-
Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్టు
సాక్షి, హైదరాబాద్(సనత్నగర్): వ్యభిచార గృహంపై ఎస్సార్నగర్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏజీకాలనీ సమీపంలోని విజయ కల్యాణ్ అపార్ట్మెంట్స్లోని ఓ ఫ్లాట్లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సార్నగర్ పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. కేంద్రం నిర్వాహకుడు స్వామితో పాటు అతనికి సహకరిస్తున్న వాసంశెట్టి దుర్గ (35), రాగుల మల్లేష్ (32)లతో పాటు మరో యువతి, విటుడిగా వచ్చిన గోపాల్ అలియాస్ గోపీని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..) -
Hyderabad: వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై సరూర్నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వెస్ట్ బెంగాల్కు చెందిన సాగర్ మొండల్ అలియాస్ రాజు అలియాస్ బిల్లు (31), రోహన్ మండల్ (22) నగరానికి వచ్చి సరూర్నగర్ అనిల్ కుమార్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వెబ్సైట్లో యువతుల ఫొటోలు పెట్టి కస్టమర్లకు సఫ్లై చేస్తున్నారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ తమ దందా నిర్వహిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి ఇక్కడ వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. వీరితో పాటు సహకరిస్తున్న మరో ముగ్గురిని గత డిసెంబర్లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న నాగర్మండల్, రోహన్మండల్పై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..) -
Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ను అద్దెకు తీసుకొని పోలీసుల కళ్లు గప్పి వ్యభిచార గృహం నడిపిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ దాడి చేశారు. ఫిజియోథెరపీ పేరుతో ఈ ఫ్లాట్ అద్దెకు తీసుకున్న సదాలక్ష్మి అనే నిర్వాహకురాలు ఆ ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తుండగా సమాచారం అందడంతో ఆదివారం అర్ధరాత్రి దాడి నిర్వహించారు. ముగ్గురు యువతులను పునరావాస కేంద్రానికి తరలించి సదాలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పరువు తీస్తానని భార్య బెదిరింపు.. భర్త ఆత్మహత్య) -
గురక శబ్ధంతో వీడిన వ్యభిచార ముఠా గుట్టు
బెంగళూరు: అప్పట్లో.. రాజులు యుద్ధాల సమయంలో శత్రు రాజ్యాలకు భయపడి రహస్య గదులను ఏర్పాటు చేసుకోవడం గురించి చరిత్రలో చదివి ఉంటాం. సాధారణంగా.. ఐటీ రైడింగ్లకు భయపడి డబ్బును గోడల్లోనో, సీక్రెట్ గదుల్లోనూ, వాటర్ ట్యాంక్ల్లోనో దాచడం చూస్తుంటాం. అలాగే డబ్బు, నగలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రపరిచే సీక్రెట్ రూమ్ చూసి ఉంటాం. కానీ, టాయిలెట్లో రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని.. అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే ముఠా ఓ ముఠా వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఈమధ్యకాలంలో ఇతర రాష్ట్రాల వ్యభిచార ముఠాల వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకర్లు.. పోలీసుల కళ్లు గప్పేలా అతితెలివి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హోటల్పై రైడింగ్కు వెళ్లిన పోలీసులు షాక్కు గురయ్యారు. చిత్రదుర్గలోని ఓ చోట వ్యభిచారం చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకుని స్పెషల్ టీం రైడ్కు వెళ్లింది. అయితే ఆ సమయంలో గదుల్లో వెతికినా ఏం కనిపించలేదు. దీంతో పోలీసులు ఘటనా స్థలంలోని బాత్రూమ్ను పరిశీలించగా.. ఒకచోట నుంచి గురక శబ్దం వినిపించింది. శబ్ధం ఎటువైపు వస్తుందోనని పరిశీలించిన ఓ అధికారికి.. టైల్స్ నుంచి రావడం వినిపించింది. అనుమానంతో ఆయన టైల్స్పై చెయ్యి వేయగానే.. అది కాస్త పక్కకు జరిగింది. దీంతో లోపల ఏర్పాటు చేసిన ఒక చిన్న గది బయటపడింది. పోలీసులు గదిని తెరిచి చూడగా.. అందులో ఒక చిన్న సెల్లార్ ఏర్పాటు చేశారు. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ పట్టుబడ్డారు. బయట చూడ్డానికి మామూలు ప్రదేశమే అనిపించినా టాయిలెట్ లోపల ఇలా వ్యభిచార గృహం ఉండడం షాక్ కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. -
Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. పరారీలో ఇషిక
సాక్షి, పంజగుట్ట: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్పై దాడిచేసిన ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. పంజగుట్ట దుర్గానగర్లో ఓ ఇంటోల స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుందనే పక్కా సమాచారం అందుకున్న పంజగుట్ట క్రైమ్ ఇన్స్పెక్టర్ నర్సింహరాజు ముందుగా కానిస్టేబుల్ను విటుడిగా పంపారు. వ్యభిచారం జరుగుతోందని తెలుసుకుని ఆకస్మికంగా దాడి చేశారు. నిర్వాహకురాలు ఇషిక పరారీలో ఉండగా డార్జిలింగ్కు చెందిన ఓ బాధితురాలితో ఈ వ్యాపారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని రెండువేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (క్షుద్ర భయం కల్పించి.. మూడు నెలలుగా లైంగిక దాడి) -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహాన్ని నడుపుతున్న నిర్వాహకుడితో పాటు మరో ఇద్దరిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్లోని లిటిల్ రాక్ అపార్ట్మెంట్లో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. మెదక్ జిల్లా కాజీపల్లికి చెందిన విజయ్కుమార్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతనితో పాటు మెదక్ జిల్లా శంకరంపేట్కు చెందిన అభిలాష్, మచ్చబొల్లారానికి చెందిన మహిళను(20) అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్స్టేషన్కు తరలించి విచారించగా వ్యభిచార గృహం నడుపుతున్నట్లు తెలిపారు. విజయ్కుమార్, అభిలాష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహిళను మెమోరియల్ ట్రస్ట్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్ కథా చిత్రమ్) -
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
హస్తినాపురం: స్పా మసాజ్ సెలూన్ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకునితో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం సి.ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పనామా చౌరస్తా దగ్గర ఉన్న ఓ కాంప్లెక్స్లో గ్లోయునిక్స్ సెలూన్ పేరుతో క్రాస్ మసాజ్, స్పా మసాజ్ చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా వ్యబిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతో దాడిచేసినట్లు సి.ఐ తెలిపారు. రెండు వేర్వేరు గదులలో ఉన్న సాయి కల్యాణ్, ఎడ్ల సుధాకర్లతో పాటు ఇద్దరు యువతులను, నిర్వాహకుడు ఏరుకొండ రవీందర్లను అరెస్ట్ చేసి వారివద్ద నుండి రూ.1500 నగదు, నాలుగు సెల్ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ప్రాణాలు తీసిన ఈత సరదా -
హైదరాబాద్లో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. పోలీసులు సైతం షాక్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీసులు రెండు వారాల క్రితం గుట్టురట్టు చేసిన విదేశీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ గ్యాంగ్ను కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు హైటెక్ పద్దతిలో దందా చేస్తున్నట్లు గుర్తించారు. వ్యభిచార గృహం నిర్వాహకుడితో పాటు ఉగాండా జాతీయురాలు, విటుడిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై పీటా యాక్ట్తో పాటు విదేశీయురాలిపై పాస్పోర్ట్, ఫారెనర్స్ యాక్ట్ కిందా కేసు నమోదు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న మరో ఉగాండా జాతీయుడి కోసం గాలిస్తున్నారు. కీలకంగా వ్యవహరిస్తున్న విదేశీయుడు... విజిట్ వీసాపై వచ్చి పుప్పాలగూడలోని ఫ్రెండ్స్ కాలనీలో నివసిస్తున్న ఓ ఉగాండా జాతీయుడు, స్థానిక వ్యక్తితో కలిసి తమ ఫ్లాట్లోనే వ్యభిచార కేంద్రం ఏర్పాటు చేశాడు. సదరు ఉగాండా జాతీయుడు తమ దేశానికి చెందిన మహిళలు, యువతులను విజిట్ వీసాపై టూరిస్టుల మాదిరిగా రప్పిస్తున్నాడు. ఆపై వీరి ఫొటోలను డేటింగ్ యాప్స్లో పొందుపరుస్తున్నాడు. వీటిని చూసి ఆకర్షితులైన వారు సదరు యాప్ ద్వారా అతడిని సంప్రదిస్తున్నారు. అలాంటి వారికి నిర్వాహకుడు సూచించిన వాట్సాప్ నంబర్ ఇచ్చే యువతి అతడితో చాటింగ్ చేస్తుంది. ఇదే వాట్సాప్ను వాట్సాప్ వెబ్ ద్వారా నిర్వాహకుడు, మధ్యవర్తి గమనిస్తుంటారు. గూగుల్ పే ద్వారా చెల్లింపుల తర్వాత... విటుడితో చాటింగ్, బేరసారాల అనంతరం రేటు ఖరారవుతుంది. ఈ మొత్తాన్ని