-
అమితాబ్ అలా చేస్తారని ఊహించలేదు: నిర్మాత సి. అశ్వినీదత్
‘‘అమితాబ్ బచ్చన్గారు లెజెండ్. మేము సెట్స్లో కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుంటాం. కానీ ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకలో నా కాళ్లకి అమితాబ్గారు నమస్కరించడంతో నాకు తల కొట్టేసినంత పని అయింది. ఆయన అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది.ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సి. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాగ్ అశ్విన్ ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది. ఈ శతాబ్దంలో ఒక మంచి దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు (నవ్వుతూ). ‘కల్కి’ విషయంలో టెన్షన్ పడలేదు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే తీశాం... అది నెరవేరింది. ప్రభాస్ సహకారం లేకపోతే అసలు ఈ సినిమా బయటికి రాదు. రాజమౌళి–ప్రభాస్ల ఎపిసోడ్ ఫన్నీగా పెట్టిందే. అలాగే బ్రహ్మానందం, రామ్గోపాల్ వర్మ పాత్రలని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.ఈ కథ అనుకున్నప్పుడే రెండో భాగం ఆలోచన వచ్చింది. కమల్గారు ఎంటరైన తర్వాత పార్ట్ 2 డిసైడ్ అయిపోయాం. ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2 వచ్చే ఏడాది జూన్లోనే విడుదల కావొచ్చు. 50 ఏళ్ల వైజయంతీ మూవీస్ ప్రయాణం అద్భుతం. ప్రస్తుతం శ్రీకాంత్గారి అబ్బాయి రోషన్తో ఓ సినిమా, దుల్కర్ సల్మాన్తో ఒక చిత్రం నిర్మిస్తున్నాం’’ అన్నారు. -
ప్రభాస్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?
డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు చేదు వార్త. అదేంటి త్వరలో 'కల్కి' రిలీజ్ కానుంది. ఈ టైంలో బ్యాడ్ న్యూస్ ఏంటా అని మీరు అనుకోవచ్చు. జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరి ప్రమోషన్స్ చేస్తున్నారు. అలా ఓ విషయమై ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నారా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)సాధారణంగా చిన్నా పెద్దా సినిమాల విడుదల ముందు ఎవరికి తగ్గట్లు వాళ్లు గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది చేస్తారు. కానీ ఇప్పుడు 'కల్కి' నిర్మాతలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించట్లేదని, ఇలాంటి ఈవెంట్ ఏం ఉండట్లేదని సమాచారం. శుక్రవారం సాయంత్రం కూడా యూట్యూబ్లో మరో కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీనిబట్టి కూడా ఈవెంట్ ఏం నిర్వహించరని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసినట్లే.'కల్కి'కి అసలు ప్రమోషన్స్ చేయట్లేదని ఓ వైపు అభిమానులు బాధ పడుతున్నప్పటికీ.. చిత్రబృందం మాత్రం షార్ట్ అండ్ స్వీట్ అన్నట్లు బుజ్జి, ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. ఇలా సింపుల్గా చేసేస్తున్నారు. చూడాలి మరి 'కల్కి' నిర్మాతలు ఏం ప్లాన్ చేస్తున్నారో?(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!) -
ప్రభాస్ 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రభాస్ వల్లే ఇలా మారిపోయాను: దీపికా పదుకొణె
ప్రభాస్ 'కల్కి' మరో వారంలో అంటే జూన్ 27న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ప్రభాస్తో పాటు దీపిక, అమితాబ్, కమల్ హాసన్ పాల్గొన్నారు. తక్కువ సమయమే ఈవెంట్ జరిగినప్పటికీ.. యాక్టర్స్ మధ్య బాండింగ్, వాళ్ల చెప్పిన విషయాలు ఆసక్తిగా అనిపించాయి. మరీ ముఖ్యంగా దీపిక, ప్రభాస్ ఫుడ్ గురించి చెప్పడమైతే హైలెట్.(ఇదీ చదవండి: లెజెండ్స్తో కలిసి పనిచేయడం అన్నింటి కంటే గొప్పది: ప్రభాస్)దీపికా పదుకొణె ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. బేబి బంప్తోనే ముంబైలో జరిగిన ఈవెంట్కి వచ్చింది. అయితే ప్రభాస్ ఫుడ్ వల్లే తనకు ఇది (బంప్) వచ్చిందని సరాదా కామెంట్స్ చేసింది. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం ఏకంగా క్యాటరింగ్లా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'నేను ఇలా అవ్వడానికి కారణం ప్రభాస్. అతడి ఇంటి భోజనమే నా బేబి బంప్కి కారణం (సరదాగా నవ్వుతూ). ప్రతిరోజు షూటింగ్కి ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వచ్చేది. ఎంతో ఇష్టంగా మూవీ టీమ్ కోసం భోజనం తెప్పించేవాడు. అది భోజనంలా కాకుండా క్యాటరింగ్లా ఉండేది. అలానే ప్రభాస్ ఇంటి నుంచి ఎలాంటి స్పెషల్ ఫుడ్ వస్తుందా అని ప్రతిరోజు ఎగ్జైట్మెంట్గా ఉండేది' అని దీపికా పదుకొణె చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: మోసపోయిన టాలీవుడ్ హీరోయిన్.. రూ.4 కోట్లు కాదు రూ.14 కోట్లు!)Made a #DeepikaPadukone - #Prabhas edit from today’s event! Need more of them together. They are so cute! Can’t wait for #Kalki2898AD pic.twitter.com/6tqqe2bTuZ— MOTHER IS MOTHERING IRL NOW ✨🥹❤️ (@deepika_era) June 19, 2024 -
మంచి కామెడీ దెయ్యం
నందితా శ్వేత, ‘వెన్నెల’ కిశోర్, నవమీ గాయక్, ‘షకలక’ శంకర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘ఓఎమ్జీ (ఓ మంచి ఘోస్ట్). శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందితా శ్వేత మాట్లాడుతూ–‘‘శంకర్గారు స్టోరీ నరేట్ చేస్తుంటే నవ్వుతూనే ఉన్నాను. హారర్, కామెడీ జానర్స్ మిళితమై వస్తున్న ఈ సినిమాను కుటుంబసమేతంగా చూడొచ్చు’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రాపారంభం కావడానికి కారణమైన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మూవీ స్క్రిప్ట్, డైలాగ్స్లో సాయం చేసిన దర్శకుడు రితేష్ రానా, మాపై నమ్మకం ఉంచిన అబినికా, ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న ఏషియన్ ఫిల్మ్స్, బాలాజీ ఫిల్మ్స్లకు ధన్యవాదాలు’’ అన్నారు శంకర్ మార్తాండ్. ‘‘కథను ఎంత బాగా చె΄్పారో, అంత బాగా సినిమా తీశారు శంకర్’’ అన్నారు అబినికా ఇనాబతుని. -
Amitabh Bachchan: కల్కిలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు
‘‘కల్కి 2898 ఏడీ’ సెట్స్లో తొలిసారి అమితాబ్ బచ్చన్గారిని కలిసినప్పుడు ఆయన కాళ్లను తాకాలనుకున్నాను. అమితాబ్గారు వద్దన్నారు. నువ్వు చేస్తే నేనూ చేయాల్సి ఉంటుందన్నారు. సార్... ప్లీజ్ అన్నాను. అప్పట్లో ఎవరైనా టాల్గా ఉంటే అమితాబ్ అనేవారు. అమితాబ్ బచ్చన్గారి హెయిర్ స్టయిల్ బాగా ఫేమస్. ఇక ‘సాగర సంగమం’ చూసి ఆ సినిమాలో కమల్గారిలా డ్రెస్ కావాలని మా అమ్మతో అన్నాను. ‘ఇంద్రుడు చంద్రుడు’లో ఆయన నటన చూసి ఎగ్జైట్ అయ్యాను. ఈ స్టార్స్, దీపికా పదుకోన్తో కలిసి యాక్ట్ చేయడం నాకో మంచి ఎక్స్పీరియన్స్’’ అని ప్రభాస్ అన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకకు హీరో రానా హోస్ట్గా వ్యవహరించారు. ఈ సినిమా తొలి టికెట్ను అమితాబ్ బచ్చన్కు అశ్వినీదత్ అందించగా, ఆయన నగదు చెల్లించి తీసుకున్నారు. ఈ టికెట్ను ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? అని అమితాబ్ను రానా అడగ్గా, మై బద్రర్ కమల్హాసన్కి అని చె΄్పారు. ఆ తర్వాత ఈ టికెట్ను అమితాబ్ నుంచి కమల్ అందుకుని, ‘షోలే’ సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టికెట్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంకా ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’లో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నేనిప్పటివరకూ ఇలాంటి సినిమా చేయలేదు. నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు అతను ఏం తాగితే ఇలాంటి ఐడియా వచ్చిందా అనిపించింది. తన విజన్ అద్భుతం. అశ్వినీదత్గారు సింపుల్గా ఉంటారు. సెట్స్లో నాకు కోపరేటివ్గా ఉన్నారు’’ అన్నారు. కమల్హాసన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’ సినిమా స్టార్ట్ చేసేప్పుడు ఆసక్తిగా అనిపించింది. సెట్స్లో పాల్గొన్న తర్వాత సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇప్పుడు అద్భుతంగా అనిపిస్తోంది. సాధారణంగా కనిపించేవారు అసాధారణ పనులు చేస్తుంటారు. నాగ్ అశ్విన్ విషయంలో నాకు అదే అనిపించింది. బ్యాట్మేన్లాంటి కథలు చేయాలని నాకు ఉండేది. ఈ సినిమాలో చేశాను. ఈ సినిమాలో నేనొక పాత్ర చేయాలనుకున్నా.. ఈ పాత్రను అమిత్జీ చేస్తున్నారన్నారు. మరో పాత్ర ఎంచుకున్నా.. అది ప్రభాస్ చేస్తున్నారన్నారు. ఫైనల్గా సుప్రీమ్ యాస్కిన్ అనే పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘కరోనా టైమ్లో జూమ్లో నాగ్ అశ్విన్ కథ చె΄్పారు. తన విజన్ క్లియర్గా ఉంటుంది. ఇందులో తల్లి పాత్ర చేశాను. ఈ సినిమా సెట్స్లో ప్రభాస్ ఈ రోజు ఎవరికి ఏం ఫుడ్ పెట్టారు అన్నదే హైలైట్ డిస్కషన్గా ఉండేది (సరదాగా)’’ అన్నారు దీపికా పదుకోన్. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ వేడుకకు హాజరు కాలేదు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడిన వీడియో బైట్ను ప్లే చేశారు. కాశీ, కాంప్లెక్స్, షంబాల అనే మూడు ప్రపంచాల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని చెప్పి, ఈ ప్రపంచాల నేపథ్యాలను వివరించారు నాగ్ అశ్విన్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్వ΄్నాదత్, ప్రియాంకా దత్, అనిల్ తడానీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న దీపికా పదుకోన్ స్టేజ్ నుంచి దిగేటప్పుడు ప్రభాస్, స్టేజ్ ఎక్కేటప్పుడు అమితాబ్ హెల్ప్ చేయడం ఈవెంట్లో హైలైట్గా నిలిచింది. -
లెజెండ్స్తో కలిసి పనిచేయడం అన్నింటి కంటే గొప్పది: ప్రభాస్
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, భైరవ ఆంథమ్కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను ముంబయిలో గ్రాండ్ నిర్వహించారు. ఈ వేడుకలో అమితాబ్, నాగ్ అశ్విన్, కమల్ హాసన్, దీపికా, ప్రభాస్, రానా సైతం పాల్గొన్నారు. ఈవెంట్లో రానా దగ్గుబాటి ఇంటరాక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ సందర్భంగా కల్కి మూవీకి సంబంధించి తమ అనుభవాలను పంచుకున్నారు.రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. 'గ్రేటెస్ట్ లెజెండ్స్తో వర్క్ చేసే అవకాశం రావడం ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం. అమితాబ్ కంట్రీ మొత్తం రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్. కమల్ సార్ సాగరసంగమం చూసి కమల్ హాసన్ లాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగా. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి క్లాత్ చుట్టుకొని ఆయనలానే యాక్ట్ చేసేవాడిని. దీపికతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. అందరికీ థాంక్ యూ' అని అన్నారు.కల్కి 2898 ఏడీ చిత్రంలో భాగం కావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అమితాబ్ అన్నారు. నాగ్ అశ్విన్ తన విజన్తో మహా అద్భుతంగా తీశారని కొనియాడారు. కల్కి ఎక్స్ పీరియన్స్ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని.. నాగి ఈ కథ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయానని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'నాగ్ అశ్విన్ మా గురువు బాలచందర్లా ఆర్డీనరిగా కనిపించే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు ఉంది. ఇందులో బ్యాడ్ మ్యాన్గా నటించా. నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్ ప్రైజ్ అవుతారు' అని అన్నారు. The biggest stars have come together. ✨#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/nK6hN7nmdU— Kalki 2898 AD (@Kalki2898AD) June 19, 2024 -
కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్.. బేబీ బంప్తో కనిపించిన దీపికా!
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.కల్కి రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా ముంబయిలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేదికపై కమల్ హాసన్, ప్రభాస్, అమితాబ్, రానా, దీపికా సందడి చేశారు. అయితే ఈవెంట్లో పాల్గొన్న దీపికా బేబీ బంప్తో కనిపించింది. బ్లాక్ అవుట్ఫిట్లో వచ్చిన బాలీవుడ్ భామ.. అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా.. ఈ చిత్రంలో దీపికా పదుకొణె సుమతి అనే గర్భిణిగా నటిస్తోంది. ఈ సందర్భంగా దీపికా పదుకొణె షూటింగ్లో తన అనుభవాలు పంచుకున్నారు.దీపికా మాట్లాడుతూ..'నాకిది ఇది ఒక అద్భుతమైన అనుభవం. చాలా నేర్చుకున్నా. ఇది పూర్తిగా నన్ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా,వృత్తిపరంగా ఒక అద్భుతమైన అనుభవం." అని అన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.Deepika.......🩶Prabhas lends a helping hand to #DeepikaPadukone to step down and Big B makes fun of it 💥💥Season 4 Brahmins #KALKI2898AD pic.twitter.com/FKi5OCWyyd— Lalita Rawat (@LalitaRawat_07) June 19, 2024 -
‘ఓ మంచి ఘోస్ట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నింద మైలురాయిగా నిలవాలి: నిఖిల్ సిద్ధార్థ్
‘‘నింద’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. మంచి కథతో పాటు చాలా క్వాలిటీతో తెరకెక్కించారు. నా కెరీర్లో ‘స్వామి రారా, కార్తికేయ’ సినిమాల్లా వరుణ్ సందేశ్ కెరీర్లో ‘నింద’ ఓ మైలురాయిగా నిలవాలి. ఈ చిత్రానికి ప్రేక్షకులు పెద్ద విజయం అందించాలి’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నింద’. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘నింద’ నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. రాజేశ్గారు ఎంతో ప్యాషన్తో ఈ సినిమా నిర్మించి, దర్శకత్వం వహించారు. మా చిత్రాన్ని మైత్రీ మూవీస్ వారు రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. నా కెరీర్లో ‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ’ చిత్రాల తర్వాత ‘నింద’ నిలుస్తుందని గర్వంగా చెప్పుకోగలను’’ అన్నారు. ‘‘నింద’ మూవీ అవుట్పుట్ నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. మా సినిమాతో వరుణ్ మంచి కమ్ బ్యాక్ ఇస్తాడు’’ అన్నారు రాజేశ్ జగన్నాథం. -
