-
వానలే వానలు.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీలో ఐదు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని.. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.ఏపీలో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం చురుకుగా మారాయి. మరోవైపు రాష్ట్రంపైకి దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న ఐదు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించిందిగురు, శుక్రవారాల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అదేసమయంలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతోపాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వివరించింది. -
మూడు రోజులు వానలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం చురుకుగా మారాయి. మరోవైపు రాష్ట్రంపైకి దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో నైరుతి, పశి్చమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. బుధ, గురు, శుక్రవారాల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అదేసమయంలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతోపాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వివరించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, మంగళవారం అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లిలో 7.3 సెం.మీ.ల భారీ వర్షం కురిసింది. అడ్డతీగల (అల్లూరి సీతారామరాజు) 5.2, సాలూరు (పార్వతీపురం మన్యం) 4.7, పెందుర్తి (విశాఖపట్న) 4.5, హరిపురం (శ్రీకాకుళం) 4.5, డి.పోలవరం (కాకినాడ) 4.1, దత్తిరాజేరు (విజయనగరం) 3.8 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
నేటి నుంచి అక్కడక్కడా వానలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి, మహారాష్ట్రలోని మిగిలిన భాగాలు, మధ్యప్రదేశ్–ఛత్తీస్గడ్లోని మరికొన్ని భాగాలు, ఒడిశాలోని మిగిలిన భాగాలు.. జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన భాగాల్లోకి ప్రవేశించనున్నాయి. దేశమంతటా రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది.ఈ కారణంగా.. రాష్ట్ర వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. క్రమంగా కోస్తా, రాయలసీమల్లో వానలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి ప్రభావంతో.. నేటి నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. -
26 నుంచి జోరుగా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని చోట్ల తేలికపాటి, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు ఇవి కొనసాగనున్నాయి. ఈనెల 26 నుంచి వానలు మరింత జోరందుకోనున్నాయి. అప్పటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుదనం సంతరించుకోనున్నాయి. ఫలితంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు వానలు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశంలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. -
హీట్వేవ్ ముగిసింది.. ఇక వానలే వానలు
న్యూఢిల్లీ: ఉత్తరభారతానికి భారత వాతావరణశాఖ(ఐఎండీ) గుడ్న్యూస్ చెప్పింది. జూన్ 23-25 తేదీల మధ్య అధిక ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని తెలిపింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం 40కిపైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. పశ్చిమతీరంలో భారీ వర్షాలు పడే అవకాశముందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగైదు రోజుల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర,గోవాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. వెస్ట్బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్లలో భారీ వర్షాలతో పాటు బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీయనున్నాయని వెల్లడించింది. -
