే ఆరోపణలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇందువల్లనే పక్క నియోజకవర్గనేతను బరిలోకి దింపారనే వాదన ఆపార్టీ వర్గాల్లోనే ఉంది. దీనికి మీరు ఏమంటారు? వైఎస్సార్సీపీకి బలమైన ఆదరణ, అభిమానం కలిగి ఉన్న నియోజకవర్గం రాజంపేట. అటువంటి ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పోటీ చేసే నాయకుడు లేక, దిగుమతి చేసుకున్న నాయకున్ని ఎన్నికల బరిలోకి దింపిందనే విషయం అందరికీ తెలిసిందే కదా. ప్ర: ఎన్నికల వేళలో చాలామంది క్షత్రియ సామాజికవర్గంతోపాటు ఇతర సామాజికవర్గాలకు చెందిన అధికారులను ఆకస్మికబదిలీ చేయించారనే వాదన రాజంపేటలో వినిపిస్తోంది. నిజమేనా? ఎక్కడ ఓడిపోతామనే భావనతో అధికారపార్టీ మాకు వ్యతిరేక సామాజికవర్గాలకు చెందిన అధికారులను ఆకస్మికంగా బదిలీ చేయిస్తున్నారు. వేధింపులకు గురిచేస్తున్నారు. ఇది నిజం. ఇప్పుడు ఎన్నికలసంఘం నేతృత్వంలో అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్ర: చంద్రబాబు పాలనపై జనంలో వ్యతిరేకత వెల్లుబుకుతోంది. 650 హామీలు ఇచ్చి నట్టేట ముంచేశారని జనం బహిర్గతంగానే విమర్శిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? బాబు పాలన దోపిడీ, అవినీతితో కూడుకున్నదని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. ఈ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రాజంపేటను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే యోచన ఉంది? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తథ్యం. జగన్ సీఎం అయితే అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతారు. నేను రాజంపేట నియోజకవర్గంలో దివంగత సీఎం వైఎస్సార్ను ఆశయంగా తీసుకొని శాశ్వత అభివృద్ధికి దోహదపడతాను. మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? మాది నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లె. నేను దివంగత సీఎం వైఎస్రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో నందలూరు సింగల్విండో చైర్మన్ ఎన్నికతో రాజకీయ ప్రవేశం చేశాను. ఆనాటి నుంచి మా కుటుంబానికి వైఎస్సార్ కుటుంబం అంటే ఎనలేని అభిమానం, ప్రేమ. దివంగత సీఎం వైఎస్సార్ ప్రతిపక్షనేతగా ఉన్న హయాంలో బస్సు యాత్రకు మా ఇంటికి వచ్చారు. ఇప్పటికీ ఆయన రాజకీయశైలిని మరిచిపోలేకున్నాను. ఆయన ఆశయాలకు పాటుపడుతూ, జగన్ అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళుతున్నాను. మీ ప్రచారం ఎలా జరుగుతోంది? వైఎస్సార్సీపీ వస్తున్న జనాదరణ ఏలా ఉంది? ఆరుమండలాల్లో ప్రచారానికి జనంనుంచి విశేషస్పందన లభిస్తోంది. నాయకుల నేతృత్వంలో పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నాయి. బాబు సామాజికవర్గంతోపాటు, కాపు, క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారు వైఎస్సార్సీపీ వైపే మొగ్గుచూపుతున్నారు. ఏగ్రామానికి వెళ్లినా జనం అపూర్వస్వాగతం, ఆపాయ్యతలు, అభిమానాలు చూపుతున్నారు. -
మద్దతు తెలపలేదని.. ఓట్లు తక్కువగా చూపుతారా?
సాక్షి,రాజంపేట: రాజంపేటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని దిగుమతి చేసుకోవడం వల్లే అతనికి ఆశించినంత స్థాయిలో బలిజలు మద్దతు పలకడంలేదని కాపునేత, సీనియర్న్యాయవాది కృష్ణకుమార్ ఆరోపించారు. ఆదివారం తన స్వగృహంలో కాపుసామాజిక వర్గానికి చెందిన నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీకి బలిజలు మద్దతు తెలపకపోవడంతో ఆ కుల ఓట్లు తక్కువగా ఉన్నట్లుగా పచ్చపత్రికల్లో రాయడం సరికాదన్నారు. నిజాలు తెలుసుకొని రాయలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేవలం బలిజ, కాపు ఉపకులాలతో అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాపు ఓట్లు లేనిదే టీడీపీకి దిక్కులేదన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బలిజ ఓటర్లు సగం జనసేన వైపు, మిగిలిన సగం వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పచ్చపార్టీలు తమ పత్రికల్లో బలిజ కులస్తులు తక్కువగా ఉన్నారని చూపించడం సహించలేనిది అన్నారు. రాజంపేట నియోజకవర్గంలో బలిజ కులస్తులు 26వేలు మాత్రమే ఉన్నట్లు ఓ పత్రికలో రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజంపేటటౌన్, మండలం కలిపి 15వేలు, నందలూరులో 8వేలు, ఒంటిమిట్టలో 4వేలు, సిద్దవటంలో 5వేలు , సుండుపల్లెలో 8వేలు, వీరబల్లిలో 3వేల ఓట్లు మొత్తం 42వేల బలిజ ఓట్లు ఉన్నాయన్నారు. రాజకీయ ఉద్దేశంతో తగ్గించి రాయడం చూస్తుంటేకాపు కులాన్ని కించపరిచడమే అవుతుందన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బలిజ కులస్తులు ఎక్కువ భాగం వైఎస్సార్సీపీ వెంట ఉన్నందు వల్లే ఇలా రాయడం అవివేకమన్నారు. టీడీపీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా రాజంపేటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, అలాగే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమని అభిప్రాయపడ్డారు. -
రాజంపేటలో వైఎస్ఆర్సీపీ బీసీల ఆత్మీయ సభ
-
ఓ నియోజకవర్గం.. ముగ్గురు తొలి ఎమ్మెల్యేలు..