విటుడు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా చెల్లిస్తూ ఆ స్క్రీన్ షాట్ను వాట్సాప్ ద్వారానే యు వతికి పంపిస్తాడు. దీనిని పర్యవేక్షించి మిగిలిన ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సదరు యువతి తమ ఫ్లాట్ లోకేషన్ను విటుడికి షేర్ చేస్తుంది. దీనిని వేర్వేరు వ్యక్తులకు షేర్ చేసే అవకాశం లేకుండా లాక్డ్ లోకేషన్ షేర్ చేస్తూ, అది కేవలం ఒకరికి మాత్రమే ఓపెన్ అయ్యేలా సెట్ చేస్తున్నారు ఆ నిర్వాహకులు. లోకేషన్ను అన్లాక్ చేయడానికి ఉపకరించే కోడ్ను విడిగా వాట్సాప్లో విటుడికి పంపిస్తున్నారు. కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా... అలా వ్యభిచార గృహం నడిచే ఫ్లాట్కు విటుడు చేరుకుంటున్నాడు. ఫ్రెండ్స్ కాలనీ కేంద్రంగా కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా దందా నడుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు రెండు వారాల క్రితం దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు పరారీలో ఉన్న ఉగాండా జాతీయుడి కోసం గాలిస్తున్నారు. ఫ్లాట్ నుంచి విటుడు తిరిగి వెళ్లేప్పుడు అతడి ఫోన్ తనిఖీ చేసే యువతి అందులోని తమ చాటింగ్తో పాటు నంబర్ను డిలీట్ చేస్తోందని పోలీసులు గుర్తించారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నట్లు ఓ అధికారి వివరించారు. చదవండి: వనపర్తిలో మరో ‘సర్ప్రైజ్’ ఘటన.. ఈసారి భర్త ‘బలి’ -
ఇంట్లో గుట్టుగా వ్యభిచారం.. యువతుల ఫొటోలను పంపి..
సాక్షి, నిజామాబాద్: మోర్తాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందరెడ్డి కాలనీలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆదివారం దాడి చేసి ఇద్దరు విటులను అరెస్టు చేశారు. వాట్సప్ ద్వారా యువతుల ఫొటోలను విటులకు పంపుతూ ఆకర్షిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ముత్యంరాజు తెలిపారు. చదవండి: (పరువు హత్యలు.. నాడు నరేశ్, ప్రణయ్.. నేడు రామకృష్ణ) -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. ఐదుగురి అరెస్ట్.. నలుగురు పరారీ
సాక్షి, మహబూబాబాద్ రూరల్ : వ్యభిచార ముఠా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్ చంద్రపవార్ కేసు వివరాలు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో మహబూబాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొంత మంది ముఠాగా ఏర్పడి వ్యభిచారం నిర్వహిస్తునట్టుగా గుర్తించారు. వెంటనే టాస్క్ ఫోర్సు ఇన్స్పెక్టర్ గండ్రతి మోహన్, మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎడ్లపల్లి సతీష్ వారి సిబ్బందిని తీసుకుని జిల్లా కేంద్రంలోని రెడ్డిబజార్లో గల ఒకగృహం మీద దాడి చేశారు. ఆ గృహంలో సర్వోదయ సంస్థలో పని చేస్తున్న కొందరు వ్యక్తులు, ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యభిచారం నిర్వహిస్తున్న కొందరిని అదుపులో తీసుకున్నారు. పట్టుబడిన వారిలో కురవి మండలంలోని తాట్యా తండా గ్రామ పరిధిలోగల పిల్లిగుండ్ల తండాకు చెందిన బానోత్ రవి, రాజోలు గ్రామ పరిధిలోగల హరిసింగ్ తండాకు చెందిన మాలోత్ మంగిలాల్ అలియాస్ లోకేష్, బంచరాయి తండాకు చెందిన భూక్యా కన్కి, మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరికి చెందిన బాదావత్ సరోజ, సోమ్లా తండాకు చెందిన బదావత్ రాములు (విటుడు) ఉన్నారు. పై వ్యక్తులు మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. చదవండి: (దారుణం: ఒక ఇంట్లో రెండేళ్లపాప నాన్నను ఇంకెపుడు చూడలేదు.. మరో ఇంట్లో) అదే మాదిరిగా మంగళవారం కూడా కొంతమంది మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తుండగా టాస్క్ ఫోర్సు, పోలీసులు పట్టుకున్నారు. వారివద్ద నుంచి పది మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వేణు, పద్మ, స్వాతి, శారద పరారీలో ఉన్నారు. ఈ కేసులో విశ్వసనీయ సమాచారం సేకరించి నేరస్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్సు ఇన్స్పెక్టర్ మోహన్, టౌన్ ఇన్స్పెక్టర్ సతీప్, టాస్క్ ఫోర్సు ఎస్సైలు జగదీశ్, రామారావు, టాస్క్ ఫోర్సు సిబ్బందికి ఎస్పీ శరత్ చంద్రపవార్ రివార్డులు అందజేసి అభినందించారు. -
వ్యభిచార గృహంపై దాడి.. పొరుగు రాష్ట్రాల అమ్మాయిలను పిలిపించి..