గతేడాదిని మించి వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: గతేడాదిని మించి ఈ ఏడాది వడగాడ్పులు హడలెత్తించాయి. గతేడాది వేసవిలో 17 రోజులు వడగాడ్పులు/తీవ్ర వడగాడ్పులు వీచినట్టు నమోదైంది. అయితే ఈసారి వడగాడ్పుల సంఖ్య 18కి పెరిగింది. అంతేకాకుండా గతేడాది ఉష్ణోగ్రతలు గరిష్టంగా 47 డిగ్రీల వరకు నమోదు కాగా ఈ ఏడాది 48 డిగ్రీల వరకు చేరుకున్నాయి. గతేడాది వేసవి దడ పుట్టించిందనుకుంటే ఈసారి అంతకు మించి హడలెత్తించింది. సాధారణం కంటే దాదాపు మూడు రెట్ల వడగాడ్పులతో జనాన్ని బెంబేలెత్తించింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ ఆరంభం నుంచే వడగాడ్పులు మొదలయ్యాయి. ఆ నెలలోనే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుకున్నాయి. మే నెల రెండో వారం, మూడో వారంలో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తూ ఉష్ణతాపాన్ని కాస్త తగ్గించాయి. ఫలితంగా వడగాడ్పుల తీవ్రత ఒకింత తగ్గినట్టు కనిపించింది. సాధారణంగా ఏప్రిల్, జూన్కంటే మే నెలలోనే వేసవి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా మే నెలలో వర్షాలు కురవడం వల్ల ఏప్రిల్కంటే తక్కువ వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి. ఏప్రిల్లో రికార్డయిన ఉష్ణోగ్రతలను చూసి మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. కానీ మే నెల మధ్య మధ్యలో ఆవర్తనాలు, ద్రోణులు, తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకే పరిమితమయ్యాయి. ఇలా ఈ వేసవి మూడు నెలలూ 18 రోజుల పాటు వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి. ఇందులో ఏప్రిల్లో ఎనిమిది రోజులు (5, 6, 7, 8, 24, 28, 29, 30 తేదీలు), మే నెలలో ఏడు రోజులు (1, 2, 3, 4, 5, 28, 31 తేదీలు), జూన్లో మూడు రోజులు (1, 17, 18 తేదీలు) వడగాడ్పులు ప్రభావం చూపాయి. స్తబ్దుగా నైరుతి రుతుపవనాలునైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మూడు రోజులు ముందుగా అటు కేరళలోకి, ఇటు రాష్ట్రంలోకి ప్రవేశించినా అవి ఉత్తర కోస్తాలోకి విస్తరించాక దాదాపు పది రోజుల పాటు స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో జూన్ మూడో వారం వర్షాలు కురవాల్సిన సమయంలో రెండు రోజుల (17, 18 తేదీల్లో) పాటు వడగాడ్పులు మళ్లీ చెలరేగాయి. ఈ దఫా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని అన్ని ప్రాంతాల్లోనూ వడగాడ్పులు దడ పుట్టించాయి. ప్రధానంగా నంద్యాల, కర్నూలు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పల్నాడు, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఎక్కువగా వడగాడ్పులను ఎదుర్కొన్నాయి. -
కోస్తాంధ్రపై కొనసాగుతున్న ఆవర్తనం
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర, తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు, శుక్ర, శనివారాల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం,అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడతాయని పేర్కొంది. -
జూన్లో లోటు వర్షపాతమే!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల గమనం మందగించింది. జూన్ నెల మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి ఆ తర్వాత అత్యంత చురుకుగా కదిలి ఈనెల 14వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. కానీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం రుతుపవనాల కదలికలు మందగమనంలోనే ఉన్నాయి. దీంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్ నెలకు సంబంధించిన అంచనాలను ఐఎండీ తాజాగా విడుదల చేసింది. ఈ నెలలో రాష్ట్రంలోని చాలాచోట్ల లోటు వర్షపాతం నమోదయ్యే పరిస్థితులే కనిపిస్తున్నట్లు తెలిపింది. నెలాఖరులో వర్షాలు కురుస్తాయని, సాధారణ వర్షపాతానికి దగ్గరగా గణాంకాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ మొత్తం మీదా చాలాచోట్ల లోటు ఉంటుందని ప్రకటించింది. 8 జిల్లాల్లో సాధారణం..11 జిల్లాల్లో లోటు జూన్ నెలలో ఇప్పటివరకు 7.85 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. బుధవారం ఉదయానికి 8.53 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 9 శాతం అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈనెల చివరి వారంలో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, తూర్పు ప్రాంత జిల్లాల్లోనే ఇందుకు ఎక్కువగా అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 7 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక 11 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. మంచిర్యాలలో లోటు ఎక్కువగా నమోదైంది. రానున్న రెండ్రోజుల్లో వర్షసూచన ప్రస్తుతం కోస్తాంధ్రను ఆనుకుని తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఇది సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉందని, దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.