సాక్షి, రాజంపేట: ఒక నియోజకవర్గానికి ఒకరే తొలి ఎమ్మెల్యే ఉంటారని అందరికీ తెలుసు.. కానీ రాజంపేట నియోజకవర్గానికి ముగ్గురు ఉన్నారు. 1952లో రాజంపేట, రైల్వేకోడూరు ఉమ్మడి నియోజకవర్గంగా ఉన్నప్పుడు పంజం నరసింహారెడ్డి తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి నియోజకవర్గ చరిత్రలో ఆయన తొలి ఎమ్మెల్యేగా నిలిచిపోయారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని అనంతరాజంపేట గ్రామ పంచాయతీలోని తంబల్లవారిపల్లెకి చెందిన ఈయన పేరొందిన కమ్యూనిస్టు నేత. కేవలం భూమి ఉన్న వారికే ఓటు హక్కు ఉన్న రోజుల్లో.. ఆయన ఓ సంచి తగిలించుకొని గ్రామగ్రామాన తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకునే వారు. కమ్యూనిస్టు పార్టీ మొదటి జిల్లా కార్యదర్శిగా పని చేశారు. 1913లో పుట్టి, 1964లో మరణించారు. స్వాతంత్య్రసంగ్రామంలో దేశం కోసం పాల్గొంటూనే.. ప్రజల సమస్యలపై కమ్యూనిస్టుగా పోరాటాలను చేశారు. కొండూరు మారారెడ్డి ఉమ్మడి నియోజకవర్గం నుంచి రాజంపేట వేరైంది. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పెనగలూరు మండలంలోని కొండూరుకు చెందిన కొండూరు మారారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఈయన గుర్తు నక్షత్రం. మంచికి మారుపేరుగా.. పేదలంటే అభిమానం, ఆప్యాయతలను చూపే ఆయన పట్ల ప్రజలు ఎనలేని అభిమానం చూపే వారు. అందుకే ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత మారారెడ్డి స్థానంలో ఆయన సతీమణి కొండూరు ప్రభావతమ్మ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రాజంపేట నియోజకవర్గంలో తనదైన శైలిలో రాణించారు. ఇప్పుడు వారి సొంత మండలం పెనగలూరు రైల్వేకోడూరు నియోజకవర్గంలోకి చేరిపోయింది. పునర్విభజన తర్వాత ఆకేపాటి రాజంపేట, పెనగలూరు, ఒంటిమిట్ట, నందలూరు మండలాలతో ఉన్న రాజంపేట నియోజకవర్గం.. నియోజకవర్గాల పునర్విభజనతో రాజంపేట, నందలూరు, వీరబల్లి, సుండుపల్లె, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలతో రాజంపేట నియోజకవర్గంగా అవతరించింది. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో రాజంపేట రాజకీయ చరిత్రలో తొలి ఎమ్మెల్యేగా నిలిచిపోయారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచిన తొలి ఎమ్మెల్యేగా ఆకేపాటి చరిత్రకెక్కారు. దివంగత సీఎం వైఎస్సార్ కుటుంబంతో అనుబంధం కలిగిన ఆకేపాటి అంచలంచెలుగా రాజకీయంగా ఎదిగారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటికి వచ్చినప్పుడు.. ఆయనకు అండగా నిలబడిన తొలి ఎమ్మెల్యే ఆకేపాటి. వైఎస్సార్ హయాంలో జిల్లా అధ్యక్షుడిగాను, జగన్మోహన్రెడ్డి హయాంలో వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. -
అక్కడ పోటీకి నో చెప్పిన డీకే సత్యప్రభ!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ శుక్రవారం భేటీ అయ్యారు. రాజంపేట ఎంపీ స్థానంనుంచి సత్యప్రభను పోటీ చేయించే విషయంపై చంద్రబాబు ఆమెతో చర్చించారు. అయితే సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేస్తానని సత్యప్రభ వెల్లడించారు. ఆలోచించి రాత్రికి నిర్ణయం ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. కాగా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆమెపై అధిష్టానం గత కొద్దిరోజులుగా ఒత్తిడి తెస్తోంది. ఈ ఎన్నికల్లో కీలకమైన ఎంపీ నియోజకవర్గాల్లో పోటీకి పార్టీ నేతలు ఎవరూ సంసిద్ధత తెలపకపోవడం గమనార్హం. టీడీపీ బలహీనంగా ఉన్న రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఇంతకుముందు రాజంపేట నుంచి చిత్తూరు ఎంపీ డీకే సత్యప్రభ కుమారుడు డీకే శ్రీనివాసులును పోటీ చేయించాలని చంద్రబాబు భావించినా ఆయన సానుకూలత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. దీంతో డీకే సత్యప్రభను అక్కడినుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. కానీ ఆమె కూడా రాజంపేట ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవటంతో వేరే అభ్యర్థిని వెతుక్కోవల్సిన పని పడింది. టీడీపీ ఓడిపోయే నియోజకవర్గంలో తామెందుకు పోటీ చేయాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. -
‘దారి’చూపని ముఖ్యమంత్రి
సాక్షి,రాజాంపేట: రాజాం ప్రధాన రహదారిని విస్తరిస్తాం. రాజాం పట్టణంలోని చెరువులను పార్కులుగా మారుస్తాం. హైటెక్ సిటీ, శాటిలైట్ సిటీ నిర్మాణం చేపడతాం. తోటపల్లి మిగులు భూములకు నీరు అందిస్తాం.’ అని 2017వ సంవత్సరం జనవరి 6న రాజాంలో నిర్వహించిన ‘జన్మభూమి మా ఊరు’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలివి. అప్పట్లో రాజాం బస్టాండ్ ఆవరణలో జరిగిన ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమంలో సీఎం ఈ హామీలు ఇవ్వగా రెండేళ్లు దాటినా ఇప్పటికీ అవి పూర్తికాలేదు. రాజాం ప్రధాన రహదారి ఇరుగ్గా ఉండడంతో విస్తరిస్తామని 2017లో సీఎం హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణకు రూ.56 కోట్లు మేర నిధులు కావాల్సి ఉండగా ఇప్పటి వరకూ రూ.10 కోట్లు మేర మాత్రమే వచ్చాయి. ఏడాది కాలంగా అంబేడ్కర్ జంక్షన్ నుంచి బొబ్బిలి జంక్షన్ వరకూ రోడ్డు విస్తరణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకూ ఆ పనులు కొలిక్కి రాలేదు. ఇలాంటి హామీలు ఇచ్చిన బాబును ఎందుకు నమ్మాలి? అని రాజాం పట్టణ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. -
టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు
సాక్షి, విజయవాడ : టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మంగళవారం సీఎం అధ్యక్షతన జరిగే రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన బ్రహ్మయ్యకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆయనను రమేష్ హాస్పిటల్కు తరలించారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా, బ్రహ్మయ్య కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. రాజంపేట అసెంబ్లీ సీటును ఆయన ఆశిస్తున్నారు. కాగా, బ్రహ్మయ్య అభ్యర్థనను చంద్రబాబు నిరాకరించినట్టు సమాచారం. నిన్న కడపలో జరిగిన మీడియా సమావేశంలో బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ‘పార్టీలో కష్టపడిన వారికి కాకుండా వలస వచ్చిన నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. (టీడీపీలో కొనసాగుతోన్న అసమ్మతి సెగలు) -
అర్ధరాత్రి నిప్పు.. భద్రతకు ముప్పు
వైఎస్ఆర్ జిల్లా , రాజంపేట: రాజంపేటలో చోటుచేసుకుంటున్న దహనం సంఘటనలు పోలీసులకు సవాల్గా మారాయి. ఎనిమిదేళ్ల క్రితం పట్టణంలోని సాయినగర్లో వరుసగా ఇంటిబయట ఉన్న బైకులకు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. అప్పటి నుంచి ఈ ఇలాంటి సంఘటనలు అడపా దడపా జరుగుతూనే వస్తున్నాయి. తాజాగా పట్టణ నడిబొడ్డున ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద 300 యేళ్ల కిందటి వినియోగంలో లేని రథానికి నిప్పు పెట్టడంతోపాటు పలుచోట్ల వాహనాలకు నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనలు పట్టణ వాసుల్లో భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. వాహనాలకు భద్రత కరువు.. బైకులు, భారీ వాహనాలకు భద్రత కరువైంది. తమ ఇంటి ముందు, వీధిలోను, ఆవరణంలో ఉంచిన వాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెడతారనే భయం వాహనదారులను వెంటాడుతోంది. ఇప్పుడు వాహనాలు బయట పెట్టుకోవాలంటే జంకుతున్నారు. పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగడం కొత్తేమీ కాకపోయినప్పటికీ అది ఇప్పుడు మళ్లీ జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకిలాచేస్తున్నారో.. వాహనాలకు నిప్పుపెట్టడం వల్ల వారికి కలిగే ఆనందం ఏమిటో..ఎందుకిలా చేస్తున్నారో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రత్యర్ధులను టార్గెట్ చేసుకొని తమ కసి తీర్చుకోవడం సహజమే. అలాంటిదేమీ లేకున్నా.. వాహనాలకు నిప్పుపెట్టిన వారితో ఎలాంటి సంబంధంలేకున్నా ఎందుకు నిప్పుపెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. తలలు పట్టుకుంటున్న పోలీసులు పట్టణంలో వాహనాలకు నిప్పుపెడుతున్న వారి తీరు అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనాలకు నిప్పు పెడుతూ సైకోలా వ్యవహరిస్తున్న వారు స్థానికులా, ఇతర ప్రాంతానికి చెందిన వారా అనేది తెలియని పరిస్థితి. సీసీ కెమెరాలు పనిచేస్తుంటే... పట్టణంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు ఇప్పుడు పనిచేయడంలేదు. అవి పనిచేయకపోవడంతో జరుగుతున్న సంఘటనల కారకులను గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు పోలీసులు ప్రైవేటు వారి సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా సోమవారం సాయంత్రం పట్టణంలోని ఓ లాడ్జిలో తనిఖీలు చేసి సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ వాసులు కోరుతున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నాం రాజంపేటలో చోటుచేసుకున్న దహనం సంఘటనలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. రథంతోపాటు వాహనాలకు నిప్పుపెట్టిన సంఘటనకు సంబంధించి వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నాము. అవసరమైన ఆధారల సేకరణలో ఉన్నాము.– రాఘవేంద్ర, డీఎస్పీ, రాజంపేట -
వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో ఉద్రిక్తత
-
కేంద్ర ప్రభుత్వ దుష్టవైఖరి మరోసారి బహిర్గతమైంది
రాజంపేట రూరల్: ఏపీకి ప్రత్యేక హోదా పై అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ దుష్టవైఖరి మరొకసారి బహిర్గతమైందని సీపీఐ, సీపీఎం ఏరియా కార్యదర్శులు పి.మహేష్, సి.రవికుమార్ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక బైపాస్ రహదారిలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కేంద్ర వైఖరిని నిరసిస్తూ మెడకు ఉరితాళ్లను వేసుకొని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏపీని మోసం చేస్తూనే ఉందన్నారు. విభజన హామీలన్ని అమలు చేశామని బూటకపు అఫిడవిట్ దాఖలు చేసిందని విమర్శంచారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీపీఐ నాయకులు ఎంఎస్ రాయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్, ఏఐఎస్ఎఫ్ ఏరియా కార్యదర్శి ఈ.సికిందర్, గురుసాయి, ఏఐటీయూసీ నాయకులు ఎస్ఎస్ షరీఫ్, సుబ్రమణ్యంరాజు, వెంకటేష్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. -
ఆ పోలీసుస్టేషన్ అంటే ఎస్ఐలకు దడ !
