-
టాలీవుడ్ నిర్మాతలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ (ఫోటోలు)
-
పవన్తో భేటీ కానున్న టాలీవుడ్ నిర్మాతలు.. అది అసలు విషయం
తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో కలవనున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం భేటీ కానున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ని కోరబోతున్నారు.(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన హీరో నాగార్జున.. ఏమైందంటే?)కొత్త రిలీజయ్యే సినిమా టికెట్ రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు లాంటి విషయాలని సదరు నిర్మాతలు పవన్ కల్యాణ్తో చర్చించనున్నారు. ఈ భేటీకి వెళ్లేవారిలో అశ్వనీ దత్, చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, వివేక్, దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు.(ఇదీ చదవండి: అలాంటివాటిని పట్టించుకోరు కానీ.. మాపై పడి ఏడుస్తారు: అనసూయ కౌంటర్) -
నిజాలు తెలుసుకుని రాయండి: దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలు పెద్దఎత్తున పోటీకి సిద్ధమయ్యాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు సమావేశమై సినిమాల రిలీజ్పై తలెత్తిన సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా లో వస్తున్న ఆర్టికల్స్తో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ఎవరైనా సరే నిజాలు తెలుసుకొని రాయండని దిల్ రాజు కోరారు. ముఖ్యంగా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నందుకు రవితేజకు కృతజ్ఞతలు తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ..'సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది. దయచేసి నిజాలు తెలుసుకొని రాయండి. సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలతో చర్చించాం. ఒక సినిమా వెనక్కి తగ్గితే ఏదో జరిగినట్టు కాదు. గతేడాది మూడు సినిమాలకే రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు 5 సినిమాలు పోటీలో ఉన్నాయి. మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా రవితేజ, పీపుల్స్ మీడియా వారికి మా కృతజ్ఞతలు. ఇదొక మంచి పరిణామం' అని అన్నారు. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..' సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. 15 రోజుల క్రితం నిర్మాతలతో మీటింగ్ పెట్టి గ్రౌండ్ రియాలిటీ చెప్పాం. నిర్మాతలు సహకరిస్తున్నారు. రవితేజ ఈగల్ సినిమా నిర్మాతలకు థాంక్స్' అని అన్నారు. కాగా.. సంక్రాంతి రేసులో మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, ప్రశాంత వర్మ హనుమాన్, నాగార్జున మూవీ నాసామిరంగ రిలీజ్ కానున్నాయి. రవితేజ పోటీ నుంచి తప్పుకోవడంతో నాలుగు చిత్రాలు బరిలో నిలిచాయి. -
టికెట్ల ధర పెంచాలని కోరిన భోళా శంకర్ నిర్మాతలు
-
హాయిగా నవ్వుకుంటారు
‘‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ వినోదాత్మక చిత్రం. మూఢ నమ్మకాలపై సెటైర్లా ఉండే ఈ కథ కొత్తగా అనిపించింది.. అందుకే నిర్మించాం. మా సినిమా చూసి ప్రేక్షకులు రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు’’ అన్నారు నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ నెల 29న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ– ‘‘వ్యాపారరీత్యా అమెరికా వెళ్లాం. అక్కడ 2016లో ఓ హాలీవుడ్ మూవీ నిర్మించాం. 2017కి ఇండియా వచ్చి, తెలుగులో మొదటి సినిమాగా ‘జార్జ్ రెడ్డి’ నిర్మించాం. ఏఆర్ శ్రీధర్ చెప్పిన కథ నచ్చడంతో ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ తీశాం. మా బ్యానర్లో నిర్మించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఆగస్టు 18న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి -
స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!
కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ తెలుగువారికి కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా కిచ్చా సుదీప్పై కొందరు నిర్మాతలు తీవ్ర విమర్శలు చేశారు. తమ వద్ద రెమ్యునరేషన్ తీసుకుని సినిమా చేయలేదని ఆరోపించారు. దీంతో ఈ వ్యాఖ్యలు శాండల్వుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్లో అడుగు పెట్టిన 'సినిమా') దీంతో తనపై కామెంట్స్ చేసిన నిర్మాతలు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేశ్లపై కిచ్చా సుదీప్ మండిపడ్డారు. అంతేకాకుండా వారిద్దరిపై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు నిర్మాతలపై కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుదీప్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. అసలు వివాదం ఏంటి? ఒక సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకుని ఎగ్గొట్టాడని నిర్మాత ఎంఎన్ కుమార్ ఆరోపించారు. ఎనిమిదేళ్ల క్రితమే సినిమా చేయడానికి అంగీకరించి.. ఇప్పటి వరకు తనకు డేట్స్ కేటాయించలేదని నిర్మాత పేర్కొన్నారు. కోటిగొబ్బ -3, విక్రాంత్ రోనా చిత్రాల తర్వాత తన సినిమా పని ప్రారంభిస్తానని హామీ ఇచ్చాడని.. కానీ సుదీప్ వద్దకు వెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించినా స్పందన రాలేదని ఆరోపించారు. ఈ చిత్రానికి ముత్తట్టి సత్యరాజు అనే టైటిల్ను నమోదు చేశానని.. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ధర్నా చేస్తానని ఎంఎన్ కుమార్ ప్రకటించారు. కాగా.. కిచ్చా సుదీప్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు విజయ్ కార్తికేయతో చేయనున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా కిచ్చా46 అని టైటిల్ పెట్టగా.. కలైపులి ఎస్ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) -
ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్న రీ రిలీజ్ మూవీస్ ధ్వంసం అవుతున్న ధీయేటర్లు
-
సినిమా సూపర్ హిట్టయినా లాభాలు రావడం లేదు: బెక్కెం వేణుగోపాల్
‘‘ప్రస్తుతం తెలుగులో కథ కంటే కాంబినేషన్ని నమ్ముకుని ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. దానివల్ల సినిమా సూపర్ హిట్టయినా లాభాలు రావడం లేదు. కాంబినేషన్ని నమ్ముకుని పారితోషికాలు పెంచడం వల్ల బడ్జెట్ ఊహించని స్థాయికి చేరుకుంటోంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. నేడు(ఏప్రిల్ 27) బెక్కెం వేణుగోపాల్ బర్త్ డే. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2006 అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలి చిత్రం ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ విడుదలైంది. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్నాను. ఈ 16 ఏళ్లల్లో సొంతంగా 12 సినిమాలు, వేరే బ్యానర్లతో కలిసి 4 సినిమాలు నిర్మించాను. స్టార్ హీరోలతో, భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఇక నిర్మాతలను మించిన నటులు ఎవరూ ఉండరు. అప్పుడప్పుడు లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి మాత్రం శాంతంగా ఉండాల్సిన పరిస్థితి. భవిష్యత్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాలనుంది. కానీ, దర్శకత్వ ఆలోచన లేదు. ప్రస్తుతం కొత్తవాళ్లతో ‘రోటి కపడా రొమాన్స్’, సుడిగాలి సుధీర్తో నరేష్ దర్శకత్వంలో నిర్మాత చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మరో మూవీ చేస్తున్నాను. అవికా గోర్ ప్రధాన పాత్రలో స్వరూప్ దర్శకత్వంలో ఓటీటీ కోసం ఓ మూవీ నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
ప్రభాస్,ఎన్టీఆర్,చరణ్,బన్నీ వెనుక పడుతున్నబాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్
-
Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
‘సాక్షి’ ప్రారంభమై పదిహేనేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ప్రారంభ వేడుకకి మొన్న మొన్నే వెళ్లినట్లుగా అనిపిస్తోంది. ఆ వేడుక ఇంకా గుర్తుంది. ‘సాక్షి’కి నా ప్రత్యేక అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘సాక్షి’ దినపత్రిక ఆరంభమై నేటితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా బ్రహ్మండంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిడ్డి. ‘‘సాక్షి’ ఇలాంటి విజయవంతమైన వసంతాలను ఎన్నో చూడాలి’’ అన్నారు కన్నడ హీరో శివరాజ్కుమార్. ‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుని, పదహారో ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన వాస్తవాలను అందించాలని, స్ఫూర్తినిచ్చే వార్తలు ఇవ్వాలనే ప్రజాసంకల్పాన్ని ధ్యేయంగా చేసుకుని అందులో విజయం సాధిస్తూ, ప్రతి ఏడాది ప్రజలకు మరింత చేరువవుతున్నందుకు అభినందనలు’’ అన్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఇంకా హీరోలు ‘అల్లరి’ నరేశ్, అది సాయికుమార్, కార్తికేయ, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, నటులు తనికెళ్ల భరణి, సుమన్, సాయికుమార్, ‘సీనియర్’ నరేశ్, అలీ, దర్శకులు కృష్ణవంశీ, బి.గోపాల్, నందినీ రెడ్డి, నిర్మాతలు సి.కల్యాణ్, ‘దిల్’ రాజు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్ తదితరులు ‘సాక్షి’కి శుభాకాంక్షలు తెలిపి, మరిన్ని విజయవంతమైన వసంతాలను చూడాలని ఆకాంక్షించారు. -
