-
'ఐసైపోతారు'..! సహజ రుచులకు ఆహారప్రియులు ఫిదా..
సాక్షి, సిటీబ్యూరో: ఐస్క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? చిన్న పిల్లల నుంచి పండు ముసలి దాకా ఎగిరి గంతేస్తారు.. అనారోగ్య కారణాల రీత్యా, కృత్రిమ రంగుల వినియోగం వల్ల కొందరు దీనికి దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం, ఆహారంపై కరోనా నేరి్పన గుణపాఠాన్ని నగరవాసులు బాగానే ఒంటబట్టించుకున్నారు. దీన్ని గ్రహించిన అమ్మకం దారులను నయా ట్రెండ్లో తమ వ్యాపారాలను అందిపుచ్చుకుంటున్నారు.ఆహార ప్రియుల మనసును గెలుచుకునేందుకు కొత్త తరహాలో సహజమైన పళ్ల రసాల నుంచి ఐస్క్రీమ్లు తయారు చేస్తున్నారు. వీటిని ఆరగించిన ఆహార ప్రియులు ఐస్ ఐపోతున్నారంటే నమ్మండి.. కొత్త తరహాలో మార్కెట్ను ఆక్రమించికుంటున్న ఆ ఆర్టిసానల్ ఉత్పత్తులపైనే ఈ కథనం...మనకు గతంలో ఇంపల్స్ ఐస్ క్రీమ్, టేక్–హోమ్ ఐస్ క్రీం అనే రెండు రకాలు అందుబాటులో ఉండేవి. వీటిలో టేక్–హోమ్ ఐస్ క్రీం మెజారిటీని మార్కెట్ వాటా కలిగి ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో పుట్టుకొచి్చన ఆర్టిసానల్ ఐస్ క్రీమ్లు శరవేగంగా పుంజుకుంటున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం కరోనా అనంతరం చలా కాలం తర్వాత గత వేసవిలో ఆర్టిసానల్ ఐస్క్రీమ్స్ తమ మార్కెట్ని భారీగా ఆక్రమించాయి. అదే ఊపు ఈ వేసవిలోనూ కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.ఆర్టిసానల్ అదుర్స్...ఆర్టిసానల్ ఉత్పత్తులు కొన్నేళ్ల క్రితమే నగరవాసులకు అందుబాటులకి వచ్చాయి. ఇందులో పాలు, క్రీమ్, చక్కెర వంటి నాణ్యమైన, సహజమైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. వివిధ ప్లేవర్లు, కలర్ల కోసం పప్పులు, పండ్లను మాత్రమే ఉపయోగిస్తారు. ఉదాహరణకు స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ పండ్లను, స్వీట్ పాన్ ఐస్క్రీమ్ అయితే స్వీట్పాన్ను, మ్యాంగో ఐస్క్రీమ్లో మామిడి పండ్లను వినియోగిస్తారు.అయితే ఫ్లేవర్డ్ ఉత్పత్తుల్లా ఇవి 6–24 నెలల వరకూ నిల్వ ఉండవు. కేవలం 5–10 వారాలు మాత్రమే ఉంటాయి. ఈ ఐస్క్రీమ్లలో ఎలాంటి రసాయనాలూ లేవని నిర్ధారించడానికి వీలుగా అధిక–గ్రేడ్ ప్యాకేజింగ్లో వస్తాయి. గడ్డకట్టే ముందు, ఐస్క్రీం మిశ్రమాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం వల్ల ఇవి సురక్షితంగా బ్యాక్టీరియా రహితంగా మారతాయి.ఆర్టిసానల్కే ఆదరణ.. రుచితోపాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇస్తున్నారు ఆహారప్రియులు. ఖరీదులో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆర్టిసనాల్ ఐస్క్రీమ్లనే ఇష్టపడుతున్నారు. ఒబెసిటీ సహా మరే ఇతర సమస్యలకూ దోహదం చేసే అవకాశం లేకపోవడం, పైగా పండ్లు, నట్స్ (పప్పులు) వంటివి వీటిలో విరివిగా వాడడం ఆరోగ్యానికి లాభదాయకం.– ఎ. ప్రవీణ్కుమార్, సి గుస్తా ఐస్క్రీమ్ పార్లర్విస్తృత శ్రేణి రుచులు..ఎటువంటి భయాలు లేకుండా వినియోగదారులు తమ ఉత్పత్తులనే ఎంచుకోవాలనే లక్ష్యంతో పలు ఐస్క్రీమ్ బ్రాండ్స్ ఇప్పుడు ఇదే బాట పట్టాయి. దీంతో ఇవి 1–2 రుచులకు మాత్రమే పరిమితం కాకుండా వి్రస్తుతశ్రేణిలో లభ్యమవుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఐస్ క్రీం తయారీదారులు డైరీ–ఫ్రీ నుంచి షుగర్–ఫ్రీ వరకూ ఆరోగ్యకరమైన ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్నారు.ఆరోగ్య స్పృహ కలిగిన యువత, మంచి రుచిని ఆస్వాదించాలనే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, తక్కువ కేలరీల ఐస్క్రీమ్ బార్లను కూడా పలు బ్రాండ్స్ అందిస్తున్నాయి. అలాంటి ఉత్పత్తుల్లో ప్రతి సరి్వంగ్కు కేవలం 89–99 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇతర సాధారణ ఐస్క్రీమ్లతో పోలిస్తే వీటిలో కొవ్వు 60% తక్కువగా ఉంటుంది. రకరకాల థీమ్లతో..నాంపల్లిలో రద్దీగా ఉండే ముజంజాహీ మార్కెట్ ప్రాంతంలో హ్యాండ్మేడ్ ఐస్క్రీమ్స్ లభిస్తున్నాయి. విశేషమేమిటంటే ఇక్కడ నాలుగు తరాల నుంచి నడుస్తున్న ఐస్ క్రీమ్ పార్లర్లు ఉన్నాయి. అంతేగాకుండా ఇక్కడ సీటింగ్ యూరప్ దేశాలను గుర్తుకుతెస్తోంది. అదే విధంగా జూబ్లీహిల్స్లోని డా.ఐస్ క్రీం పార్లర్, దాని పేరుకు తగ్గట్టుగా డాక్టర్ థీమ్తో ఉండే ఈ పార్లర్లో ఇక్కడ కొన్ని టాపింగ్స్ సిరంజిలను ఉపయోగించి మరీ అందిస్తారు.వనిల్లా, చాక్లెట్ తదితర రుచుల నుంచి బిర్యానీ ఫ్లేవర్ వరకూ వెరైటీ రుచులకు ఇది ప్రసిద్ధి. అలాగే జూబ్లీహిల్స్లోనే ఉన్న మిలానో ఐస్క్రీమ్, అబిడ్స్లోని సాఫ్ట్ డెన్, రోస్ట్, సిగుస్తా, ఆల్మండ్ హౌస్.. వంటివి హెల్ధీ ఐస్క్రీమ్స్కి చిరునామాగా ఉన్నాయి. యూరోపియన్ శైలిలో అందిస్తే వీటినే ఇటాలియన్ నామం జిలాటోగా పేర్కొంటారు.వీటితో ప్రమాదం..సాధారణంగా మనకు పరిచయమున్న ఐస్క్రీమ్స్ ఒబెసిటీ తదితర జీవనశైలి వ్యాధులతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలను తెచి్చపెట్టే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వీటికి రకరకాల రసాయనాలను మేళవించాల్సి ఉంటుంది. అలాగే ఐస్ స్ఫటికాలు ఏర్పడకుండా ఉండేందుకు ఐస్ క్రీములకు కారాజెనన్, ఎల్బిజి, గ్వార్, అకేసియా వంటివి కలుపుతారు. కొన్నిసార్లు మోనో–డిగ్లిజరైడ్స్ను కూడా కలుపుతారు.ఇవి చదవండి: బోటీ.. లొట్టలేసీ..! 25 ఏళ్లుగా చెరగని టేస్ట్..!! -
పంట ఏదైనా.. ఎత్తుమడులే మేలు!