జూన్లో ఇప్పటివరకు జిల్లాల వారీగా వర్షపాతం.. » తీవ్ర లోటు (–60% నుంచి –99%): మంచిర్యాల » లోటు(–20% నుంచి –59%): ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి » సాధారణం(+19% నుంచి –19%): వరంగల్, హనుమకొండ, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, జనగామ, రంగారెడ్డి, ఖమ్మం » అధికం(+20% నుంచి +59%): మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, సూర్యాపేట, నారాయణపేట » అత్యధికం(+60% పైబడి): హైదరాబాద్, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, నల్లగొండ జూన్లో సాధారణ వర్షపాతం : 12.94 సెంటీమీటర్లు బుధవారం నాటికి కురవాల్సిన వర్షం : 7.85 సెంటీమీటర్లు నమోదైన వర్షపాతం : 8.53 సెంటీమీటర్లు సాధారణం కంటే 9 శాతం అధికంగా నమోదు -
కదలని ‘నైరుతి’
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది రుతుపవనాలు నిర్ణీత సమయానికి ముందే రాష్ట్రంలోకి విస్తరించాయి. వసూ్తనే మంచి వర్షాలను కురిపించాయి. వారం రోజులు చురుగ్గానే ఉన్నాయి. తర్వాత ఉత్తర కోస్తా వైపు కదిలి కొద్ది రోజల క్రితం విజయనగరం వరకు చేరగానే, ముందుకు విస్తరించకుండా అక్కడే తిష్టవేశాయి. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. పైగా, వర్షాకాలంలో వేసవిని తలపించే ఎండలు కాస్తున్నాయి. సాధారణంకంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూ వడగాడ్పులూ వీస్తున్నాయి. ప్రధానంగా తీర ప్రాంత జిల్లాల్లో వీటి ప్రభావం ఎక్కువ కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు విజయనగరం నుంచి మిగిలిన ప్రాంతాలకు విస్తరించకపోవడానికి కొన్నాళ్లుగా కొనసాగుతున్న అధిక పీడన ద్రోణి (రిట్జ్) కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అల్పపీడన ద్రోణి ఏర్పడితే వర్షాలు కురుస్తాయి. కానీ, అధిక పీడన ద్రోణి ఉంటే అందుకు విరుద్ధంగా వర్షాభావ పరిస్థితులేర్పడతాయని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం పూర్వ అధిపతి ఓఎస్ఆర్యూ భానుకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో రుతు పవనాల్లో కదలిక వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పటివరకు ఉత్తర కోస్తాంధ్రలో ఉష్ణ తీవ్రత ఉంటుందని ఆయన తెలిపారు.కొనసాగుతున్న ఆవర్తనాలు..ప్రస్తుతం కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒకటి, రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో మరొకటి ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బుధవారం అల్లూరి సీతారామరాజు, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే గురు, శుక్రవారాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. మరోవైపు గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. -
అటు వర్షాలు..ఇటు వడగాడ్పులు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పక్క మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరోపక్క వడగాడ్పులూ వీస్తున్నాయి. జూన్ మొదటి వారం వరకు దడ పుట్టించిన వడగాడ్పులు ఆ తర్వాత నైరుతి రుతుపవనాల ఆగమనంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు గణనీయంగా తగ్గాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ ఊపందుకొని, వడగాడ్పులు వీస్తున్నాయి. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు ఆరంభంలో ఆశాజనకంగానే ప్రభావం చూపాయి.గత వారంలో ఉత్తరాంధ్రకు విస్తరించాయి. అప్పట్నుంచి ముందుకు కదలకుండా స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో వర్షాలు అరకొరగానే కురుస్తున్నాయి. ఎక్కడైనా కొన్ని చోట్ల మినహా అనేక చోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ప్రస్తుతం కోస్తాంధ్రపైకి పశ్చిమ గాలులు వీస్తుండడం, కోస్తా వైపు రుతుపవనాలు విస్తరించకపోవడం వంటి కారణాల వల్ల మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి వడగాడ్పులకు దోహద పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల సాధారణంకంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న ఒకట్రెండు రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని, ఫలితంగా పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో వడగాడ్పులకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం ఒక నివేదికలో వెల్లడించింది. విశాఖపట్నం జిల్లాలోనూ వడగాడ్పుల అనుభూతి కలుగుతుందని పేర్కొంది.