ఆ మాఫియా వల్ల సినీపరిశ్రమ నాశనమవుతోంది
‘‘నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులు ఉన్నారు. కానీప్రొడ్యూసర్స్ గిల్డ్లో 27 మంది సభ్యులు ఉన్నారు.ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాఫియాగా మారింది. గుత్తాధిపత్యం వల్ల పరిశ్రమ నాశనమవుతోంది’’ అని నిర్మాత సి. కల్యాణ్ ఆరోపణలు చేశారు. నేడు నిర్మాతల మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్మాతల మండలి అధ్యక్షడు సి. కల్యాణ్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ – ‘‘అందరూ ఒకే తాటిపై ఉండాలని ఆరంభం అయిన ఆర్గనైజేషన్ చిన్నగా ఎల్ఎల్పీగా మారి అది కాస్తా ‘గిల్డ్’గా మారింది. గిల్డ్ ఏంటి?ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏంటి? రెండింటినీ కలిపేయొచ్చు కదా అని చాలామంది అంటున్నారు. కలపడానికి మేం చేస్తున్న ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటున్నారు. ఇక్కడంతా మోనోపలి అయ్యింది. వారే హీరోలు, వారే డిస్ట్రిబ్యూటర్స్, వారివే థియేటర్స్.. ఇలా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. కల్యాణ్ లీడ్ చేస్తే మంచే జరుగుతుంది అనే నమ్మకం కలిగితే మా ఫ్యానల్కు ఓటు వెయ్యండి’’ అన్నారు. కాగా ఈ ఎన్నికల్లో కల్యాణ్ పోటీపడటంలేదు. నిర్మాతల మండలి తరఫున అధ్యక్ష పదవికి పి. కిరణ్ పోటీలో ఉన్నారు.ఈ ఎన్నికలపై ‘దిల్’ రాజు స్పందిస్తూ – ‘‘ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న నిర్మాతలు ఉన్న ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్’ని గెలిపించాలని కోరుతున్నాను’’ అన్నారు. ఈ ఫ్యానెల్ తరఫున అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. -
దిల్రాజును ట్రోల్ చేసిన ప్రముఖ నిర్మాత.. వీడియో వైరల్
ఈమధ్యకాలంలో సోషల్మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఏది ఎప్పుడు, ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు ఊహించలేం. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా ట్రోల్స్ బారిన పడుతుంటారు. ఇటీవలి కాలంలో దిల్రాజు పేరు నెట్టింట బాగా వైరల్ అయ్యింది. వారీసు ప్రీరిలీజ్ ఈవెంట్లో తమిళం, ఇంగ్లీష్ కలిపి ఆయన మాట్లాడిన తీరు ఎంతలా ట్రోల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మీమ్స్, ట్రోల్స్ సహా చివరికి రివ్యూలు కూడా దిల్రాజు స్టైల్లో చెప్పి నెట్టింట తెగ హడావిడి చేశారు. తాజాగా నిర్మాత ఎస్కేఎన్ కూడా దిల్రాజును ఇమిటేట్ చేశారు. రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన స్పీచ్ చివర్లో.. ఈ సినిమాలో కామెడీ ఇరిక్కు ఫైట్స్ ఇరిక్కు స్టొరీ ఇరిక్కు.. అంటూ దిల్రాజును ఇమిటేట్ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The Swaggg Starrrrr @SKNonline 🔥 Total auditorium maamulu response kaadu pic.twitter.com/kIgO47vOqP — AYYAPPA REDDY (@lucky59000) January 20, 2023 -
తెలుగు నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశం రసాభాస
-
నిర్మాణ రంగంలో రాణిస్తున్న లేడీ ప్రొడ్యూసర్స్, ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చింది వీరే
అమ్మాయిలంటే సిల్వర్ స్క్రీన్పై మెరవడానికే.. స్క్రీన్ వెనక టెక్నీషియన్స్గానో, సినిమాలకు పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్గా సూట్ అవ్వరనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అందుకే ఈ రెండు విభాగాల్లో తక్కువమంది ఉంటారు. అయితే రోజులు మారుతున్నాయి. మహిళా సాంకేతిక నిపుణులు పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది నిర్మాణ రంగంలో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య పెరిగింది. అరడజను మందికి పైగా ఈ ఏడాది నిర్మాతలుగా పరిచయం కావడం ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పువచ్చు. ఇక ఈ ఏడాది ఫిలిం మేకింగ్ (నిర్మాణం)లోకి వచ్చిన మేడమ్స్ గురించి తెలుసుకుందాం. దివంగత ప్రముఖ నటులు, నిర్మాత కృష్ణంరాజు పెద్ద కుమార్తె సాయి ప్రసీద ‘రాధేశ్యామ్’ సినిమాతో ఈ ఏడాది నిర్మాతగా పరిచయం అయ్యారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ లవ్స్టోరీ ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్ (యూవీ క్రియేషన్స్)లతో కలిసి ప్రసీద (గోపీకృష్ణా మూవీస్) ఈ సినిమా నిర్మించారు. నిర్మాణరంగంలోకి అడుగు పెట్టక ముందు విదేశాల్లో