రాజంపేట : నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట రూరల్ (మన్నూరు) పోలీసుస్టేషన్ ఎస్ఐలుకు అచ్చిరావడంలేదు. మన్నూరు పోలీసుస్టేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్న ఎస్ఐలు ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. సస్పెన్షన్ కావడమో..రాజకీయ బదిలీ...లేక వ్యక్తిగతగ ఫెయిల్యూర్స్తో ఎస్ఐలు స్టేషన్ వీడిపోతున్నారు. దీంతో ఇక్కడ పోస్టింగ్ అంటే ఎస్ఐలు వెనడుగు వేస్తున్నారు. మన్నూరు పోలీసుస్టేషన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. లాకప్డెత్ నుంచి నేటి వరకు పనిచేసిన ఎస్ఐలు అనేక వివాదాలు, ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారంటే ఈ స్టేషన్ ప్రభావం ఏ పాటిదే అవగతమవుతుంది. పరిధి విస్తారం..మానసిక ఒత్తిడిలు.. పేరుకే రూరల్ పోలీస్టేషన్..కానీ పరిధి విస్తా రం. ప్రజల కోసం పనిచేసే ఎస్ఐలకు రాజ కీయ ఒత్తిళ్లు అధికం అన్న విమర్శలున్నాయి. మన్నూరు పోలీసుస్టేషన్ పరిధి ఎక్కువుగా ఉండటంతో ఒక ఎస్ఐ విధులు నిర్వర్తించాలంటే కష్టమవుతోంది. ఇక్కడ పనిచేసే ఎస్ఐకు మానసిక ,విధి పరమైన ఒత్తిడిలతో కుటుంబాలతో గడపలేని పరిస్ధితులు దాపురించాయి. ఇటీవల మన్నూరు ఎస్ఐ మహేశ్నాయుడు భార్య ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలతో ఈ స్టేషన్ అంటేనే హడలెత్తిపోతున్నారు. వాస్తుపరంగా ఈస్టేషన్కు దోషాలు ఉన్నాయనే అనుమానాలు మన్నూరు పోలీసులను వేధిస్తున్నాయి. పట్టణతరహాలో ఎస్హెచ్ఓ అవసరం.. రాజంపేట పట్టణపోలీసుస్టేషన్ తరహలో స్టేషన్హౌస్ ఆఫీసర్కు సీఐ స్ధాయి అధికారిని పోలీసుశాఖ నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రూరల్ సీఐ ఉన్నప్పటికీ రాజంపేట నియోజకవర్గంలో ఒక మండలం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు, పుల్లంపేట మండలాలు చూసుకోవాల్సి వస్తోంది. మన్నూరు పరిధిలో అధిక సంఖ్యలో గ్రామాలు, అటవీ పల్లెలు, పట్టణంతో పాటు అభివృద్ధి చెందుతున్న బోయనపల్లె, పలు ఉన్నత విద్యాసంస్ధలు, చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్ధితిలో ఈ స్టేషన్ను ఒక ఎస్ఐ మెయింటెన్ చేయడం కష్టంగా ఉందని పోలీసులు అంటున్నారు. ఇప్పటివరకు ఎవరెవరు.. ఇప్పటి వరకు మన్నూరు పోలీసుస్టేషన్లో అనేక మంది సీఐలు, ఎస్ఐలు పనిచేసినప్పటికి వివాదాలు నడుమ వెళ్లిపోవడం ఈ స్టేషన్ సంప్రదాయం. 1998 నుంచి తీసుకుంటే మునిరామయ్య, గోరంట్ల మాధవ్, సయ్యద్ సాబ్జాన్, శాంతుడు, ఓవీ రమణ, రామచంద్రారెడ్డి, జెవీఎస్ సత్యనారాయణ, ఎం.కృష్ణారెడ్డి, పి.చంద్రశేఖర్, రెడ్డప్ప, కృష్ణయ్య, కృష్ణమోహన్, డి.శ్రీనివాస్, ఎస్వీనరసింహారావు, మధుసూదన్రెడ్డి, సుధాకర్, మహమ్మద్రఫి, ప్రవీణ్కుమార్, ఎన్వీనాగరాజు, పి.మహేశ్లు పనిచేశారు. వీరిలో సగానికిపైగా పోలీసు అధికారులు అనవసర వివాదాల్లో చిక్కుకొని ఇక్కడి నుంచి వీఆర్, బదిలీలో వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. మన్నూరు పోలీసుస్టేషన్ ఎక్కడుండాలి... మన్నూరు పోలీసుస్టేషన్ రూరల్ పరిధిలో కాకుండా పట్టణంలోని పట్టణ పోలీస్ క్వార్టర్స్లో నిర్వహిస్తున్నారు. గతంలో హరితహోటల్ సమీపంలో ఉన్న మన్నూరు పోలీసుస్టేషన్ను నిర్మాణ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పేల్చేశారు.బోయనపల్లె మెయిన్రోడ్డులోని పీఓబి, ఎర్రబల్లి వద్ద స్థలాలు ఉన్నాయి. అక్కడ నిర్మించేందుకు పోలీసు బాస్లు ఆలోచన చేయడంలేదు. ప్రస్తుతం ఉన్నచోటు నుంచి మరోచోటుకు తరలించాలని అధికారులను స్టేషన్లో పని చేస్తున్న పోలీసులు కోరుతున్నారు. -
సాయం చేయండి..ఊపిరి పోసుకుంటా
అసలే పేదరికం.....వృద్ధాప్యంలో బాగోగులు చూసుకుంటాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కిడ్నీ సమస్య తీవ్రమైంది.ఆర్థిక సమస్యలతో డయాలసిస్ చేయించుకోలేకఇబ్బంది పడుతున్నాడు. దాతలు సాయం చేస్తే ఊపిరి పోసుకుంటానని వేడుకుంటున్నాడు. సున్నపురాళ్లపల్లి (రాజంపేట టౌన్) : రాజంపేట మండలం సున్నపురాళ్ళపల్లె గ్రామానికి చెందిన జి.వెంకటేష్ అలియాస్ ఉమర్బాషా రెండేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారిన పడ్డాడు. వయసులో ఉన్నప్పుడు ఏదో ఒక వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. వయస్సు పైబడటం, దానికి తోడు ఆరోగ్యం సహకరించక పోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమర్బాషా కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ నేపథ్యంలో ఉమర్బాషాకు కిడ్నీ సమస్య అధికమైంది. రెండు నెలలుగా మూడు రోజులకోసారి డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి. బంధువులు, తెలిసిన వారు, స్నేహితుల సహకారంతో కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఒకసారి డయాలసిస్ చేయించుకుంటే రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని బాధితుడు చెబుతున్నాడు. సకాలంలో డబ్బులు లభించకుంటే వారం రోజుల వరకు డయాలసిస్ చేయించుకోకుండా ఉండిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు సహాయం చేస్తే తన ప్రాణం నిలబడుతుందని వేడుకుంటున్నాడు. మానవతావాదులు 8790085866 నంబరును సంప్రదించాలని కోరుతున్నాడు. -
ఎస్ఐ భార్య ఆత్మహత్య