నేడు, రేపు తేలికపాటి వర్షాలు..వచ్చే 4 రోజుల్లో నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, బెంగాల్, బీహార్, కోస్తాంధ్ర అంతటా విస్తరించేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క గోవా నుండి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు, 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటన్నంటి ప్రభావంతో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకా>శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.అదే సమయంలో పలు ప్రాంతాల్లో వడ గాలులు కూడా వీస్తాయని తెలిపింది. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోను, బుధవారం అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.మరోవైపు గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు చిత్తమూరు (తిరుపతి)లో 4.2 సెంటీమీటర్లు, నెమలికళ్లు (పల్నాడు)లో 3.9, మంగళగిరి (గుంటూరు)లో 3.5, ఎస్.కోట (విజయనగరం)లో 3.5, నగరి (చిత్తూరు)లో 2.1 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
రుతుపవనాలపై ‘ఐఎండీ’ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే సగటున 20 శాతం వర్షాలు తక్కువగా పడ్డాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. మధ్య భారతంలో 29 శాతం వర్షపాతం తక్కువగా నమోదవగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వాయువ్య రాష్ట్రాల్లో ఏకంగా సాధారణం కంటే 68 శాతం తక్కువ వర్షపాతం రికార్డవగా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 20 శాతం తక్కువ వర్షం పడింది. సాధారణంగా జూన్ 1 నుంచి జులై 8వ తేదీ దాకా రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో పడే వర్షాలను సమ్మర్ వర్షాలుగా పిలుస్తారు. ఇవి రైతులు విత్తనాలు విత్తుకునేందుకు కీలకమైన వర్షాలు. ‘రుతుపవనాల విస్తరణకు కాస్త బ్రేక్ పడింది. అవి కాస్త బలహీనమయ్యాయి. అయితే అవి ఎప్పుడు బలపడతాయో అప్పుడు కొద్ది సమయంలోనే కుండపోత వర్షాలు కురుస్తాయి’అని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు. -
ఏపీలో విస్తారంగా వానలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు మరింత విస్తారంగా కురవనున్నాయి. ప్రస్తుతం రాయలసీ మ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఉత్తర కోస్తాంధ్ర వ్యాప్తంగా మరింతగా విస్తరించనున్నాయి. వీటి ఫలితంగా ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లా గాజువాకలో 10.5 సెంటీమీటర్లు, పి.లింగవలస (విజయనగరం)లో 7.8, శంఖవరం (కాకినాడ)లో 5.1, చోడవరం (అనకాపల్లి)లో 3.7, గూడవల్లి (బాపట్ల)లో 2.4, రామచంద్రాపురం (కోనసీమ)లో 2.3, పట్టిసీమ (ఏలూరు)లో 2.1, పైడి భీమవరం (శ్రీకాకుళం)లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ బులెటిన్లో పేర్కొంది. -
కొనసాగుతున్న ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ద్రోణి ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలు, ఆదివారం పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఊపందుకోనున్న రుతుపవనాలు..కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు స్తబ్దుగా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు చురుకుదనం సంతరించు కోనున్నాయి. ఫలితంగా ఈనెల 17, 18 తేదీల్లో కోస్తాంధ్రలోను, 18న రాయలసీమలోను భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. శుక్రవారం రాత్రి వరకు డోలపేట (విజయనగరం జిల్లా)లో 7.8 సెంటీమీటర్లు, కోట ఉరట్ల (అనకాపల్లి)లో 5.7, అనపర్తి (తూర్పు గోదావరి)లో 4.3, ఎచ్చెర్ల (శ్రీకాకుళం)లో 3.2, సాలూరు (పార్వతీపురం మన్యం)లో 2.9, పర్లపాడు (వైఎస్సార్)లో 2.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
