-
వినోదాల ఎర్రచీర
శ్రీకాంత్ కీలక పాత్రలో, అలీ, బేబీ సాయి తేజస్విని, కారుణ్య చౌదరి, రఘుబాబు, కమల్ కామరాజు, అజయ్, శ్రీరాం ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎర్రచీర’. సత్యసుమన్ బాబు దర్శకత్వంలో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదలవుతోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ను హీరో వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సత్యసుమన్ బాబు మాట్లాడుతూ– ‘‘హారర్, యాక్షన్, సస్పెన్స్ ప్రధానంగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. చేజింగ్ సీన్స్, హారర్, కామెడీ హైలైట్. షూటింగ్ ముగింపు దశలో ఉంది. మరోవైపు నిర్మాణానంతర పనులు పూర్తవుతున్నాయి. త్వరలో టీజర్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘ఈ నెల చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం. ప్రియాంక అగస్టీన్–రఘుబాబు– ఫిష్ వెంకట్ల ప్రత్యేక గీతం మా సినిమాలో మరో హైలైట్’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్. ఈ చిత్రానికి కెమెరా: చందు, సంగీతం: ప్రమోద్ పులిగిల్ల. -
ఇదొక అందమైన ప్రయాణం
‘‘పాడుతా తీయగా’ కోసం 1996లో తొలిసారి మైక్ పట్టుకున్న క్షణం నుంచి నిన్నమొన్నటి వరకు కూడా నాలో అదే ఉత్సాహం.. ఎంజాయ్మెంట్ ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రతి చిన్న విషయానికి నాలో ఎగై్జట్మెంట్ కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ‘ఇండిపాప్’ నేనే అయినందుకు చాలా గర్వంగా ఉంది’’ అని గాయని, సంగీత దర్శకురాలు, నటి స్మిత అన్నారు. ఆమె సంగీత ప్రయాణం 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో ఈ నెల 22న ‘ఎ జర్నీ 1999–2019’ పేరుతో వేడుక నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం స్మిత మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో? ఎలా ఉంటుందో? తెలియకుండానే వచ్చాను. ఆ తర్వాత నేర్చుకోవడం మొదలు పెట్టాను.. మ్యూజిక్, డ్యాన్స్లో మరింత శోధన చేసి ఎదిగాను. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా ప్రయాణం ఎంతో ఆనందంగా ఉంది. 10 కంటే ఎక్కువ భాషల్లో పాటలు పాడాను. 12 ఆల్బమ్స్, 17 మ్యూజికల్ వీడియోలు, 100 కు పైగా ప్లే బ్యాక్ సాంగ్స్, 8 దేశాల్లో 200కు పైగా కాన్సర్ట్స్, ఓ ట్రోఫీ ఇంటికి తీసుకురావడం... ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని తీపి అనుభూతులే. నేను ఇంత సాధించడానికి ఎంతో చేసిన వాళ్లందర్నీ గుర్తు చేసుకోడానికి.. వాళ్లకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకోడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా.. కళకు నేను ఇవ్వాలనుకుంటున్న గౌరవం ఇది. అదే రోజు నా భవిష్యత్ లక్ష్యాలను చెబుతా’’ అన్నారు. -
పదికాలాల పాటు నిలిచిపోయేలా...
శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ముఖ్యతారలుగా వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జై సేన’. వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సాయి అరుణ్కుమార్ నిర్మించిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ను, మోషన్ పోస్టర్ను నటుడు సునీల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘పదికాలాల పాటు నిలిచిపోయేలా మంచి సినిమాలు తీయాలనే శివ మహాతేజ ఫిలింస్ బ్యానర్ను స్థాపించాం. ఇందులో తొలి ప్రయత్నంగా చేస్తున్న సినిమా ‘జై సేన’. నా ప్రతి సినిమాలో సామాజిక అంశాలున్నట్లే ఇందు లోనూ ఉన్నాయి. సహ నిర్మాత శిరీష్ రెడ్డిగారు అన్ని విషయాల్లో నాకు బ్యాక్బోన్లా నిలిచారు. జూలైలో సినిమా విడుదల చేయాలనుకుంటు న్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు కథే సూపర్స్టార్. నేను పరిచయం అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు మారకుండా అలాగే ఉన్న వ్యక్తుల్లో సముద్ర ఒకరు’’ అన్నారు సునీల్. ‘‘సముద్రతోనే నా జర్నీ స్టార్ట్ అయింది’’ అన్నారు సంగీత దర్శకుడు రవిశంకర్. శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్, శిరీష్ రెడ్డి, గోపీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు, సహ నిర్మాతలు: పి.శిరీష్ రెడ్డి, దేవినేని శ్రీనివాస్. -
అర్జున్ రెడ్డి ఈజ్ కబీర్ సింగ్
‘అర్జున్ రెడ్డి’ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతోంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెలుగు వెర్షన్ని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ రీమేక్కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బిగించి ఉన్న పిడికిలిని లవ్ సింబల్గా చేసి ఉన్న గుర్తుతో ఉన్న టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది జూన్ 21న విడుదల కానున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ‘‘అర్జున్రెడ్డి’ ని ప్రేమించారు, అభినందించారు. ఇప్పుడు ‘కబీర్ సింగ్’ వంతు వచ్చింది. వేచి చూడండి’’ అని షాహిద్ కపూర్ పేర్కొన్నారు. -
‘సమైక్యంపై చంద్రబాంబు’ పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్ : ‘సమైక్యంపై చంద్ర బాంబు’ అనే వాల్పోస్టర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అడ్డంగా నరికేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ అయితే, అందుకు ఉపయోగిస్తున్న గండ్రగొడ్డలి చంద్రబాబు లేఖేనని పేర్కొన్నారు. ఆయన లేఖ ఇవ్వడం వల్లే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్, చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను వాల్పోస్టర్ల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేమూరి సూర్యనారాయణ (బుజ్జి), కఠారి శంకర్, ముదివర్తి బాబూరావు, యర్రజర్ల రమేష్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు.