-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాంకర్ సుమ.. పలువురు సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
రామసేతు ఒడిలో మోదీ ప్రాణాయామం
చెన్నై: రామసేతు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాయామం చేశారు. సముద్ర నీటితో ప్రార్థనలు చేశారు. తీరంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామాయణంతో సంబంధం ఉన్న తమిళనాడులోని అరిచల్మునై జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. శనివారం రాత్రి రామేశ్వరంలో బస చేసిన మోదీ.. రామసేతు నిర్మించిన ప్రదేశంగా పేరొందిన అరిచల్మునైకి వెళ్లారు. రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాల మూడు రోజుల పర్యటనను ప్రధాని మోదీ తమిళనాడులో ముగించనున్నారు. శుక్రవారం చెన్నైలో ఖేలో ఇండియా గేమ్స్ 2023ను ప్రారంభించారు. శనివారం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి, రామేశ్వరంలోని అరుల్మిగు రామనాథస్వామి ఆలయాలను సందర్శించారు. సోమవారం అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో రామాయణంతో సంబంధం ఉన్న తమిళనాడు ఆలయాలను మోదీ సందర్శించారు. #WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi visits Arichal Munai point in Dhanushkodi, which is said to be the place from where the Ram Setu was built. pic.twitter.com/GGFRwdhwSH— ANI (@ANI) January 21, 2024 అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకకు దేశంలో దాదాపు 7000 మంది ప్రముఖులు హాజరవుతారు. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్ సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ దాదాపు పూర్తయింది. టన్నెల్లో అమర్చిన పైప్లైన్ ద్వారా రెస్క్యూ బృందం వారిని బయటకు తీసుకురానుంది. దాదాపు 17 రోజుల పాటు టన్నెల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులు బయటకు వస్తున్నారు. వారంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థించారు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్. నవంబర్ 12న ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ రంగంలోకి దిగారు. రెస్క్యూ బృందం ప్రయత్నాలు ఫలించి బాధితులు బయటపడుతున్న వేళ ఆర్నాల్డ్ డిక్స్ మంగళవారం టన్నెల్ సైట్ సమీపంలోని చిన్న దేవాలయం వద్ద కార్మికుల క్షేమం కోసం అర్చకులతో కలిసి పూజలు చేశారు. దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా మారింది. While long awaited breakthrough in #Uttarkashi tunnel operation is achieved, visual of Prof. Arnold Dix, international tunnelling expert, bowing and praying before temple near the site is so heartwarming. Prayers for safety of all the trapped workers. pic.twitter.com/CcrkeEZZ9i — Arun Bothra 🇮🇳 (@arunbothra) November 28, 2023 -
చంద్రయాన్-3: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇస్రో శాస్త్రవేత్తలు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. చంద్రయాన్-3 యొక్క సూక్ష్మ నమూనాలను శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్–3 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ఎంకే–3(ఎల్వీఎం–3) రాకెట్ శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. చదవండి: బాహుబలి రాకెట్ చంద్రయాన్ 3 ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రయోగం ఎట్టిపరిస్థితుల్లోనూ గురి తప్పకూడదన్న లక్ష్యంతో శ్రమిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎల్వీఎం–3 రాకెట్పైనే కేంద్రీకృతమై ఉంది. చంద్రయాన్–3 మిషన్లో భాగంగా ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ను చందమామ వద్దకు మోసుకెళ్లే ఈ రాకెట్కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
రోజంతా కేజ్రీవాల్ ధ్యానం
న్యూఢిల్లీ: దేశాభ్యున్నతి కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం రోజంతా ధ్యానం, పూజలు, ప్రార్థనలు చేశారు. అవి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం దాకా కొనసాగినట్టు ఆప్ ట్వీట్ చేసింది. అంతకుముందు ఉదయం ఢిల్లీలో రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధిని కేజ్రీవాల్ సందర్శించి నివాళులర్పించారు. హోలీ సందర్భంగా దేశం కోసం ప్రార్థనలు చేస్తానని కేజ్రీవాల్ మంగళవారమే పేర్కొన్నారు. దేశం కోసం మంచి పనులు చేస్తున్న వారిని జైళ్లపాలు చేస్తున్నారని, దోచుకుంటున్న వారిని మాత్రం వదిలేస్తున్నారని ఆరోపించారు. -
రిషభ్ పంత్ కోలుకోవాలని టీమిండియా క్రికెటర్ల పూజలు.. ఫోటోలు వైరల్
-
రిషభ్ పంత్కు ప్రమాదం.. ప్రార్థిస్తున్నా అంటూ ఊర్వశీ రౌతేలా పోస్ట్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాగా స్వస్థలం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో.. రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతడు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్కు గురైన తర్వాత పూర్తిగా దగ్ధమైయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రిషభ్ పంత్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం డెహ్రాడూన్లోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇక పంత్ త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా నటి ఊర్వశీ రౌతేలా సైతం పంత్ యాక్సిడెంట్ప తనదైన శైలిలో స్పందించింది. పేరు ప్రస్తావించకుండా.. ప్రార్థిస్తున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టును షేర్ చేసింది. ఊర్వశీ పోస్ట్పై చాలామంది ఫ్యాన్స్ పంత్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఊర్వశీ-రిషభ్ పంత్ మధ్య గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో కోల్డ్వార్ నెలకొన్న సంగతి తెలిసిందే. తనకోసం ఓ హోట్లో ఆర్పీ చాలా సేపు ఎదురుచూశాడని ఊర్వశీ పేర్కొనగా.. కొంతమంది పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడతారని, ఇలాంటి వాళ్లనే చేస్తే జాలేస్తుందని రిషభ్ పంత్ ఊర్వశీని ఉద్దేశిస్తూ ఆ మధ్య పోస్ట్ చేసిన సంగతి విధితమే. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
భర్తల ఆయురారోగ్యాల కోసం ఇంకా జల్లెడ నుంచి చంద్రుడిని చూస్తారా?
జైపూర్: కర్వాచౌత్ నాడు భారతీయ మహిళలు జల్లెడ ద్వారా చంద్రుడిని చూసి తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు నిర్వహించడం దురదృష్టకరమని రాజస్తాన్ మంత్రి గోవింద్ రామ్ మేఘవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు సైన్స్ ప్రపంచంలో బతుకుతూ ఉంటే, మన దేశంలో జల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తూ భర్త ఆయుష్షు కోసం పూజలు చేస్తున్నారని మరి ఆ భర్తలు భార్యల కోసం జల్లెడలోంచి ఎప్పుడూ చంద్రుడిని చూడలేదని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎందరో భారతీయ మహిళలు విమాన పైలెట్లుగా ఉన్నారని, కల్పనా చావ్లా వంటి వారు అంతరిక్షంలోకి వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రామ్లాల్ శర్మ గుర్తు చేశారు. -
Qutub Minar Row: ఆలయ పునరుద్ధరణ సాధ్యం కాదు!