15 నుంచి విస్తారంగా వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొద్ది రోజుల నుంచి నైరుతి రుతుపవనాలు స్తబ్దుగా ఉన్నాయి. ప్రస్తుతం షీర్ జోన్, గాలుల కోత కారణంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ నెల 15 నుంచి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి. అదే సమయంలో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు, ఒడిశా, వాయవ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఫలితంగా ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. కాగా గురు, శుక్రవారాల్లో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతోపాటు అక్కడక్కడ పిడుగులు పడతాయని వివరించింది. బుధవారం రాయలసీమలో కొన్నిచోట్ల భారీగా, పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. సిద్ధాపురం (కర్నూలు) 5.1, వ్యాసపురం (అనంతపురం) 5.0, కూచినపూడి (బాపట్ల) 3.8, మారాల (శ్రీసత్యసాయి) 2.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈ నెల 3న రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు క్రమంగా వ్యాప్తి చెందుతూ వారం రోజుల వ్యవధిలో రాష్ట్రమంతటా వేగంగా విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రుతుపవనాల వ్యాప్తి సమయంలోనే రాష్ట్రంలో తొలకరి వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో గత పదిరోజుల్లో సంతృప్తికర స్థాయిలో వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో ఈనెల 12 నాటికి 3.81 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..6.01 సెం.మీ. నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 55% అధికంగా నమోదైంది. ప్రస్తుతం మోస్తరు వర్షాలే కురవగా..ఈనెల మూడో వారం నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావర ణ శాఖ నిపుణులు అంచనా వేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సంతృప్తికరంగా, 4 జిల్లాల్లో మధ్యస్థంగా, 9 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా... ఆదిలాబాద్, మంచిర్యా ల. నిర్మల్, పెదపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రెండ్రోజులు పలుచోట్ల మోస్తరు వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావ రణ శాఖ వెల్లడించింది. ఆసిఫాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఈక్రమంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా ఖమ్మంలో 37.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో అత్యధికంగా 20.0 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. బుధవారం జనగామ జిల్లా జఫర్గడ్లో అత్యధికంగా 4.06 సెం.మీ., సూర్యాపేట జిల్లా మునగాల, పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
నార్త్లో ఎండలు.. సౌత్లో వర్షాలు
సాక్షి,ఢిల్లీ: దేశంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరాదిన భానుడు భగభగలాడుతుండగా దక్షిణాదిన వర్షాలు పడుతూ వాతావరణం చల్లగా మారింది. ఉత్తరాదిలో ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో హీట్వేవ్ జూన్ 14వరకు కొనసాగుతుందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది.గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటవచ్చని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎండల ధాటికి ఢిల్లీలో జనం బయటికి రావాలంటేనే జడుస్తున్నారు. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఇక్కడ పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
‘నైరుతి’ మందగమనం!
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో ప్రభావం చూపుతున్న నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఒకింత మందగమనంలో ఉన్నాయి. దీంతో ఉత్తరాంధ్ర మినహా రాష్ట్రంలో ఆ రెండు ప్రాంతాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక ఒక్కోసారి ఉపరితలంలో అధిక పీడన ద్రోణి (రిడ్జ్) ఏర్పడుతుంటుంది. ఇది అల్పపీడన ద్రోణికి విరుద్ధం. అంటే అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పుడు ఉపరితలంలో గాలులు గడియారపు ముల్లు తిరిగే దిశ (క్లాక్ వైజ్ డైరెక్షన్)లో తిరుగుతూ మేఘాలు, వర్షాలకు కారణమవుతాయి. అదే అధిక పీడన ద్రోణి ఏర్పడితే గాలులు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. ఫలితంగా అరకొర మేఘాలు ఏర్పడడమే కాకుండా సూర్యరశ్మి నేరుగా కిందకు ప్రసరిస్తుంది. దీంతో ఉష్ణతీవ్రత పెరగడంతో పాటు వర్షాలకు అడ్డంకులేర్పడతాయి. ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఉత్తరాంధ్రపై అధిక పీడన ద్రోణి కొనసాగుతోందని ఆంధ్రా విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ ఓఎస్ఆర్యూ భానుకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. దీనివల్ల విజయనగరం వరకు విస్తరించిన రుతుపవనాలు చురుకుదనం సంతరించుకోకుండా స్తబ్దుగా ఉన్నాయన్నారు. దీని ఫలితంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా.. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులే పడుతున్నాయని తెలిపారు. పైగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయన్నారు. మరో రెండు మూడు రోజుల్లో అధిక పీడన ద్రోణి బలహీనపడుతుందని చెప్పారు. ఆ తర్వాత రుతుపవనాలు పుంజుకుంటాయని.. దీంతో మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయని వివరించారు. మూడు రోజులపాటు వర్షాలు..మరోవైపు రానున్న మూడు రోజులు రాయలసీమ, కోస్తాంధ్రల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే బుధవారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే అల్లూరి, పల్నాడు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. -
ఆదిలాబాద్ మినహా అంతటా అత్యల్పమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తుండటం.. పలుచోట్ల వానలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా దాదాపు అన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్లో 39.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్లో 22.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదు కాగా, హనుమకొండ, హైదరాబాద్, మహబూబ్నగర్ ప్రాంతాల్లో 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయింది. మిగతా ప్రాంతాల్లో కూడా 3 డిగ్రీలు తక్కువగా నమోదు అయింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించాయి. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వివరించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
ముంబైలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
మహారాష్ట్రలోని ముంబై, పూణేలలో శనివారం అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ముంబైలోని దహిసర్ ప్రాంతంలో రోడ్లపై నీరు నిలిచిపోయింది. రానున్న కొద్ది గంటల పాటు ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. రత్నగిరికి ఆరెంజ్ అలర్ట్, ముంబై సహా ఇతర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ను ప్రకటించింది. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది. అదే సమయంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్,దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, కోస్తా ఆంధ్ర ప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని వాతావరణశాఖ ట్విట్టర్లో ఒక పోస్ట్లో పేర్కొంది. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండ వేడిమి కొనసాగుతోంది. ఇంతలోనే పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ ఏడాది రుతుపవనాలు రెండు రోజులు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది కేరళలో రుతుపవనాలకు ముందు విస్తృతంగా వర్షాలు కురిశాయి. -
రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పతనమయ్యాయయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడం గమనార్హ. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల విస్తరణ ఊపందుకోవడం.. దీనికితోడు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రానున్న మూడురోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు నిజామాబాద్ పరిసర ప్రాంతం వరకు విస్తరించినట్లు నిపుణులు చెబుతున్నారు.రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని చాలాప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్లో 41.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్లో 22.0 డిగ్రీ ల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
‘సీజన్’ ముంచుకొస్తోంది