భరించలేని ఎండలతో జనాన్ని భీతిల్లజేసిన ఎల్నినో ముగిసింది. అధిక వర్షాలతో కూడిన లానినాప్రారంభం కానున్న నేపథ్యంలో అధిక వర్షాలకు పంటలు తట్టుకునే వ్యూహాలు అవసరం. అందులో ముఖ్యమైనది.. ఎత్తుమడులు లేదా బోదెల (రెయిజ్డ్ బెడ్స్)పై పంటలు విత్తుకోవటం. అది ఎర్ర నేలైనా, నల్ల నేలైనా.. పత్తి, కంది, మిర్చి, పసుపు, సోయా, వేరుశనగ, కూరగాయలతో టు ఇంకా ఏ ఇతర ఆరుతడి పంటలైనా సరే ఎత్తుమడులపై విత్తుకుంటే నీటి ముంపు నుంచి, ఉరకెత్తటం, అతివృష్ఠి/ అనావృష్ఠి బాధల నుంచి రక్షణ పొందవచ్చని ఆదిలాబాద్ కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డా. ప్రవీణ్కుమార్ రైతులకు సూచిస్తున్నారు.వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా.. వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకోవటం మేలని డా. ప్రవీణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు చెబుతూ వస్తున్నారు.పత్తి సాగులో ఎత్తు మడి లాభాలు..అతివృష్ఠి సమయాల్లో పంటల సంరక్షణకు సమర్థవంతమైన మురుగు నీటి పారుదల వ్యవస్థ కీలకం. ఎత్తు మడుల పద్ధతిలో పత్తి సాగు చేయడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. ఎత్తుమడులు చేసుకోవడానికి ట్రాక్టర్తో అనుసంధానం చేసే రిడ్జర్ లేదా బెడ్ మేకర్ను ఉపయోగిస్తారు. పత్తికి ఉద్దేశించిన మడి 15–20 సెం.మీ.ల ఎత్తు ఉంటుంది. మడి వెడల్పు నేల స్వభావం, ఆప్రాంతంలో నమోదయ్యే వర్షపాతాన్ని బట్టి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు.ట్రాక్టర్ ద్వారా ఇలా ఎత్తు మడులు/బోదెలు తోలుకోవాలిపత్తి సాళ్ల మధ్య 180/ 150/ 120 సెం.మీ., మొక్కల మధ్య 30/20/30 సెం.మీ.ల దూరంలో పత్తి పంటను సాగు చేయవచ్చు. సాధారణంగా ఒక ఎకరంలో ఎత్తు మడులు చేయడానికి సుమారు 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం పడుతుంది. ఎత్తు మడుల మీద విత్తిన విత్తనం సాధారణ ΄÷లంలో కన్నా ఒకటి రెండు రోజులు ముందే మొలకెత్తుతుంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే, మొలక శాతం ఎక్కువ. దాదాపు 90 శాతం విత్తనాలు మొలుస్తాయి.ఎత్తు మడుల వలన మురుగు నీటి వ్యవస్థ మెరుగవుతుంది. వర్షపు నీరు ΄÷లంలో నిలవకుండా, కాలువల ద్వారా బయటికి వెళ్లిపో తుంది. దీనివలన తొలిదశలో మొక్క పెరుగుదల కుంటుపడదు. భారీ వర్షాలు కురిసినప్పుడు నల్లరేగడి నేలల్లో వరద పారుతుంది. ఆ ప్రవాహంలో మొక్కలు కొట్టుకుపోకుండా ఎత్తు మడులు కాపాడుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో మడుల్లో నిల్వ ఉండే తేమ పంటకు ఉపయోగపడుతుంది. సాంప్రదాయ పద్ధతిలో పత్తి మొక్కల కింది కొమ్మలకు మొదట్లో వచ్చే 5 నుండి 10 కాయలు కుళ్లాపోతూ ఉంటాయి.ఎత్తుమడులు చేయడం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి కాయకుళ్లు, ఇతర చీడడీడల ఉధృతి తక్కువగా ఉంటుంది. యాంత్రీకరణ ద్వారా కలుపు యాజమాన్యం సులభమవుతుంది. సాధారణ పద్ధతితో పోలిస్తే ఎత్తు మడుల పద్ధతిలో 10–20 శాతం అధిక దిగుబడులు సాధించవచ్చు. నల్లరేగడి నేలలు, తేలికపాటి ఎర్రనేలల్లో ఎత్తు మడుల పద్ధతిలో పత్తిని సాగు చేయవచ్చు. పత్తిలో అంతరపంటగా కందిని విత్తు కుంటే, ఒకవేళ ఏ కారణంగానైనా ఒక పంట దెబ్బతింటే, మరో పంట రైతును ఆదుకుంటుంది.ఇతర వివరాలకు డా. ప్రవీణ్ కుమార్ను 99896 23829 నంబరులో సంప్రదించవచ్చు. ఎత్తు మడులపై పత్తి పంటను విత్తుకునే మెళకువలను తెలిపే వీడియో ‘కేవీకే ఆదిలాబాద్’ యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఈ క్యూఆర్ కోడ్ను స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేసి చూడొచ్చు. – డా. ప్రవీణ్ కుమార్ -
తిరుపతిలో 144 సెక్షన్ కొనసాగింపు
తిరుపతి అర్బన్: శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత కల్పించాల్సి ఉందని తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. బుధవారం ఆయన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్తో కలిసి శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి అధికారులకు భద్రతా అంశాలపై పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు కొనసాగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ను విధించినట్లు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందే కాకుండా ఎన్నికల తర్వాత కూడా ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. అనవసరంగా వివాదాల జోలికి వెళ్లి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. 144 సెక్షన్ నేపథ్యంలో డ్రోన్లు ఎగుర వేస్తే చర్యలు తప్పవని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయన్నారు. పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టారని తెలిపారు. -
ప్యాకేజీల కోసం కాదు.. ప్రజాసేవ కోసమే బీఆర్ఎస్ లోకి
-
ఆకాశం నుంచి ఊడిపడ్డాడా?.. రిటైర్ అయితే బెటర్..
భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరుపై టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డాడు. ఆటగాళ్లందరినీ బోర్డు సమానంగా చూడాలన్నాడు. అంతేగానీ.. ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనే విధంగా వ్యహరించకూడదని హితవు పలికాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లంతా రంజీ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బోర్డు ఆదేశాలను ధిక్కరించారనే ఆరోపణల నేపథ్యంలో మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ ఇషాన్ కిషన్ల కాంట్రాక్టులు రద్దు చేసింది. దీంతో బీసీసీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. రెడ్బాల్ క్రికెట్కు దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్యాకు మాత్రం మినహాయింపులు ఎందుకు ఇచ్చారని ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ ప్లేయర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ సైతం ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆకాశం నుంచి ఊడిపడ్డాడా?.. ‘‘హార్దిక్ పాండ్యా ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? అతడు కూడా రంజీలు ఆడాల్సిందే. అతడి ఒక్కడికి మాత్రం రూల్స్ మారిపోతాయా? తప్పకుండా ఆడాల్సిందేనంటూ బోర్డు అతడిని బెదిరించాలి. అతడు కేవలం దేశవాళీ టీ20 టోర్నీలు ఆడితే చాలదు! మూడు ఫార్మాట్లలోనూ ఆడాలి కదా.. జట్టుకు అతడికి అవసరం ఉంది. ఒకవేళ తాను టెస్టులకు పూర్తిగా దూరమవ్వాలని నిర్ణయించుకుంటే రాతపూర్వకంగా బోర్డుకు లేఖ సమర్పించాలి. రిటైర్ అయితే బెటర్.. తాను పూర్తిగా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాలి. అంతేగానీ.. విషయంపై ఎటూ తేల్చకుండా నాన్చితే ఎలా? ఒకవేళ అతడు టీ20 జట్టుకు మాత్రమే అతిపెద్ద ఆస్తి అని బీసీసీఐ భావిస్తే.. ఆ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలి. ప్రతి ఆటగాడి విషయంలోనూ బీసీసీఐ ఇదే విధానం పాటిస్తే పారదర్శకంగా ఉంటుంది’’ అని ప్రవీణ్ కుమార్ ఓ యూట్యూబ్ చానెల్లో ఈ మేరకు వ్యాఖ్యానించాడు. టెస్టు ఫార్మాట్లో ఆడకూడదని నిర్ణయించుకుంటే.. హార్దిక్ పాండ్యా రిటైర్మెంట్ ప్రకటించడమే సబబుగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా హార్దిక్ పాండ్యా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ‘ఎ’ గ్రేడ్లో ఉన్నాడు. ముంబై సారథిగా ఈ క్రమంలో.. వార్షిక వేతనంగా రూ. 5 కోట్లు అందుకుంటున్నాడు. గాయం కారణంగా వన్డే వరల్డ్కప్-2023 టోర్నీ మధ్యలోనే నిష్క్రమించిన అతడు.. ఐపీఎల్-2024తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా కొత్త పాత్రలో కనిపించనున్నాడు. ఇక గాయం నుంచి కోలుకున్న తర్వాత డీవై పాటిల్ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఆడిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2024- RCB: విరాట్ కోహ్లి లేకుండానే.. -
తెలంగాణను కాపాడేందుకే బీఆర్ఎస్తో పొత్తు: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
-
‘రోహిత్ శర్మ ఆటగాళ్లను అందుకే తిడతాడు’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ ప్రశంసలు కురిపించాడు. అతడొక అద్భుతమైన నాయకుడని.. జట్టును ముందుకు నడిపించడంలో తనకు తానే సాటి అని కొనియాడాడు. సౌరవ్ గంగూలీ లాంటి క్రమక్రమంగా వాళ్లు పటిష్ట జట్టు నిర్మిస్తే.. రోహిత్ శర్మ తనకు తానుగా జట్టును క్రియేట్ చేసుకున్న ఘటికుడని పేర్కొన్నాడు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల మేళవింపుతో కూడిన టీమ్ను సమర్థవంతంగా నడిపిస్తున్న తీరు అమోఘమని ప్రశంసించాడు. రన్మెషీన్ విరాట్ కోహ్లి నుంచి భారత కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్లలో దుమ్ములేపాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో టీమిండియాను తిరుగులేని జట్టుగా మార్చాడు. కానీ.. టీ20 వరల్డ్కప్-2022 టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ రోహిత్ శర్మ సేనకు పరాభవం తప్పలేదు. ఇక వన్డేల్లోనూ అదే తరహా దురదృష్టం వెంటాడింది. ద్వైపాక్షిక సిరీస్లో సత్తా చాటడం సహా సొంతగడ్డపై అపజయమన్నది ఎరుగక వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ దాకా వెళ్లినా.. రన్నరప్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వచ్చినా.. జట్టును నడిపించిన తీరు బాగుందని ప్రవీణ్ కుమార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. ‘‘సౌరవ్ గంగూలీ జట్టును నిర్మించాడు. కానీ రోహిత్ తనకంటూ కొత్త జట్టును క్రియేట్ చేసుకున్నాడు. సహచర ఆటగాళ్లతో తనొక స్నేహితుడిలా మెలుగుతాడు. వాళ్లు తప్పుచేసినప్పుడు మాత్రమే తిడతాడు. మళ్లీ వెంటనే వెళ్లి ఆత్మీయంగా హత్తుకుంటాడు కూడా! కెప్టెన్గా వాళ్లకు ఆదేశాలు ఇస్తూనే మైదానంలో స్వేచ్ఛగా కదిలే వెసలుబాటు కూడా కల్పిస్తాడు’’ అని ప్రవీణ్ కుమార్ రోహిత్ కెప్టెన్సీ తీరును ప్రశంసించాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్తో రోహిత్ శర్మ బిజీగా ఉన్నాడు. కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి సీనియర్లు లేకుండానే ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1తో గెలిచాడు. చదవండి: IPL 2024: లక్నో అభిమానులకు గుడ్న్యూస్.. కెప్టెన్ వచ్చేశాడు! -
పశుసంవర్థక శాఖ డైరెక్టర్గా మంజువాణి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్గా డాక్టర్ జి.మంజువాణి నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్న డాక్టర్ ఎస్.రాంచందర్ను బదిలీ చేసిన ప్రభుత్వం, ఆయన స్థానంలో మంజువాణిని నియమించింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మంజువాణి తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతారు. డాక్టర్ ఎస్.రాంచందర్ను తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ (టీఎల్ఎస్డీఏ) సీఈవోగా నియమించారు. కాగ్ నివేదిక నేపథ్యంలో! పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీలో జరిగిన కుంభకోణం కారణంగానే ఈ బదిలీలు జరిగాయనే చర్చ సాగుతోంది. గొర్రెల పంపిణీలో చాలా అవకతవకలు జరిగాయని, బైక్లపై కూడా గొర్రెలను తీసుకొచ్చారని ఇటీవల కాగ్ తన నివేదికలో వెల్లడించిన నేపథ్యంలో ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గిరిజన బిడ్డ కావడమే నేరమా?: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పశుసంవర్థక శాఖలో జరిగిన బదిలీలపై రాష్ట్ర బహుజన సమాజ్పార్టీ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ స్పందించారు. నిజాయితీకి మారుపేరైన రాంచందర్ను ఆగమేఘాల మీద బదిలీ చేసి బలిపశువును చేశారని, ఆయన తెలంగాణ తండాలలో జని్మంచిన గిరిజన బిడ్డ కావడమే నేరమా అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘గొర్రెల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రులను, వారి ఓఎస్డీలను, అప్పటి డైరెక్టర్లను ముట్టుకునే దమ్ముందా మీకు? ’అని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
రోహిత్ను అసభ్యంగా దూషించారు: మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్
'Our Own Abuse Us': ‘‘సాధారణంగా నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను. మెల్బోర్న్లో అనుకుంటా.. ఆరోజు నేను, రోహిత్ శర్మ, మనోజ్ తివారి ఉన్నాం. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. అప్పుడే అక్కడికి వచ్చిన కొంతమంది ఎందుకో మమ్మల్ని దుర్భాలాషడటం మొదలుపెట్టారు. వాళ్లు టీమిండియా అభిమానులమని చెప్పుకొంటున్నారు. కానీ.. రోహిత్ శర్మను అసభ్య పదజాలంతో దూషించారు. అయినా తను చాలాసేపు ఓపిక పట్టాడు. కానీ వాళ్ల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో రోహిత్ సహనం కట్టలు తెంచుకుంది. తను కూడా వాళ్లకు తిరిగి బదులివ్వడం మొదలుపెట్టాడు. నేను కూడా తనతో కలిసి వారి మాటకు మాటా సమాధానం చెప్పాను. కానీ ఎందుకో సొంత అభిమానులే మమ్మల్ని దూషించడం బాధించింది’’ అంటూ టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అభిమానులమని చెప్పుకొంటూనే దూషిస్తూ ఆస్ట్రేలియా టూర్కు వెళ్లినపుడు తమకు ఎదురైన చేదు అనుభవం గురించి గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మను అకారణంగా కొంతమంది దూషించారని వారికి తామిద్దరం కలిసి గట్టిగానే బదులిచ్చామని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నాడు. అభిమానులమని చెప్పుకొనే కొంతమంది ఆరోజు హిట్మ్యాన్కు కించపరిచే విధంగా వ్యవహరించారని తెలిపాడు. సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో కాగా ది లలన్టాప్నకు ఇస్తున్న ఇంటర్వ్యూలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ గత కొన్ని రోజులుగా ప్రవీణ్ కుమార్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాలో చాలా మందికి మద్యం సేవించే అలవాటు ఉన్నా ఓ సీనియర్ ప్లేయర్ మాత్రం తన పేరును హైలైట్ చేశాడని ప్రవీణ్ ఆరోపించాడు. అదే విధంగా చెప్పినట్లు వినకపోతే ఐపీఎల్లో తనకు అవకాశాలు రాకుండా చేస్తానని మాజీ చైర్మన్ లలిత్ మోదీ వార్నింగ్ ఇచ్చాడని ప్రవీణ్ పేర్కొన్నాడు. ఇక బౌలర్లంతా అప్పుడప్పుడు టాంపరింగ్కు పాల్పడతారని.. అయితే పాకిస్తాన్ బౌలర్లు మాత్రం ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తారని ఆరోపణలు గుప్పించాడు. రీఎంట్రీకి సిద్ధమైన రోహిత్ కాగా 37 ఏళ్ల ప్రవీణ్ కుమార్ టీమిండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఆరు టెస్టు, 68 వన్డే, 10 టీ20 మ్యాచ్లు ఆడి.. మొత్తంగా 112 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 119 మ్యాచ్లలో కలిపి 90 వికెట్లు తీశాడు. ఇక 2017లో తన చివరి మ్యాచ్ ఆడిన ప్రవీణ్ ఆ తర్వాత ఆటకు గుడ్బై చెప్పాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ప్రస్తుతం అఫ్గనిస్తాన్తో సిరీస్కు సిద్ధమైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ ద్వారా దాదాపు 14 నెలల తర్వాత హిట్మ్యాన్ అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇస్తున్నాడు. చదవండి: Ishan Kishan: అప్పటి వరకు ఇషాన్కు టీమిండియాలో స్థానం లేదు.. హింటిచ్చిన ద్రవిడ్ -
అందరూ అలాంటోళ్లే... బద్నామైంది మాత్రం నేనొక్కడిని!