రాజంపేట : మన్నూరు పోలీసుస్టేషన్ ఎస్ఐ మహేశ్నాయుడు భార్య సౌజన్య (26) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మన్నూరు పోలీసుస్టేషన్ ఎదురు వీధిలో వీరు నివాసం ఉంటున్నారు. సౌజన్యది నెల్లూరు జిల్లా కావలి కాగా, ఎస్ఐది చిత్తూరు జిల్లా సత్యవేడు పరిధిలోని వరదయ్యగారిపాళెం. ఐదేళ్ల కిత్రం వీరికి వివాహమైంది. వీరికి పూర్ణేష్ అనే మూడేళ్ల బాబు ఉన్నాడు. ఎస్ఐ ఏడాదిన్నర క్రితం మన్నూరు స్టేషన్కు బదిలీ అయ్యారు. భార్యభర్త ఇక్కడే ఉంటున్నారు. కాగా ఎస్ఐ ఉదయం నుంచి ప్రత్యేకహోదా బంద్లో విధులు నిర్వర్తించారు. సాయంకాలం ఊటుకూరు గ్రామసభలో విధులు నిర్వర్తించే క్రమంలో ఎస్ఐ వెళ్లిపోయారు. పోతూ పోతూ తన బిడ్డను పోలీసుస్టేషన్లో ఓ కానిస్టేబుల్కు అప్పగించి వెళ్లినట్లు సమాచారం. పిల్లవాడిని చూసుకుంటుండాలి.. విధులు ముగించుకొని వచ్చేటప్పుడు తీసుకెళతానని చెప్పినట్లు సమాచారం. అయితే ఇతను విధుల్లో ఉండగానే ఇంటికి రావాలని భార్య నుంచి ఫోన్కాల్ రాగా.. తాను గ్రామసభలో ఉన్నానని.. ఆ తర్వాత వస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈలోగా పిల్లవ్లాడిని ఓ కానిస్టేబుల్ ఇంటి వద్దకు తీసుకెళ్లి చూడగా, తలుపు వేసి ఉందని వెనక్కి వచ్చి ఎస్ఐకి సమాచారం ఇచ్చారు. అయితే మరో కానిస్టేబుల్ మళ్లీ ఇంటికి వద్దకు వెళ్లి బలవంతంగా తలుపు తెరిచి లోపలికి వెళ్లి చూడగా ఎస్ఐ భార్య ఫ్యాన్కు ఊరివేసుకొని ఆత్మహత్య చేçసుకోవడాన్ని గమనించారు. వెంటనే ఎస్ఐకు సమాచారం అందచేశారు. హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకుని, భార్య మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ మన్నూరు ఎస్ఐ భార్య ఆత్మహత్య సంఘటన పోలీసువర్గాలను కలవరపాటుకు గురిచేసింది. సంఘటన స్ధలానికి డీఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండేవారని పలువురు పేర్కొన్నారు. మృతురాలి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కేసు విషయంపై పరిశీలిస్తామన్నారు. రాజంపేట టౌన్ సీఐ యుగంధర్, ఎస్ఐ రాజగోపాల్(టౌన్), రాజంపేట ఆర్డీవో వీరబ్రహ్మం, తహసీల్దారు నరసింహులు తదితరులు మృతదేహాన్ని పరిశీలించారు. -
‘సోలార్’ బాధితులకు అండగా పాదయాత్ర
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి నంబులపూలకుంట: మండలంలో ఏర్పాటు చేస్తున్న అల్ట్రామెగా సోలార్పవర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయి పరిహారం రాని బాధిత రైతుల తరఫున పోరాటం సాగిస్తామని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి తెలిపారు. బాధితులకు అండగా వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ డా.పి.వి.సిద్దారెడ్డి చేపట్టనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జరిగిన వివాహవేడుకకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరిహద్దు జిల్లాలైన వైఎస్ఆర్,అనంతపురం లో దాదాపు 10వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న మెగా సోలార్ ప్రాజెక్టులో రైతులు భూములు కోల్పోయి ఉపాధి లేక వీదిన పడాల్సి వచ్చిందన్నారు. మూడేళ్లుగా రైతులకు మంజూరైన పరిహారాన్ని ఇవ్వకుండా సర్వే పేరుతో ప్రభుత్వం నీరుగార్చేలా ప్రవర్తిస్తోందన్నారు. అక్టోబర్లో సోలార్హబ్ నుంచి చేపట్టనున్న పాదయాత్రలో ప్రతి రైతూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సోలార్హబ్తో నష్టపోయిన బాధితుల రైతుల సమస్యను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రానున్న అసెంబ్సీ సమావేశాల్లో పట్టాలున్న 104 మంది రైతులతోపాటు పట్టాలులేని రైతులకు ఇవ్వాల్సిన పరిహారంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు తెలిపారు. బీమా పంపిణీలోనూ రైతులకు తీవ్ర అన్యాయం : వర్షాబావంతో నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన బీమా పరిహారంలోనూ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని డా.పి.వి.సిద్దారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం మండలాల వారీగా ప్రకటించిన బీమా పరిహారానికి ప్రస్తుతం రైతులకు ఇస్తున్న పరిహారానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. బ్యాంకులు రైతుల వద్ద పట్టాదారు పాసుపుస్తకంలో ఉన్న విస్తీర్ణానికి బీమా ప్రీమియం చెల్లించుకున్నప్పటికీ పరిహారం వచ్చే సమయానికి సగం భూమికి మాత్రమే పరిహారం ఇవ్వడం దారుణమన్నారు. దీనిపై పూర్తి వివరాలతో హైకోర్టుకెళ్లి ప్రతి రైతుకూ తగిన పరిహారం అందేలా పోరాటం చేస్తామన్నారు. -
భూఅక్రమాలపై ఏసీబీ కన్ను
► రాజంపేటలో జోరుగా భూ అక్రమాలు ► రికార్డుల కోసం వచ్చిన అధికారులు ► క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లపై ఆరా ► కాసులు కురిపిస్తున్న భూ వ్యవహారాలు ► కోట్లాది విలువచేసే సర్కారు భూములు ధారాదత్తం రాజంపేట: రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోజరిగిన భూ అక్రమాలపై ఎసీబీ కన్నుపడింది. మండల పరిధిలో రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. రికార్డుల టాంపరింగ్, కబ్జాలు ఇలా ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారుల్లో భూ బకాసురులు అక్రమ వ్యవహారాలకు తెరతీశారు. రికార్డులు తారుమారు, టాంపరింగ్ చేసి తమవి అన్నట్లుగా చిత్రీకరించుకోవడం రాజంపేటలో అధికం కావడంతో నిజమైన భూబాధితులు అధికారుల అవినీతికి అడ్డుకట్టవేసేందుకు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. ఈనేపథ్యంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం తహసీల్దారు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సందర్శించారు. అక్కడి అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ స్థలాలను కట్టబెట్టి...