వరుణ్ సందేశ్ 'నింద' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘హనీమూన్ ఎక్స్ప్రెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నమ్మకం ఉంది కాబట్టే ముందే షో వేశారు
‘‘హరోం హర’ ట్రైలర్ చాలా నచ్చింది. సుధీర్బాబు మంచి సినిమా చేశాడని తెలిసి, ఈ వేడుకకి వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలకు నాలుగైదు రోజుల ముందే డిస్ట్రిబ్యూటర్స్ని పిలిచి షో వేశారంటే సినిమాపై యూనిట్కి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది’’ అని హీరో అడివి శేష్ అన్నారు. సుధీర్బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన చిత్రం ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్పై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ (టీజర్, ట్రైలర్, ΄ాటలు...) ్ర΄ామిసింగ్గా ఉంది. సుబ్రహ్మణ్యం, సుమంత్ లాంటి ΄్యాషన్ ఉన్న నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఈ సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. సుధీర్బాబు మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ‘హరోం హర’ లాంటి నేపథ్యంలో సినిమా రాలేదు. నాతో ఇంత మంచి సినిమా తీసిన జ్ఞానసాగర్కి థ్యాంక్స్. ఈ సినిమా చూశాక ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం’’ అన్నారు నిర్మాత సుమంత్. ‘‘హరోం హర’లోని తండ్రీ కొడుకుల ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యింది’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగో΄ాల్, డైరెక్టర్ మారుతి, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. -
Harom Hara Movie: ‘హరోం హర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
Chandini Chowdary: యేవం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫోటోలు)
-
‘మనమే’.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)
-
Manamey : శర్వానంద్ ‘మనమే’.. ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'భజే వాయు వేగం' ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Kartikeya Gummakonda: ప్రేక్షకులు అప్పుడే హీరోలా చూస్తారు
‘‘ఇప్పుడున్న నా ఇమేజ్కు సరైన మూవీ ‘భజే వాయు వేగం’. హీరో అంటే మనం ΄ోల్చుకునేలా ఉండాలి. అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు ఎంచుకునే మార్గాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలని భావిస్తాను. అప్పుడే అతన్ని ప్రేక్షకులు హీరోలా చూస్తారు. హీరోగా నాకు కొంచెం సామాజిక బాధ్యత ఉంది. అది నేను చేసే పాత్రల మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది’’ అని హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నారు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర చేశారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రం రేపు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ– ‘‘లాక్ డౌన్ టైమ్లో ‘భజే వాయు వేగం’ కథ వినిపించాడు ప్రశాంత్ రెడ్డి. ఈ కథ వినగానే కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ టైపులో ఊహించుకున్నాను. ‘ఖైదీ’లో ఉన్నంత యాక్షన్ ఉండదు కానీ, హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. యూవీ క్రియేషన్స్లో సినిమా అనగానే మేకింగ్, ΄ోస్ట్ ్ర΄÷డక్షన్, రిలీజ్ అన్నీ సరిగ్గా జరుగుతాయనే నమ్మకం వచ్చింది. ‘భజే వాయు వేగం’లో ఫస్టాఫ్లో ఎమోషన్ ఉన్న హీరోను చూస్తారు.