టీమిండియాలో అందరూ తాగేవాళ్లే.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో సాదాసీదా వ్యక్తి కాదు. 2007-12 మధ్యలో టీమిండియా అత్యుత్తమ స్వింగ్ బౌలర్గా గుర్తింపు తెచ్చుకున్న యూపీ ఆటగాడు ప్రవీణ్ కుమార్. ఐదేళ్ల పాటు టీమిండియాలో తిరుగులేని బౌలర్గా, ఆతర్వాత ఐపీఎల్లో అత్యుత్తమ పేసర్గా చలామణి అయిన ప్రవీణ్ ఆ తర్వాత వివిధ కారణాల చేత కనుమరుగయ్యాడు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ప్రవీణ్.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి తన సహచరులపై వివాదాస్పద ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కాడు. లల్లన్టాప్ అనే యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ మాట్లాడుతూ.. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ, నాటి తన టీమిండియా సహచరులు, ప్రత్యేకించి ఓ సీనియర్ ఆటగాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అలాగే పాకిస్తాన్ ఆటగాళ్లపై కూడా ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశాడు. టీమిండియాలో చేరిన కొత్తలో పలువురు సీనియర్లు తనను మద్యం సేవించడం మానుకోవాలని సూచించారని ప్రవీణ్ అన్నాడు. తనకున్న మద్యం అలవాటు కారణంగా ఓ సీనియర్ తనను ప్రత్యేకించి బద్నాం చేసేవాడని ఆరోపించాడు. జట్టులో అందరూ తాగేవాళ్లే అయినప్పటికీ తన పేరును మాత్రమే హైలైట్ చేసేవారని వాపోయాడు. ఐపీఎల్లో తనకు కోచింగ్ అవకాశాలు రాకపోవడంపై కూడా ప్రవీణ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాగుతానని సాకుగా చూపి తన సొంత జట్టు ఉత్తరప్రదేశ్ సైతం తనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రౌండ్లో కాని డ్రెస్సింగ్ రూమ్లో కాని తాను తాగలేదు కదా అని ఎదురు ప్రశ్నించాడు. సరైన గుర్తింపు లేక, అవకాశాలు రాక, కనీసం పలకరించే వారు లేక ఓ దశలో డిప్రెషన్లోకి వెళ్లిపోయానని తెలిపాడు. ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడకపోతే తన కెరీర్ను నాశనం చేస్తానని నాటి ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ వార్నింగ్ ఇచ్చాడని బాంబు పేల్చాడు. తన సొంత పట్టణం మీరట్ అయిన కారణంగా తాను ఢిల్లీ డేర్డెవిల్స్కు ఆడాలనుకున్నానని, అయినా తన అభ్యర్ధనను లలిత్ మోదీ పట్టించుకోకుండా బలవంతంగా ఆర్సీబీతో ఒప్పందం కుదిర్చాడని ఆరోపించాడు. పాకిస్తాన్ బౌలర్లు ఎక్కువగా బాల్ టాంపరింగ్కు పాల్పడేవారని ప్రవీణ్ ఆరోపించాడు. దాదాపుగా ప్రతి బౌలర్ కొద్దోగొప్పో బాల్ టాంపరింగ్ చేస్తాడని, పాక్ బౌలర్లు కాస్త ఎక్కువగా చేసే వారని ప్రవీణ్ అన్నాడు. పాక్ ఆటగాళ్లు పైకి ఒకలా లోపల మరోలా ఉండేవారని, వారు ఎక్కువగా అబద్దాలాడేవారని తెలిపాడు. 37 ఏళ్ల ప్రవీణ్కు అప్పట్లో అత్యుత్తమ స్వింగ్ బౌలర్గా గుర్తింపు ఉండేది. ప్రవీణ్ టీమిండియా తరఫున 6 టెస్ట్లు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ప్రవీణ్ 112 వికెట్లు పడగొట్టాడు. ప్రవీణ్ ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీల తరఫున 119 మ్యాచ్లు ఆడి 90 వికెట్లు పడగొట్టాడు. ప్రవీణ్ చివరిసారిగా 2017లో ఐపీఎల్లో ఆడాడు. ఆతర్వాత అవకాశాలు రాకపోవడంతో అతను క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో ఉన్నాడు. అతను గత యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు సమాజ్వాది పార్టీలో చేరాడు. -
ఎస్పీ ప్రవీణ్కుమార్ బదిలీ
నిర్మల్: ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ బదిలీ అయ్యా రు. కొత్త ఎస్పీగా జీ జానకీషర్మిల నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులను బది లీ చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నాలుగో ఎస్పీగా తొలిసారి మహిళా అధికారి నియమితులయ్యారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న జానకీషర్మిలను ఎస్పీగా నియమించారు. ప్రస్తుతం బదిలీపై వెళ్తున్న ఎస్పీ ప్రవీణ్కుమార్కు కొత్త ఎస్పీ శాఖాపరంగా ఒక ఏ డాది సీనియర్. తన జూనియర్ స్థానంలోకి వస్తున్న ఈ సీనియర్ అధికారి రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిని చూసి న అనుభవం ఉంది. జిల్లా మూడో ఎస్పీగా 2021 మార్చి 14 చల్లా ప్రవీణ్కుమార్ నియమితులై మూ డేళ్లు సేవలందించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లు నిండుతున్న అధికారుల బదిలీల్లో భాగంగా ప్రవీణ్కుమార్ను బదిలీ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ డీసీపీగా బదిలీపై వెళ్తున్నారు. జిల్లాపై తనదైన ముద్ర జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పారదర్శక పోలీస్ విధుల్లో ప్రవీణ్కుమార్ తనదైన ముద్రవేశారు. మూడేళ్ల కాలంలో ఎదురైన పలు ఘటనలు, అసెంబ్లీ ఎన్నికలనూ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పోలీసుల సంక్షేమానికీ తనవంతు కృషిచేశారు. జిల్లాకేంద్రంలో పోలీస్ పెట్రోల్బంక్, ప్రత్యేక పోలీస్ క్యాంటిన్ తీసుకువచ్చారు. జానకీషర్మిల బయోడేటా 2007 మే 31న గ్రూప్–1 ద్వారా డీఎస్పీగా ఎంపిక. 2009 మార్చిలో ఉమ్మడిరాష్ట్రంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా నియామకం. 2009 జులైలో కొవ్వూరు డీఎస్పీగా.. 2009 నవంబర్లో రాజమండ్రి అర్బన్ సెంట్రల్జోన్ డీఎస్పీగా.. 2011లో రాజమండ్రి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి. 2012లో సైబరాబాద్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీగా బదిలీ. 2013లో కన్ఫర్డ్ ఐపీఎస్గా ఉత్తర్వులు. 2015లో హైదరాబాద్ నార్త్జోన్ రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా.. 2016లో ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్గా బదిలీ. 2017లో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీగా పదోన్నతి. 2018లో ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా బదిలీ. 2024లో నిర్మల్ ఎస్పీగా బదిలీ. -
సిర్పూర్ పైనే ఏనుగంత ఆశ!