సాక్షి, హైదరాబాద్: వానాకాలం అంటేనే సీజనల్ వ్యాధుల ముప్పు ఉంటుంది. అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకుంటే జనంపై వ్యాధులు పంజా విసురుతాయి. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో వ్యాధులు ప్రబలిపోతాయి. డెంగీ, మలేరియా, చికున్గున్యా సహా ఇతరత్రా వ్యాధులు సోకుతాయి. అయితే ఇప్పటివరకు ఆ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించలేదు. ప్రధానంగా దోమలతో వచ్చే వ్యాధులతో జనం సతమతమవుతారు. నీటి వల్ల వచ్చే రోగాలతో ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడతుంది. కానీ వ్యాధుల నివారణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం సన్నద్ధం కాలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. జ్వరాలు సర్వసాధారణం... సీజన్ మారిందంటే జ్వరాలు సర్వసాధారణం అవుతాయి. ఒక్కోసారి పరిస్థితి అదుపు తప్పుతుంది. మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలితే పరిస్థితి మన నియంత్రణలో ఉండదు. దీనికి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికే కాదు. అందుకు అవసరమైన అమలు కూడా ఉండాలి. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలి. అన్నిచోట్లా మందులు అందుబాటులో ఉంచాలి. జ్వరం క్లినిక్లను తీసుకురావాలి. సాయంత్రం కూడా క్లినిక్లు తెరవాలి.మలేరియా, డెంగీ నియంత్రణకు టెస్టింగ్ కిట్లు ఆస్పత్రులకు పంపాలి. డెంగీ వంటి జ్వరాల్లో ప్లేట్లెట్లు పడిపోతే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్లేట్లెట్లు అందుబాటులో లేకుంటే పేదలు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్లేట్లెట్లు ఎక్కించేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడతాయి. రూ.50 వేల నుంచి రూ. లక్షకు పైగా వసూలు చేస్తాయి. ఇలాంటి పరిస్థితులను నియంత్రించాలంటే అన్ని రకాల చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖ మంత్రి సమీక్షలకే పరిమితం కాగా, వైద్య విద్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఆస్పత్రుల పనితీరుపై ఎలాంటి సమీక్షలూ జరపలేదు. అధికారులూ అంతే... అధికారుల తీరుపై విమర్శలు ఉన్నాయి. ఆస్పత్రుల తనిఖీలు లేవు. వైద్యవిధాన పరిషత్ కమిషనర్, ప్రజారోగ్య సంచాలకులు సహా రాష్ట్రస్థాయిలో ఉన్న అధికారులు బయట కాలుపెట్టడంలేదన్న విమర్శలున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో అనేక ఆస్పత్రుల్లో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న డాక్టర్లు, నర్సులు చాలా మంది వెళ్లడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్లో ఉంటూ కొందరు కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. బయోమెట్రిక్ ఉన్నా వాటి కన్నుగప్పి తప్పించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వాతావరణ మార్పులతో వ్యాధుల ముప్పుజాగ్రత్తలు సూచించిన ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్ నాయక్సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో ఉ ష్ణోగ్రతల తగ్గుదల, గాలిలో తేమ వంటి వాతావరణ మా ర్పుల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని, అలాగే దోమలు, ఆహారం, నీటి ద్వారా వ్యాధుల వ్యాప్తి పొంచి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ హెల్త్, ఫ్యా మిలీ వెల్పేర్ విభాగం డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్ నాయక్ అ న్నారు. దోమల బెడద కారణంగా మలేరియా, డెంగీ, చికు న్గున్యా వంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు.వర్షాకాలం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కిటికీలకు దోమ తెరలు/ స్క్రీన్లు పెట్టుకోవాలని, దోమల సంతానోత్పత్తి సమయాలైన ఉదయం, సాయంత్రం తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని సూచించారు. దోమలు కుట్టకుండా క్రీములు, లోషన్లు వంటివి రాసుకోవాలని తెలిపారు. మురుగు కాల్వల్లో నీళ్లు నిలిచిపోకుండా చూడాలని, సెప్టిక్ ట్యాంకులను మెష్లతో కవర్ చేయాలని పేర్కొన్నారు. ప్రతీ శుక్రవారం ఇంటి చుట్టూ నీళ్లు నిలిచిపోకుండా డ్రైడే నిర్వహించాలని, కాచి వాడబోసిన నీళ్లు, బయట ఉన్నపుడు బాటిల్డ్ వాటర్ తీసుకోవాలని తెలిపారు. -
తుంగభద్ర ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లు అందేనా?