కోట్లు లాభర్జన: తహసీల్దారు కార్యాలయంలో కొందరు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా భూ బకాసురులకు కట్టబెడుతున్నారు. ఇందుకు కొంతమంది అధికారులు ఇప్పటికే కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నట్లుగా ఆరోపణలు వెలుడుతున్నాయి. ఓ రెవెన్యూ అధికారి బాధ్యతలు తీసుకున్నప్పటి నుం చి కోట్లాది రూపాయలు భూ కుం భకోణంకు పాల్పడినట్లుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినప్పటికి ఏమీ చేయలేని నిస్సహాయíస్థితిలో రెవెన్యూ ఉన్నతాధికారులు ఉండిపోయారు. అధికార పార్టీ అండదండలతో భూ అక్రమ వ్యవహారాలను తమ్ముళ్లకు అనుకూలంగా వ్యవహారిస్తూ రూ.కోట్లు వెనుకవేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు వీఆర్వోలు కూడా భూ బకాసురు లకు అంతర్గత మద్దత్తు ఇస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఏసీబీ ఆరాతో రెవెన్యూ అధికారుల్లో వణుకు ఏసీబీ అధికారులు తహసీల్దారు కార్యాలయానికి రావడంతో కొందరు అధికారుల్లో వణుకుపుట్టింది. అలాగే ప్రభుత్వ భూములను కూడా రికార్డులు మార్చేసి రాజం పేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిష్టర్లు కూడా చేయించుకున్నారంటే ఎంత పక్కాగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సహకారం లేకుంటే ఇది సాధ్యమయ్యే పని కాదని భూ బాధితులు చెబుతున్నారు. తాళ్లపాక, ఊటుకూరు, వెంకటరాజంపే ట, బోయనపల్లె, అన్నమయ్య థీం పార్కు ఏరియా, బైపాస్ రహదారి, చక్రాలమడుగు ఏరియా, ఎస్ఆర్పాళెం(పుల్లంపేట మండలం), రాయచోటి రోడ్డు తదితర ప్రాంతాల్లో భూ అక్రమ వ్యవహారాలు కోట్లరూపాయలు సాగినట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా యి. పైవాటిలో కొన్నింటికి సంబంధించి భూ రికార్డులలో గోల్మాల్ చేసినట్లు ఏసీబీ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఇంటిస్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం ఎక్కడాలేదనే రాజంపేట రెవెన్యూ అధికారులు మాత్రం బడాబాబులు, అధికారపార్టీ నేతలకు మాత్రం దగ్గరుండి సాగు, ఇంటి స్థలాలను చూపించి.. వారి వద్ద నుంచి కొంత మొత్తం తీసుకొని కట్టబెడుతున్నారు. గత మూడేళ్లుగా కొనసాగిన ప్రభుత్వ భూ అక్రమ వ్యవహారం ఎట్టకేలకు ఏసీబీని కూడా తాకింది...ఏసీబీ అధికారులు ఏ క్షణానైనా దాడి చేయవచ్చనే భయాందోళన రెవెన్యూ వర్గాల్లో హాట్టాఫిక్గా మారింది. రికార్డుల కోసం.. ఏసీబీ అధికారులు మండల రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డుల కోసం ఆయాశాఖల అధికారులను సంప్రందించినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు గత కొంతకాలంగా రాజంపేటలో జరుగుతున్న భూ అక్రమ వ్యవహారాలపై నిఘా ఉం చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక భూ అక్రమ వ్యవహా రాలు అధికమయ్యాయి. ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించడం లాంటివి స్థానిక రెవెన్యూ అధి కారుల సహకారంతో చేపట్టినట్లు ఆరోపణలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ప్ర«భుత్వ భూములను తమవి అన్నట్లుగా రికార్డులు సృష్టించుకొని అందులో రియల్ వ్యాపారం చేస్తున్నారు. -
ఐక్యతకు ప్రతీక నవమి ఉత్సవాలు
కూచివారిపల్లె (రాజంపేట టౌన్): ప్రజల్లో ఐక్యతకు శ్రీరామనవతి ఉత్సవాలు ప్రతీకలాంటివని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాద్రెడ్డి అభిప్రాయపడ్డారు. మండలంలోని కూచివారిపల్లెలో వెలసిన శ్రీరామాలయంలో వైఎస్సార్ సీపీ యూత్ విభాగం నాయకుడు రెడ్డిమాసి రమేష్నాయుడు స్వామివారికి శనివారం ఉభయం సమర్పించారు. ఈకార్యక్రమంలో ఆకేపాటి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సీతారాములను దర్శించుకొని పూజలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆకేపాటి మాట్లాడుతూ ముఖ్యంగా శ్రీరామనవమి, వినాయకచవితి, పీర్లపండుగలు వంటివి ప్రజల్లో ఐక్యతాభావాన్ని మరింత పెంచుతాయన్నారు. ఈ పండుగలను ప్రతిచోట అన్ని వర్గాల ప్రజలు ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిమెలసి ఘనంగా జరుపుకుంటుండటం దేశ ఐక్యతకే నిదర్శనమన్నారు. పండుగలు, ఉత్సవాలు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు చిహ్నాల్లాంటివని తెలిపారు. పండుగలను, శుభ కార్యాలను ప్రజలంతా కలిసి, మెలసి సంతోషంగా జరుపుకోవాలని ఆకేపాటి ఆకాంక్షించారు. అప్పుడే ప్రజల మధ్య చిన్న, చిన్న స్పర్దలు ఉన్నా తొలగిపోతాయని ఆయన తెలిపారు. సమాజంలో సుఖశాంతులు విరాజిల్లాలని ఆకేపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఊటుకూరు–1 ఎంపీటీసీ రేవరాజు శ్రీనివాసరాజు, వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు రెడ్డిమాసి రమేష్నాయుడు, పోలి మురళీరెడ్డి, రమణారెడ్డి, పసుపులేటి సుధాకర్, పెనిగిలపాటి పెంచలయ్యనాయుడు, గోవిందు బాలక్రిష్ణ, బలిజపల్లె చిన్న తదితరులు పాల్గొన్నారు. -
నష్టాల్లో రాజంపేట ఆర్టీసీ
రాజంపేట: రాజంపేట ఆర్టీసీ డిపో రూ.10.80కోట్ల నష్టానికి చేరుకుంది. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు సంబంధించి రాజంపేటలో ఆర్టీసీ డిపో ఉంది. కిలోమీటరకు రూ.27.11 ఆదాయం వస్తున్నప్పటికి ఖర్చు రూ.35.78 వస్తోంది. దీన్ని బట్టి కిలోమీటరకు రూ.8.67 నష్టం వస్తోంది. ఈ విధమైన రీతిలో రాజంపేట డిపో ఆర్టీసీ నడుస్తోంది. తెలుగువెలుగుకు ఆటోల తాకిడి..: రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల పరిధిలో చాలా ప్రాంతాలకు నడిచే తెలుగువెలుగు బస్సులకు ఆటోల తాకిడి అధికమైంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం క్రమక్రమంగా నైట్హాల్ట్ బస్సులతో పాటు కొన్ని బస్సులను రద్దు చేసుకుంది. ఉదాహరణకు తొగురుపేట, నందలూరు ఆర్ఎస్ బస్సులు ఉన్నాయి. మారుమూల గ్రామాలకు ఆటోల తాకిడితో ఈ బస్సులను ఆర్టీసీ నడపడం మానేసింది. తగ్గిపోతున్న సర్వీసులు..: రాజంపేట డిపోలో ఒకప్పుడు 124 సర్వీసులకుపైగా ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 80కి చేరింది. అద్దెబస్సులు 30 వరకు నడుస్తున్నాయి. నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ యాజమాన్యం బస్సులను ఉపసంహరించుకుంటోంది. సర్వీసులు తగ్గిపోతున్న క్రమంలో ఉన్న కార్మికులకు డ్యూటీ చార్ట్లో విధులకన్నా..విశ్రాంతి అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కోట్లు విలువచేసే స్థలం ఉన్నా..: డిపోకు కోట్ల రూపాయలు విలువజేసే రెండు ఎకరాలకు పైగా నిరుపయోగంగా ఉంది. ఈ ఆస్తులను వాడకంలోకి తెచ్చి ఆర్టీసీ డిపో లాభాల బాటలో పయనించేందుకు ప్రయత్నాలు సాగించింది. ఖాళీ స్థలంలో సర్వే నిర్వహించి ప్లాట్స్కూడా వేసింది. ఇప్పుడున్న స్థలంలో ఒకే ఒక షాపు మాత్రం ఏర్పాటైంది. మిగిలిన ప్లాట్స్ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. కనుమరుగవుతున్న ఎక్స్ప్రెస్ సర్వీసులు...: రాజంపేట డిపో పరిధిలో ఎక్స్ప్రెస్ సర్వీసులు కననుమరుగవుతున్నాయి. కలెక్షన్ రావ డం లేదనే సాకుతో నెల్లూరు, విజయవాడ, చెన్నై ప్రాంతాలకు నడిచే బస్సులను నిలిపివేశారు. కడప–రాజంపేట పాతబస్టాండు మధ్య నడిచే ఎక్స్ప్రెస్ సర్వీసును కూడా ఎత్తివేశారు. ప్రస్తుతం కేవలం విజయవాడ, బెంగళూరు, హైదరాబాదుకు నడుస్తున్నాయి. విజయవాడకు అద్దెబస్సును నడిపిస్తున్నారు. 30మంది రాయచోటికి బదిలీ..: రాజంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న 30 మందిని రాయచోటి డిపోకు బదిలీ అయినట్లుగా సమాచారం. ఈ బదిలీకి ప్రధానంగా ఈ డిపోలో సర్వీసులు తగ్గిపోవడమేనని కార్మికవర్గాలు వాపోతున్నాయి. నడుస్తున్న సర్వీసుల కన్నా అధికంగా సిబ్బంది ఉండటం వల్లనే బదిలీకి ఆర్టీసీ ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల ఈడీ కూడా డిపోకు వచ్చి ఆర్టీస్టీ పురోగతికి సంబంధించి పలు అంశాలపై ఆరా తీశారు. అధికారులతో చర్చించారు. కేఎంపీఎల్ సాధించడంలో జోన్లో అగ్రస్థానం..: డిపో నష్టాల్లో నడుస్తున్నప్పటికీ కేఎంపీఎల్ సాధించడంలో ఆర్టీసీ జోన్లోని అగ్ర స్థానంలో ఉంది. రాజంపేట డిపో మేనేజరుగా ఎంవీకృష్ణారెడ్డి బాధ్యతలు తీసుకన్నప్పటి నుంచి ఆర్టీసీని లాభాలబాటలో నడిపించాలని విశేష కృషి సలుపుతున్నారు. డిపోలో తొలిసారిగా కెఎంపీఎల్ సాధించడంలో సఫలీకృతులయ్యారు. ఇటీవల డిపో నష్టాలను తగ్గించుకునేందుకు అనేక ఆదాయమార్గాలను అన్వేషించుకుంటున్నారు. ఆర్టీసీ ఆలయాల దర్శనం, ముఖ్యమైన ఉత్సవాలకు బస్సులను నడిపించడంలో కార్మికుల సహకారంతో ముందుకెళుతున్నారు. డిపో నష్టాల్లో నడుస్తోంది..: రాజంపేట డిపో నష్టం పది కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా వస్తోంది. నష్టాల నంచి బయటపడేందుకు కార్మికులు, ఉద్యోగుల సహకారంతో కృషి చేస్తున్నాం. చాలా రూట్లలో కలెక్షన్ రాకపోవడం వల్ల బస్సులను తిప్పలేకపోయే పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. --- ఎంవీ కృష్ణారెడ్డి, మేనేజరు, రాజంపేట డిపో -
రాజంపేటలో విషాదం
రాజంపేట పట్టణంలో ఆదివారం విషాదం అలుముకుంది. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు సంఘటనల్లో నలుగురు మృతి చెందారు. ఈతకు వెళ్లి ఇద్దరు.. ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు.. అనుమానాస్పద స్థితిలో మరొకరు మృతి చెందడంతో నాలుగు కుటుంబాలు శోకంలో మునిగిపోయాయి. ఈతకు వెళ్లి.. రాజంపేట: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు స్విమ్మింగ్పూల్లో మునిగి మృతి చెందిన సంఘటన ఆదివారం రాజంపేట పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ అశోక్కుమార్ కథనం మేరకు.. రాజంపేట మండలం ఎంజీపురం రహదారిలోని చక్రధర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు కుమారుడు అమర్నాథ్(22) తన స్నేహితులు ప్రతాప్, కార్తీక్, మహేష్లతో కలిసి పట్టణంలోని పీఎన్ఆర్ స్విమ్మింగ్పూల్కు వెళ్లారు. స్విమ్మింగ్పూల్లో నలుగురు ఈత కొడుతున్న సమయంలో నీటిలో ఉన్న అమర్నాథ్ స్పృహ కోల్పోయాడు. వెంటనే తోటి స్నేహితులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అమర్నాథ్ మృతి చెందాడు. కాగా నలుగురు కూడా మద్యం సేవించి స్విమ్మింగ్కు వచ్చారు. మద్యం మత్తులో ఈత కొట్టడంతోనే అమర్నాథ్ మృతి చెంది ఉండవచ్చని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా మృతునికి కొద్ది నెలల క్రితమే వివాహమైంది. దీంతో మృతుని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హత్యరాలలో మరో యువకుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన హత్యరాలలోని బహుదా నదిలో ఈతకు వెళ్లి తిరుపతికి చెందిన రాము (22) అనే యువకుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం జనసందోహం తక్కువగా ఉన్న సమయంలో పక్క దోవ నుంచి బహుదా నదిలో ఈతకు వెళ్లిన రాము తీరం అవతలికి వెళ్లి తిరిగి ఇవతలికి వచ్చేటప్పుడు నీటిలో మునిగిపోయాడు. దీంతో రాము మృతదేహం కోసం తహశీల్దార్ చంద్రశేఖర్రెడ్డి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 6గంటల సమయంలో రాము మృతదేహం లభ్యమైంది. రాము తిరుపతిలోని ఓ హోటల్లో పని చేసుకుని జీవించేవాడని అతని స్నేహితులు తహశీల్దార్ చంద్రశేఖర్రెడ్డికి వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహనం ఢీకొని.. ద్విచక్రవాహనం ఢీకొన్న సంఘటనలో మండలంలోని యల్లాగడ్డకు చెందిన తాళ్లపాక వెంకటయ్య (50) మృతి చెందాడు. ఆదివారం హత్యరాలకు వెళ్లి వస్తున్న క్రమంలో తాళ్లపాకలో ద్విచక్రవాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో.. రాజంపేట పట్టణం అహమ్మద్నగర్కు చెందిన సగినాల మౌలా (38) అనే గ్రానైట్ వ్యాపారి ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తీవ్ర గాయాలతో అతని ఇంటి సమీపంలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పట్టణ సీఐ అశోక్కుమార్, ఎస్ఐ రెడ్డప్ప సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కుటుంబ కలహాలు.. దంపతుల ఆత్మహత్య