న్యూఢిల్లీ: రక్షిత స్మారక ప్రదేశం అయితే కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో.. ఆలయాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది. భారత పురావస్తు సర్వే శాఖ కీలక ప్రకటన చేసింది. కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఆలయపునరుద్ధరణ వ్యవహారం సాకేత్ కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో.. ఆ స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలనే అభ్యర్థనను ఏఎస్ఐ తోసిపుచ్చింది. కుతుబ్ మినార్ అనేది 1914 నుంచి పరిరక్షణ స్మారకంగా కొనసాగుతోంది. అలాంటి చోటులో నిర్మాణాలను మార్చడం సాధ్యం కాదు. స్మారక చిహ్నం వద్ద ఆరాధన పునరుద్ధరణ అనుమతించబడదు అని ఏఎస్ఐ స్పష్టం చేసింది. పూజలకే కాదు.. నమాజ్కు నో ఆర్కియాలజీ నిబంధనల ప్రకారం.. నివాసం లేని ప్రదేశాల్లో ప్రార్థనలకు అనుమతించరు. ఈ లెక్కన.. కుతుబ్మినార్ దగ్గర పూజలకే కాదు.. నమాజ్కు అనుమతులు ఇవ్వలేదు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండగా.. తాము తాజాగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. పాలసీ ప్రకారం.. నమాజ్ను నిలిపివేయాలని గతంలోనే కోరామని, పంపిన ఆదేశాలు కూడా ఎప్పటివో అని స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీద్ సర్వే వ్యవహారం వార్తల్లో నిలిచి వేళ.. ఏఎస్ఐ మాజీ రీజినల్ డైరెక్టర్ ధరమ్వీర్ శర్మ కుతుబ్మినార్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుతుబ్ మినార్ను కుతుబ్ అల్ దిన్ ఐబక్ కట్టించలేదని, సూర్యుడి దశను అధ్యయనం చేసేందుకు రాజా విక్రమాదిత్య కట్టించాడని వాదిస్తున్నాడు. మరోవైపు హిందూ సంఘాలు కుతుబ్ మినార్ వద్దకు చేరుకుని విష్ణు స్తంభ్గా పేరు మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. చదవండి: కుతుబ్ మినార్ తవ్వకాలపై కేంద్రం క్లారిటీ -
పుతిన్ మానసిక వైద్యం చేయించుకో... మిన్నంటుతున్న నిరసనలు
కీవ్: రష్యా దాడిని నిరసిస్తూ యూరప్ అంతటా నిరసనలు మిన్నంటుతున్నాయి. ‘పుతిన్! మానసిక వైద్యం చేయించుకో. ఉక్రెయిన్ను, ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వు’ అంటూ జర్మనీ రాజధాని బెర్లిన్లో భారీ ప్లకార్డుల ప్రదర్శన జరిగింది. మరోవైపు ప్రపంచ దేశాల నుంచి ఉక్రెయిన్కు సాయం కూడా వెల్లువెత్తుతోంది. 100 టన్నుల మేరకు మందులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాకులు, బ్లాంకెట్లు తదితరాలను పంపుతున్నట్టు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. దాంతోపాటు రష్యాతో తనకున్న సత్సంబంధాల దృష్ట్యా యుద్ధాన్ని ఆపేందుకు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకొచ్చింది. ఉక్రెయిన్కు మరింత సైనిక సాయం పంపడంపై ఈయూ దేశాల విదేశాంగ మంత్రులు ఆదివారం రాత్రి పొద్దుపోయాక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్ దళాలకు తక్షణం సాయం చేయడం కనీస ధర్మమని మంత్రులకు ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ విజ్ఞప్తి చేశారు. పోప్ ప్రార్థనలు ఉక్రెయిన్లో ప్రాణ నష్టానికి అడ్డుకట్ట పడి శాంతి నెలకొనాలంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. సె యింట్ పీటర్స్ స్క్వేర్లో ఆదివారం జరిగిన మధ్యాహ్న ప్రార్థనల్లో పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
భజనలు చేస్తూ మోదీ.. లంగర్లో వడ్డిస్తూ రాహుల్
వారణాసి/ఢిల్లీ: పంజాబ్ ఎన్నికల సందడి అక్కడికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని ఉత్తరప్రదేశ్ వారణాసిలో కనిపించింది. కాంగ్రెస్ నుంచి ఆప్ వరకు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులందరూ గురు రవిదాస్ సంస్మరణలో మునిగితేలారు. 15వ శతాబ్దానికి చెందిన దళిత నాయకుడు గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని బుధవారం రాజకీయ నాయకులు, భక్తులతో వారణాసి కిటకిటలాడిపోయింది. రవిదాస్ అనుచరుల ఓట్లను లక్ష్యంగా చేసుకొని అన్ని పార్టీల వారు పోటీలు పడి మరీ ప్రార్థనలు చేశారు. Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg — Narendra Modi (@narendramodi) February 16, 2022 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కరోల్బాగ్లో రవిదాస్ ఆలయాన్ని సందర్శించి మహిళా భక్తులతో కలిసి కూర్చొని భజనలు చేశారు. రవిదాస్ జన్మస్థలమైన వారణాసిలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఒక ఎంపీగా తనకా అవకాశం దక్కడం అదృష్టమని మోదీ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారణాసిలోని రవిదాస్ ఆలయంలో లంగర్ (సమూహ భోజనాలు)లో భక్తులకు భోజనాలు వడ్డించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ తెల్లవారుజామున 4 గంటలకే రవిదాస్ ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, ఆప్ ఎంపీ సంజయ్సింగ్ కూడా ప్రార్థనలు చేశారు. రవిదాస్కి ఎందుకింత ప్రాధాన్యం ► గురు రవిదాస్ వారణాసిలోని గోవర్ధన్పూర్ గ్రామంలో చర్మకారుల కుటుంబంలో జన్మించారు. రవిదాసియా అనే ప్రత్యేక మతాన్ని వ్యాప్తి చేశారు. పంజాబ్లో ప్రముఖ డేరా సచ్చఖానంద్ బల్లాన్ రవిదాసియా మతాన్నే ఆచరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ డేరాకు 20 లక్షల మంది అనుచరులు ఉన్నారు. ► చిన్నప్పట్నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్న ఆయన సమాజంలో నెలకొన్న వర్ణ వివక్షను ప్రశ్నిస్తూ కవిత్వం రాశారు. ఆయన రాసిన కవిత్వానికి, రవిదాసులో సాహితీవేత్తకి కులాలకతీతంగా అభిమానులున్నారు. ► సిక్కు రాడికల్ సంస్థకు చెందిన కొందరు నాయకులు 2009లో వియన్నాలో గురు రవిదాస్ డేరాలపై జరిపిన దాడిలో ఒక నాయకుడు మరణించాడు. దీంతో సిక్కు మతంతో తమకు సంబంధం లేదని ఆ డేరా ప్రకటించింది. గురు గ్రంథ సాహిబ్ స్థానంలో రవిదాస్ రచించిన 200 కీర్తనలతో కూడిన అమృత్వాణిని తీసుకువచ్చారు. అదే తమకు మత గ్రంథమని ప్రకటించుకున్నారు. ► పంజాబ్ జనాభాలో 32 శాతం దళితులున్నారు. వారిలో ఎక్కువ మంది రవిదాస్ అనుచరులు కావడంతో రాజకీయ పార్టీల తలరాతలు మార్చే ఓటు బ్యాంకుగా మారారు. ► ఈ సారి పంజాబ్ ఎన్నికలు ఫిబ్రవరి 14నే జరపాలని తొలుత ఎన్నికల సంఘం నిర్ణయించినప్పటికీ రవిదాస్ జయంతి కోసం ఎన్నికల్ని కూడా 20 తేదీకి వాయిదా వేసింది. ► పంజాబ్లో దళితుల ఓట్లను ఆకర్షించడానికి గతంలో బీఎస్పీ ప్రయత్నించి కొంత సఫలమైంది. అయితే ఆ పార్టీకి రామ్దాసియా సిక్కుల మద్దతు మాత్రమే లభించింది. ఈసారి వీరి ఓట్ల కోసం ప్రతీ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వారణాసిలోని రవిదాస్ ఆలయంలో వడ్డిస్తున్న రాహుల్ -