సాక్షి, హైదరాబాద్: బహుజన వాదం నినాదంతో రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని ఆశపడ్డ బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ బీఎస్పీలో చేరి గత రెండేళ్లుగా పార్టీని బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆయన స్వయంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి పోటీ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించారు. సిర్పూరులో విజయం సాధిస్తామనే అంచనాతో పాటు పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు సాధిస్తుందని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా 10 శాతం ఓట్లు సాధించడం లక్ష్యంగా బరిలోకి దిగినట్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెపుతూ వచ్చారు. ఇందులో భాగంగానే పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేసి పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను భయపెట్టారనే చెప్పాలి. ఆ మూడు పార్టీలు చీల్చుకునే ఓట్లపై.. సిర్పూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్బాబు, కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్లకు పార్టీ అభ్యర్థి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ ప్రచారం నుంచే గట్టిపోటీ ఇచ్చారు. దళిత, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లతో పాటు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్ల నెలకొన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అదే స్థాయిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్కు దీటుగా ఓట్లు పోలయినట్లు ఆపార్టీ అంచనా వేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లు పంచుకుంటే బీఎస్పీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే పోలింగ్ రోజు బీజేపీకి భారీగా ఓట్లు పోలవడం కొంత అనుమానాలకు తావిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో గట్టి పోటీ సిర్పూర్తో పాటు చివరి నిమిషంలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు నీలం మధు, పెద్దపల్లి నుంచి బరిలో నిలిచిన దాసరి ఉష, సూర్యాపేట నుంచి వట్టె జానయ్య యాదవ్, నకిరేకల్ నుంచి పోటీ చేసిన మేడి ప్రియదర్శిని, ఆలంపూర్ నుంచి బరిలోకి దిగిన ప్రవీణ్కుమార్ సోదరుడు ఆర్. ప్రసన్న కుమార్ ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చినట్లు పార్టీ భావిస్తోంది. ఈ నియోజకవర్గాలలో గెలవక పోయినా ప్రత్యర్థి పార్టీల ఓటములను నిర్దేశించే స్థితిలో ఓట్లు సాధిస్తుందని భావిస్తున్నారు. కాగా పోటీ చేసిన ఇతర నియోజకవర్గాలలో కూడా పార్టీ మెరుగైన ఓట్లను సాధించడం ద్వారా రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని మెరుగు పరుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ భావిస్తున్నారు. -
ప్రజాగొంతుకనై ఉంటా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఎస్పీ పాత్ర కీలకం అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఐపీఎస్ అధికారిగా ఏడేళ్ల సర్విస్ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల గొంతుకగా మారిన తాను ఎన్నికల అనంతరం కూడా అదేవిధంగా ఉంటానని అన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆయ న మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలోని 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు గట్టిపోటీ ఇస్తుందన్నారు. చాలా నియోజకవర్గాల్లో అనూహ్య విజయాలు సాధించబోతున్నామని చెప్పారు. అధికార బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీల ధనబలాన్ని తట్టుకొని బీఎస్పీ అభ్యర్థులు ధీటైన పోటీ ఇస్తున్నారని చెప్పారు. సిర్పూరులో తనతోపాటు చాలా జిల్లాల్లో బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన నిలిచిన బీఎస్పీకి రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు అండగా నిలిచారన్నారు. ఆదివాసీల పోడుభూముల కోసం పోరుబాట పట్టిన విషయాన్ని గుర్తుచేశారు. దళిత, గిరిజన, బీసీ వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల కోసం రెండేళ్లుగా రాజకీయ పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో అన్నివర్గాల ప్రజలు అత్యధిక స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించి ఆదరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. గెలిచిన తరువాత ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు, నిరుద్యోగులకు న్యాయం జరిగేందుకు పోరాడతానని చెప్పారు. -
ఆ ట్రిపుల్ఐటీలో అసలేం జరుగుతుంది? విద్యార్థిది హత్యా! లేక మరేంటి?