ప్రసీద ప్రొడక్షన్ కోర్స్లో చేశారు. మరోవైపు దివంగత ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దివ్య దీప్తి నిర్మించిన తొలి చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, సంజన జంటగా నటించారు. తండ్రి దర్శకత్వం వహించిన చిత్రాల షూటింగ్లకు దివ్య వెళ్లేవారు. అలా ఫిలిం మేకింగ్పై అవగాహన పెంచుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా మారారు. సమంత టైటిల్ రోల్ చేసిన ‘శాకుంతలం’ సినిమాకు నీలిమ ఓ నిర్మాత. ఈ ఏడాది నవంబరులో విడుదల కావాల్సిన ఈ పీరియాడికల్ ఫిల్మ్ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇక నిర్మాణరంగంలో ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ది ప్రత్యేక స్థానం. ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన చిత్రాలకు (సిరి సిరి మువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం..) పదికిపైగా జాతీయ అవార్డులు వచ్చాయి. ఏడిద నాగేశ్వరరావు వారసురాలిగా ఆయన మనవరాలు ఏడిద శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రం ద్వారా నిర్మాతగా తొలి అడుగు వేశారు. శ్రీజ ఎంటర్టైన్మెంట్స్పై రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జంటగా నటించారు. కాగా ప్రస్తుతం తెలుగులో ఉన్న అగ్ర నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. ఆయన కుమార్తె హన్షిత రెడ్డి నిర్మాణరంగంపై దృష్టి సారిస్తున్నారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘దిల్’ రాజు డిజిటల్ కంటెంట్ను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్లో ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ కూడా ఆరంభమైంది. ఈ సిరీస్కు దర్శకుడు హరీష్ శంకర్ కథ ఇచ్చారు. బిగ్బాస్ ఫేమ్ వీజే సన్నీ, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకుంటున్న ఈ సిరీస్కి హన్షిత రెడ్డి ఓ నిర్మాతగా ఉన్నారు. యాక్షన్ టు ప్రొడక్షన్ హీరోయిన్లు కూడా నిర్మాతలుగా మారు తుంటారు. హీరోయిన్ మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ నిర్మాతగా మారారు. రాహుల్ విజయ్, మేఘా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మాటే మంత్రము’ చిత్రానికి బిందు ఆకాష్ ఓ నిర్మాతగా ఉన్నారు. పేరు తల్లిది అయినప్పటికీ కూతురు మేఘా ఆకాష్ సపోర్ట్తోనే బిందు నిర్మాత అయ్యుంటారని ఊహించవచ్చు. ఇక మలయాళ బ్యూటీ ఐశ్వర్యా లక్ష్మి ‘గార్గి’ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అయ్యారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే టాప్ హీరోయిన్ కీర్తీ సురేష్ త్వరలో ఓ ప్రొడక్షన్ హౌస్ ఆరంభించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందీలోనూ.. బాలీవుడ్లోనూ ఈ ఏడాది లేడీ నిర్మాతల జాబితాలో కొందరు హీరోయిన్ల పేర్లు చేరాయి. హన్సల్ మెహతా తెరకెక్కించనున్న ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్లో నటించి, నిర్మించనున్నారు కరీనా కపూర్. ఏక్తా కపూర్తో కలిసి ఆమె ఈ సినిమా నిర్మించనున్నారు. ఇక షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఆలియా భట్ ‘డార్లింగ్స్’ అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ఆలియా నటించారు కూడా. హీరోయిన్ కృతీ కుల్హారి కూడా ‘నాయిక’ అనే సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇలా నిర్మాణ రంగంలోనూ స్త్రీ శక్తి ప్రవేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. -
కోవిడ్లోనూ రెచ్చిపోయిన నాగేంద్ర బాబు.. వలలో ఎందరో సినీ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: సిటీ నటి జీవితను టార్గెట్ చేసి, ఆమె మేనేజర్ నుంచి రూ.1.25 లక్షలు కాజేసి, కటకటాల్లోకి చేరిన చెన్నై వాసి టిక్కిశెట్టి నాగేంద్రబాబుకు (29) ఘనమైన నేరచరిత్రే ఉంది. కోవిడ్ సీజన్లోనూ ఇతగాడు తనదైన పంథాలో, సమకాలీన అవసరాలకు అనువుగా మార్చుకుని రెచ్చిపోయాడని బయటపడింది. ఇతడి తాజా నేరాల చిట్టా బయటపడడానికి కస్టడీలోకి తీసుకుని విచారించాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగేంద్రబాబు స్వస్థలం విజయవాడ. ఇతగాడు 2016 నుంచి మోసాలు చేయడం మొదలెట్టాడు. అప్పట్లో ఫ్యాన్సీ ఫోన్ నెంబర్లు ఇప్పిస్తానంటూ అనేక మంది నుంచి డబ్బు దండుకున్నాడు. ఈ మోసాలకు సంబంధించి ఇతడిపై విజయవాడలో మూడు కేసులు నమోదయ్యాయి. చెన్నైకు మకాం మార్చిన నాగేంద్ర అక్కడి లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా పని చేశాడు. కోవిడ్–19 వ్యాక్సిన్లు మార్కెట్లోకి విడుదలైన కొత్తలో వాటికి ఉన్న డిమాండ్ను క్యాష్ చేసుకున్నాడు. ఇతగాడు తొలుత తాను టార్గెట్ చేసిన వ్యక్తుల మొబైల్ నంబర్లను వివిధ మార్గాల్లో సేకరించే వాడు. గత ఏడాది వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిగా అనేక మందికి ఫోన్లు చేశాడు. ప్రముఖ హాస్యనటుడు, ప్రముఖ నిర్మాతలకు ఫోన్లు చేశాడు. వారితో పాటు వారివద్ద పని చేసే వారికీ వ్యాక్సిన్లు వేస్తానంటూ రూ.