హుబ్లీ (కర్ణాటక): హుబ్లీ తాలూకా వరూరు గ్రామంలోని ఎస్జీ టవర్స్, అమృత కంఫర్ట్ హోటల్లో వేశ్యావాటిక నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. యజమాని వెంకటేష్ నాయక్, మేనేజర్ వీరేష్ మురుడేశ్వర, కేఎం.ప్రదీప్గౌడ, మంజునాథ గౌడను అరెస్ట్ చేశారు. అక్కడ చిక్కుకుపోయిన యువతులను రక్షించారు. నిందితులు పొరుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను పిలిపించి ఆన్లైన్ ద్వారా విటులను రప్పించే వారని పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: (స్పాలో అక్రమాలంటూ.. ఓనర్ను బెదిరించి, ఆపై) -
ప్రేమపేరుతో ట్రాప్.. లాడ్జికి తీసుకెళ్లి.. మద్యం తాగించి
మంగళగిరి(గుంటూరు జిల్లా): ప్రేమ పేరుతో మైనర్(16)ను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించబోయారు. బాలిక చాకచక్యంగా తప్పించుకుని డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సత్వరమే స్పందించి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మంగళగిరి డీఎస్పీ రాంబాబు మంగళవారం విలేకరులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టకు చెందిన కంసాని రాజేష్ వివాహం చేసుకుని గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొత్తపేటలో నివాసముంటున్నాడు. కొద్ది రోజులుగా రాజేష్ మంగళగిరిలోని పార్కు రోడ్డులో ఓ బాలికకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. చదవండి: ఇన్స్టాగ్రామ్లో యువతి పరిచయం.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి గత నెల 22న రాత్రి రాజేష్ తన బంధువులు అవినాష్, వినోద్ సహాయంతో బాలికను కారులో యాదగిరిగుట్ట తీసుకువెళ్లి ఓ లాడ్జిలో ఉంచాడు. అక్కడ మద్యం తాగించి బాలికను అవినాష్ లోబర్చుకున్నాడు. రాజేష్ బంధువు సిరి వ్యభిచారం నిర్వహిస్తుండగా బాలికను ఆ కూపంలోకి దించాలని చూశారు. దీన్ని గ్రహించిన బాలిక తప్పించుకుని డయల్ 100కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు బృందాలుగా ఏర్పడి రాజేష్, అవినాష్, వినోద్, సిరిని అరెస్ట్ చేసి బాలికను రక్షించారు. బాలిక కనిపించకుండా పోయిన రోజునే ఆమె తల్లిదండ్రులు మంగళగిరిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందికి అర్బన్ ఎస్పీ రివార్డు ప్రకటించారు. సమావేశంలో సీఐ భూషణం, ఎస్ఐలు నారాయణ, మహేంద్ర పాల్గొన్నారు. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్లో చోటుచేసుకుంది. సీఐ చంద్రశేకర్ తెలిపిన వివరాల ప్రకారం... బాలాజీనగర్లోని శివాజీనగర్లో రహస్యంగా ఓ ఇంటిలో ఆరుగురు సభ్యులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో ఓ ఇంటిపై దాడులు నిర్వహించి 6 గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిర్వాహకులు బాకాపురం ప్రసాద్ (32), బాకాపురం జ్యోతి (35), వానరుల సాయికిషోర్ (25), ఎస్.దవర్లాల్ (30), వానరుల భవాణి (40) కుప్ప బాగ్యలక్ష్మి (30)లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: (ప్రియుడితో ప్రేమ వివాహం.. మూడు నెలల ముచ్చట తీరకుండానే..!) -
ఇంటిపని అని చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపారు
సాక్షి, చెన్నై (తమిళనాడు): ఇళ్లల్లో పని పేరిట త్రిపుర రాష్ట్రానికి చెందిన నలుగురు బాలికలను తీసుకొచ్చి.. ఓ ముఠా వ్యభిచార కుంపంలో దించి చిత్ర హింసలకు గురి చేసింది. ఈ ఘటన చెన్నైలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. త్రిపుర రాష్ట్రం శివజాల ప్రాంతానికి చెందిన సలీమా ఖదున్(38) అక్కడి బాలికలు, యువతులకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి బెంగళూరు, చెన్నైకు పంపిస్తోంది. ఈ క్రమంలో త్రిపురకు చెందిన నాలుగురు బాలికల్ని తొలుత ఓ బ్యూటీ పార్లర్లో ఉద్యోగం నిమిత్తం పంపించింది. కొన్నాళ్లు అక్కడున్న ఆ బాలికల్ని చెన్నైకు తరలించారు. ఈనెల 17వ తేదీ చెన్నై శివారులోని కేలంబాక్కం పడూర్లోని ఓ నివాసంలో ఈ బాలికల్ని ఉంచారు. అక్కడ అలావుద్దీన్, మైదీన్, అన్వర్, హుస్సేన్ అనే నలుగురు వ్యక్తులు బాలికలను చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టారు. ఈసీఆర్ మార్గంలోని కొన్ని రిసార్టులకు పంపించి బలవంతంగా వ్యభిచార కుంపంలోదించారు. ఈనెల 26న వారి నుంచి తప్పించుకున్న ఓ 16 ఏళ్ల బాలిక గస్తీ పోలీసుల్ని