pramod sawant
-
అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన గోవా ముఖ్యమంత్రి
-
పరీక్షలో నెగ్గిన సావంత్
పణజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 15 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మొత్తం సభ్యుల సంఖ్య 40 మంది కాగా.. ప్రస్తుతం అసెంబ్లీలో 36 మంది ఉన్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించగా, మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం సావంత్ మాట్లాడుతూ.. పాజిటివ్గా ఉండాలి అనే పారికర్ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరు మనసులో ఉంచుకోవాలని కోరారు. విశ్వాస పరీక్ష కోసం గవర్నర్మృదులా సిన్హా ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. 11 మంది బీజేపీ, ముగ్గురు చొప్పున గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. 14 మంది కాంగ్రెస్, ఒక ఎన్సీపీ ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఓటేశారు. -
చితి బూడిద చల్లారే వరకు కూడా ఆగలేదు..
ముంబై : గోవాలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ఆడిన రాజకీయ క్రీడ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేసిందని ఆ పార్టీ మిత్రపక్షం శివసేన విమర్శించింది. అధికారం కోసం సిగ్గుమాలిన చర్యకు పాల్పడిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు శివసేన అధికార పత్రిక సామ్నాలో కథనం ప్రచురించింది. ‘ మనోహర్ పరీకర్ భౌతికకాయంపై ఉంచిన పువ్వులు వాడనే లేదు. ఆయన చితాభస్మం చల్లారనూ లేదు. కానీ అదే సమయంలో బీజేపీ నీచ రాజకీయ క్రీడకు తెరతీసింది. అధికార వ్యామోహంతో అర్ధరాత్రి కొత్త సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించింది. మరో నాలుగు గంటలు ఆగితే ఏం పోయేది. బీజేపీ వ్యవహరించిన విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ప్రమాదకరం’ అని బీజేపీ తీరును ఎండగట్టింది. చదవండి : రాత్రి 2గంటలకు సీఎంగా ప్రమాణమా? బీజేపీ మాట తప్పింది.. డిప్యూటీ సీఎంల నియామకం గురించి ప్రస్తావిస్తూ... ‘నాలుగేళ్ల క్రితం బీజేపీ ఉప ముఖ్యమంత్రులుగా పదవులు ఇవ్వమని చెప్పిన బీజేపీ.. అధికారం కోసం మాట తప్పింది. కేవలం 19 ఎమ్మెల్యేలలో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా నియమించింది. నేటికీ మనోహర్ పరీకర్ మరణాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి సంతాప సూచకంగా జాతీయ జెండాను హాఫ్ మాస్ట్ చేసే ఉంచారు. కనీసం అలా ఎందుకు చేస్తారోనన్న విషయం గురించి బీజేపీ వాళ్లకు కాస్తైనా అవగాహన ఉందో లేదో’ అంటూ సామ్నాలో శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా కేంద్రం, రాష్ట్రంలో తమతో అధికారం పంచుకున్న శివసేన ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి బీజేపీ నిరాకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మిత్రపక్షంపై విమర్శలు సంధిస్తున్న శివసేన...సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆ పార్టీతో జట్టు కట్టడం విశేషం. ఇక పదవిలో ఉండగానే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగుతుండగానే మరోపక్క బీజేపీ అధిష్టానం గోవా ముఖ్యమంత్రి ఎంపిక, అందుకు కావాల్సిన మద్దతును మిత్రపక్షాల నుంచి కూడగట్టేందుకు జోరుగా మంతనాలు జరిపింది. తమ పార్టీ నేత, అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి.. సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యే సుదిన్ దివాలికర్, గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్లకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశమిచ్చింది. దీంతో అధికార పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
గోవాలో గట్టెక్కిన కాషాయ బలం
పణజీ: గోవాలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. సీఎం మనోహర్ పరీకర్ మరణంతో ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్ ప్రభుత్వం బుధవారం విశ్వాస పరీక్షలో నెగ్గింది. గవర్నర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక శాసనసభ సమావేశంలో బీజేపీ ప్రభుత్వం 20-15 ఓట్లతో బలపరీక్షలో విజయం సాధించింది. మేజిక్ ఫిగర్ 19 కాగా.. బీజేపీ ఒక ఓటు ఎక్కువే సాధించింది. గోవా అసెంబ్లీలో మొత్తం స్థానాలు 40 కాగా, ప్రస్తుత సభ్యుల సంఖ్య 36. బీజేపీకి సొంతంగా 12 మంది సభ్యులు ఉండగా. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ బ్లాక్, స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్కు 14, బీజేపీకి 12, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి మూడు, గోవా ఫార్వర్డ్ బ్లాక్కు మూడు, ముగ్గురు స్వతంత్ర సభ్యులు, ఒక్క ఎన్సీపీ సభ్యుడు ఉన్నారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లకుగాను మనోహర్ పరీకర్, అంతకుముందు ఓ బీజేపీ సభ్యుడి మృతి, అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు బీజేపీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో సభ్యుల సంఖ్య 36కు పడిపోయింది. మారిన పరిస్థితుల్లో తమకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ బీజేపీ రెండు మిత్రపక్షాలు డిమాండ్ చేయడంతో గోవాలో అనిశ్చితి పరిస్థితి ఏర్పడుతుందని అందరూ భావించారు. చివరకు రెండు మిత్ర పక్షాలకు ఉప ముఖ్యమంత్రి పదవులకు అంగీకరించడంతో సంధి కుదిరింది. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ సీఎంగా ప్రమాణం చేయగా, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు, 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. అతి చిన్న రాష్ట్రమైన గోవాకు ఇద్దరు డిప్యూటి ముఖ్యమంత్రులు ఉండడం విశేషం. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ బీజేపీ త్వరగా పావులు కదిపి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్తోపాటు ముగ్గురు స్వతంత్య్ర సభ్యుల మద్దతును సేకరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ను బీజేపీ సొంత రాష్ట్రానికి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది. (చదవండి : రాత్రి 2గంటలకు సీఎంగా ప్రమాణమా?) -
నేడు గోవా సర్కార్కు ‘పరీక్ష’
పణజీ: గోవాలో ఆదివారం రాత్రి నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ అనూహ్యంగా సోమవారం అర్ధరాత్రి 2 గంటలకు కొత్త ముఖ్యమంత్రిగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం బుధవారమే అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇందుకోసం గవర్నర్ బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రత్యేకంగా శాసనసభ సమావేశం ఏర్పాటు చేశారని ఓ అధికారి తెలిపారు. విశ్వాసపరీక్షలో తామే నెగ్గుతామని సీఎం సావంత్ చెప్పారు. గోవా అసెంబ్లీలో మొత్తం స్థానాలు 40 కాగా, ప్రస్తుత సభ్యుల సంఖ్య 36. ఇక కొత్త ప్రభుత్వానికి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. తాజా లెక్కల ప్రకారం బీజేపీకి సొంతంగా 12 మంది, ఎంజీపీ, జీఎఫ్పీలకు చెరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు ఈ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. నాటకీయ పరిణామాల నడుమ అంతకుముందు సోమవారం సాయంత్రం నుంచి గోవాలో బీజేపీ, దాని మిత్ర పక్షాల మధ్య చర్చలు, నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే. అనేక దఫాల చర్చల అనంతరం ఎట్టకేలకు అర్ధరాత్రి 2 గంటలకు ప్రమోద్ సావంత్ చేత గవర్నర్ మృదులా సిన్హా కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. మనోహర్ పరీకర్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారినే కొత్త మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గోవాలో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ), ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుండటం తెలిసిందే. అమిత్ షా, గడ్కరీ చాణక్యం కొత్త సీఎంగా ఎవరు ఉండాలనే దానిపై బీజేపీ, మిత్ర పక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రాలేదు. చివరకు బీజేపీకి సీఎం పదవి, ఎంజీపీ, జీఎఫ్పీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. జీఎఫ్పీకి చెందిన విజయ్సర్దేశాయ్, ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్ ధవలికర్లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ ఒప్పుకుంది. దీంతో రాత్రి 11 గంటలకే ప్రమాణ స్వీకారం ఉంటుందని తొలుత బీజేపీ ప్రకటించినా ఇంకా చర్చలు జరుగుతున్నాయంటూ మళ్లీ వాయిదా వేశారు. అనంతరం అర్ధరాత్రి 2 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, గోవా బీజేపీ సమన్వయకర్త గడ్కరీలు చక్కబెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలిసిన తరుణంలో అధికారం బీజేపీ చేజారకుండా వీరు పావులు కదిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికలప్పుడు సైతం గోవాలో హంగ్ అసెంబ్లీ రాగా, అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్కు కాదని బీజేపీకి అధికారం దక్కేలా చేయడంలో గడ్కరీ కీలక పాత్ర పోషించారు. ఆయుర్వేద వైద్యుడికి సీఎం పదవి పరీకర్కు విశ్వాసపాత్రుడిగా ప్రమోద్ సావంత్ (46)కు మంచి పేరుంది. ఉత్తర గోవాలోని సంఖాలిమ్ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరెస్సెస్లోనూ పనిచేశారు.. మహారాష్ట్రలోని కోల్హాపూర్ ఆయుర్వేద వైద్య విద్యనభ్యసించిన ప్రమోద్ కొంతకాలం వైద్యుడిగానూ పనిచేశారు. బీజేపీలో యువజన నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పరీకర్కు అత్యంత నమ్మకస్తుడిగా ఉండేవాడు. ప్రమోద్కు పెద్దగా రాజకీయ అనుభవం లేనప్పటికీ, ఆయనకు ఎవరూ పోటీ లేకపోవడంతో సులభంగానే ముఖ్యమంత్రి పదవి దక్కిందని చెప్పవచ్చు. -
రాత్రి 2గంటలకు సీఎంగా ప్రమాణమా?