లక్ష చొప్పున తీసుకుని మోసం చేశాడు. ఓ టెలివిజన్ ఛానెల్ను ఇలానే టార్గెట్ చేసిన నాగేంద్ర వారితో ఏకంగా తాను మంత్రి కేటీఆర్ సన్నిహితుడినంటూ చెప్పుకుని రూ.1.5 లక్షలు వసూలు చేశాడు. ఓ యువ నిర్మాతకు మీడియా అవార్డు ఇప్పిస్తానంటూ చెప్పి ఆమె నుంచి రూ.3.5 లక్షలు కాజేశాడు. ఈ నేరాలకు సంబంధించి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, సైబరాబాద్ రాయదుర్గం తదితర ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. గత ఏడాది సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. బెయిల్పై బయటకు వచ్చినా తన పంథా మార్చుకోకుండా కొనసాగిస్తున్నాడు. -
తెలుగులో కొత్త కథలు లేవా..? పరభాష చిత్రాలనే అరువు తెచ్చుకోవాలా..?
-
కోలీవుడ్లో సోదాల కలకలం
న్యూఢిల్లీ: పలువురు తమిళ సినీ నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ల నివాసాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఇటీవల సోదాలు నిర్వహించిందని, ఈ సోదాల్లో రూ.200 కోట్లకుపైగా నల్లధనాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2 నుంచి మూడు రోజులపాటు చెన్నై, మదురై, కోయంబత్తూరు, వెల్లూరు తదితర నగరాల్లో దాదాపు 40 చోట్ట సోదాలు జరిపినట్లు పేర్కొంది. లెక్కల్లో చూపని రూ.26 కోట్ల నగదుతోపాటు రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసింది. బహిర్గతం చేయని నగదు లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. తమిళ నిర్మాతలు కలైపులి ఎస్.థాను, అన్బుసెళియన్, ఎస్ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా తదితరులు కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. సదరు నిర్మాతలు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపినట్లు అధికారులు గుర్తించారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి, ఆ సొమ్మును లెక్కల్లో చూపలేదని అధికారులు తేల్చారు. -
అప్పటి నుంచి సినిమా షూటింగ్లు బంద్..!
Tollywood Movies Shooting Close From August 1: ఆగస్టు 1నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ నిలిపివేయాలని సినీ అగ్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అవసరమైతే రెండు, మూడు నెలలు చిత్రీకరణ బంద్ చేద్దామని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయాలతో గతకొద్దిరోజులుగా నిర్మాతలందరూ ఈ వ్యవహారంపై చర్చిస్తున్నారు. మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంపైనా నిర్మాతలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ సినిమా చిత్రీకరణ నిలిపివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా కొవిడ్ తర్వాత థియేటర్కు వచ్చే ఆడియెన్స్ సంఖ్య భారీగా తగ్గింది. దీంతో టాలీవుడ్ భారీ నష్టాలను చవిచూసింది. వేసవిలో పెద్ద సినిమాలు సందడి చేయడంతో కాస్త కోలుకున్నట్లు అనిపించినా, తాజాగా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు నుంచి కొద్ది రోజులపాటు షూటింగ్లు ఆపేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. చివరి దశ షూటింగ్ ఉన్న చిత్రాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, ఆగస్టు 1 నుంచి అన్ని సినిమాల చిత్రీకరణను నిలిపివేయాలని చూస్తున్నారు. నిర్మాణ వ్యయం, ఓటీటీలు తదితర సమస్యలపై చర్చించిన తర్వాతే షూటింగ్లకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చదవండి: బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. వీడియో వైరల్ స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ ఈ విషయంపై త్వరలోనే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓటీటీలో రిలీజయ్యే సినిమాల విషయంలో సైతం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. జులై 1 నుంచి 50 రోజుల తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు 10 వారాలకు పొడిగించాలని భావిస్తున్నారట. ఈ విషయాలన్నింటిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. ఆయన మాకు గురువులాంటివారు: పూజా హెగ్డే -
నా దృష్టిలో నిర్మాతలే హీరోలు
‘‘నా దృష్టిలో నిర్మాతలే హీరోలు. అందుకే నా ‘గ్యాంగ్స్టర్ గంగరాజు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు నిర్మాతలను ఆహ్వానించాను. ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాస్. లక్ష్ చదలవాడ, వేదిక దత్త జంటగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రేపు విడుదలవుతోంది. ‘‘ఒక పెద్ద సినిమా తీసే బడ్జెట్లో 25 చిన్న సినిమాలు తీయొచ్చు. అందుకే కొత్త వారితో మా బ్యానర్లో 15 సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు చదలవాడ శ్రీనివాస్. -
పూజాకు నిర్మాతలు షాక్, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట!