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రామాటి ప్రవీణ్కుమార్(19) వసతిగృహంలోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ట్రిపుల్ఐటీ అధికారులు చెబుతున్నారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు. ఔట్పాస్ తీసుకుని.. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్కుమార్ శనివారం ఔట్పాస్ తీసుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. శనివారం ఔట్పాస్ తీసుకున్న విద్యార్థి ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో అంతుచిక్కడం లేదు. అధికారులైతే ఆదివారం ఉదయం అల్పహారం చేశాడని చెబుతున్నారు. ఒక రోజు ఔట్పాస్ తీసుకున్న విద్యార్థి అక్కడే ఎందుకు ఉండిపోయాడనే విషయం అంతుపట్టని ప్రశ్న. ఔట్పాస్ తీసుకున్న విద్యార్థులు కళాశాలలో ఉన్నారో బయటికి వెళ్లిపోయారా అనే విషయాన్ని భద్రతా సిబ్బంది చూసుకుంటున్నారో లేదో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఖాళీ గదిలో ఆత్మహత్య.. ప్రవీణ్కుమార్ బీహెచ్–1 వసతి గృహంలో ఉంటున్నాడు. ఆదివారం బీహెచ్–2 వసతి గృహంలోని ఖాళీ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసతి గృహంలోని ఖాళీ గదుల్లోనే గతంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వసతి గృహాల్లో ఖాళీ గదులకు తాళాలు ఎందుకు వేయడం లేదనే అనుమానం తలెత్తుతోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి మెడ భాగం కమిలిపోయి ఉందని, ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో తెలియడం లేదని పలువురు చెబుతున్నారు. పోలీసు భద్రత.. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న వెంటనే మృతదేహాన్ని అంబులెన్సులో భైంసాకు తరలించారు. పోస్టుమార్టం గది వద్దకు ఎవరిని అనుమతించలేదు. మృతదేహాన్ని లోపల భద్రపరిచి తాళం వేశారు. ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు మోహరించారు. ట్రిపుల్ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనే విషయం అంతుచిక్కడం లేదు. వ్యక్తిగత కారణాలతోనే.. నాగర్కర్నూలు జిల్లాకు చెందిన రామాటి ప్రవీణ్కుమార్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఔట్పాస్ తీసుకున్నాడు. ఉదయం వేళ అల్పహారం చేసిన ఈ విద్యార్థి బీహెచ్–2 వసతి గృహంలోని ఖాళీగదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నాం. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశాం. – ప్రొఫెసర్ వెంకటరమణ, వీసీ ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: అడవిలో కట్టెలు తీసుకురావడానికి వెళ్లిన యువకుడిని కిరాతకంగా.. -
అందరి తెలంగాణగా మార్చడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్రాన్ని దొరల తెలంగాణ కాకుండా పేదల తెలంగాణగా మార్చాలనేది బీఎస్పీ ఆలోచన అని తెలిపారు. తెలంగాణలో దొరలు వదిలిపెట్టిన గడీలు గత తొమ్మిదేళ్లలో మళ్లీ పునర్నిర్మాణమయ్యాయని ఆయన విమర్శించారు. బాంచన్ కాల్మొక్త అనే సంస్కృతి తెలంగాణలో పోలేదని చెప్పారు. అన్ని వర్గాలను కలుపుకుంటాం... పేదల రాజ్యాధికారంతోనే బాంచన్ సంస్కృతి పూర్తిగా పోతుందని ప్రవీ ణ్కుమార్ స్పష్టం చేశా రు. స్పష్టమైన ప్రణాళిక తో అన్ని వర్గాలను కలుపుకొని కృషి చేస్తే రాజ్యాధికారం తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వీలైతే రాజ్యాధికారం చేపడతామని ఆశిస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్లో గతంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన మధు కోడా ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ప్రవీణ్కుమార్ గుర్తుచేశారు. మాయావతి వల్లే యూపీలో బహుజనులకు రాజ్యాధికారం... దళితులు కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులైతే సరిపోదని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనే స్థితిలో ఉంటేనే రాజ్యాధికారం వచ్చినట్లవుతుందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో మాయావతి సీఎం అయిన తర్వాతే బహుజనులకు రాజ్యాధికారం వచ్చిందన్నారు. మాయావతి హయాంలో దళితులకు భూముల పంపిణీ జరిగిందని, ఆమె ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించిందని చెప్పారు. మాయావతి పాలన వల్ల రెండు, మూడు తరాల బహుజనులు బాగుపడ్డారని ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 10 లక్షల ఉద్యోగాలిస్తాం.. ముఖ్యమంత్రిని కలిసి తమ ఆలోచనలు పంచుకొనే అవకాశం రాష్ట్రంలో ఏ అధికారికీ లేదని ప్రవీణ్కుమార్ చెప్పా రు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు సైతం కానిస్టే బుల్ ఆపితే ప్రగతి భవన్ గేటు వద్ద నుంచే వెనక్కి వెళ్లిన సందర్భాలున్నాని పేర్కొన్నారు. గురుకులాల సెక్రటరీగా వెళ్లిన వెంటనే తాను దళిత, నిమ్న, వెనుకబడిన, అణగారిన అనే పదాలను నిషేధించి స్వేరో అనే పదాన్ని తీసుకొచ్చానని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 10 లక్షల ఉద్యోగా ల హామీ మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కాదని, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా మని ఆయన వివరణ ఇచ్చారు. ఇవేగాక మరిన్ని విషయా లను ప్రవీణ్కుమార్ సాక్షి టీవీతో పంచుకున్నారు. -
BSP అధ్యక్షుడిగా ఫస్ట్ పొలిటికల్ ఫైట్ లో పాస్ అవుతారా?
-
తెలంగాణలో అధికారంలోకి వస్తాం
సూర్యాపేట: తెలంగాణలో ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ నాయకత్వంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సూర్యాపేట మండలంలోని గాం«దీనగర్లో బహుజన రాజ్యాధికార సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. అన్నీ సంపన్న వర్గాల కోసం నడుస్తున్న పార్టీలని అన్నారు. కానీ బీఎస్పీ ఒక్కటే బహుజన వర్గాల కోసం ప్రజల విరాళాలతో పనిచేస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకుని నడుస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీ అని చెప్పారు. దేశంలో మిగిలిన పార్టీలన్నీ ఓట్ల ముందు తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. ఇది గమనించిన వట్టె జానయ్య యాదవ్ లాంటి వారు బహుజన జెండాను ఎత్తుకోవడం ఆహా్వనించదగిన పరిణామమని అన్నారు. వట్టె జానయ్యపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని.. అది బీఆర్ఎస్, కాంగ్రెస్లు జరిపించిన వ్యూహాత్మక దాడి అని ఆరోపించారు. ‘మేము తక్కువగా చెప్పి.. ఎక్కువగా పనిచేస్తాం’అని పేర్కొన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 1,300 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తోందన్నారు. అమరవీరుల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో కూడా కేసీఆర్కు తెలియకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో గడీల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. సభలో సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్యయాదవ్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బహుజన వాదం బలపడేనా.. వినబడేనా?
ఉత్తరప్రదేశ్లో బలమైన రాజకీయశక్తిగా ఎదిగిన నాటినుంచి తెలుగునేలపై కాలు మోపాలని యత్నిస్తున్న బహుజన సమాజ్ పార్టీ ఈసారి మాత్రం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. అందుకే ఏకంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలిపింది. కేవలం ఎన్నికల సమయంలోనే వినిపించే బహుజనవాదాన్ని రెండేళ్లుగా జనాల్లోకి తీసుకెళ్లిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్కుమార్ ఈ దఫా బీఎస్పీ సత్తా చూపాలని పట్టుదలతో ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న ప్రవీణ్ కుమార్ స్వయంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు నుంచి సీనియర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఢీ కొంటున్నారు. పటాన్చెరు, సూర్యాపేట, పెద్దపల్లి, అలంపూర్, జహీరాబాద్, నకిరేకల్, వర్ధన్నపేట, పాలేరు వంటి పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు బీఎస్పీ అభ్యర్థులు సవాల్ విసురుతున్నారు. ప్రధాన పక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థుల అధికార, అర్ధబలం తట్టుకొని బీఎస్పీ అభ్యర్థులు చివరి వరకు ఎలా నిలబడతారన్నదే ప్రశ్న అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బీఎస్పీ అంటే దళితుల పార్టీ అనే ముద్రను చెరిపివేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర సారథి ప్రవీణ్ కుమార్ భారీ కసరత్తు చేశారు. ఐపీఎస్గా, గురుకులాల కార్యదర్శిగా వ్యవహరించిన సమయంలో ఉన్న సంబంధాలు ఆయనకు రాజకీయంగా ఉపయోగపడ్డాయనే చెప్పాలి. అగ్ర కులాలు మొదలుకొని 60 శాతం మంది బీసీలకు సీట్లిచ్చారు. ప్రవీణ్కుమార్ జనరల్ సీటు అయిన సిర్పూరు నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం. బహుజన వాదమే ఎజెండాగా చెపుతున్న ఆయన అభ్యర్థుల ఎంపికలోనూ విలక్షతను చాటుకున్నారు. మంథనిలో చల్లా నారాయణరెడ్డి, నల్లగొండలో కోమటి సాయితేజ్ రెడ్డి, పెద్దపల్లిలో ఉష (పద్మశాలి), నిజామాబాద్లో షేక్ ఇమ్రాన్ఖాన్, సూర్యాపేటలో వట్టె జానయ్య (యాదవ), ఎల్బీనగర్– గువ్వ సాయి రామకృష్ణ ముదిరాజ్ ..