రవిదాస్ దేవాలయంలో ప్రార్థనలు చేసిన మోదీ
Modi offered prayers at Guru Ravidas Vishram Dham Mandir: ప్రధాని నరేంద్ర మోదీ గురు రవిదాస్ జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని కరోల్ బాగ్లోని రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్లో ప్రార్థనలు చేశారు. ఆయన భక్తులతో మమైకమై ఆలయంలో 'షాబాద్ కీర్తన'లో పాల్గొన్నారు. సందర్శకుల పుస్తకంలో కూడా గురు రవిదాస్ జీవితం అందరికీ ఆదర్శమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పలు ఫోటోలు, వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ట్విట్టర్లో ...."రవిదాస్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. సాధువు చూపిన మార్గాన్ని అనుసరించి సమానత్వం, సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి మనమందరం సహకరిద్దాం" అని ట్వీట్ చేశారు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా రవిదాస్ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సెలవు ప్రకటించింది. గురు రవిదాస్ 15 లేదా 16వ శతాబ్దపు భక్తి ఉద్యమకారుల్లో ఒకరు. అతని శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్లో ప్రముఖంగా ఉంటాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ పౌర్ణమిని గురుదాస్ జయంతిగా జరుపుకుంటారు. గురు రవిదాస్ లింగ లేదా కులం ఆధారంగా చేసే విభజనను వ్యతిరేకించారు. లింగ సమానత్వం కోసం కృషి చేశారు. అంతేకాదు రవిదాస్ని ప్రముఖ భక్తి ఉద్యమ కవయిత్రి మీరా బాయికి ఆధ్యాత్మిక మార్గదర్శి అని కొందరు అంటుంటారు. Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg — Narendra Modi (@narendramodi) February 16, 2022 (చదవండి: మోడల్గా మారిన 60 ఏళ్ల కూలీ!) -
పాఠశాలల్లో ప్రార్థనలపై వివాదం
నశంకరి: పాఠశాలలకు విద్యార్థులు హిజబ్– కాషాయ కండువాలతో రావడం తీవ్ర వివాదాస్పదం కాగా, దక్షిణ కన్నడ, బాగల్కోటే జిల్లాల్లో రెండు పా ఠశాలల్లో ఒకవర్గం విద్యార్థులు పాఠశాలల్లో నమాజ్ చేయడం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. ఇలా అయితే మేము భజన చేస్తామని మరోవర్గం విద్యార్థులు హెచ్చరించారు. దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా అంకత్తడ్డ ప్రభుత్వ పాఠశాలలో 10 మందికి పైగా విద్యార్థులు శుక్రవారం నమాజ్ చేసినట్లు వీడియోలు వచ్చాయి. ఇకపై ఎవరైనా తరగతి గదుల్లో నమాజ్ చేసినట్లు కనబడితే తమ విద్యార్థులు భజన చేస్తారని పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్భండారీ హెచ్చరించారు. ఇళకల్ ప్రభుత్వ పా ఠశాలలోనూ ఇలాంటి దృశ్యమే పునరావృతమైంది. -
ఇదేం చిత్రం.. కోహ్లి సెంచరీ కోసం పాక్ ఆటగాళ్ల మొక్కులు
టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లి సెంచరీ మార్క్ సాధించి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. కోహ్లి సెంచరీ లేకుండా ఇన్నేళ్లు ఉండడం ఇదే తొలిసారి. అతను ఎప్పుడు సెంచరీ కొడతాడా అని క్రికెట్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లి అభిమానులే గాక.. పాక్ క్రికెటర్లు సహా ఆ దేశ క్రికెట్ అభిమానులు కూడా కోహ్లి సెంచరీ కోసం పరితపిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని పీఎస్ఎల్(పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్)లో పాల్గొంటున్న ఇస్లామాబాద్ యునైటెడ్ స్ట్రాటెజీ మేనేజర్ హసన్ చీమా తన ట్విటర్లో వెల్లడించాడు. చదవండి: ర్యాంకింగ్స్లో దుమ్మురేపిన ఐపీఎల్.. రెండో స్థానంలో సమ్మర్ ఒలింపిక్స్ ''పీఎస్ఎల్ గురించి ఎక్కువగా ట్వీట్ చేయకూడదు అనుకున్నా. కానీ ఒక విషయం నాకు జీర్ణం కావడం లేదు. పీఎస్ఎల్లో ఆడుతున్న పాక్ ఆటగాళ్ల దగ్గర నుంచి అభిమానుల వరకు ఒక విషయాన్ని బలంగా కోరుకుంటున్నారు. అదేంటంటే.. కోహ్లి 71వ సెంచరీ అందుకోవాలని. దీనికోసం పాక్ ఆటగాళ్లు సహా ఫ్యాన్స్ మొక్కుకుంటున్నారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించలేదు. పేరుకే ప్రత్యర్థులం కానీ క్రికెట్లో రాణించే ఆటగాడికి ఏ దేశం నుంచైనా అభిమానులు ఉంటారన్న దానికి కోహ్లియే ఉదాహరణ. కోహ్లి కచ్చితంగా 71వ సెంచరీ సాధిస్తాడు.'' అని ట్వీట్ చేశాడు. ఇది విన్న టీమిండియా అభిమానులు.. ''ఇదేం చిత్రమో.. బయటకు మాత్రం మా చేతిలో పాక్ ఓడిపోతే.. మన దేశాన్ని తిడతారు.'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక కోహ్లి ఇటీవలే టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకముందే వన్డే, టి20 కెప్టెన్గా పక్కకు తప్పుకున్నాడు. ఇకపై సీనియర్ బ్యాట్స్మన్గా జట్టుకు సేవలందించనున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్లో కోహ్లి పర్వాలేదనిపించాడు. అందరు విఫలమైనచోటు తాను కాస్త సక్సెస్ అయ్యాడు. కేప్టౌన్ టెస్టులో కోహ్లి సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ 21 పరుగుల తేడాతో ఆ ముచ్చట తీరకుండానే 79 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే , మూడో వన్డేలో హాఫ్ సెంచరీలు సాధించినప్పటికి.. వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. 71వ సెంచరీ సాధిస్తాడని ఎదురుచూస్తున్న కోహ్లి అభిమానుల కల.. విండీస్తో సిరీస్లోనైనా తీరుతుందేమో చూడాలి. కాగా ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా వెస్టిండీస్తో సిరీస్ ఆడనుంది. చదవండి: సిక్స్ కొడితే ఫైనల్కు.. బౌలర్కు హ్యాట్రిక్; ఆఖరి బంతికి ట్విస్ట్ -