సాక్షి, న్యూఢిల్లీ : గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగుతుండగానే మరోపక్క బీజేపీ అధిష్టానం గోవా ముఖ్యమంత్రి ఎంపిక, అందుకు కావాల్సిన మద్దతును మిత్రపక్షాల నుంచి కూడగట్టేందుకు జోరుగా మంతనాలు జరపుతూ వచ్చింది. బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ గత రాత్రి 9 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని, అందుకు ఆయనకు మెజారిటీ సభ్యుల బలం ఉందని ప్రకటన వెలువడింది. ఇంతలో తమకు ముఖ్యమంత్రి పదవి కావాలంటే తమకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ ఇంతకాలం బీజేపీ సీఎం మనోహర్ పర్రీకర్కు మద్దతిస్తూ వచ్చిన గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యేలు, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో గోవా ప్రభుత్వంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోపక్క రాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక సీట్లు కలిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు గవర్నర్ను కలుసుకొని ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇంతలో మహారాష్ట్ర గోమంతక్ పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు వచ్చి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి, ఆ ఇద్దరితో బీజేపీ శాసన సభ్యుల సంఖ్య 12 నుంచి 14 చేరుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్యతో సమానం అవుతుంది. దాంతో మళ్లీ రాత్రి ఒంటి గంట వరకు మంతనాలు కొనసాగాయి. గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లకుగాను మనోహర్ పర్రీకర్, అంతకుముందు ఓ బీజేపీ సభ్యుడి మృతి, అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు బీజేపీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో సభ్యుల సంఖ్య 36కు పడిపోయింది. కాంగ్రెస్కు 14, బీజేపీకి 12, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి మూడు, గోవా ఫార్వర్డ్ బ్లాక్కు మూడు, ముగ్గురు స్వతంత్ర సభ్యులు, ఒక్క ఎన్సీపీ సభ్యుడు ఉన్నారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ బీజేపీ త్వరగా పావులు కదిపి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్తోపాటు ముగ్గురు స్వతంత్య్ర సభ్యుల మద్దతును సేకరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ను బీజేపీ సొంత రాష్ట్రానికి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది. మారిన పరిస్థితుల్లో తమకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ బీజేపీ రెండు మిత్రపక్షాలు డిమాండ్ చేయడంతో గోవాలో అనిశ్చితి పరిస్థితి ఏర్పడుతుందని, ఖాళీగా ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే వరకు అసెంబ్లీని సుషుప్త చేతనావస్థలో ఉంచాల్సి వస్తుందని ఊహాగానాలు చెలరేగాయి. చివరకు ఆ రెండు పార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులకు అంగీకరించడంతో సంధి కుదిరింది. దాంతో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ సీఎంగా ప్రమాణం చేయగా, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు, 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. అతి చిన్న రాష్ట్రమైన గోవాకు ఇద్దరు డిప్యూటి ముఖ్యమంత్రులు ఉండడం విశేషం. తుది లెక్కల ప్రకారం మిత్రపక్షాలను కలుపుకొని అసెంబ్లీలో బీజేపీ బలం 21కి చేరుకోగా, ఎన్సీపీ సభ్యుడిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలం15 వద్ద స్థిరంగా ఉంది. -
గోవా కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్
-
గోవా కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్!
పనజి : బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) అంత్యక్రియలు ముగిశాయి. గోవాలోని మిరామిర్ బీచ్లో అధికారిక లాంఛనాలతో వేలాది మంది ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు పరీకర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్ దేశ రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన పరీకర్ మరణంతో గోవాలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిగా కాంగ్రెస్ నేతలు గవర్నర్ మృదులా సిన్హాకు విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అమిత్ షా, నితిన్ గడ్కరీ బీజేపీ సహా మిత్ర పక్షాల ఎమ్మెల్యేలతో సమావేశమైనట్లు సమాచారం. ఈ క్రమంలో గోవా కొత్త సీఎంగా శాసన సభాపతి ప్రమోద్ సావంత్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యే సుదిన్ దివాలికర్, గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్లకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి గవర్నర్ మృదులా సిన్హా వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం. -
ప్రసాదం బదులు..విత్తనాలు పంపిణీ
సాక్షి, ముంబై: ఠాణేకు చెందిన ఓ గణేశ్ మండలి వినూత్న రీతిలో భక్తులకు ప్రసాదం పంచి పెడుతోంది. భక్తులకు ప్రసాదం బదులుగా విత్తనాలు పంపిణి చేస్తున్నారు. శ్రీరంగ్ సహనివాస్ గణేశోత్సవ్ మండల్ తమ మండలిని సందర్శించేందుకు వచ్చిన భక్తులకు ప్రసాదం బదులుగా విత్తనాలు పంపిణి చేస్తున్నారు. సీతాఫల్, బల్సమ్ (ఒక రకమైన తైలం), గుమ్మడి కాయ, నారింజ, నిమ్మకాయ, సపోట, జీడి పప్పు, చింత పండు, కర్జూరం తదితర విత్తనాలు మట్టితో రోల్ చేసి (సీడ్ బాల్స్) భక్తులకు ఇస్తున్నారు. వీటిని భక్తులు పక్క ఇంటి పెరట్లో లేదా ఇంటి ఆవరణంలో స్థలం ఉన్నా అక్కడ నాటాల్సిందిగా సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ మండలి 8,000 క్లే బాల్స్ (విత్తనం ఉంచిన మట్టి ఉండ)ను తయారు చేసింది. మరి కొన్ని రోజుల్లో మరో 25 వేల క్లే బాల్స్ను తయారు చేసి భక్తులకు పంపిణి చేస్తామని మండలి నిర్వాహకులు తెలిపారు. అయితే ఉత్సవాల సమయంలో విత్తనాన్ని దానం చేసేందుకు వీలుగా వీటిని సీడ్స్ బాంబ్లుగా మార్చారు. ఈ సందర్భంగా మండలి అధ్యక్షుడు ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. తాము క్లీన్ అండ్ గ్రీన్ పర్యావరణాన్ని నమ్ముతామన్నారు. దీంతో తాము ఈ ఏడాది భక్తులు విత్తనాలను నాటేందుకు సీడ్ బాంబులను ప్రసాదంగ పంపిణి చేస్తున్నామన్నారు. ఈ విధానం ద్వారా తమకు మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. వివిధ మార్గాల ద్వారా తాము విత్తనాలను సేకరించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా స్థానిక పాఠశాల విద్యార్థులు, వాలెంటీర్లు కూడా సీడ్ బాంబ్స్ను తయారు చేయడంలో పాలుపంచుకున్నారని తెలిపారు. మండలి సంయుక్త కార్యదర్శి ఓంకార్ పట్నే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గౌరీ తనయుడు ఆశీర్వాదం పొందేందుకు భక్తులు తమ మండపానికి దర్శించుకునేందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఈకో–ఫ్రెండ్లీ గణేష్ సందేశంతో పాటు పర్యావరణానికి హాని కలుగకుండా గణేష్ ఉత్సవాలను నిర్వహించాల్సిందిగా కోరుతున్నారు. -
దేశంలోనే అతిపిన్న వయసు స్పీకర్గా రికార్డు..
పణాజీ: దేశంలోనే అతిపిన్న వయస్కుడిగా గోవా అసెంబ్లీ స్పీకర్ రికార్డులకెక్కారు. పాలె నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రమోద్ సావంత్(44) గోవా అసెంబ్లీ స్పీకర్గా ఇటీవల ఎంపికయ్యారు. మనోహర్ పారికర్ ఆధ్వర్యంలోని బీజేపీ పార్టీ గత నెలలో గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని సావంత్ ఓడించారు. దేశంలో ఇప్పటి వరకు స్పీకర్లుగా పనిచేసిన వారి జాబితాను గోవా అసెంబ్లీవిడుదల చేసింది. ప్రమోద్ సావంత్ అతి చిన్న వయస్సులోనే స్పీకర్గా ఎంపికయ్యారని తెలిపింది. ఈయన ఇప్పటి వరకు రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రమోద్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే స్పీకర్గా ఎంపికైనందుకు తనకు చాలా గర్వంగా ఉందని మీడియాకు తెలిపారు. శాసనసభ హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడేందుకు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన కైలాష్ మేఘ్వాల్(83) వృద్ధుడైన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.