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ(ఐఎండీ) అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది తుంగభద్ర డ్యామ్లో 170 టీఎంసీల లభ్యత ఉంటుందని తుంగభద్ర బోర్డు, ఏపీ, కర్ణాటక, తెలంగాణ జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే ఈనెల 1 నుంచి తుంగభద్ర బేసిన్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఇప్పటికి 0.67 టీఎంసీలు తుంగభద్ర డ్యామ్లోకి చేరాయి. ఇక శనివారం డ్యామ్లోకి 1,490 క్యూసెక్కులు చేరాయి. గతేడాది ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు సక్రమంగా కురవలేదు. దాంతో తుంగభద్ర డ్యామ్లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహం వచ్చింది. తాగునీటి అవసరాలకుపోను మిగతా నీటితో ఆరుతడి పంటలను ఆయకట్టు రైతులు సాగుచేశారు. ఈ ఏడాదైనా తుంగభద్ర డ్యామ్లో నీటి లభ్యత పుష్కలంగా పెరుగుతుందని.. ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందాలని రైతులు ఆశిస్తున్నారు. కేటాయింపుల మేరకైనా లభ్యత ఉండేనా.. తుంగభద్ర డ్యామ్లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. తగ్గిన నిల్వ సామర్థ్యం.. నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. గతేడాది తుంగభద్ర డ్యామ్లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చింది. అంటే.. బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దాంట్లో కేవలం 49.81 శాతం మేర మాత్రమే తుంగభద్ర డ్యామ్లో నీటి లభ్యత ఉన్నట్లు స్పష్టమవుతోంది.తుంగభద్ర డ్యామ్లోకి 2016–17లో కేవలం 85.719 టీఎంసీలే చేరాయి. డ్యామ్ చరిత్రలో అదే కనిష్ట వరద ప్రవాహం కావడం గమనార్హం. ఈ ఏడాదైనా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకైనా నీటి లభ్యత ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. నాలుగేళ్లూ పుష్కలంగా నీటి లభ్యత.. తుంగభద్ర డ్యామ్లోకి 2015 నుంచి 2018 వరకు అరకొరగానే ప్రవాహం వచ్చింది. ఇక 2019–20 నుంచి 2022–23 వరకు నాలుగేళ్లు టీబీ డ్యామ్లో బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దానికంటే అధికంగా లభ్యత నమోదైంది. బేసిన్లో భారీ వర్షాలు కురవడంతో డ్యామ్లోకి వరద ప్రవాహం కొనసాగింది. నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో రాయలసీమ, కర్ణాటక, తెలంగాణలోని ఆయకట్టు రైతులు భారీ ఎత్తున పంటలు సాగుచేయడంతో సస్యశ్యామలమైంది. దిగుబడులు భారీగా రావడం.. గిట్టుబాటు ధర దక్కడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. -
మూడు రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరో మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలోని విస్తరిస్తున్నాయి. ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో వచ్చే మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నాయి. ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు కూడా సంభవిస్తాయని ఐఎండీ తెలిపింది. ఆదివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా.. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో అత్యధికంగా 3.6 సెం.మీ., దుత్తలూరు (నెల్లూరు) 3.2, యాడికి (అనంతపురం) 2.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
వాన నీటిలో ‘పరుపు’ ప్రయాణం.. వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్రలోని పుణేలో శుక్రవారం భారీగా వాన కురిసింది. భారీ వానకు ఓ రోడ్డుపై నీరు నిలిచింది. దీంతో ఒక వ్యక్తి పరుపుపై వాన నీటిలో తేలియాడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీటితో నిండిన రోడ్డుపై ఒక వ్యక్తి పరుపుపై తేలుతూ ముందుకు వెళ్లాడు. అయితే అతని పక్కనే కొన్ని వాహనాలు కూడా వెళ్లటం ఆ వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు భిన్నంగా స్పందింస్తున్నారు. పలువురు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.Turning Disaster into an opportunity! आपदा को अवसर में बदलना koi inse sikhe. Visuals from Pune waterlogged street. Matter of days when this will be daily life of Mumbaikars for next 4 months 🎥 #MumbaiRains #PuneRains pic.twitter.com/slhY36U5E3— Mumbai Nowcast (@MumbaiNowcast) June 7, 2024 ‘నీటిలో పరుపు బైక్ రైడ్ బాగుంది’,‘నీటిలో ఆ వ్యక్తి పరుపుతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు’అని కామెంట్లు చేస్తున్నారు. అలా వెళ్లటం చాలా ప్రమాదకరం అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక.. మరికొందరు మాత్రం వాన పడినప్పుడు రోడ్లు ఇలా మారితే పరిస్థితి ఏంటని పశ్నిస్తున్నారు.