విషాదం: తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం
న్యూఢిల్లీ: లైబీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో తొక్కిసలాటలో 29 మంది మరణించారు. వీరిలో 11 మంది పిల్లలు, ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చ వద్ద ఆరాధన వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో చర్చిలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. దీంతో సమావేశానికి హాజరైన వందలాది భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. లైబీరియన్ రెడ్క్రాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. మరోవైపు లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ సంఘటనా సందర్శించి మృతులకు నివాళుర్పించారు. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు."ఇది దేశానికి విచారకరమైన రోజు." అని డిప్యూటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ విచారం వ్యక్తం చేశారు. -
దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోజా
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్టుగా ఆమె తెలిపారు. మరోవైపు తెలగు రాష్ట్రాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతం పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్ష్మీదేవి నట్టింట్లోకి నడిచిరావాలని, బాధలు, కష్టాలు తొలగిపోవాలని వరలక్ష్మిని కొలుస్తున్నారు. కరోనా నేపథ్యంలో చాలా మంది ఇళ్లలోనే పూజలు చేస్తున్నారు. నిర్మాత, నటి మంజుల ఘట్టమనేని కూడా ఇంట్లోనే వరలక్ష్మీ వత్రం పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. లక్ష్మీ దేవి అందరి జీవితాల్లోకి ఆనందం, విజయం, ఆరోగ్యం, సంపద తీసుకురావాలని ఆకాంక్షించారు. హీరోయిన్ ప్రణీత కూడా అందరికి వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఫాదర్ పాలు దొంగిలించిన పిల్లి
పిల్లి పాలు తాగడం చాలా సాధారణమైన అంశం. కానీ ప్రస్తుతం ఓ పిల్లి పాలు తాగుతున్న వీడియో మాత్రం ప్రపంచం అంతా చక్కర్లు కొడతూ తెగ వైరలవ్వడమే కాక పిల్లిని.. దాని యజమానిని ఓవర్నైట్లో స్టార్స్ని చేసింది. కాంటర్బరీ కేథడ్రాల్ ఉదయం ప్రార్థనల లైవ్ స్ట్రీమ్ సెషన్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. డీన్ లైవ్లో తన ఉపన్యాసాలను చదువుతుండగా.. ఆయన 13 ఏళ్ల పెంపుడు పిల్లి టైగర్ ఎలాంటి జంకు లేకుండా అక్కడకు వచ్చి డీన్ పక్కన ఉన్న కుర్చిపై కూర్చుటుంది. అంతటితో ఊరుకోక ఆ పక్కనే టేబుల్ మీద డీన్ కోసం ఉంచిన పాల వాసనను పసిగడుతుంది. వెంటనే దాని మీదకు దూకి పాలు తాగడం ప్రారంభించింది. ఇది అంతా వీడియోలో రికార్డయ్యింది. టైగర్ను గమనించిన డీన్.. ‘క్షమించండి ఈ ఉదయం మాకొక స్నేహితుడు దొరికాడు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. WATCH: Thirteen-year-old Tiger the cat joins the livestream of Canterbury Cathedral's morning prayers and drinks milk that was meant for the Dean pic.twitter.com/wZRDO5Uph6 — Reuters India (@ReutersIndia) July 10, 2020 -
ఇళ్లలోనే రంజాన్ వేడుకలు..
సాక్షి, అనంతపురం: జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ముస్లింలు రంజాన్ను జరుపుకున్నారు. మసీదుల్లో ఐదు మంది చొప్పున మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎవరి ఇళ్లల్లో వారు కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు. ముస్లింలు అత్యధికంగా నివసించే అనంతపురం, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి తదితర పట్టణాల్లో రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి అంతా సుభిక్షంగా ఉండాలని.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అల్లాను ప్రార్థించారు. ముస్లింలకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సహకరించాలని వారు ఆకాంక్షించారు. కర్నూలు: జిల్లాలో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు మసీదుల్లో భౌతిక దూరం పాటిస్తూ ముస్లిం సోదరులు ప్రార్థనలు జరుపుకున్నారు. కరోనా వైరస్ కట్టడి కి అందరు కలిసి కట్టుగా కృషి చేయ్యాలని ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. తూర్పుగోదావరి: కాకినాడలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఇళ్ల వద్దే కుటుంబసభ్యులతో కలిసి ప్రార్ధనలు నిర్వహించుకున్నారు. వైఎస్సార్ జిల్లా: రంజాన్ సందర్భంగా కమలాపురం నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయ కర్త దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి. జడ్పీటీసీ నరేన్ రామాంజుల రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజులు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాహ్ దగ్గరయిన ముస్లిం సోదరులందరూ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇళ్లలోనే ఉండి నవాజ్ ఈద్ ప్రార్థనలు చేసి ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ముస్లిం సోదరులకు అభినందనలు తెలిపారు. విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్కే దక్కిందన్నారు. -
ఇళ్ల వద్దే ప్రార్ధనలు చేసుకోవాలి..