ప్రస్తుతం సౌత్లో పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దక్షిణాది స్టార్ హీరో అందరి సరసన నటించి అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ పూజా బిజీగా మారింది. అయితే ఇటీవల పూజా నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్లు ఫ్లాప్ అయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలు పరాజయం కావడానికి పూజా హెగ్డేనే కారణమని, ఆమెది ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూజాకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కోడుతుంది. ఓ బడా నిర్మాత పూజాకు షాకిచ్చినట్టు తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బీస్ట్ మూవీ షూటింగ్ సమయంలో పూజా హెగ్డే స్టాఫ్కు సంబందించిన ఖర్చులు భారీగా వచ్చాయట. కేవలం వీరి ఫుడ్ కోసమే లక్షల్లో బిల్లు అయిందట. రీసెంట్గా వీటికి సంబంధించిన బిల్లులు బీస్ట్ నిర్మాతలకు అందాయట. ఇక ఆ బిల్లు చూసిన నిర్మాతలు ఒక్కసారిగా కంగుతిన్నారని వినికిడి. పూజా స్టాఫ్ ఫుడ్కు, మెయింటెన్స్కు అయిన బిల్లు చూసి నిర్మాతలు ఒక్కసారిగా చుక్కలు చూశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీస్ట్ మూవీ డిజాస్టర్తో భారీ నష్టాల్లో ఉన్న నిర్మాతలు పూజా, ఆమె స్టాఫ్కు అయిన ఖర్చులు మరింత భారమయ్యాయట. దీంతో ఈ బిల్లులతో తమకు సంబంధం లేదని, తన స్టాఫ్కు అయిన ఖర్చులను ఆమె భరించాలంటూ నిర్మాతలు ఆ బిల్లును పూజాకు పంపినట్లు సమాచారం. ఇక సినిమా ఫ్లాప్ అవ్వడంతో పూజా కూడా దీనిపై నోరు విప్పకుండ ఆ బిల్లును తానే కట్టాలని నిర్ణయించుందని సినీవర్గాల నుంచి సమాచారం. అయితే అ వార్తల్లో నిజమెత్తుందో తెలియదు. మరి దీనిపై పూజా, బీస్ట్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే గతంలో పూజా నిర్మాతలకు మరింత భారమయ్యాలే వ్యవహరిస్తుందని ఓ దర్శకుడు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాను మాత్రమే కాకుండా తన స్టాఫ్ని సైతం షూటింగ్కు తీసుకువస్తుందని, వారికి అయ్యే ఖర్చు నిర్మాతలకు భారమే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. -
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదని సీనియర్ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం(మే 30) దర్శకరత్న దాసరి నారాయణరావు వర్థంతి సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను స్మరించుకుంటూ నిర్వహించిన ఓ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు నటుడు సుమన్ కూడా పాల్గొన్నారు. చదవండి: అదిరిపోయిన అనన్య, విజయ్ హుక్ స్టెప్, వీడియో చూశారా? ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరిగారు ఇండస్ట్రీ పెద్దగా అందరి సమస్యల గురించి ఆలోచించేవారని గుర్తు చేశారు. ‘ముఖ్యంగా ఆయన బయ్యర్స్ గురించి ఆలోచించేవారు. ఒక సినిమా ప్లాప్ అయితే తర్వాత సినిమాను ఫ్రీగా చేసి బయ్యర్స్ను కాపాడేవారు. కానీ ప్రస్తుత నిర్మాతలు బయ్యర్స్ గురించి ఆలోచించడం లేదు. మేకర్స్ వల్ల బయ్యర్స్ నష్టపోతున్నారు. వారి తీరుతో బయ్యర్స్ సంతోషంగా ఉండటం లేదు. కోట్టకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. చదవండి: అలాంటివి విని విసిగిపోయాను, నా వ్యక్తిత్వం అది కాదు: రాధిక ఆప్టే సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో బయ్యర్స్ కొంటున్నారు. ఒకవేళ ఆ సినిమా ప్లాప్ అయితే నష్టపోయేది వారే. అసలు బయ్యర్ల గురించి ఆలోచించే వారే లేరు. సినిమా షూటింగ్స్లో సమయపాలన అసలు లేదు. నిర్మాతకు అదనపు భారం కలిగేలా మేకర్స్ ఉన్నారు. ఇది నేను ఆవేశంతో మాట్టాడుతున్నాను అనుకున్నా.. ఇది మాత్రం నిజం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో సుమన్ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. -