సెకండాఫ్లో ఆ ఎమోషన్ వల్ల ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడనేది చూపించాం. ఈ సినిమా క్రెడిట్ వంద శాతం దర్శకుడిదే. హీరోగా చేస్తున్న టైమ్లో ‘గ్యాంగ్ లీడర్, వలిమై’ చిత్రాల్లో విలన్గా నటించినందుకు ఫీల్ అవడం లేదు. ఆ సినిమాల ద్వారా నాకు అమెరికాలో, తమిళ పరిశ్రమలో గుర్తింపు దక్కింది. ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత తెలుగు, తమిళంలో విలన్గా చాన్స్ వచ్చినా పాత్రలు నచ్చక చేయలేదు. నా తర్వాతి సినిమాని కూడా ప్రశాంత్ రెడ్డితోనే చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
మందేసి హీరోయిన్ అంజలిని స్టేజ్ పై తోసేసిన బాలకృష్ణ
-
‘గం. గం.. గణేశా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు ఎలాంటి బిజినెస్లు లేవని.. చనిపోయే వరకు సినిమాలే చేస్తానని అన్నారు.దిల్ రాజు మాట్లాడుతూ.. 'మేము 25 ఏళ్లు కష్టపడితేనే వచ్చిన బ్రాండ్ ఇది. ఎస్వీసీ(శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్) కానీ, డీఆర్పీ(దిల్ రాజు ప్రొడక్షన్స్) కానీ అంతా ఈజీగా వచ్చింది కాదు. నాకు సినిమా తప్ప ఎలాంటి బిజినెస్లు లేవు. ప్రతి నిమిషం సినిమా కోసం పనిచేశా. నాకు సినిమా తప్ప వేరేది ఏది ఎక్కదు. చాలా మంది నన్ను అడుగుతుంటారు. మీరు ఏదైనా బిజినెస్ చేయొచ్చు కదా అని. నాకు సినిమా బిజినెస్లు ఉంటే చెప్పండి. అంతే కానీ వేరే వాటి గురించి మాట్లాడొద్దు అని ఒకటే మాట చెబుతా. నేను చచ్చేవరకు సినిమాలే చేస్తా. సినిమా తప్ప నా నోటి నుంచి మరేది రాదు.' అని మాట్లాడారు. కాగా.. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. అనంతరం మాట్లాడుతూ..'హర్షిత్ రెడ్డి సినిమాపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారాడు. హన్షిత చిన్నప్పటినుంచి షూటింగ్స్కు వెళ్లేది. కానీ సినిమా రంగంలోకి వస్తుందని ఊహించలేదు. వీరిద్దరు కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై చిత్రాలు నిర్మిస్తున్నారు. తొలి సినిమా బలగంతో వేణు యెల్దండిని దర్శకుడిగా పరిచయం చేశారు. లవ్ మీతో అరుణ్కు ఛాన్స్ ఇచ్చారు. మరికొన్ని సినిమాల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. కొత్తవారిని ప్రోత్సహించాలనేదే మా లక్ష్యం' అని అన్నారు. -
గ్రాండ్గా జరిగిన 'డర్టీ ఫెలో' ప్రీ రిలీజ్ ఫంక్షన్
ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా చేసిన సినిమా 'డర్టీ ఫెలో'. దీపిక సింగ్, సిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాలా హీరోయిన్లుగా నటించారు. శాంతి బాబు నిర్మించారు. ఆడారి మూర్తి సాయి దర్శకుడు. ఈ నెల 24న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(ఇదీ చదవండి: Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్)మా సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇది ధమాకా, బ్లాస్ట్ లాంటి సక్సెస్ అందుకుంటుందని హీరో శాంతి చంద్ర చెప్పుకొచ్చారు. సినిమాను థియేటర్ లోనే చూడండి. చిన్న సినిమాలను బతికించండి. లేకుంటే ఒకప్పుడు తోలు బొమ్మలాటలు ఆడేవారంట అని చెప్పుకున్నట్లే. థియేటర్ లో సినిమాలు ప్రదర్శించేవారంట అని రేపటి తరాలు చెప్పుకుంటాయని డైరెక్టర్ ఆడారి మూర్తి సాయి ఆవేదన వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?) -
‘బిగ్ బ్రదర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)