-
కరోనా: వారిపైనే సిక్కోలు దృష్టి
సాక్షి, శ్రీకాకుళం: ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిపైనే సిక్కోలు పరిస్థితి ఆధారపడింది. రాష్ట్రంలో కరో నా కేసులు అమాంతం పెరగడానికి కారణం ఢిల్లీ తబ్లిగీ జమాత్ ప్రార్థనలే అన్న సంగతి అందరికీ తె లిసిందే. అయితే ఆ ప్రార్థనలకు మన జిల్లా నుంచి ఎవ్వరూ హాజరు కాలేదు. కానీ ఆ సమయంలోనే ఢిల్లీ ప్రయాణాలు చేసిన వారు ఉన్నారు. వారిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఏ మాత్రం అ లసత్వం వహించినా చైన్లా కరోనా వ్యాపించే అవకాశం ఉంది. దాన్ని అడ్డుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక్కొక్కరిగా గుర్తిస్తున్నారు. వెంటవెంటనే శాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి 50వరకు శాంపిల్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటి ఫలితాలు ఏం వస్తాయోనన్న టెన్షన్ జిల్లా వాసులకు పట్టుకుంది. మొ న్నటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారితోనే క రోనా వ్యాపిస్తుందని భయం ఉండేది. దాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్త మైంది. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ క్వా రంటైన్లో పెట్టింది. జిల్లాకు 1455 మంది విదేశాల నుంచి రాగా ఇప్పటివరకు 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారు 1217 మంది ఉన్నారు. 14 రోజుల లోపు క్వారంటైన్లో ఉన్న వారు 228 మంది మాత్రమే. ఇప్పటివరకు వారిలో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించలేదు. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారిపై కాస్త భయం తగ్గింది. అనుకోకుండా ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింంది. మన జిల్లాలో ఇంతవరకు ఒక్క పాజిటివ్ లేదు. తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి మన జిల్లా నుంచి ముస్లింలెవరూ హాజరు కాలేదు. కాకపోతే ఆ కార్యక్రమానికి వెళ్లి తిరిగిన వచ్చిన వివిధ ప్రాంతాల వారితో రైళ్లలో ప్రయాణించే వా రు, ఆ సమయంలో వివిధ అవసరాల కోసం ఢిల్లీ లో ఉన్న వారు మన జిల్లాలో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఢిల్లీ సెల్ టవర్స్ సిగ్నల్ ఆధారంగా ఫోన్ నంబర్లు సేకరించి వారిని సంప్రదిస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ టవర్తో సంబంధం ఉన్న సెల్ నంబర్లకు జిల్లా నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్ ఆధారంగా గుర్తిస్తున్నారు. మొత్తానికి దొరికిన వారికి సంబంధించి శాంపిల్స్ తీస్తున్నారు. అటు ఢిల్లీ ప్రయాణికులు, ఇటు కరోనా లక్షణాల అనుమానితులకు సంబంధించి 95 శాంపిల్స్ తీసి పంపించగా వా టిలో ఇప్పటివరకు 49 నెగిటివ్ వచ్చాయి. మరో 46 శాంపిల్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటిపైనే ఇప్పుడందరిలో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ నుంచి వచ్చిన వారిపై ఆరా పొందూరు: మండలానికి ఢిల్లీ నుంచి వచ్చిన వారిని తహసీల్దార్ తామరాపల్లి తాడివలస పీహెచ్సీ డాక్టర్ సాగరికతో కలిసి పరిశీలించారు. రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చిన సమాచారం మేరకు 10 మంది ఢిల్లీ నుంచి వచ్చారని తెలిసిందని అన్నారు. వారిలో ఐదుగురు మాత్రమే మండలంలో ఉండగా మిగిలిన వారు రాలేదని చెప్పారు. ముగ్గురిని క్వా రంటైన్కు పంపించామని, ఇద్దరిని హోమ్ క్వారెంటైన్లో ఉంచామని తెలిపారు. వారిలో ఇద్దరికి పరీక్షలు జరిపించగా సాధారణ దగ్గు మాత్రమే ఉందని చెప్పారు. లాక్డౌన్కు సహకరించండి కాశీబుగ్గ: ప్రజలంతా ఇళ్లకే పరిమితమై లాక్డౌన్కు సహకరించాలని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి కోరారు. శుక్రవారం కాశీబుగ్గలో సీఐ వేణుగోపాలరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. డివిజన్ పరిధిలోని 12 మండలాలకు ఢిల్లీ నుంచి వచ్చిన వారు 70 మందిని గుర్తించి జిల్లా కేంద్రంలోని క్వారంటైన్ సెంటర్కు తరలించామన్నారు. -
కరోనా వైరస్: తేరుకోకపోతే ముప్పే..
సాక్షి, కాకినాడ: కరోనా మహమ్మారి జిల్లాను అతలాకుతలం చేస్తోంది. జిల్లాలో బుధవారం నాటికి ఆరుగురిలో పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మరో 97 మందిని వైరాలజీ టెస్టులు చేసేందుకు కాకినాడ జీజీహెచ్కు తరలించి చర్యలు తీసుకుంటోంది. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతోపాటు పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా రాజమహేంద్రవరంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఢిల్లీ వెళ్లి వచ్చిన కాకినాడ, పెద్దాపురాల్లోని ఇద్దరు వ్యక్తుల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించింది. (కరోనా : అమెరికాలో ఒక్క రోజులోనే 884 మంది మృతి) దీంతో కాకినాడలోని కొంత భాగాన్ని జిల్లా యంత్రాంగం రెడ్ జోన్గా ప్రకటించింది. ఆ ప్రాంతంలో గట్టి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసి నియంత్రణ చర్యలు చేపట్టింది. వీరిలో రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు, కాకినాడకు చెందిన ఇద్దరు, పెద్దాపురానికి చెందిన ఒకరు, పిఠాపురానికి చెందిన ఒకరిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. రాజమహేంద్రవరం శాంతినగర్లో పాజిటివ్ వచ్చిన రోగి కోడలు (36), మనవడు (18), మనుమరాలు (16)కు సైతం పాజిటివ్గా తేలింది. తేరుకోకపోతే ముప్పే.. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు, ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు అధికారులు నిర్ధారించిన 25 మంది ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారనే విషయాలు రాబట్టడంలో అధికారులు తలమునకలయ్యారు. ఢిల్లీతోపాటు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ స్వచ్ఛందంగా వచ్చి సంబంధిత అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ ఉచిత వైద్య నిర్ధారణతో పాటు చికిత్స కూడా అందజేస్తామన్నారు. (కేవలం 29 సబ్జెక్టులకే పరీక్షలు ) రెవెన్యూ, పోలీస్, వైద్యాధికారులతో ర్యాపిడ్ యాక్షన్, జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా, పట్టణ, మండల, గ్రామ స్థాయి అధికారుల సమన్వయంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను గురించి ఈ కమిటీలు అధికారులకు నివేదికలిస్తున్నాయి. ఇతర దేశాలు, రాష్ట్రాలు, ఢిల్లీ నుంచి వచ్చిన వారి వివరాలను తెలిపేలా కలెక్టరేట్లో ప్రత్యేక అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ గార్డెన్స్ ప్రాంతంలో హై అలర్ట్ పిఠాపురం: ఒక యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్థానిక వైఎస్సార్ గార్డెన్స్ ఏరియాలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన కాకినాడకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా ఆ వ్యక్తి గత 20వ తేదీన పిఠాపురం వచ్చి ఇక్కడ ఒక విశ్రాంత పోలీసు అధికారి, సహకార సంఘం నాయకుడు తదితర 20 మంది వ్యక్తులతో గడిపినట్టు తేలింది. వారందరినీ గుర్తించిన అధికారులు కాకినాడ జీజీహెచ్కు తరలించారు. వారిలో పిఠాపురం వైఎస్సార్ గార్డెన్స్లో నివాసముంటున్న ఒక 20 ఏళ్ల యువకుడికి పాజిటివ్ రిపోర్టులు రావడంతో అంతటా అప్రమత్తమైంది. బుధవారం ఇలా.. జిల్లాలో బుధవారం ఒక్క రోజే 90 నమూనాలు పరీక్షించగా.. 