ఆశ్రయించింది. ప్యారిస్ పోలీసులు ఆ నలుగురి బాలికల్ని రక్షించారు. అయితే, ఆ మహిళతో పాటుగా ముఠా సభ్యులు మాత్రం తప్పించుకున్నారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా బాధిత బాలికలను త్రిపురకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థిని ఆత్మహత్య పళ్లిపట్టు: ప్లస్టూ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆర్కేపేట పోలీసులు కథనం మేరకు బాలాపురం గ్రామానికి చెందిన స్నేహ(17) స్థానికంగా ఉంటున్న ప్రభుత్వ మహాన్నత పాఠశాలలో ప్లస్టూ చదువుతోంది. ఈ బాలిక తల్లిదండ్రులు ఐదేళ్ల కిందట మృతి చెందడంతో అత్తమ్మ మునియమ్మ వద్ద ఉంటోంది. స్నేహ పేరిట దాదాపు రూ.2 కోట్ల విలువైన ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్నేహకు వివాహం చేసేందుకు అత్త మునియమ్మ నిర్ణయించినట్లు సమాచారం. కాగా వివాహంపై ఆసక్తి లేని స్నేహ ఇంట్లో ఒంటిరిగా ఉంటున్న సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. లగ్జరీ గెస్ట్ హౌస్లో యజమానికి తెలియకుండా..
సాక్షి,గచ్చిబౌలి(హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గెస్ట్హౌస్పై దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్నగర్లోని శ్రీ వినాయక లగ్జరీ గెస్ట్ హౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బుధవారం సాయంత్రం 6.30 గంటలకు దాడి చేశారు. (చదవండి: Khammam: బాలికతో వృద్ధుడి అసభ్య ప్రవర్తన.. కౌగిలించుకుని ) యజమానికి తెలియకుండా అందులో పని చేసే ప్రకాశ్కుమార్ సాహు(25) నిర్వాహకులకు అద్దెకు ఇస్తూ యువతీ, యువకులను లోపలికి అనుమతిస్తున్నాడు. సాహుతో పాటు దిల్సుఖ్నగర్కు చెందిన విటుడు కుమార్(30)ను అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్కు చెందిన ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. నిందితుల నుంచి రెండు సెల్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు విజయ్, రాహుల్ పరారాలో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ముగ్గురు అరెస్టు
Warangal: హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడి నిర్వహించి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఒక విటుడిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. కొత్తురుజెండాలో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం జరుగుతుందని ఆయన తెలిపారు. నిర్వాహకులు కొత్తురుజెండాకు చెందిన ప్రీతి ఉపాధ్యాయ, ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన బండి సురేష్, విటుడు వరంగల్ కొత్తవాడకు చెందిన మామిడి విద్యాసాగర్ను అరెస్ట్ చేసి హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను -
సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. యువతితో కలిసి నీలిచిత్రాలు చిత్రీకరిస్తూ, ఆపై
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకలో సెక్స్ రాకెట్ గుట్టురట్టయినట్లు తెలిసింది. బుధవారం అర్ధరాత్రి పొత్కపల్లి పోలీసులు గ్రామానికి చెందిన రాకేశ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా అసలు విషయం బయట పడినట్లు సమాచారం. గత కొంతకాలంగా మడకకే చెందిన ఓ యువతితో రాకేశ్, మరికొందరు నీలిచిత్రాలు చిత్రీకరిస్తూ, నీలి క్యాసెట్ల దందాను నడుపుతున్నట్లు తెలిసింది. పోలీసులు పక్కా సమాచారంతో ఆ యువకుడిని పట్టుకోగా వీణవంక మండలంలోని చల్లూరు సెల్ పాయింట్లో నీలి క్యాసెట్లు లభ్యమైనట్లు విశ్వసనీయ సమాచారం. నీలి చిత్రాల ముఠా గత కొంతకాలంగా యువతులను, మహిళలను లొంగదీసుకొని వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం వెనక చాలామంది ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై పొత్కపల్లి ఎస్సై ఎస్.లక్ష్మణ్ను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, వివరాలు తర్వాత చెబుతామని పేర్కొన్నారు. (చదవండి: Health Benefits of Butter: ఇమ్యూనిటీని పెంచడంలో ఇదే కీలకం.. దూరంపెట్టకండి) -
సెక్స్ రాకెట్: టాప్ మోడల్, నటి అరెస్ట్