రాజంపేట(వైఎస్సార్జిల్లా): వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రాజంపేట మండలం మందరం గొల్లపల్లిలో భార్యాభర్తలు వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య(40), వెంకట సుబ్బమ్మ(37) దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి వీరిధ్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో.. మనస్తాపానికి గురై ఇద్దరు కలిసి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
విద్యార్థి మరణం.. కట్టలు తెగిన ఆగ్రహం
- జాతీయ రహదారిపై విద్యార్థుల బైఠాయింపు - రాస్తారోకోలో పాల్గొన్న వివేకా, ఆకేపాటి రాజంపేట: జాతీయ స్థాయిలో రాణించిన జూడో క్రీడాకారుడు యుగంధర్ (21) దుర్మరణంతో తోటి విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏకంగా ఐదు గంటలకు పైగా కడప–రేణిగుంట జాతీయ రహదారిని దిగ్బంధించేశారు. రోడ్డుపై వేలాది మంది విద్యార్థులు బైఠాయించారు. ఫలితంగా జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదం ఇలా.. కడప–రేణిగుంట జాతీయ రహదారిపై బోయనపల్లెలోని ఇసుకపల్లె క్రాస్ రోడ్డు వద్ద శనివారం అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతూ జాతీయ స్థాయిలో జూడో క్రీడాకారుడుగా రాణిస్తున్న బి.యుగంధర్ (21) రోడ్డు దాటుతుండగా కడప నుంచి తిరుపతికి వెళుతున్న నాన్స్టాప్ బస్సు ఢీకొంది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థికి అంబులెన్స్ సిబ్బంది చికిత్స అందిస్తుండగానే మృత్యు ఒడికి చేరుకున్నాడు. సకాలంలో పోలీసులు, అంబులెన్స్ రాలేదని ఆగ్రహంతో విద్యార్థులు అంబులెన్స్, ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. ఆందోళనలో వివేకా, ఆకేపాటి విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి సంఘీభావంగా రాస్తారోకోలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణతోపాటు పోలీసు, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా యల్లారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ విద్యార్థులను శాంతింపచేయడానికి ప్రయత్నించారు. ఆందోళనలో పట్టణ బీసీ కన్వీనర్ పసుపులేటి సుధాకర్, నందలూరు సౌమిత్రి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి పల్లె గ్రీష్మంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయాలని పట్టు సంఘటన స్థలానికి సాయంత్రం రాజంపేట ఆర్డీవో వీరబ్రహ్మం, డీఎస్పీ రాజేంద్ర చేరుకుని విద్యార్థులతో చర్చించారు. విద్యార్ధులను ఎన్నివిధాగాలు నచ్చచెప్పిన వినేపరిస్ధితులు దాటిపోయాయి. కలెక్టరు రావాలంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు బై ఠాయించారు. బస్సు డ్రైవరు, అంబులెన్స్ వాహన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆర్ఎం చెంగల్రెడ్డి కూడా రాజంపేటకు చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. డిమాండ్లను అంగీకరించాకే ఆందోళన విరమణ మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, బోయనపల్లెలో పోలీసు చెక్పోస్టు ఏర్పాటు చేయాలని, స్పీడ్ బ్రేకర్లు వేయాలని, ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఆర్డీవోను కోరారు. ఆర్డీవో హామీతో ఎట్టకేలకు ఆందోళన విరమించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కోలారు(కర్ణాటక): స్థానిక జాతీయ రహదారిపై ఉన్న పవన్ కళాశాల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ముందు వెళ్తున్న లారీని స్కార్పియో వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతి చెందిన షేక్ అఫీజా (44)ది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఉస్మాన్నగర్. రాజంపేటకు చెందిన వీరు చెన్నై నుంచి బెంగళూరుకు స్కార్పియో వాహనంలో వెళ్తున్న సమయంలో ముందు వెళుతున్న వాహనం అకస్మాత్తుగా తిరగడంతో ఢీకొంది. ఘటనలో షేక్ అఫీజా మరణించగా, భర్త జిలాని తీవ్రంగా గాయపడి ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పొలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కోలారు(కర్ణాటక): స్థానిక జాతీయ రహదారిపై ఉన్న పవన్ కళాశాల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ముందు వెళ్తున్న లారీని స్కార్పియో వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతి చెందిన షేక్ అఫీజా (44)ది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఉస్మాన్నగర్. రాజంపేటకు చెందిన వీరు చెన్నై నుంచి బెంగళూరుకు స్కార్పియో వాహనంలో వెళ్తున్న సమయంలో ముందు వెళుతున్న వాహనం అకస్మాత్తుగా తిరగడంతో ఢీకొంది. ఘటనలో షేక్ అఫీజా మరణించగా, భర్త జిలాని తీవ్రంగా గాయపడి ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పొలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.