69 నెగిటివ్, 5 పాజిటివ్, 16 ఫలితాలు రావాల్సి ఉంది. కేసులపై నిరంతర నిఘా... జిల్లా కరోనా అనుమానిత కేసులపై అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూరల్, అర్బన్ ప్రాంతాల్లో 17,658 మందిపై పర్యవేక్షణ కొనసాగుతోంది. 165 క్వారంటైన్ కేంద్రాలు: జిల్లా వ్యాప్తంగా ‘కోవిడ్–19’ వైరస్ అనుమానితులకు వైద్య సేవలు అందించేందుకు 165 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో 6509 పడకలు సిద్ధంగా ఉంచారు. 3441 మంది స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. 351 మంది క్వారంటైన్ కేంద్రాల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. -
‘తబ్లిగి జమాత్’తో పెరిగిన కేసులు
న్యూఢిల్లీ: గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 376 కొత్త కరోనా కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్కు హాజరై ‘కరోనా’తో తిరిగి స్వస్థలాలకు వెళ్లిన వారి వల్ల ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిందని వివరించింది. అంతేకానీ, ఇది దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న ట్రెండ్ కాదని స్పష్టం చేసింది. కరోనాతో ఇప్పటివరకు 1,637 కేసులు, 38 మరణాలు నమోదయ్యాయని వెల్లడించింది. అలాగే, 132 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. వీరిని మినహాయిస్తే చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య 1,446కి చేరుతుందని పేర్కొంది. ఢిల్లీలోని తబ్లిగి జమాత్కు హాజరైనవారికి సంబంధించి బుధవారం కొత్తగా 154 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. వీటిలో జమ్మూకశ్మీర్ నుంచి 23, ఢిల్లీ నుంచి 18, తమిళనాడు నుంచి 65 ఉన్నాయన్నారు. (యూరప్లో 30 వేల మంది మృతి) రాష్ట్రాల లెక్క వేరే అయితే, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రకటించిన సమాచారం ప్రకారం, కేసుల సంఖ్య 1,910గా, మృతుల సంఖ్య 58గా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బుధవారం సుమారు 400 కొత్త కేసులు, కనీసం 11 మరణాలు నమోదైనట్లు రాష్ట్రాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం కేసుల సంఖ్య ఢిల్లీలో 152కి, మహారాష్ట్రలో 335కి పెరిగిందని ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 33 కొత్త కేసులు నమోదవగా, అందులో 30 ఒక్క ముంబైలోనే నమోదయ్యాయి. బుధవారం మహారాష్ట్రలో కోవిడ్–19తో ఆరుగురు మరణించారు. దాంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 16కి చేరింది. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో క్వారంటైన్లో ఉన్న 5 వేల మందిలో అత్యధికులు హై రిస్క్ కేటగిరీలో ఉన్న నేపథ్యంలో.. కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 234కి చేరింది. వీటిలో 110 కేసులు ఢిల్లీలోని తబ్లిగి జమాత్కు హాజరైనవారికి సంబంధించినవే కావడం గమనార్హం. ఢిల్లీ జమాత్కు హాజరైన వారిలో ఉత్తరప్రదేశ్లో 569 మందిని, గుజరాత్లో 85 మందిని, కర్ణాటకలో 50 మంది విదేశీయులను క్వారంటైన్ చేశారు. గుజరాత్ నుంచి భారీగా దాదాపు 1,500 వరకు ఆ మత సమావేశాలకు హాజరయినట్లు సమాచారం. అస్సాం నుంచి ఢిల్లీ మర్కజ్కు 347 మంది హాజరు కాగా, వారిలో 230 మందిని క్వారంటైన్ చేసినట్లు ఆ రాష్ట్రం ప్రకటించింది. లైఫ్ లైన్ విమానాలు కరోనాపై పోరులో భాగంగా 20 వేల రైలు కోచ్ల్లో దాదాపు 3.2 లక్షల ఐసోలేషన్, క్వారంటైన్ బెడ్స్ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 5 వేల కోచ్ల్లో బెడ్స్ ఏర్పాటు ఇప్పటికే ప్రారంభమైందన్నారు. నిర్ధారణ పరీక్షల కిట్స్, ఔషధాలు, మాస్క్ల తరలింపు కోసం పౌర విమానయాన శాఖ ‘లైఫ్లైన్’ విమానాలను సిద్ధం చేసిందన్నారు. గత 5 రోజుల్లో ఈ విమానాల ద్వారా 15.4 టన్నుల వైద్య పరికరాల సరఫరా జరిగిందన్నారు. నేడు సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలు, వలస కార్మికుల సామూహిక ప్రయాణాలు, తబ్లిగి జమాత్లో పాల్గొన్నవారు, ఆ తరువాత కలిసిన వారిని గుర్తించడం, నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉంచడం.. తదితర అంశాలు ఆ సమావేశంలో చర్చకు రావచ్చని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. -
కరోనా వైరస్: ప్రకాశం భయకంపితం
సాక్షి, చీరాల: జిల్లాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. మూడు రోజుల క్రితం వరకు లండన్ వెళ్లి వచ్చిన యువకునికి తప్ప అతని కుటుంబ సభ్యులకు సైతం నెగిటివ్ రిపోర్టు రావడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఓ మతపెద్ద ద్వారా అతని భార్య, కుమారునితోపాటు మరో ఏడుగురికి సైతం కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులతోపాటు ప్రజలు భయకంపితులయ్యారు. ఇప్పటి వరకు జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 10 కేసులు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారే కావడం గమనార్హం. (అమెరికాలో ఒక్కరోజే 865 కరోనా మరణాలు!) జిల్లాలో నమోదైన 11 పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చీరాలలో 4 కేసులు నమోదు కాగా, కందుకూరులో 3, ఒంగోలు నగరంలో 2, కనిగిరి, కారంచేడులో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 280 మందిలో సుమారు 100 మందికి పైగా ఆచూకీ తెలియలేదు. వీరందరూ స్వచ్ఛందంగా క్వారంటైన్ కేంద్రాలకు వచ్చి వైద్య చికిత్స పొందాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కోరారు. అంతే కాకుండా వీరి ఆచూకీ కోసం ప్రత్యేక టాస్్కఫోర్స్ బృందాలు వెతుకులాట ప్రారంభించాయి. (కౌలాలంపూర్ నుంచి అంటుకుందా? ) ఒంగోలు నగరంలో పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తి