ఓ స్టార్ హోటల్లో గుట్టుగా సెక్స్ రాకెట్ నడుపుతున్న ఓ మహిళను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. జూహులోని ఓ 5 స్టార్ హోటల్లో పలువురు టీవీ నటులు, మోడల్తో ఆమె ఈ రాకెట్ను నడిపిస్తున్నట్లు తెలిసింది. అరెస్టయిన సదరు మహిళను టాప్ మోడల్, టీవీ నటిగా పోలీసులు గుర్తించారు. లాక్డౌన్లో ఉపాధి కోల్పోవడంతో వ్యభిచారం నడుపుతున్నట్టు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. కాగా సదరు మోడల్ పేరు ఇషా ఖాన్గా సమాచారం. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు సమాచారం ప్రకారం.. జూహులోని 5 స్టార్ హోటల్లో సదరు మోడల్ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చదవండి: పాయల్ రాజ్పుత్పై కేసు నమోదు దీంతో కస్టమర్లుగా ఇషాఖాన్కు పోలీసులు ఫోన్ చేశారు. దీంతో వారితో గంటకు ఒక్కరికి రూ. 2 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. ఈ ఒప్పందం కుదరడంతో ఆమె పోలీసులకు కొంతమంది అమ్మాయిల ఫొటోలను వాట్సప్లో పంపించింది. ఆ తర్వాత వారిని కలుసుకోవడానికి జూహులోని ఓ స్టార్ హోటల్కు రావాల్సిందిగా ఆమె చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు హోటల్కు వెళ్లిన పోలీసులు సదరు మోడల్తో పాటు మరో ఇద్దరూ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో ఈ వృత్తిలోకి దిగినట్లు చెప్పారు. అనంతరం ఈ రాకెట్ నడుపుతున్న ఇషాఖాన్పై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మరోఇద్దరి అమ్మాయిలను పునరావస కేంద్రాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. Maharashtra | Mumbai Crime Branch on Friday busted a high-profile prostitution racket at a five-star hotel in Juhu. A TV actress was arrested and two people, including a model and another TV actress, have been rescued. — ANI (@ANI) August 21, 2021 -
కరీంనగర్లో హైటెక్ వ్యభిచారం: అంతా ఆన్లైన్లోనే..
సాక్షి, కరీంనగర్: లగ్జరీ ఇళ్లు.. సంపన్నులు ఉండే ప్రాంతాలు.. శివారుకాలనీలు అడ్డాగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో అనుమానం రాకుండా హైటెక్ వ్యభిచారం సాగుతోంది. యువకులు, సంపన్నులు, పేరున్న వారితో ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ.. వాట్సాప్లో అందమైన అమ్మాయిల ఫొటోలు పంపిస్తూ.. వలపువల వేస్తున్నారు. రేట్ ఫిక్స్ చేసుకుని దందాను గుట్టుగా సాగిస్తున్నారు. ఇటీవల నిఘా పెట్టిన పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తుండగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. అంతా వాట్సాప్లోనే.. ► వ్యభిచార కేంద్రం నిర్వాహకులు కస్టమర్లతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. సదరు గ్రూపుల్లో యువతుల ఫొటోలు పెడుతూ ఆకర్షిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కొందరు దంపతులు కలసి ఈ దందాను సైలెంట్గా నడిపిస్తున్నారు. ► ఎక్కువగా యువత, ఇంజినీరింగ్, పీజీ కళాశాలలకు చెందిన విద్యార్థులకు వలపువల విసురుతూ.. తమ మనిషిని పంపించి పరిచయాలు పెంచుకొని దందాకు శ్రీకారం చుడుతున్నారు. ► జిల్లాలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగులు, పేరున్న పెద్దమనుషులు, విద్యాసంస్థల కరస్పాండెంట్ల వద్దకు యువతులనే నేరుగా పంపిస్తున్నారని సమాచారం. ►నగరశివారు ప్రాంతాల్లో అయితే ఎక్కువగా జనాలు వచ్చిపోవడం చూసి చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారమందిస్తున్నారని జిల్లాకేంద్రంలోనే కొత్తదారులు వెతుకుతున్నారు. నగరంలోని మంకమ్మతోట, జ్యోతినగర్, భాగ్యనగర్, తీగలగుట్టపల్లి, విద్యానగర్, భాగ్యనగర్, చైతన్యపురి, బ్యాంక్కాలనీల్లో పెద్దపెద్ద అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని గుట్టుగా దందా నడిపిస్తున్నారు. ► అదే విధంగా కరీంనగర్లోని కొన్ని లాడ్జీల్లోనూ విచ్చలవిడగా వ్యభిచారం జరుగుతోందని అరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి అద్దె ఇళ్లు, ప్లాట్లలో వ్యభిచారం నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ► ఫోన్ల ద్వారానే యువతుల ఎంపిక, బేరం అన్ని జరుగుతుంటాయని తెలిసింది. కొందరు ఉన్నత చదువులు చదివిన యువతులు కూడా తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా రొంపిలోకి దిగుతుండడం బాధాకరమైన విషయమని ఓ పోలీసు అధికారి తెలిపారు. పోలీసుల నిఘా వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక నిఘాపెట్టారు. కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు గత నెలలో టూటౌన్ పరిధిలోని సప్తగిరికాలనీలోని ఓ ఇంట్లో దాడిచేసి వ్యభిచార నిర్వాహకులైన భార్యభర్తలు, ముగ్గురు విఠులను అరెస్టు చేశారు. వారినుంచి రూ.37,380 స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15న కరీంనగర్ రూరల్ ప్రాంతంతోని తీగలగుట్టపల్లిలో ఒక వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకుడితో పాటు విఠుడిని అరెస్టు చేశారు. దందాపై పోలీసులు నిఘా పెడుతూ అరెస్టు చేస్తున్నప్పటికీ ఎక్కడోఒకచోట గుట్టుగా నడుస్తూనే ఉంది. ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగితే డయల్ 100 ద్వారా, సమీప పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. వేళ్లూనుకుంటున్న దందా.. కరీంనగర్ జిల్లాకేంద్రంలో వ్యభిచార దందా వేళ్ళూనుకుంటోంది. నగరం నడిబొడ్డున వ్యభిచార కేంద్రాలు వెలుస్తుండగా.. గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వారి అర్థిక స్థితిగతులను ఆసరాగా చేసుకుని రొంపిలోకి దింపుతున్నారు. పోలీసులు దాడులు చేసినప్పటికీ.. దందా ఆగడం లేదు. గతంలో చింతకుంట, రేకుర్తి, హౌసింగ్బోర్డుకాలనీ శివారు ప్రాంతాల్లో జరిగే వ్యభిచారం ఇప్పుడు జిల్లాకేంద్రంలోనే హైటెక్ హంగులతో కొనసాగిస్తూ.. పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జిల్లా కేంద్రంలోనే రెండు వ్యభిచార కేంద్రాలపై పోలీసులు దాడిచేసి నిర్వాహకులు, విటులను అరెస్టు చేశారు. -
సెక్స్వర్కర్లను రప్పించి.. హోటల్ గదిలో గుట్టుగా వ్యభిచారం
చిక్కడపల్లి: చిక్కడపల్లిలోని సాయికృప హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా చిక్కడపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సంఘటనలో మేనేజర్ బి.ఉషశ్రీ (22) సహా హోటల్లో హౌస్కీపర్లుగా పని చేస్తున్న ఇ.శ్రీకాంత్ (24), కె.సాయికుమార్(23)లను పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి మూడు ఖరీదైన సెల్ఫోన్లు, 10 నిరోధ్ ప్యాకెట్లు, రూ.8 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ పాలడుగు శివశంకర్రావు వివరాల ప్రకారం.. సులువుగా డబ్బు సంపాదించేందు కోసం సూర్యపేటకు చెందిన ఉషశ్రీ సాయికృప హోటల్లోని 205 నంబర్ గదిని అద్దెకు తీసుకుని వివిధ ప్రాంతాలకు చెందిన సెక్స్వర్కర్లను రప్పించి వారికి వచ్చే ఆదాయంలో ఫిఫ్టీ షేరింగ్తో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. హోటల్లో హౌస్కీపింగ్ జాబ్ చేస్తున్న సిద్ధిపేటకు చెందిన శ్రీకాంత్, నల్గొండకు చెందిన సాయికుమార్లు ఆమెకు సహకరించేవారు.మధ్యవర్తులుగా వ్యవహరించిన విష్ణు, ధర్మాలు పరారీలో ఉన్నారు. సీసీఎస్ పోలీసుల విశ్వసనీయ సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం రాత్రి హోటల్పై దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. -
హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం
మాదాపూర్: హైటెక్ సిటీలోని ఓ స్టార్ హోటల్పై యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ దాడి చేసి విదేశీ యువతులు, మోడళ్లతో నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసింది. నిర్వాహకుడు పరారీ కాగా, ఐదుగురు యువతులను, ఒక విటుడిని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించింది. మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్లోని ఓ స్టార్ హోటల్లో ఉజబెకిస్తాన్కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతుల పేరిట ఐదు రూమ్లు బుక్ చేశారు. నిర్వాహకులు అర్నవ్, ప్రిన్స్లు ఫోన్లో విటులతో మాట్లాడి హోటల్కు రప్పించి యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం 5 గంటలకు సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ సదరు హోటల్పై దాడి చేసింది. వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉజబెకిస్తాన్కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుంది. విటుడు షేక్పేట్కు చెందిన జ్ఞాన శేఖర్ మణికంఠన్(44)ను పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ గదులలో రూ.29,560 నగదు, కండోమ్ ప్యాకెట్లు, సెల్ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. కాగా, యువతులను రెస్క్యూ హోంకు తరలిస్తామని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిర్వాహకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఖైరతాబాద్: మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం
ఖైరతాబాద్: మసాజ్ సెంటర్ పేరుతో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై సైఫాబాద్ పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ షాదన్ కళాశాల ఎదురుగా చింతలబస్తీ మార్గంలో ‘టీఎనీ్టఏ బ్యూటీ పార్లర్ అండ్ స్పా’ సెంటర్ నడుస్తోంది. ఈ సెంటర్కు మసాజ్ కోసం వచ్చిన వారిని వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో విధుల్లో ఉన్న రాంగోపాల్పేట ఇన్స్పెక్టర్ చంచల్ బాబు, సైఫాబా ద్కు చెందిన ఇద్దరు ఎస్ఐలు, పలువురు సిబ్బందితో ప్రణాళిక సిద్ధం చేశారు. తొలుత ఓ కానిస్టేబుల్ను పంపి బేరం కుదుర్చుకున్నాక అతను సమాచారం ఇవ్వడంతో పోలీసులు దాడులు చేశారు. అక్కడ నిర్వాహకులు హీనా తబస్సుమ్, జైనబ్ తబస్సుమ్తో పాటు విటులు మొయినుద్దీన్, పుర్కాన్అలీ, సాజిద్ఆలీ, మొయిన్ మహబూబ్ హుస్సేన్లను అదుపులోకి తీసుకున్నారు. వారితో ముగ్గురు యువతులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పీటా చట్టం కింద నిర్వాహకులు, విటులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: గచ్చిబౌలి హోటల్లో వ్యభిచారం... ఆరుగురి అరెస్టు) -
కూకట్పల్లిలో వ్యభిచారం గుట్టురట్టు.. యువతులను రప్పించి..
సాక్షి, హైదరాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ అపార్టుమెంట్లోని ఇంటిపై పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితో పాటు విటులను అరెస్ట్ చేసిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లోని ప్లాట్ను చరణ్రాజు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ ప్లాట్కు ఇద్దరు యువతులను రప్పించి కాల్స్, వాట్సప్ల ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడు చరణ్రాజుతో పాటు విటులు లక్ష్మారెడ్డి, భూష రమేశ్తో పాటు ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.3 వేల నగదు, సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మహిళా కానిస్టేబుల్ను అసభ్యంగా తాకుతూ.. ఉప్పల్లో లారీ బీభత్సం.. ఒకరు మృతి -
ఓయో లాడ్జ్లో గుట్టు చప్పుడు కాకుండా..
హస్తినాపురం: గుట్టు చప్పుడు కాకుండా లాడ్జ్లో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జ్ యజమానిని వనస్థలిపురం పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆటోనగర్లో మదిరెడ్డి రాఘవేందర్రెడ్డి (40) ఓయో లాడ్జీని నడిపిస్తున్నాడు. కొంతకాలంగా తన లాడ్జ్లో వ్యభిచారం చేయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గతవారం లాడ్జ్పై దాడి చేసి మహిళలను,విటులను రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న రాఘవేందర్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. (టిక్టాక్లో బాసలు చేశాడు.. ఆశలు రేపాడు) -
వాట్సాప్ ద్వారా దందా: భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
స్పా ముసుగులో యువతులను వ్యభిచార కార్యక్రమాల్లోకి దింపుతున్న వ్యవహారం ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో అమ్మాయిల ఫోటోలు పంపి, వారిని ఆకర్షించి, వ్యభిచార దందా సాగిస్తున్న ఉదంతాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు చేధించారు. వీరిలో ప్రధానంగా ఒక మహిళ వుండటం మరింత ఆందోళన రేపింది. వివరాల్లోకి వెళితే, ఘజియాబాద్ నగర పరిధిలోని రాజ్ హంస ప్లాజాలోని మూడు స్పా సెంటర్లలో సెక్స్రాకెట్ కొనసాగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఇందిరాపురంలోని మూడు స్పాస్లపై జరిపిన దాడుల్లో 9 మంది యువతులు సహా, మొత్తం 19 మందిని అరెస్టు చేశారు. యువతుల ఫోటోల ద్వారా నగరంలోని విటులను స్పాలకు ఆహ్వానించి ఈ రాకెట్ నడుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ మహిళ ఆధ్వర్యంలో ఈ దందాను నడిపిస్తున్నారని అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ కేశవ్ కుమార్ వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న యువతుల నుంచి రూ. 16 వేలను, 24 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. స్పా సెంటర్లు నిర్వహిస్తున్న వారిలో కొందరు పరారీలో ఉన్నారని, మానవ అక్రమ రవాణా నివారణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.