హీరోపై వరుసగా నిర్మాతల ఫిర్యాదులు.. కోట్లు మోసం చేశాడని కేసు
చెన్నై సినిమా: కోలీవుడ్ హీరో విమల్ చీటింగ్ చేశారంటూ పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మన్నన్ వగైయారా. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించి తనను మోసం చేశారని విమల్పై నిర్మాత గోపి గత వారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అలాగే డిస్ట్రిబ్యూటర్ సింగారవేలన్ కూడా కంప్లైట్ ఇచ్చారు. తాజాగా మరో నిర్మాత గణేశన్ కూతురు హేమ మంగళవారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో నటుడు విమల్ పై రూ. 1.74 కోట్లు మోసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. అందులో తిరుప్పూర్కు చెందిన తమ కుటుంబం మాంసం విక్రయం వృత్తి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఎదిగిందని పేర్కొన్నారు. కాగా సినిమా అంటే వ్యామోహం కలిగిన తన తండ్రి గణేశన్.. విమల్ హీరోగా మన్నర్ వగైయారా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారన్నారు. అలా ప్రారంభమైన చిత్ర షూటింగ్ హీరో హీరోయిన్ల మధ్య విభేదాల కారణంగా నిలిచిపోవడంతో ప్రొడక్షన్ ఖర్చు పెరిగిందన్నారు. దీంతో తన తండ్రి చిత్ర నిర్మాణం నిలిపేసి ఊరికి తిరిగొచ్చేశారని, ఆ తరువాత విమల్ తమ తండ్రిని కలిసి చిత్రాన్ని తానే నిర్మిస్తానని, మీ పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ రాశారన్నారు. అయినా తమ డబ్బు చెల్లించకపోవడంతో తాము చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, దీంతో విమల్ తమను కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని, పిటిషన్ను వాపస్ తీసుకోమని కోరారన్నారు. చిత్రం విడుదలైనా తమకు నగదు చెల్లించకపోగా చిత్ర తెలుగు అనువాద హక్కులను అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకుని తమ రూ.1.74 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: చరణ్ నటన నాకు కొత్తగా అనిపించలేదు: చిరంజీవి ఇదెక్కడి మాస్ రిలీజ్ జేమ్స్ మావా.. అన్ని భాషల్లో 'అవతార్ 2' సినిమా ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1631343214.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'పుష్ప' ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు..
Pushpa Movie Producers Press Meet On Movie Success: ‘‘పుష్ప: ది రైజ్’ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉండేది.. కానీ ఇంత పెద్ద హిట్ సాధిస్తుందని ఊహించలేదు. బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ అన్నారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నవీన్, రవిశంకర్ మాట్లాడుతూ ‘‘మా సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు రూ. 173 కోట్ల గ్రాస్, రూ. 85 కోట్ల షేర్ సాధించింది’’ అని తెలిపారు. ‘‘పుష్ప’ విడుదల తర్వాత ఇక్కడ హాలీవుడ్ మూవీ ‘స్పైడర్ మ్యాన్’కి థియేటర్స్ తగ్గాయంటే మా సినిమా క్రేజ్ ఏంటో తెలుస్తోంది’’ అన్నారు సీఈఓ చెర్రీ. ‘‘పుష్ప’లో భాగం కావడం గర్వంగా ఉంది’’ అన్నారు కెమెరామ్యాన్ మిరోస్లా క్యూబా. 'పుష్ప' సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 173 కోట్ల వసూళ్లు సాధించి అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది. ఆదివారం (డిసెంబర్ 19) భారీ కలెక్షన్లతో దుమ్ములేపిన పుష్పరాజ్ 2021 సంవత్సరంలో దేశంలోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచాడు. పుష్పరాజ్గా బన్నీ యాక్టింగ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేసింది 'పుష్ప'. ఈ సినిమా సెకండ్ పార్ట్ 'పుష్ప: ది రూల్' షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇదీ చదవండి: 2021లో దేశంలోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా 'పుష్ప'.. 3 రోజుల్లోనే.. -