ఇలా వివిధ వర్గాల వారికి సీట్లు ఇచ్చారు. వరంగల్ ఈస్ట్ నుంచి ట్రాన్స్జెండర్ చిత్రపు పుష్పిత లయకు సీటు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 1994 నుంచి బరిలో నిలుస్తున్నా... రాష్ట్రంలో 1994 శాసనసభ ఎన్నికల సమయంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం, అధ్యక్షురాలు మాయావతి తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టినా ఫలితం దక్కలేదు. అప్పటి నుంచి అడపాదడపా ఎన్నికల సమయంలో బీఎస్పీ పోటీలో నిలబడడం, ఏనుగు గుర్తుపై అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతూ వచ్చింది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాడేరు నుంచి లాకే రాజారావు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత 2014లో అప్పటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా ప్రస్తుత మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి నేతృత్వంలో పలువురు అభ్యర్థులు వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేశారు నిర్మల్ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్రెడ్డి, సిర్పూరు నుంచి బరిలో నిలిచిన కోనేరు కోనప్ప మాత్రమే విజయం సాధించారు. కానీ గెలిచిన వెంటనే బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ పిలుపు మేరకు అధికార పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి పోటీ చేసిన ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ రెండోస్థానానికి పరిమితమయ్యారు. రాష్ట్రంలో బీఎస్పీపై ప్రవీణ్ ముద్ర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలంపూర్కు చెందిన రేపల్లె శివ ప్రవీణ్కుమార్ 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2013 నుంచి 2021 జూలై నెలలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేంత వరకు ప్రభుత్వ గురుకులాల సంస్థ (స్వేరోస్) కార్యదర్శిగా సేవలు అందించారు. ప్రవీణ్కుమార్ అదే సంవత్సరం ఆగస్టులో మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరారు. ప్రభుత్వంలో లోటుపాట్లు, మంచి చెడులు తెలిసిన ఆయన బహుజనవాదం నినాదంతో బీఎస్పీని రాష్ట్రంలో బలమైన శక్తిగా తయారు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఏడాది కాలం పాటు పాదయాత్ర జరిపి వేలాది గ్రామాలను చుట్టి వచ్చారు. సొంత నియోజకవర్గం అలంపూర్ను కాదని సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తూ, మిగతా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలిపారు. -పోలంపల్లి ఆంజనేయులు -
మరో 25 మందితో బీఎస్పీ మూడో జాబితా
సాక్షి, హైదరాబాద్: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) మూ డో విడత అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షు డు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ శనివారం ప్రకటించారు. 25 మందితో కూడిన ఈ జాబితాతో ఇప్పటి వరకు బీఎస్పీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 88కు చేరింది. ప్రజల మధ్యన ఉండే వారినే బీఎస్పీ అభ్యర్థులుగా నిర్ణయించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సిర్పూర్ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నానని, సిర్పూర్ను ఆంధ్ర వలస దారుని పాలన నుంచి విముక్తి కల్పించడమే తన ధ్యేయమన్నారు. 10న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి 2018 శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసిన సీఎం కేసీఆర్ అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించలేదని ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆర్టీఐ కింద గజ్వేల్ ఆర్డీవో నుంచి తాము తీసుకున్న వివరాల్లో కేసీఆర్ ఆస్తుల వివరాలు లేవని తెలిపారు. ఆస్తుల వివరాలు వెల్లడించని నామినేషన్ను ఆమోదించిన అప్పటి రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్ను మళ్లీ పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై తాము మొదటి నుంచీ హెచ్చరిస్తున్నామనీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల భద్రతపై కూడా తమకు అనుమానాలున్నాయని, జనావాసాల మధ్య కట్టిన ఈ ప్రాజెక్టులకు ఏమైనా జరిగితే భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు తప్పవని ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. -
బీఎస్పీ బహుజన భరోసా!
సాక్షి, హైదరాబాద్, పెద్దపల్లి రూరల్: బహుజన భరోసా పేరుతో బహుజన్ సమాజ్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. మంగళవారం హైదరా బాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పార్టీ నాయకుల సమ క్షంలో పది ప్రధాన హామీలతో కూడిన మేనిఫెస్టో ను ప్రకటించారు. 3.91 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు బహుజన భరోసా ఆవిష్కరిస్తున్న ట్లు ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం పాలైందని, ఈ రాష్ట్రాన్ని అందరి తెలంగాణగా మార్చేందుకే బహుజన భరోసా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా మేనిఫెస్టోల పేరుతో మరో సారి అంకెల గారడీ చేసిందని విమర్శించారు. గ్రూ ప్ పరీక్షలు రాసి ఉద్యోగం రాదని తెలిసి ఆత్మ హత్యకు పాల్పడ్డ యువతి ప్రవల్లిక వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తప్పుడు మాటలు మాట్లాడారని విమర్శించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తెలంగా ణ ఎలా ఉండాలని మేధావులు, రిటైర్డ్ అధికారు లు, అన్నివర్గాల ప్రజలతో చర్చించి బహుజన భరో సా పేరుతో మేనిఫెస్టో రూపొందించినట్లు ప్రవీణ్ తెలిపారు. ఇది ప్రొవిజనల్ మేనిఫెస్టో మాత్రమే నని, తెలంగాణ ప్రజలు ఇంకా ఏమైనా కోరుకుంటే వారి ఆకాంక్షల మేరకు వాటిని కూడా పొందుపరు స్తామని చెప్పారు. కాగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ని బీఎస్పీ కార్యాలయంలో కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన మాజీ మావోయిస్టు నిదానపురం కొమురయ్య బీఎస్పీలో చేరారు. ఆయనకు ప్రవీణ్కుమార్ బీఎస్పీ కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా పెద్దపల్లి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత మర్రిపల్లి సతీశ్ బీఎస్పీలో చేరారు. మేనిఫెస్టోలో బీఎస్పీ ఇచ్చిన 10 ప్రధాన హామీలు.. 1. ‘కాన్షీ’ యువ సర్కార్: యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు. మహిళలకు 5 లక్షల ఉద్యో గాలు. షాడో మంత్రులుగా విద్యార్థి నాయ కులు. 2. పూలే విద్యా దీవెన: మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య, డేటా, ఏఐ, కోడింగ్ లో శిక్షణ. 3. బహుజన రైతు ధీమా: ప్రతి పంట కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీ. ధరణి పోర్టల్ రద్దు. 4. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి: మహిళా కార్మికులు, మహిళా రైతులకు ఉచిత వాషింగ్ మెషీన్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్లో శిక్షణ. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ. మహిళా సంఘాలకు ఏటా రూ. 1 లక్ష 5. భీం రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు. 6. బ్లూ జాబ్ కార్డ్: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ, రోజు కూలి రూ. 350 కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత భీమా 7. నూరేళ్ల ఆరోగ్య ధీమా: ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ. ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జెట్ 8. వలస కార్మికుల సంక్షేమ నిధి: రూ. 5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు. వలస కార్మికులకు వసతి, కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు. 9. షేక్ బందగీ గృహ భరోసా: ఇల్లు లేని వారికి 550 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షలు సహాయం. ఇంటి పునర్నిర్మా ణానికి రూ.1 లక్ష సహాయం. 10. దొడ్డి కొమురయ్య భూమి హక్కు: భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా. -