భార్య ఆ చుట్టు పక్కల పిల్లలకు ట్యూషన్ చెప్పిందని గుర్తించిన అధికారులు ట్యూషన్కు వెళ్లే పిల్లలను గుర్తించి కుటుంబ సభ్యులందరినీ మంగళవారం క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో పాటు వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వారందరినీ గుర్తించి దగ్గరలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఉన్న 10 క్వారంటైన్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 696 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒంగోలు జీజీహెచ్లో ఐసోలేషన్ వార్డులో ఉన్న వారితోపాటు జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మంది అనుమానిత లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్ను ల్యాబ్లకు పంపగా వారి రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటికే 11 కేసులు నమోదు కాగా ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందనే ఆందోళన సర్వత్రా నెలకొంది ఢిల్లీలో ఇస్తిమాకు హాజరైన 14 మందిని క్వారంటైన్కు తరలించడంతో నిర్మానుష్యంగా ఇస్లాంపేట చీరాలలో.. చీరాల ప్రాంతం కరోనా కోరల్లోకి వెళ్లింది. ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి జిల్లా నుంచి 280 మంది వెళ్లగా వారిలో 80 మంది చీరాల పరిసర ప్రాంత ప్రజలు కావడం విశేషం. చీరాల మండలంలోని సాల్మన్సెంటర్ పంచాయతీ నవాబుపేటలో భార్యభర్తలకు కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. మార్చి 12 చీరాల మండలం సాల్మన్సెంటర్ పంచాయతీలోని నవాబుపేటకు చెందిన వ్యక్తితో పాటు మరో ఏడుగురు ఇస్తిమాకు చీరాల నుంచి ఢిల్లీ వెళ్లారు. చీరాలలో నాలుగు పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యాంత్రాంగం చూపు చీరాలపై పడింది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు మొత్తం హుటాహుటిన చీరాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నవాబుపేటకు చెందిన భార్యభర్తలకు పాజిటివ్ రావడంతో శనివారం ఆయన కుటుంబంతో సహ గృహనిర్భందంలోకి వెళ్లారు. నవాబుపేట, పేరాల ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రహదారులు మూతపడ్డాయి. చీరాలలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నెం. 08594–232327 కు ఎవరైనా అనుమానిత కేసులు ఉంటే సంప్రదించాలన్నారు. అలానే అనుమానిత కేసులు తరలించేందుకు మూడు అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. చీరాల ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్గా ఏర్పాటు చేసి జిల్లా పరిషత్ సీఈఓ, డీవైఎంహెచ్ఓ చీరాలలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నవాబుపేటలో రాకపోకలపై పూర్తిగా ఆంక్షలు విధించారు. వలంటీర్లు, ఏఎన్ఎంలు సర్వేలు నిర్వహిస్తున్నారు. కందుకూరులో.. కందుకూరు పట్టణలంలో కరోనా కలకలం రేపింది. పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. కరోనా సోకిన ముగ్గురు వ్యక్తులు ఢిల్లీలో ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారే కావడం, వారు పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రజలు హడలి పోతున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారు, ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తులకు కరోనా పాజిటివ్గా తేలుతుండడంతో రెండు రోజుల క్రితం వీరిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఈ ముగ్గురికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దాదాపు 10 రోజులపాటు వీరు పట్టణంలో తిరగడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ ముగ్గురు కుటుంబ సభ్యులను అధికారులు ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఆయా ప్రాంతాలను రెడ్జోన్గా ప్రకటించారు. మక్కా మసీద్లో ఇమామ్గా పనిచేసిన వ్యక్తి గత శుక్రవారం మసీదులో జరిగిన నమాజ్లో పాల్గొన్నారు. ఈ నమాజ్లో 80 మంది వరకు పాల్గొన్నట్లు గుర్తించారు. అలాగే బూడిదపాలేనికి చెందిన వ్యక్తి లింగసముద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఈయన 50 మందికి పైగా రక్త పరీక్షలు చేసినట్లు తేలింది. వారిలో 42 మంది క్వారంటైన్కు స్వయంగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి మాట్లాడుతూ.. విక్కిరాలపేటరోడ్డు, బూడిదపాలెం, మక్కామసీదు, పోతురాజుమిట్ట ప్రాంతాలను రెడ్ అలెర్ట్ జోన్స్గా ప్రకటిస్తున్నామని తెలిపారు. ప్రజలు అర్ధం చేసుకుని స్వియ నియంత్రణలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కందూరుకు ఇన్చార్జిగా జెడ్పీ సీఈఓ కైలాస్గిరీశ్వర్, ఆర్డీఓ ఓబులేసు, డీఎస్పీ శ్రీనివాసులు, కమిషనర్ మనోహర్, వైద్యాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కనిగిరిలో.. ఢిల్లీలో నిజాముద్దీన్ ఇస్తిమాకు వెళ్లి వచ్చిన కనిగిరికి చెందిన ఏడుగురిని క్వారంటైన్ సెంటర్కు తరలించిన సంగతి విధితమే. వారిలో అర్బన్ కాలనీకి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అతని కుటుంబంలోని 11 మంది, సన్నిహితులైన నలుగురు మొత్తం 15 మందిని క్వారంటైన్ సెంటర్కు తరలిస్తున్నట్లు కమిషనర్ డీవీఎస్ నారాయణరావు తెలిపారు. అలాగే కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తితో పూర్తిగా దగ్గరగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను కూడా ఒంగోలుకు తరలించినట్లు సమాచారం. కరోనా పాజిటివ్ వ్యక్తి నివాసం నుంచి 300 మీటర్ల మేర రెడ్జోన్గా ప్రకటించారు. అ ప్రాంతంలోని అన్ని గృహాల్లో వైద్య, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే చేపట్టారు. కరోనా బాధితుడు నివాసం ఉంటున్న అర్బన్ కాలనీ ప్రాంతాన్ని ఎమ్మెల్యే బుర్రా మధుసుదన్ యాదవ్తో పాటు, జెడ్పీ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి నర్శింహారావు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు సందర్శించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి జనతా కర్ఫ్యూ రోజున పోలీసులు, జర్నలిస్టులకు వాటర్ బాటిళ్లు, పండ్లు వగైరా పంపిణీ చేశాడు. ఈ నెల 23 నుంచి ఇప్పటి వరకు అతనికి దగ్గరగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరనే దానిపై పూర్తిగా వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కారంచేడులో.. మండలంలోని కుంకలమర్రు గ్రామంలో మంగళవారం కరోనా పాటిజివ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఒంగోలు ఆర్డీఓ ప్రభాకరరెడ్డి హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వలంటీర్లను, ఆశా, ఏఎన్ఎంలను రంగంలోకి దించారు. మంగళవారం ఆర్డీఓ కారంచేడు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. గ్రామంలో మొత్తం 12 బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రతి ఇంటినీ జల్లెడపడతారన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో అతి సన్నిహితంగా ఉన్న వారి పేర్లుతోపాటు, వారి ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తామన్నారు. గ్రామానికి ఇరువైపులా చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామంలోకి ఎవరూ రావద్దని, గ్రామస్తులు కూడా ఎవరూ బయటకు వెళ్లవద్దంటూ సూచించారు. గ్రామం మొత్తం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీవైఎంహెచ్ఓ డాక్టర్ మాధవీలత, ఇన్చార్జి తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ ప్రద్యుమ్నకుమార్, వైద్య సిబ్బంది, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాకు కోవిడ్ హాస్పిటల్గా నెల్లూరు వైద్యశాల ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసుల ఆరోగ్యం మెరుగుపడకపోతే వారిని నెల్లూరు జిల్లా వైద్యశాలకు తరలించనున్నారు. నెల్లూరు జిల్లా వైద్యశాలను పూర్తిస్థాయి కోవిడ్ వైద్యశాలగా మార్చారు. అక్కడ పూర్తి వెంటిలేటర్ల సౌకర్యంతోపాటు కోవిడ్కు అందించే అధునాతన వైద్య పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. అయితే ఒంగోలు జీజీహెచ్లో ఉన్న కోవిడ్ 19 అనుమానితులందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. వీరికి కోవిడ్ 19 జిల్లా నోడల్ అధికారి డాక్టర్ జాన్ రిచర్డ్స్ ఆధ్వర్యంలోని వైద్య బృందం చికిత్స అందిస్తోంది. -
కరోనా వైరస్: డేజంర్ జర్నీ
సాక్షి, కర్నూలు: కరోనావైరస్ (కోవిడ్-19) మహమ్మారికి లాక్డౌన్, క్వారంటైన్తో కళ్లెం వేయాలని చూసిన ప్రభుత్వం, జిల్లా యంత్రాంగానికి కొత్త సమస్య ఎదురైంది. ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు పలు జిల్లాల్లో తేలడం, అక్కడికి వెళ్లొచ్చిన వారిలో అన్ని జిల్లాల కంటే కర్నూలు వాసులే అధికంగా ఉండటంతో అధికారులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై..రానున్న పెనుముప్పును నివారించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీని నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్కు చేర్చిన అధికారులు.. వారి సన్నిహితులు, నివాస ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. (అమెరికాను వణికించిన భూకంపం ) కరోనా వైరస్ విదేశాల నుంచి వస్తున్న వారితో ఇండియాలో వ్యాపిస్తోందని ప్రాథమిక దశలో గుర్తించిన ప్రభుత్వం వెంటనే వారిపై దృష్టి సారించింది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేయించడంతో పాటు అనుమానితులను క్వారంటైన్లో ఉంచింది. అయితే ఆలస్యంగా వెలుగుచూసిన ఢిల్లీ ఘటన ఇతర ప్రాంతాలతో పాటు కర్నూలు జిల్లా వాసులనూ కలవరపెడుతోంది. మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్లో మతపరమైన ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో కొందరికి కరోనా సోకడం, తెలంగాణలో మరణాలు కూడా సంభవించడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.(కరోనా: మరో ప్రముఖ నటుడు మృతి ) మన ప్రభుత్వం కూడా వెంటనే సర్వే చేయించింది. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో అత్యధికంగా కర్నూలు జిల్లా వాసులు 258 మంది ఉన్నట్లు ఇప్పటిదాకా గుర్తించారు. అందులోనూ కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఆదోని ప్రాంత వాసులు ఎక్కువగా ఉన్నారు. అదీగాక 60 ఏళ్లకు పైబడిన వారే అధికంగా ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై.. వీరిని రాయలసీమ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీల్లోని క్వారంటైన్ సెంటర్లలో చేర్చుతోంది. ఇప్పటిదాకా 188 మందిని క్వారంటైన్కు తరలించింది. 43 మందిని హోం ఐసోలేషన్లో ఉంచింది.12 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు గుర్తించింది. మరో 15 మంది ఆచూకీ దొరకలేదు. సర్కారు పటిష్ట చర్యలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా కట్టడికి జిల్లా అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. లాక్డౌన్ను పక్కాగా అమలు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలు నిలిపేశారు. ఇప్పటి వరకూ 23 మందిని ఐసోలేషన్లో ఉంచి..వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో 13 మందికి కరోనా లేదని తేలింది. సంజామల మండలం నొస్సంలో ఉండే రాజస్థాన్ యువకుడికి పాజిటివ్ వచ్చింది. మరో 9 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిపై ఆరా ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో ఎక్కువమంది కర్నూలు వాసులే ఉండటంతో ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో పాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక సీఎస్ జవహర్రెడ్డి కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పెనుముప్పుపై అప్రమత్తం ఢిల్లీ నుంచి వచ్చిన వారు 20 రోజులుగా జనం మధ్యనే తిరిగారు. ఒకవేళ వారికి పాజిటివ్ వస్తే వారి ద్వారా ఇంకెంతమందికి వ్యాపించి ఉంటుందోనని అధికారులు హైరానా పడుతున్నారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా, ఇలాంటి తప్పిదాలు కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లిన వారి కుటుంబ సభ్యులు సైతం హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వారి సన్నిహితులపైనా దృష్టి సారించారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ముందస్తు జాగ్రత్తగా కర్నూలు సర్వజనాస్పత్రితో పాటు విశ్వభారతి, శాంతిరామ్ బోధనాస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. వీటిలో వెంటిలేటర్లతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో కలి్పంచారు. అవసరమైతే జిల్లాలోని మరిన్ని ప్రైవేటు ఆస్పత్రులను ఆ«దీనంలోకి తీసుకుని వైద్యం అందించేందుకు అధికారులు సిద్ధమయ్యా రు. వైద్యులు, నర్సుల కొరత లేకుండా ఉండేందుకు ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ చర్యలకు ఉపక్రమించింది. రిటైర్డ్ సిబ్బందితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది సేవల వినియోగానికి ఏర్పాట్లు చేస్తోంది. -
మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లొద్దు