లక్ష్య కథ వినగానే భయపడ్డాను: నిర్మాత
నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘లక్ష్య’. ఈ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా లక్ష్య విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► లవ్ స్టోరీ సినిమా మాకు మంచి విజయాన్ని అందించింది. కమర్షియల్గానూ పెద్ద సక్సెస్ అయింది. శేఖర్ కమ్ముల గారు మాకు ఒక మంచి సినిమాను ఇచ్చారు. ఆ సమయంలో మాకు వచ్చిన మొత్తం చాలా ఎక్కువే. వారం వారం సినిమాలు మారుతుంటాయి. ఈ వారం లక్ష్య సినిమా రాబోతోంది. ఆర్చరీ బేస్డ్ సినిమాలు ఇంత వరకు రాలేదు. ఆ పాయింట్ అందరినీ ఆకట్టుకుంది. ► మొదట ఈ కథ విన్నప్పుడు కొద్దిగా భయపడ్డాను. కానీ పూర్తిగా కథ విన్నాక చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఆటతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కథ విన్నవెంటనే నాగ శౌర్యకు పంపించాం. అతను విన్న వెంటనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ తరువాత నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ శరత్ మరార్తో కలిసి నిర్మించాం. ► రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్లు, ఓవర్సీస్లో 100 థియేటర్లలో లక్ష్య సినిమాను విడుదల చేయబోతోన్నాం. ► అఖండ సినిమా పెద్ద సక్సెస్ అయింది. అది మాకు సంతోషంగా అనిపించింది. అసలు థియేటర్లకు జనాలు వస్తారా? లేరా? అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ భయాలన్నీ పోయాయి. రెండేళ్ల క్రితమే శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మేశాం. ఫిల్మ్ బాగుంటే జనాలు వస్తారు అని తెలిసింది. ఇప్పుడు మేం థియేటర్ రెవిన్యూ మీద ఆధారపడ్డాం. ► సినిమాలు చిన్నవి పెద్దవి అని కాదు. పెద్ద సినిమా అయినా బాగా లేకపోతే ఎవ్వరూ చూడటం లేదు. అదే జాతి రత్నాలు లాంటి చిన్న సినిమా బాగుంది. యాభై కోట్లు కలెక్ట్ చేసింది. ► ఆన్ లైన్ టికెటింగ్ అనేది మంచిదే. దానిపై ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే టికెట్ రేట్లు ఇబ్బందిగా ఉంది. తెలంగాణలో రేట్లు బాగున్నాయి. కానీ ఏపీలో పరిస్థితి బాగా లేదు. ఆ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. త్వరలోనే సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. దేశం అంతా ఒక వైపు పోతోంటే మనం ఇంకో వైపు పోలేం కదా. కచ్చితంగా రేట్లు పెంచాల్సింది. మన దగ్గర ఉన్న థియేటర్లు దేశంలో ఎక్కడా లేవు. అత్యాధునిక హంగులతో థియేటర్లను నిర్మించాం. ప్రేక్షకులు కూడా అలాంటి థియేటర్లోనే సినిమాలను చూడాలని అనుకుంటారు. ► మరీ ఎక్కువ కాకుండా.. తక్కువ కాకుండా రేట్లు ఉంటేనే పరిశ్రమకు మంచిదని నా అభిప్రాయం. మరీ ఎక్కువగా ఉంటే కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చు. టికెట్ రేట్లను మరీ ఇంత తక్కువగా తగ్గించడంతో నిర్మాతలకు కష్టంగా మారింది. ► శేఖర్ కమ్ముల-ధనుష్, శివ కార్తికేయన్తో ఒక సినిమా, సుధీర్ బాబు హీరోగా హర్ష వర్దన్ డైరెక్షన్లో ఒక సినిమా, రంజిత్ దర్శకత్వంలో గౌతమ్ విజయ్ సేతుపతి- సందీప్ కిషన్ల కాంబినేషన్లో మరో సినిమా.. నాగార్జునతో ఓ సినిమాను చేస్తున్నాం. ఈ సినిమాకు ముందుగా కాజల్ అనుకున్నాం. కానీ ఇప్పుడు వేరే హీరోయిన్ను చూస్తున్నాం. ► లక్ష్య సినిమా క్రీడా నేపథ్యంలో రావడమే ప్లస్ పాయింట్. కేతిక శర్మ చాలా బాగా నటించారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా వచ్చింది. ఆల్రెడీ లక్ష్యం అనే వచ్చిందనే ఉద్దేశ్యంతో లక్ష్య అనే టైటిల్ను పెట్టామని నిర్మాతలు చెప్పుకొచ్చారు. -
మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల భేటీ