హంగ్ వస్తే.. సీఎం కుర్చీలో బీఎస్పీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఒక వేళ హంగ్ పరిస్థితులే ఉంటే సీఎం పదవిని ఆఫర్ చేసిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. ఎన్నికల శంఖారావం పేరుతో కొత్తగూడెంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పలు విమర్శలు చేయడంతో పాటు బీఎస్పీకి సంబంధించిన మేనిఫెస్టోలోని కీలక అంశాలను వెల్లడించారు. పులికి భయమెందుకు.. తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి నెలకు రూ.3.50 లక్షల జీతం తీసుకుంటున్న సీఎం కేసీఆర్ నెల రోజుల నుంచి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. అక్టోబర్ 15న పులి బయటకు వస్తుందని మంత్రి కేటీఆర్ అంటున్నారని, ఆయన పులి అయితే ప్రతిపక్షాలంటే ఎందుకు భయపడు తున్నారని, ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యే పథకాలతో ప్రజల ముందుకు వస్తామని మంత్రి హరీశ్రావు అంటున్నారని, ఇప్పటికే ప్రజల మైండ్లను నాశనం చేశారని ప్రవీణ్ విమర్శించారు. ఈసీకి ఫిర్యాదు చేస్తాం ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని అనేక జిల్లాల్లో కీలక పదవుల్లో తమ అడుగులకు మడుగులు ఒత్తే అధికారులను బీఆర్ఎస్ పార్టీ నియమించుకుందని ప్రవీణ్కుమార్ ఆరోపించారు. అందరి వివరాలతో జాబితా రెడీ చేస్తున్నామని, త్వరలోనే ఎన్నికల కమిషన్ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వివిధ పదవుల నుంచి రిటైరైన కేసీఆర్ కుటుంబ సభ్యులు, దూరపు బంధువులకు ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎన్నికలు ముగిసేవరకు వారిని ఆ పోస్టులకు దూరంగా ఉంచాలని ఈసీని కోరారు. కొందరు అధికారులు కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాత తేదీలతో సంతకాలు చేస్తున్నారని, ఆ వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. కాగా, కమ్యూనిస్టులు కమ్యూనిజాన్ని మరిచిపోయి దొరల గడీల దగ్గర కాపలా కాస్తున్నారని ఆయన విమర్శించారు. 119 నియోజకవర్గాల్లో పోటీ రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ 119 నియోజ కవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు 1,300 దరఖాస్తులు తమకు అందాయన్నారు. ఇందులో మేధా వులు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, స్కాలర్లు ఉన్నారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. బీఎస్పీ మేనిఫెస్టోలో కీలక అంశాలు ♦ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు పోడు పట్టాల పంపిణీ ♦ భూమి లేని వారికి కనీసం ఎకరం భూమి పంపిణీ ♦ ప్రతీ మండలంలో అంతర్జాతీయ ప్రమాణాల తో పాఠశాల ♦ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీ సౌకర్యంతో కూడిన కోచింగ్ సెంటర్లు ♦ ప్రతీ కుటుంబం నుంచి ఒకరు విదేశాల్లో విద్యనభ్యసించేలా ప్రణాళిక ♦ ఆయుఃప్రమాణం వందేళ్లకు పెంచేలా వైద్య రంగంలో మార్పులు ♦ మహిళలకు ఉచితంగా డ్రైవింగ్లో శిక్షణ ♦ పది లక్షల ఉద్యోగాల కల్పన, అందులో 50 శాతం మహిళలకు.. ♦ కౌలు రైతులను ఆదుకునేలా విధానాలు ♦ జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపులు. -
బీఎస్పీకి అధికారం ఖాయం
సాక్షి, హైదరాబాద్, గన్పౌండ్రీ: రానున్న ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా, తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కొండ చిలువలకు, చలిచీమలకు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సోమవారం కాన్షీరాం 17వ వర్ధంతి సందర్భంగా ఎన్నికల నగారా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాబలం బీఎస్పీకి ఉందనీ, మరో రెండు నెలలు పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లూ కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. బహుజనులు పాలకులు కావాలని కలలుగన్న కాన్షీరాం పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతుంటే ఈ వర్గాల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రోద్బలం, ఒత్తిడితోనే వట్టే జానయ్య యాదవ్పై నిరాధారంగా పోలీసులు కేసులు పెట్టారని విమర్శించారు. తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగురవేయాలి బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ మాట్లాడుతూ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగురవేసి, ఏనుగుపై ప్రగతి భవన్కు వెళ్ళాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్లు రాజస్తాన్, మధ్యప్రదేశ్లలో ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. మెజారిటీ ప్రజలకు అధికారం దక్కాలనేదే బీఎస్పీ ధ్యేయమని పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డనేటర్ మంద ప్రభాకర్ అన్నారు. సభలో పార్టీ ఉపాధ్యక్షులు దాగిళ్ళ దయానంద్, చాట్ల చిరంజీవి, రుద్రవరం సునీల్ పాల్గొన్నారు. -
రాజకీయ నిరుద్యోగుల అడ్డాగా టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రాజకీయ నిరుద్యోగులకు అడ్డాగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. కనీస అర్హతలు లేని వ్యక్తులను కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం నియమించడంతో కమిషన్ పనితీరు అస్తవ్యస్తమైందని మండిపడ్డారు. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు అల్లకల్లోలంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో నిరుద్యోగ అభ్యర్థుల ఆధ్వర్యంలో జరిగిన టీఎస్పీఎస్సీ ప్రక్షాళన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్లతో కలసి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరి, కమిషన్ తీరుపై విరుచుకుపడ్డారు. సీఎం కుటుంబానికి అవి ఏటీఎంలు... మంత్రి కేటీఆర్కు టీఎస్పీఎస్సీ, సీఎం కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు, ఎమ్మెల్సీ కవితకు సింగరేణి సంస్థలు ఏటీఎంలుగా మారాయని రేవంత్రెడ్డి ఆరోపించారు. సీఎం కార్యాలయంలో పనిచేసే వ్యక్తుల బంధువులే టీఎస్పీఎస్సీ బోర్డులో అక్రమాలకు పాల్పడ్డారని.. వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్ష విషయంలో ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పబట్టినా ఇప్పటికీ బోర్డును రద్దు చేయకుండా మొండిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో 30 లక్షల మంది నిరుద్యోగులతోపాటు వారి తల్లిదండ్రులు కలిపి మొత్తం 90 లక్షల మంది ఓటు ద్వారా కేసీఆర్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఏటా జనవరిలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల వ్యవహారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, టీఎస్పీఎస్సీ తీరును నిరసిస్తూ ఈ నెల 14న సడక్ బంద్ (రహదారుల దిగ్బంధం) చేపట్టాలని పిలుపునిచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ‘సిట్’ నివేదిక వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. తక్షణమే కొత్త బోర్డు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కోదండరాం పిలుపు మేరకు రహదారుల దిగ్బందానికి టీపీసీసీ పూర్తి మద్దతు ప్రకటించింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ప్రొఫెసర్ వినాయక్రావు పాల్గొనగా నిరుద్యోగులు శివానంద స్వామి, మహేష్, మిత్రదేవి అధ్యక్షత వహించారు. -
పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు!
సాక్షి, పెద్దపల్లి: టీఎస్పీ ఎస్సీ పరీక్ష పేపర్లు లీక్చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్ల పేరిట రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు. జూన్ 11న టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్పీ ఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాల యంలోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్కు హాజరైన వారికంటే అదనంగా 270 ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయో ఆ సంస్థ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. చైర్మన్ జనార్దన్రెడ్డి, సభ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, కార్యదర్శి దేవునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
జనవరిలో రామాయపట్నం పోర్టు ప్రారంభం
సాక్షి, అమరావతి: పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని ఇందులో భాగంగా వచ్చే 4 నెలల్లో ఒక పోర్టును, నాలుగు ఫిషింగ్ హర్బర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో, ఏపీఐఐసీ వీసీ, ఎండీ ప్రవీణ్కుమార్ చెప్పారు. రామాయపట్నం పోర్టులో కార్గో బెర్త్ పనుల్ని డిసెంబర్ నాటికి పూర్తిచేసి జనవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా సుమారు రూ.20 వేలకోట్లతో నాలుగు పోర్టులు (రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ సెజ్ పోర్టు), 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆయన గురువారం నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం ఫిషింగ్ హర్బర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తొలిదశలో నిర్మాణం చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలుత జువ్వలదిన్నె, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లను ప్రారంభిస్తామన్నారు. నాలుగు పోర్టులతో పాటు వాటి పక్కనే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు.