-
2025 ఖరీఫ్కు పోల‘వరం’
పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదు. ప్రజలకు మంచి చేయడమే మా సంకల్పం. ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో నేను ఒకటే చెప్పా.. అయ్యా! మీరే బటన్ నొక్కండి.. నేరుగా మీరే నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు పంపించండి..! మేమే చేయా లని ఆరాట పడటం లేదు. క్రెడిట్ ఎవరికి వచ్చినా ఫర్వా లేదు. నాకు కావాల్సిందల్లా మంచి జరగాలి. ఇంతకన్నా నాకు వేరే అవసరం లేదని చెప్పా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పోలవరం ప్రాజెక్టును 2025 ఖరీఫ్ కల్లా కచ్చితంగా పూర్తిచేసే పరిస్థితి వస్తుంది. 2025 జూలై, ఆగస్టులో 41.15 మీటర్ల పరిధిలో నీటిని నిల్వ చేసే పరిస్థితి కూడా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టు, నిధులకు సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ వారికి అర్థమయ్యే రీతిలో చెప్పామన్నారు. ఇవన్నీ చేసిన నేపథ్యంలో వారిలో కొంత కదలిక వచ్చి సానుకూల వాతావరణంతో ధరలను రివైజ్ చేసి ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేలా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. పోలవరం ముంపు ప్రాంతం కాంటూరు లెవల్ 41.15 మీటర్ల పరిధిలో ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఎన్నికలకు ముందే ఆరేడు నెలల్లోగా నష్టపరిహారం అందుతుందన్న నమ్మకం ఉందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం అల్లూరి సీతారామ రాజు, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ బాధితులను స్వయంగా కలుసుకుని క్షేత్రస్థాయిలో అమలైన సహాయ చర్యలను పరిశీలించారు. కూనవరం, గొమ్ముగూడెంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే.. బుద్ధి లేకుండా బాబు సంతకాలు.. పోలవరం డ్యామ్ను మూడు సంవత్సరాల్లో మూడు దశల్లో పూర్తిగా నింపుతారు. అందులో మొదటి స్టేజ్.. మొదటి ఏడాది 41.15 మీటర్ల వరకు నింపుతారు. దశలవారీగా నింపడం ద్వారా ఒక్కో దశలో ఏవైనా లీకేజీలు ఉంటే వాటికి మరమ్మతులు చేసే అవకాశం ఉంటుంది. మూడు సంవత్సరాల్లో మూడు ఫేజ్ల్లో డ్యామ్ను నింపాలని సీడబ్ల్యూసీ నిబంధనల్లో ఉంది. 41.15 మీటర్ల వరకు నింపితే కటాఫ్ అయిపోయే గ్రామాలు ఇంకా ఉంటాయి. వాటిని ఫస్ట్ ఫేజ్లోకి తేకుంటే ఆ ఊళ్లకు వెళ్లటానికి ఇబ్బంది అవుతుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లైడార్ సర్వే నిర్వహించి 32 గ్రామాల్లో 48 హ్యాబిటేషన్లను (ఆవాస ప్రాంతాలు) మళ్లీ యాడ్ చేయించాం. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం కిందా మీదా పడుతున్నాం. మన ఖర్మకొద్దీ ఇదంతా ఎందుకు మొదలైందంటే గత ప్రభుత్వం 2013–2014 రేట్లతోనే పోలవరాన్ని పూర్తి చేస్తామని అండర్ టేకింగ్ ఇచ్చింది. దీంతో అంతకంటే ఎక్కువ డబ్బులివ్వమని, నాటి మీ ముఖ్యమంత్రే ఇందుకు ఒప్పుకుని సంతకం చేశారని కేంద్ర ప్రభుత్వం మొండికేసింది. నేను నేరుగా ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి వారికి అన్ని రకాలుగా నచ్చచెప్పా. 2013–14 రేట్ల ప్రకారం ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఎలా సాధ్యం? ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కూడా మారిపోతాయి. గత ప్రభుత్వంలో చంద్రబాబు బుద్ధి లేకుండా సంతకం చేశాడు గానీ మీరైనా ఆలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం చేశా. శ్రీశైలం ప్రాజెక్టు ఎంతతో స్టార్ట్ చేశారు? ఎంతతో పూర్తైంది? ఈ నెలాఖరు కల్లా శుభవార్త! ఇవన్నీ వివరించిన తరువాత వారిలో (కేంద్రం) కొంత కదలిక వచ్చింది. సానుకూల వాతావరణం వచ్చింది. ఇప్పుడు ఉన్న రేట్లకు మళ్లీ రివైజ్ చేసి ప్రాజెక్టును పూర్తిచేసేలా అడుగులు వేశాం. ఇది జరగాలంటే కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. దీనికోసం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎస్టిమేట్స్ తయారు చేసి సెంట్రల్ వాటర్ కమిషన్కు ఇప్పటికే పంపించింది. వాళ్లు మరో వారంలో అప్రూవల్ ఇస్తారు. ఆ తర్వాత జల్శక్తి శాఖ వద్దకు వస్తుంది. అనంతరం కేబినెట్లో పెడుతుంది. దేవుడు ఆశీర్వదిస్తే నాకు తెలిసి బహుశా ఈ నెలాఖరు కల్లా కేబినెట్కు ఇది వచ్చే కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే పోలవరం తొలి ప్రాధాన్యతా పనుల కోసం రూ.17 వేల కోట్లు మనకు ఇచ్చేందుకు ఆమోదం లభిస్తుంది. దీనివల్ల అత్యంత ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయి. డ్యామ్ పూర్తి హైట్కు కంప్లీట్ అవుతుంది. 41.15 మీటర్ల వరకు నీళ్లు నింపేందుకు ఆర్ అండ్ ఆర్ పూర్తిగా అందుతుంది. లైడార్ సర్వే ద్వారా గుర్తించిన 48 ఆవాస ప్రాంతాలను కూడా మొదటి పునరావాస ప్రాధాన్యత కింద ఆమోదించాలని కోరాం. దాని తర్వాత రెండో ఏడాది సెకండ్ ఫేజ్, అనంతరం మూడో ఏడాది మూడో దశ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతోంది కాబ ట్టి! బహుశా జగనే కడితే మొదట మీకు (నిర్వా సితులకు) ఇచ్చి తర్వాత ప్రాజెక్టు గురించి ఆలోచన చేసేవాడినేమో! కేంద్ర ప్రభుత్వం డబ్బు లు ఇస్తోంది కాబట్టి ఫేజ్ ప్రకారం జరగాల్సిందే. 20 వేల కుటుంబాల తరలింపు! నేను కూడా అనుకున్నంత వేగంగా చేయలేక పోయిన పని ఒకటి ఉంది. అది పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ఇప్పించడం. అది నా చేతుల్లో ఉండే పని కాకపోవడంతో కష్టపడాల్సి వస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధార పడాల్సి వస్తోంది. వాళ్ల మీద ఒత్తిడి తెస్తూ అడుగులు ముందుకు వేస్తున్నా. ఏదైనా టైమ్ రావాలి. ఇవన్నీ జరిగేదాకా వారు డబ్బులివ్వరు. డబ్బులు ఇవ్వకపోతే పని జరగదు. పని జరగకపోతే, డబ్బులు ఇవ్వకపోతే మనం కూడా ఇవ్వలేం. ఈ వాస్తవాన్ని కూడా మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరు కల్లా కేంద్ర కేబినెట్ ఆమోదం లభించి రూ.17 వేల కోట్లకు అప్రూవల్ వస్తే 41.15 మీటర్లకు, 48 హ్యాబిటేషన్లకు సంబంధించి రూ.5,200 కోట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాం. గట్టిగా ఒత్తిడి తెచ్చి వచ్చే జనవరికల్లా ఆర్ అండ్ ఆర్ పూర్తయ్యేలా చూస్తాం. మన ప్రభుత్వం రాక ముందు కేవలం 3 వేల కుటుంబాలను మాత్రమే తరలించారు. గత నాలుగేళ్లలో ఇప్పటికే 12 వేల కుటుంబాలను షిఫ్ట్ చేశాం. మరో 8 వేల కుటుంబాలను అంటే మొత్తంగా 20 వేల కుటుంబాలను తరలిస్తున్నాం. తరలించాల్సిన 8 వేల కుటుంబాల కోసం రూ.800 కోట్లు డబ్బులు అవసరం. మనమే కిందమీద పడి ఎలాగో చేసేస్తాం. బహుశా ఈ నెలాఖరుకో లేకపోతే వచ్చే నెలకల్లా పూర్తి చేస్తాం. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, ఎంపీ కోటగిరి శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ప్రజాప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వరద బాధితులతో సీఎం వారికి మిగతా రూ.3.5 లక్షలు ఇస్తాం పోలవరం ప్రాజెక్టుకు తొలుత నాన్న (వైఎస్సార్) హయాంలో భూసేకరణ జరిగినప్పుడు రూ.లక్ష, రూ.లక్షన్నరకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి నేను రూ.5 లక్షలు ఇస్తానని చెప్పా. ఆ మిగిలిన రూ.3.5 లక్షలు కచ్చితంగా ఇస్తాం. మీ బిడ్డ వల్ల నష్టపోయామనే మాట ఎక్కడా వినప డదని చెబుతున్నా. మీ బిడ్డ మంచే చేస్తాడు. చెడు మాత్రం ఎప్పుడూ చేయడని గుర్తు పెట్టుకోండి. కేంద్రం రూ.6.8 లక్షలకు తోడు రాష్ట్రం రూ.3.2 లక్షల ప్యాకేజీ ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6.8 లక్షల ప్యాకేజీకి తోడు రూ.3.2 లక్షల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనమే ఇస్తాం. ఇప్పటికే జీవో జారీ చేశాం. దీనికి మీ బిడ్డ కట్టుబడి ఉన్నాడని తెలియజేస్తున్నా. దేవుడు ఆశీర్వదిస్తే కేంద్రం నుంచి జరగాల్సిన మంచి ఆరేడు నెలల్లోనే జరుగుతుందన్న నమ్మకం ఉంది. మీ బిడ్డ మీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాడు. బాబు ఘోర తప్పిదాలు గత ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదం స్పిల్వే కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారు. మొదట స్పిల్వే పూర్తి చేసి నీళ్లు డైవర్ట్ చేసి ఆ తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత డయాఫ్రం వాల్ తర్వాత వెనకాల కట్టాలి. అలా చేస్తే డ్యామేజ్ అనేది జరగదు. మన ఖర్మ కొద్దీ ఆ రోజుల్లో కేవలం కాంట్రాక్టర్లకు మంచి చేయడం కోసమే పనులు చేపట్టి ప్లానింగ్ లేకుండా ఇష్టమొచ్చినట్లు చేశారు. స్పిల్వే పనులు అసంపూర్తిగా వదిలేశారు. కాబట్టే నీళ్లు అటువైపు నుంచి డైవర్ట్ చేయలేకపోయారు. నీళ్లు డైవర్ట్ చేయలేకపోయారు. కాబట్టి అటువైపు పంపించలేకపోయారు. పైగా అది పూర్తి కాకుండానే మధ్యలో కాఫర్ డ్యామ్ మొదలు పెట్టారు. వరదలకు డయాఫ్రం వాల్ కోతకు గురైంది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తాం ఇప్పుడు నిపుణులు అధ్యయనం చేసిన తర్వాత కొత్త డయాఫ్రం వాల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా మనం కాఫర్డ్యాంలు పూర్తిచేశాం. స్పిల్వే పూర్తిచేసి దానిమీదుగా నీళ్లు పంపిస్తున్నాం. ఇవన్నీ మనం చేయగలిగాం. గత సర్కారు నిర్వాకాల కారణంగా ప్రాజెక్టు మనం అనుకున్నంత స్పీడ్లో ముందుకు వెళ్లలేకపోయింది. వీటన్నింటినీ అధిగమించి ఇప్పుడు దేవుడి దయ వల్ల గాడిలో పడింది. 2025 ఖరీఫ్కల్లా కచ్చితంగా పోలవరం పూర్తి చేసి నీళ్లు నిల్వ చేసే పరిస్థితి వస్తుంది. -
ఎప్పుడు ఏ బాధ వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం
-
విభజన హామీలకు ప్రైవేటు మెంబర్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్రామ్ శుక్రవారం లోక్సభలో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదా, పోలవరం సవరించిన అంచనాలతో సహా పలు హామీల అమలుకు సంబంధించిన అంశాలను ఆయన బిల్లులో పొందుపరిచారు. అనంతరం ఏపీ భవన్లో భరత్ మీడియాతో మాట్లాడారు. విభజన హామీలను అమలుచేయాలంటూ రాజ్యసభలో ప్రైవేటు మెంబరు బిల్లును పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారని.. ద్రవ్య బిల్లు అని చెప్పడంతో లోక్సభలో ప్రవేశపెట్టామని తెలిపారు. బిల్లులో ప్రత్యేక హోదాను ప్రధానంగా ప్రస్తావించామని, వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ, రైల్వేజోన్ తదితర అంశాలు ఇందులో ఉన్నాయన్నారు. గతంలో చంద్రబాబు తప్పిదాలను సవరిస్తూ ఏపీకి రావాల్సినవి తీసుకొస్తున్నామని భరత్ వివరించారు. అలాగే, పోలవరం సవరించిన అంచనాల ఆమోదానికి సంబంధించి లోక్సభాపక్షనేత మిథున్రెడ్డి మరో బిల్లు ప్రవేశపెడతారని భరత్రామ్ తెలిపారు. ప్రజాప్రయోజన బిల్లులకే పార్లమెంటులో మద్దతిస్తున్నామన్నారు. ప్రైవేటు మెంబరు బిల్లులు ఎందుకు ప్రవేశపెడుతున్నామో కేంద్రం ఆలోచించాలని ఎంపీ భరత్ తెలిపారు. ఏపీ విభజన చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి బేసిన్లో ఒక పెట్రో కెమికల్ రిఫైనరీ తీసుకురావాల్సి ఉందని, దానికి వయబిలిటీ గ్యాప్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టుకోవాలన్నారు. గోడ మీద పిల్లిలా టీడీపీ.. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై టీడీపీ వ్యవహారం గోడ మీద పిల్లిలా ఉందని భరత్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై పార్లమెంటులో ప్రశ్నలు వేసి టీడీపీ ఎంపీలు అభాసుపాలయ్యారన్నారు. లోకేశ్కు ధైర్యముంటే తనపై ఎంపీగా పోటీచేయాలని సవాల్ విసిరారు. -
పోలవరం ప్రాజెక్టులో తాగునీటి విభాగం ఖర్చూ భరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తులకు కేంద్రం అంగీకరించింది. ప్రాజెక్టులో కేవలం సాగు నీటి విభాగం పనులకే నిధులిస్తామని, తాగు నీటి విభాగం ఖర్చును భరించే ప్రసక్తే లేదంటూ ఇన్నాళ్లూ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. సీఎం జగన్ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంది. తాగునీటి విభాగానికి ప్రతిపాదించిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు నిధులపై అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు ఈ విషయం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ విభాగానికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, వరదల కారణంగా ప్రాజెక్టులో దెబ్బతిన్న చోట్ల మరమ్మతులకు అదనంగా మరో రూ.2 వేల కోట్లు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిరభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు. అదేవిధంగా తాగు నీరు కాంపొనెంట్ ఖర్చును కూడా ఇవ్వడానికి అభ్యంతరం లేదని సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. వేధింపుల నిరోధక చట్టంలో బాధితులకూ శిక్షలా? వేధింపుల నిరోధక చట్టంలో ఫిర్యాదుదారులను శిక్షించే పరిస్థితి కూడా ఉండడంతో బాధితులు ముందుకు రావడంలేదని, దీని పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం లోక్సభ ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఎంఎస్ఎంఈ సహాయ మంత్రి భాను ప్రతాప్ వర్మ స్పందిస్తూ.. లైంగిక వేధింపులపై బాధిత మహిళలు చేసే ఫిర్యాదులను అంతర్గత కమిటీ అన్ని కోణాల్లో క్షుణ్నంగా దర్యాప్తు చేసిన మీదటే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీలో 47.17 టన్నుల బంగారు నిల్వలు ఇండియన్ మినరల్స్ ఇయర్ బుక్ – 2021 ప్రకారం ఏపీలో 47.17 టన్నుల బంగారు నిల్వల సామర్ధ్యం ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీంట్లో 5.3 టన్నుల నిరూపిత, సంభావ్య నిల్వలు, 41.87 టన్నుల మిగిలిన వనరులు ఉన్నాయని వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పరిశోధనల ప్రకారం రామగిరి, పెనకచర్ల బంగారు క్షేత్రాలు, జోనగిరి షిస్ట్ బెల్ట్, సౌత్ చిగర్గుంట – బిసనట్టం గోల్డ్బెల్ట్లో బంగారు నిల్వలు గుర్తించారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం ప్రతిపాదన లేదు సెయిల్లో విశాఖ ఉక్కు పరిశ్రమను విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు. కాగా ఆత్మనిర్భర భారత్లో భాగంగా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్(పీఎస్యూ) విధానానికి అనుగుణంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్.(ఆర్ఐఎన్ఎల్) షేర్హోల్డింగ్లో 100% పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం పొందిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. -
పోలవరం కాంట్రాక్టర్ని మార్చొద్దన్నా మార్చేశారు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను మార్చొద్దని ఎంతచెప్పినా వినకుండా సీఎం జగన్ మార్చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. తమ హయాంలో పెట్టిన కాంట్రాక్టర్ సమర్థంగా పనిచేస్తున్నారని పీపీఏ చెప్పినా వినలేదన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును రివర్స్ చేశారని, జీవనాడి అయిన ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, రివర్స్ పోకడల వల్లే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైందన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి సీఎం మూర్ఖపు నిర్ణయాలే కారణమని చెప్పారు. తమ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.11,537 కోట్లు ఖర్చుచేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,611 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేతగా పోలవరం ముంపు బాధితులకు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు వారిని ముంచేశారని విమర్శించారు. వైఎస్ చేసిన పనుల వల్ల ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందన్నారు. 2009 వరకు ఎలాంటి పురోగతి లేదని, మొత్తం ప్రాజెక్టుని వైఎస్ సమస్యల సుడిలోకి నెట్టేశారని విమర్శించారు. వాటన్నింటినీ సరిదిద్ది తాను ప్రాజెక్టు పనులు ప్రారంభించానని చెప్పారు. తమ హయాంలో 72శాతం పనులు పూర్తిచేస్తే, వైఎస్సార్సీపీ వచ్చాక కేవలం నాలుగుశాతం మాత్రమే చేశారని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు సకల వసతులతో కాలనీలు నిరి్మస్తానని చెప్పి నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ఈ ప్రాజెక్టులను దారిలో పెట్టడానికి నిర్దిష్ట కాలపరిమితితో పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వాళ్ల బాగోతాన్ని బట్టబయలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
పోలవరం నిధులపై అభ్యంతరం చెప్పలేదు
పోలవరం ప్రాజెక్ట్లో 41.15 మీటర్ల వరకూ నీటిని నింపడానికి రూ.10,911.15 కోట్లు వరద నష్టం రూ.2 వేల కోట్లు నిధులకు ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పలేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జనవిశ్వాస్ బిల్లుకు మద్దతు లోక్సభలో కేంద్రం గురువారం ప్రవేశపెట్టిన జన విశ్వాస్ సవరణ బిల్లు, 2022కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. దేశంలో జీవన సౌలభ్యానికి బిల్లు ఎంతో తోడ్ప డుతుందన్నారు. బిల్లులో కొన్ని మార్పులను ఎంపీ సత్యవతి సూచించారు. తిట్టలేదు.. అవాస్తవాల ప్రచారంపై ప్రశ్నించానంతే: ఎంపీ ఎంవీవీ తనతో పాటు తన కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగేలా మీడియాతో మాట్లాడిన వ్యవహారంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కేవలం ప్రశ్నించాను తప్ప అసభ్య పదజాలంతో తిట్టలేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. తనపై చేసిన అసత్య ప్రచారంపై రఘురామను నిలదీశానని, వాస్తవాలు తెలియకుండా ఇష్టానురీతిన ఎలా మాట్లాడుతారని ప్రశ్నించినట్టు తెలిపారు. ఈ నెల 20న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్సభ వాయిదా పడిన అనంతరం సెంట్రల్ హాల్లో తనను అసభ్య పదజాలంతో తిడుతూ.. చంపేస్తాననే ధోరణిలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాకు ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఎంవీవీ సత్యనారాయణ స్పందిస్తూ.. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని కొట్టిపారేశారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతంపై రఘురామ తలాతోక లేని ఆరోపణలు చేశారని విమర్శించారు. -
5 ప్రాధాన్య ప్రాజెక్టులు ఈ ఏడాది పూర్తికావాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాల ప్రగతిపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల వారీ ఇప్పటి వరకు విడుదలైన, ఖర్చుచేసిన నిధులు.. చేసిన, చేయాల్సిన పనులు.. నిర్వాసితులకు అమలు చేయాల్సిన పునరావాస ప్రాజెక్టులు తదితర అంశాలపై ఆయన చర్చించారు. ముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, పునరావాస ప్యాకేజీకి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన పనులను సమీక్షించిన ఆయన గడువు ప్రకారం పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అవుకు టన్నెల్, గొట్టా బ్యారేజి నుంచి హిర మండలం ఇరిగేషన్ ప్రాజెక్టు, వంశధార–నాగావళి నదుల అనుసంధానం, గొట్టా బ్యారేజి రిజర్వాయర్ ప్రాజెక్టు, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్–2 ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఈ ఐదు ప్రాజెక్టులను ఈ ఏడాదిలో పూర్తిచేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చుక్కల భూముల తొలగింపు పనులు వేగవంతం 22–ఎ జాబితా నుంచి చుక్కల భూములను తొలగింపు పనులను వేగవంతం చేయాలని సీఎస్ జవహర్రెడ్డి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం రాష్ట్ర సచివాలయంలో సి.సి.ఎల్.ఎ., ఐ.టి.ఇ.– సి, జి.ఎస్.డబ్లు్య.ఎస్ అధికారులతో సమావేశమయ్యారు. 22–ఎ జాబితా నుంచి చుక్కలు, అనాధీనం, బ్లాంక్, హెల్డు ఓవర్ భూముల తొలగింపు, జగనన్న సురక్ష కింద ధ్రువీకరణపత్రాల జారీ పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22–ఎ జాబితా నుంచి ఇంకా దాదాపు 7,558 ఎకరాల చుక్కల భూములను తొలగించాల్సి ఉందని చెప్పారు. ఆ పనులను వేగవతం చేయాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్, సి.సి.ఎల్.ఎ. సాయిప్రసాద్ను ఆదేశించారు. అనాధీనం, బ్లాంక్, హెల్డు ఓవర్ భూముల తొలగింపు పనులపైన కూడా ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. గ్రామ సేవా ఈనామ్ భూముల విషయంలో దేవదాయ శాఖ క్లియరెన్సు పొందాలని సూచించారు. 20 సంవత్సరాలకు పైబడి అసైన్డు భూములను అనుభవిస్తున్న వారికి ఆ భూమిపై పూర్తి హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అసైన్డు భూములను, ఒరిజనల్ అస్సైనీలను, వారి వారసులను ధ్రువీకరించే పనులనుపైన కూడా ప్రత్యేకదృష్టి సారించాలని చెప్పారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు ఏపీలోని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సాహితీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదం అనంతరం తీసుకున్న చర్యలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో పలు శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ప్రమాదకర రసాయన పరిశ్రమలను వెంటనే మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. పరిశ్రమలు, ఫైర్ తదితర విభాగాల అధికారులతో ప్రతిఏటా తప్పకుండా ఆయా పరిశ్రమలను తనిఖీ చేయాలన్నారు. ప్రతి ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఎక్కడైనా లోపాలుంటే వెంటనే నోటీసులిచ్చి వాటిని సరిదిద్దాలని ఆదేశించారు. సాల్వెంట్ పరిశ్రమలను నిర్వహించే వ్యక్తుల సామర్థ్యాన్ని, భద్రతకు తీసుకుంటున్న చర్యలను పూర్తిగా పరిశీలించాకే లైసెన్స్లు జారీ చేయాలన్నారు. -
పోలవరం నిర్వాసితులకు పునరావాసంపై రామోజీ అసత్య వార్తలు
-
గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 7,59,015 క్యూసెక్కులకు పెరిగింది. దాంతో నీటి మట్టం 38.9 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం నుంచి 7,62,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్లోకి 6,86,660 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి మట్టం 9.40 అడుగులకు చేరింది. గోదావరి డెల్టాకు 9,900 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 6,76,760 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన వరద పెరిగిన నేపథ్యంలో బుధవారం ధవళేశ్వరం బ్యారేజ్కి చేరే ప్రవాహం పెరగనుంది. గోదావరిలో ఎగువన తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్లోకి 5,79,730 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్లోకి 7.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావం వల్ల బుధవారం, గురువారం బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. -
Fact Check: హామీ అమలు చేస్తున్నా హాహాకారాలేనా?
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టువల్ల ప్రయోజనం పొందే రైతులకు దీటుగా ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న నిర్వాసితుల జీవన ప్రమాణాలు పెంచేలా సీఎం వైఎస్ జగన్ పునరావాసం కల్పిస్తుండటాన్ని చూసి ఓర్వలేని రామోజీరావు ‘ఈనాడు’లో ఎప్పటిలాగే రోతరాతలతో యథేచ్ఛగా విషం చిమ్మారు. సర్వస్వం త్యాగంచేసిన నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా వారిని రోడ్డున పడేసి.. ప్రాజెక్టు ప్రోటోకాల్ను తుంగలో తొక్కి కొడుకు వియ్యంకుడి సంస్థతో కలిసి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను రామోజీరావు, చంద్రబాబు చేపట్టి ప్రజాధనాన్ని దోచుకుని, పంచుకు తిన్నారన్నది బహిరంగ రహస్యం. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. చంద్రబాబు చేసిన ఘోర తప్పిదాలను సరిదిద్దుతూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టును పూర్తిచేస్తుంటే రామోజీరావు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. కాంట్రాక్టు నుంచి రామోజీ కొడుకు వియ్యంకుడి సంస్థను జగన్ తప్పించడంతో తమ డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో)కి అడ్డుకట్ట పడిందనే రామోజీరావు అక్కసు సోమవారం ‘ఈనాడు’లో ‘గోదాట్లో కలిసిన జగన్ హామీ’ శీర్షికన ప్రచురించిన కథనంలోని ప్రతి అక్షరంలోనూ కన్పిస్తుంది. ఆ క్షుద్ర పాత్రికేయంలోని ఆరోపణలు, వాస్తవాలు ఇవీ.. ఈనాడు ఆరోపణ: నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదు.. పునరావాస కాలనీలకు తరలించలేదు. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగంచేస్తే రోడ్డున పడేస్తారా? వాస్తవం: రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు అంగీకరించడంతో.. 2016, సెప్టెంబరు 7న అర్థరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి కేంద్రం అప్పగించింది. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం 2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగంలో మిగిలిపోయిన వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం పెట్టిన షరతుకు అంగీకరించారు. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో 2014, ఏప్రిల్ 1 నాటికి రూ.4,730.71 కోట్లు వ్యయం చేశారని.. మిగిలిన రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామంటూ 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్ధిక శాఖ తెగేసిచెబితే.. దానికి చంద్రబాబు తలూపారు. అందులో భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయం రూ.9,477 కోట్లే. భూసేకరణ చట్టం–2013 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయం రూ.28,172.21 కోట్లు. అలాంటప్పుడు రూ.9,477 కోట్లతోనే భూసేకరణతోపాటు 373 ముంపు గ్రామాల్లోని 1,06,006 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. నిర్మాణ బాధ్యతలు దక్కగానే రామోజీరావు కొడుకు వియ్యంకుడి సంస్థకు నామినేషన్పై పనులు కట్టబెట్టిన చంద్రబాబు.. ప్రాజెక్టు ప్రోటోకాల్ను తుంగలో తొక్కి.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యమిచ్చి కమీషన్లు దండుకున్నారు. ఈ క్రమంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పనులు చేపట్టారు. పునరావాసం కల్పించకుండా కాఫర్ డ్యామ్లు నిర్మిస్తూ తమను ముంచేస్తున్నారంటూ కేంద్ర జల్శక్తి శాఖ, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం)కు నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర జల్శక్తి శాఖ.. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యామ్ల పనులు చేయాలని అప్పట్లో చేసిన సూచనలను చంద్రబాబు తోసిపుచ్చారు. కమీషన్లు రావనే నెపంతో పునరావాసం పనులు చేపట్టకుండా.. కాఫర్ డ్యామ్ల పనులు మధ్యలోనే ఆపేసి చేతులెత్తేశారు. ఇప్పుడు చెప్పండి రామోజీ.. సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులను రోడ్డున పడేసి వియ్యంకుడితో కలిసి పోలవరంలో దోచుకుంది మీరు, చంద్రబాబు కాదా? ఈనాడు: తొలిదశ పునరావాసానికీ దిక్కులేదు. ఆందోళనలో 24 వేల కుటుంబాలు, ఊళ్లు. మాట తప్పను.. మడమ తిప్పను అనే సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క మాటనూ ఇప్పటికీ నిలబెట్టుకోలేదు. వాస్తవం: ప్రాజెక్టులో 41.15 మీటర్ల పరిధిలో 20,946 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని తొలుత గుర్తించారు. ఇందులో 2014–2019 మధ్య 3,073 నిర్వాసిత కుటుంబాలకు రూ.96.80 కోట్లను పరిహారంగా అందించారు. 3,066 ఇళ్లను రూ.96.60 కోట్లతో నిర్మించి పునరావాసం కల్పించారు. అంటే.. ఐదేళ్లలో కేవలం రూ.193.4 కోట్లు వెచ్చించి 3,073 కుటుంబాలకు మాత్రమే చంద్రబాబు సర్కార్ పునరావాసం కల్పించినట్లు స్పష్టమవుతోంది. కానీ, జగన్ సీఎం అయ్యాక పునరావాసంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ► 2019, మే 30 నుంచి ఇప్పటివరకూ 10,720 కుటుంబాలకు పునరావాస పరిహారంగా రూ.722.27 కోట్లు చెల్లించారు. ► రూ.1,006.15 కోట్ల వ్యయంతో పునరావాస కాలనీల్లో 11,575 ఇళ్లను నిర్మించారు. 8,878 కుటుంబాలను కాలనీలకు తరలించి పునరావాసం కల్పించారు. ► అంటే.. నాలుగేళ్లలో.. అందులో కరోనా విపత్తువల్ల రెండేళ్లు తీవ్ర ఇబ్బందులున్నా సరే రూ.1,728.42 కోట్ల వ్యయంతో 8,878 కుటుంబాలకు సీఎం జగన్ పునరావాసం కల్పించినట్లు స్పష్టమవుతోంది. ► నిర్వాసితులకు పునరావాసం కల్పించడా నికి బాబు ఐదేళ్లలో చేసిన వ్యయం కంటే జగన్ నాలుగేళ్లలోనే తొమ్మిది రెట్లు అధికంగా ఖర్చుచేశారన్నది స్పష్టమవుతోంది. ► మిగిలిన 8,228 కుటుంబాలకు నాలుగు నెలల్లో పునరావాసం కల్పించేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రూ.830.14 కోట్ల బిల్లులు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ► జగన్ ఇచ్చిన హామీ మేరకు పోలవరం నిర్వాసిత కుటుంబాలకు రూ.పది లక్షల నగదు ప్యాకేజీ ఇచ్చేందుకు గ్రీన్సిగ్నల్ ఇస్తూ 2021, జూన్లో జారీచేసిన జీఓ–224 అమలుకు కూడా సిద్ధమైంది. ఈనాడు: ‘ప్రధాని అపాయింట్మెంట్ తీసుకున్నాను.. మీ కష్టాలను ప్రధానికి వివరించి.. మీరే బటన్ నొక్కి నిర్వాసితులకు ఖాతాల్లో పరిహారం జమచేయాలని ప్రధానిని కోరుతా’ అని 2022, జూలై 28న పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలుపుకోలేదు. వాస్తవం: జగన్ 2022, ఆగస్టు 22న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశమై.. వాస్తవంగా భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ.28,172.21 కోట్లని.. కానీ, 2016లో నాటి సీఎం చంద్రబాబు 2013–14 ధరల ప్రకారం రూ.15,667.9 కోట్లకే పూర్తిచేస్తానని అంగీకరించారని.. కానీ, ఆ ధరలతో ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యమని మరోసారి వివరించారు. 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన నగదు పరిహారాన్ని వారి ఖాతాల్లోనే నేరుగా జమచేయాలని ప్రధానిని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం.. నిర్వాసితుల పునరావాసంతో సహా తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లను అదనంగా ఇచ్చేందుకు అంగీకరిస్తూ జూన్ 5న కేంద్ర ఆర్ధికశాఖ ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో 41.15 కాంటూర్ పరిధిలోకి 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలింది. అందులో నివసిస్తున్న 16,642 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ.4,223 కోట్లు వ్యయం అవుతుందని.. ఈ నేపథ్యంలో తొలిదశ పనుల పూర్తికి రూ.17,144 కోట్లు విడుదల చేయాలని జూలై 5న ప్రధానిని సీఎం జగన్ మరోసారి కోరారు. నిర్వాసితులకు జగన్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంటే నీకెందుకంత కడుపుమంట రామోజీ?. అప్పుడు, ఇప్పుడూ అవే గ్రామాలు.. భద్రాచలం వద్ద గోదావరికి వరద వచ్చే సమయంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటికీ కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మించక ముందు కూడా అనేక గ్రామాలు ముంపునకు గురయ్యేవి. ఆ గ్రామాల ప్రజలను రెవిన్యూ అధికారులు పునరావాస శిబిరాలకు తరలించేవారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిగా ఎత్తివేసి, వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. అంటే నీటిని ఏమాత్రం నిల్వచేయడంలేదని స్పష్టమవుతోంది. ప్రాజెక్టు కట్టనప్పుడు ఏ గ్రామాలైతే ముంపునకు గురయ్యేవో ఇప్పుడు అవే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆ గ్రామాల ప్రజలను రెవిన్యూ అధికారులు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. -
పోలవరం వద్ద పెరుగుతున్న వరద.. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
సాక్షి, ఏలూరు జిల్లా : ఎగువను కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద 32.390 మీటర్ల నీటిమట్టం పెరిగింది. వరద పోటెత్తడంతో డ్యాం 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. స్పిల్ వే గేట్ల నుంచి 7 లక్షల 43 వేల 352 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే దిగువన 24 మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరి వరదల నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 1800 233 1077 జంగారడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 9553220254 కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 7013128597,9848590546 వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 6309254781 తూ.గో. జిల్లా: ధవళేశ్వరంలో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. కాటన్ బ్యారేజ్ వద్ద 10.8 అడుగులకు నీటి మట్టం చేరింది. 8.48 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాల్వలకు 11వేల క్యూసెక్కులు విడుదల చేశారు అధికారులు. చదవండి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ వదలని వాన.. వరదలా.. -
వరద గోదారి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, దాని ఉప నదులు జలకళ సంతరించుకున్నాయి. ఎగు వన గోదావరిలోకి ప్రవాహాలు పెరుగుతుండగా.. కాళేశ్వరం దిగువన ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదులు, వాగుల నీటి చేరికతో నది ఉగ్రరూపం దాల్చుతోంది. మేడిగడ్డ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. దీనితో అధికారులు గురువారం మధ్యాహ్నమే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక్క గురువారం రాత్రి 8 గంటల సమయానికి 9,79,347 క్యూసెక్కుల ప్రవాహంతో వరద నీరు 44.1 అడుగులకు చేరింది. శుక్రవారం తెల్లవారు జాము సమయానికి నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక అయిన 48 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో నది తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రా లకు తరలిస్తున్నారు. ఇక ఎగువ గోదావరిలోనూ వరద పెరిగింది. మహారాష్ట్రలో, రాష్ట్రంలోని పరీ వాహక ప్రాంతంలో వానలతో శ్రీరాంసాగర్ ప్రాజె క్టులోకి 59,165 క్యూసెక్కుల వరద చేరుతోంది. వచ్చిన వరద వచ్చినట్టుగానే.. ప్రాణహితలో వరద ఉధృతి పెరుగుతోంది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోకి చేరుతున్న 5,37,140 క్యూసెక్కులను వచ్చింది వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు దిగువన ఇంద్రావతి జలాలు తోడై సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజీలోకి 8,76,940 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ మొత్తాన్నీ విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తాలిపేరు, కిన్నెరసాని సైతం పొంగి ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు దాదాపు గరిష్ట మట్టానికి చేరగా.. తాలిపేరు 24 గేట్లు ఎత్తి 1,02,399 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. వీటితోపాటు శబరి జలాలు కూడా కలసి గోదావరి మహోగ్ర రూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద వరద నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. దీనితో కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం సబ్ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం భద్రాచలం రానున్నారు. వరద మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. పోలవరానికి పెరిగిన వరద భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టులోకి గోదా వరి ప్రవాహం పెరిగింది. గురువారం రాత్రి ఏడు గంటలకు పోలవరం ప్రాజెక్టులోకి 5,99,490 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 48 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నీటి మట్టం స్పిల్వే ఎగువన 31.88 మీటర్లు, దిగువన 23.3 మీటర్లుగా.. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 32.55 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 22.73 మీటర్లుగా నమోదైంది. పోలవరం నుంచి నీరంతా ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ, మిగతా నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తత గోదావరి, దాని ఉప నదుల పరీవాహక ప్రాంతంలో గురు, శుక్రవారాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. గోదావరితోపాటు ఉప నదులు, వాగుల ప్రవాహాలతో ప్రభావం పడేచోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణా ఉప నదులకూజలకళ మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో కృష్ణా నది ఉప నదుల్లోనూ వరద ప్రారంభమైంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి 32,146 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి నిల్వ 32.24 టీఎంసీలకు చేరింది. ఆ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 97 టీఎంసీలు అవసరం. దీని దిగువన ఉన్న నారాయణ పూర్ డ్యామ్లోకి ఇంకా వరద మొదలవలేదు. ఇక కృష్ణా ఉపనది మలప్రభ నుంచి మలప్రభ ప్రాజెక్టులోకి 10,437 క్యూసెక్కులు, ఘటప్రభ ఉప నది నుంచి ఘటప్రభ ప్రాజెక్టులోకి 20,813 క్యూసెక్కులు వరద వస్తోంది. భద్ర నది నుంచి భద్ర రిజర్వాయర్లోకి 4,227 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి తుంగభద్ర డ్యామ్లోకి 9,536 క్యూసెక్కులు ప్రవాహాలు ఉన్నాయి. బీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులోకి 12,925 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ నిండితే ప్రధాన కృష్ణా నదిలోకి వరద మొదలుకానుంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని.. నెలాఖరు నాటికి ప్రధాన నదిలో ప్రవాహాలు పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు. కాగా, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో వానలతో కృష్ణా ఉప నది అయిన మూసీలో వరద ఉధృతి పెరిగింది. మూసీ ప్రాజెక్టులోకి 2,125 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు రెండు గేట్లు ఎత్తి 1,800 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. -
పోలవరం పనులు పరిశీలించిన పీపీఏ సీఈవో
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో శివనందన్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) ప్రాంతంలో గోతులు పడిన ప్రదేశంలో ఇసుకతో నింపి వైబ్రో కంపాక్షన్ చేసిన పనులను ఆయన తనిఖీ చేశారు. రానున్న వరదల కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, మేఘ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉరకలేస్తున్న గోదావరి
దవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో బ్యారేజీ వద్దకు వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 9.70 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 1,25,693 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. నీటిమట్టం ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద 14 అడుగులకు, పోలవరంలో 27.67 మీటర్లకు చేరింది. -
పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోంది: మంత్రి అంబటి
తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోందని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దాని కాంట్రాక్టు రామోజీరావు బంధువు నుంచి పోయిందని కక్ష కట్టారని అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయాలనే తపనతో సీఎం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు. కరోనా టైంలో కష్టాలు వచ్చినా కీలక నిర్మాణాలు పూర్తి చేశామని పేర్కొన్నారు. లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం, స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత జగన్దని చెప్పారు. డయా ఫ్రం వాల్ నిర్మాణం వరదల వల్ల కొట్టుకుపోలేదని మంత్రి అంబటి స్పష్టం చేశారు. కేవలం చంద్రబాబు నిర్లక్ష్యం, కమిషన్ల వలనే కొట్టుకుపోయిందన్నారు. ఆ విషయాలను రామోజీ ఎందుకు రాయటం లేదు? అని ప్రశ్నించారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్కి మరమ్మత్తు చేయటమా? కొత్తది నిర్మాణమా అనే దానిపై సీడబ్ల్యుసీ ఆలోచిస్తోందని చెప్పారు. కాఫర్ డ్యాంలు పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ కట్టొచ్చని మీ పత్రికలో రాయగలరా? అని ప్రశ్నించారు. పయ్యావుల కేశవ్కి లోకేష్ కన్నా తక్కువ బుర్ర ఉందని, అందుకే పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రూ.900 కోట్లు మాయం అయ్యాయని వాపోతున్నారు.. ఆర్.ఈ.సీ. కాంట్రాక్టును ఒకసారి చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయని మంత్రి అంబటి తెలిపారు. అన్నిస్థాయిల్లోనూ పనులను చెక్ చేసిన తర్వాతనే నిధులు విడుదల చేశారని వెల్లడించారు. చట్టం ప్రకారమే నిధులు విడుదల చేశారని, అందులో తప్పేమీలేదని అంబటి చెప్పారు. పవన్ ఏకపత్నీవ్రతుడు: అంబటి 'పవన్కళ్యాణ్ నిన్న తణుకు సభలో మరోసారి ఊగిపోయాడు. ఆయన పెళ్ళిళ్ల గురించి మాట్లాడితే ఆయనకు కోపం వస్తుంది. కానీ నిత్యం ఆయన పక్కనే ఉండే నాదెండ్ల మనోహర్కు మాత్రం ఏ కోపం రాదు. ఆయన ఒక కార్మిక వీరుడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి జనసేన ఆఫీస్కు రహస్య సొరంగ మార్గం తవ్వడానికి పని చేస్తున్న కార్మిక వీరుడు నాదెండ్ల మనోహర్. 'మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్' ఆవరించింది అంటే పవన్కళ్యాణ్కు కోపం వచ్చింది. ఇక నుంచి పెళ్ళిళ్ల గురించి ఎత్తం. అందుకు బదులుగా, ఒక్కోసారి ఒక్కో పెళ్ళి చేసుకున్న‘ఏకపత్నీ వ్రతుడు పవన్కళ్యాణ్గారు’ అని మాత్రమే అంటాం. అప్పుడు ఆయనకు చాలా ఆనందంగా ఉంటుంది.' అని మంత్రి అంబటి అన్నారు. వారిపై ఎందుకంత కడుపు మంట?.. 'వాలంటీర్ల వ్యవస్థ మీదు ఎందుకంత కడుపు మంట? వారు ఇతర ప్రాంతం, ఇతర రాష్ట్రాల నుంచి రాలేదు కదా? ఆ 50 ఇళ్లలో నుంచి వచ్చిన వారే కదా? అలాంటి వారిపై ఒక ఏకపత్నీవ్రతుడు, మరో ముసలాయన పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు. వారు గౌరవ వేతనం రూ. 5 వేలు మాత్రమే తీసుకుని ఎంతో సేవ చేస్తున్నారు. మీకు నిజంగా వారి పట్ల చిత్తశుద్ధి ఉంటే.. మీరు వస్తే వారికి లక్ష జీతం ఇస్తామని చెప్పండి. లేదా వారిని తీసేస్తామని చెప్పండి' అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 1000సార్లు జగన్నామస్మరణ చేయండి.. 'ఇక నుంచి సీఎం జగన్ను ఏకవచనంతోనే పిలుస్తానని పవన్ అన్నాడు. దాంతో మేము బాధ పడ్డామని, ఆయన బాధ పడిపోతున్నాడు. పవన్, ఆ శపథం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 373 సార్లు సీఎం జగన్ను ఏకవచనంతో సంబోధించాడు. అయ్యా, 1000 సార్లు అలా జగన్ పేరు ఉచ్ఛరించండి. మీరు చేసిన పాపాలన్నీ పరిహారం అవుతాయి.' అని మంత్రి అంబటి పేర్కొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు.. మయా శక్తి: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి -
ఏది నిజం?: కమీషన్లు అందటం లేదనే.. రామోజీ నేలబారు రాతలు
అసలింతకీ రామోజీరావుకు ఏం కావాలి? పోలవరం ప్రాజెక్టు పూర్తికావటమా... లేక ఎక్కడికక్కడ పనులు ఆగిపోవటమా? దీనికి ఆగిపోవటమే ఆయనకు కావాలన్న సమాధానం తేలిగ్గానే వచ్చేస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచి్చన దగ్గర్నుంచీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రామోజీరావు ‘ఈనాడు’లో అచ్చోసిన దుర్మార్గపు కథనాలు అన్నీఇన్నీ కావు. ఇంకేముంది ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదని కొన్నాళ్లు... కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదని కొన్నాళ్లు... ఎత్తు తగ్గించి కట్టేస్తున్నారని కొన్నాళ్లు... ఇలా పదేపదే విషాన్ని చిమ్ముతూనే వస్తున్నారు. చిత్రమేంటంటే... రామోజీ అంచనాలకు భిన్నంగా పోలవరం వేగంగా ముందుకెళుతోంది. చంద్రబాబు వీసమెత్తయినా పట్టించుకోని పునరావాసాన్ని కూడా వైఎస్ జగన్ భుజాలకెత్తుకుని ప్రాజెక్టును నడిపిస్తున్నారు. కేంద్రాన్ని పదేపదే అభ్యర్థిస్తూ... రావాల్సిన నిధుల్ని రాబట్టుకుంటున్నారు. ఇదిగో... ఇదే ‘ఈనాడు’ కడుపు మంటను పెంచేస్తోంది. కాంట్రాక్టరుగా తన వియ్యంకుడిని తప్పించేసి మరీ ప్రాజెక్టును పూర్తి చేస్తుండటాన్ని రామోజీరావు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘పోలవరం నిధుల కోసం... జగన్ నేల చూపులు– బేల మాటలు’ అంటూ సోమవారం ప్రచురించిన కథనం కూడా ఇలాంటిదే!!. మరి దీన్లో నిజానిజాలెంత? ఏది నిజం? ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చేది ఇక రూ.12,911.15 కోట్లనేనని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్లో 2017లో ఆమోదించిన మొత్తానికి అదనంగా... రూ.12,911.15 కోట్లే ఇస్తామని పేర్కొంది. దీనికన్నా పైసా ఎక్కువరాదు. వాస్తవం: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి, ఆరి్థక శాఖ మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్లను కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతి సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే గతేదాది జనవరి 3న ప్రధాని మోదీతో సమావేశమైనపుడు... ప్రాజెక్టు తొలి దశను సత్వరమే పూర్తి చేసి, రైతులకు ముందస్తు ఫలాలు అందించడానికి తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించి... జల్ శక్తి, ఆర్థిక శాఖలకు తగు ఆదేశాలిచ్చారు. కేంద్ర జల్ శక్తి శాఖ సూచన మేరకు తొలి దశ పూర్తికి రూ.10,911.15 కోట్లు అవసరమని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిని జల్ శక్తి శాఖ ఆమోదించింది. అయితే చంద్రబాబు ఘోర తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడానికి, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందని గత మార్చి 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. దాంతో తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు (10,911 ప్లస్ 2వేలు) విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ జూన్ 5న అంగీకరించింది. అదీ కథ. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం.. 2014, ఏప్రిల్ 1 నాటికి ఇరిగేషన్ కాంపొనెంట్ ఖర్చులో మిగిలిన మొత్తం అంటే రూ.15,667.9 కోట్లకు మించి ఇచ్చేది లేదని, ఆ తర్వాత పడే అదనపు భారంతో కేంద్రానికి సంబంధం లేదని 2017 మార్చి 15న కేంద్రం ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని కేబినెట్ ఆమోదించింది కూడా. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,128.78 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం రూ.14,418.39 కోట్లు రీయింబర్స్ చేసింది. అంటే 2017, మార్చి 15న కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రకారం పోలవరానికి ఇక విడుదల చేయాల్సింది రూ.1249.51 కోట్లే. ఈ నేపథ్యంలో... తొలి దశ పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లు విడుదల చేయాలంటే.. 2017, మార్చి 15 నాటి కేబినెట్ తీర్మానాన్ని సవరించాలి. ఆ మేరకు ప్రతిపాదన పంపాలని కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆరి్థక శాఖ సూచించిందే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వబోమని గానీ.. ఇచ్చేది ఇక ఇంతేననిగానీ ఆర్థిక శాఖ నోట్లో ఎక్కడా లేదు. రామోజీరావు మాత్రం ఇచ్చేది ఇక ఇంతేనని కేంద్ర ఆర్థిక శాఖ నోట్లో పేర్కొన్నట్లు తప్పుడురాతలు రాసేశారు. చంద్రబాబులా రామోజీది కూడా చంద్రబాబు తరహా బ్రీఫ్డ్ మీ ఇంగ్లీషే అయితే.. ట్యూషన్ పెట్టించుకోవాలి గానీ తనకు అర్థమైనదే వాస్తవమన్న రీతిలో రాసేస్తే ఎలా? అజా్ఞనంతో తప్పుడురాతలు అచ్చేస్తే ఎలా? ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులివ్వబోమని కేంద్రం చెప్పినా సీఎం వైఎస్ జగన్ నోరెత్తడం లేదు. లోక్సభలో బీజేపీకి కావాల్సినంత బలం ఉన్నా రాజ్యసభలో లేదు. రాజ్యసభలో ఉన్న రాజకీయ బలాన్ని పోలవరం నిధులు, ప్రత్యేక హోదా సాధనకు సీఎం వైఎస్ జగన్ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిరి్మంచాలి. కానీ.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కోసం రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ... దాని నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2014, జూన్ నుంచి 2016, సెపె్టంబరు 6 వరకూ నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు కేంద్రం మంజూరు చేశాక యనమల రామకృష్ణుడు బావమరిదికి, రామోజీరావు వియ్యంకుడికి ఈ కాంట్రాక్టు పనులు నామినేషన్పై కట్టబెట్టేశారు. భారీగా కమీషన్లు దండుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెపె్టంబరు 7న అంగీకరించడం. మరి ఆ మూడేళ్లలో ధరలు పెరిగి ఉండవా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకుంటే ఎలా? 2016, సెపె్టంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని.. 2018, డిసెంబర్లోగా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే.. విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామంటూ కేంద్రం పెట్టిన మెలికకు సైతం చంద్రబాబు తల ఊపేశారు. 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే (ఇరిగేషన్ కాంపొనెంట్) వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టం చేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి నోరు మెదపలేదు. 2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే .. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసినా సరే... చంద్రబాబు స్పందించలేదు. 2016, సెపె్టంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం... 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి.. నిధులిస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2018, జనవరి 12న నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ. 33,168.23 కోట్లు. అలాంటిది కేవలం రూ.15,667.9 కోట్లు ఇస్తే పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా అంగీకరించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే అంశాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శాసనసభలో పలు మార్లు ఎత్తిచూపుతూ.. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లని.. అలాంటిది కేంద్రం ఇస్తామన్న రూ.15,667.9 కోట్లతో ఎలా పూర్తి చేస్తారని నిలదీస్తే.. నాటి సీఎం చంద్రబాబు వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు. అంటే చంద్రబాబుకు కావాల్సింది కమీషన్లు తప్ప ప్రాజెక్టు పూర్తవటం కాదు. అందుకే రాష్ట్రమే చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... ప్రత్యేక హోదా అడగబోమని తాకట్టుపెట్టేశారు. అంచనా వ్యయాన్ని సవరించకున్నా నోరు మెదపలేదు. ఆఖరికి పునరావాసం ఊసెత్తకుండా కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ మాత్రమే ఇస్తామన్నా... సై అనేశారు. అసలు పునరావాసం లేకుంటే ప్రాజెక్టు ఉంటుందా? ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే పేదలకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి, వారికి తగిన పరిహారం ఇవ్వకుంటే వారు అక్కడి నుంచి వెళతారా? వారు వెళ్లకపోతే ప్రాజెక్టు పూర్తి చేసినా నీటిని నిల్వ చేయగలరా? నీటిని నిల్వ చేసే పరిస్థితి లేనపుడు ఎంత ఎత్తు కడితే లాభమేంటి? మరి పునరావాస నిధుల ఊసెత్తకుండా చంద్రబాబు ఎందుకు నోరుమూసుకున్నారు నిజానికి ఎలాంటి ప్రాజెక్టు అయినా... ఎంత ప్రతిష్టాత్మకమైనది అయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా వేసిన అంచనా వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికైనా అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు చేశారంటే... ఆయనకు కమీషన్లు వస్తే చాలనుకున్నారు కనక. చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నిధుల కొరత ఎదురవుతోందన్నది నిజం. ç2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. పోలవరం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్తోపాటు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ చర్చల వల్ల 2014–15 నాటి రెవెన్యూ లోటు రూ.10,421 కోట్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది. ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు సీఎం వైఎస్ జగన్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇవేవీ కని్పంచడం లేదా రామోజీ? ఈనాడు ఆరోపణ రెండో దశ పునరావాసానికి రాష్ట్రం ఏమీ చేయలేదని సీఎం స్వయంగా ప్రకటించారు. రాష్ట్రం నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పారు. వాస్తవం: కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా నీటిని నిల్వ చేయాలంటే.. ఐఎస్(ఇండియన్ స్టాండర్డ్) ఆపరేషన్ ఆఫ్ రిజర్వాయర్స్ గైడ్ లైన్స్, కేంద్ర జలసంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేయకుండా.. మూడు దఫాలుగా నిల్వ చేసుకుంటూ పోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి.. ప్రాజెక్టులో అన్ని భాగాలను పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతారు. ఆ తర్వాత 44 మీటర్ల కాంటూర్ వరకూ నీటిని నింపి, లోటుపాట్లు ఏవైనా ఉత్పన్నమైతే వాటిని సరిదిద్దుతారు. ఆనక 45.72 మీటర్లలో అంటే గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ పలు మార్లు శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. తొలుత 41.15 మీటర్ల వరకూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని.. ఆ తర్వాత దశలవారీగా పునరావాసం కల్పించి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేస్తామని ఉద్ఘాటించారు. ప్రాజెక్టు ఎత్తు ఏమాత్రం తగ్గదని.. కావాలంటే పూర్తయ్యాక టేపు తెచ్చుకుని కొలుచుకోవాలని చంద్రబాబు, రామోజీరావు ఎల్లో మీడియాకు సవాల్ విసిరారు. ఇదే అంశంపై అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క ఇంచు కూడా తగ్గదని, నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో అదనంగా 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలటంతో ఆ గ్రామాల ప్రజలకూ పునరావాసం కల్పించడానికి రూ.5,122 కోట్ల నిధులివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభ్యరి్థంచారు. దీనికీ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. దీన్ని బట్టి చూస్తే ప్రాజెక్టు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టమవుతుంది. అయినా సరే.. రామోజీరావు పదే పదే విషం చిమ్ముతున్నారు. -
బాధ్యులెవరంటూ బండ అబద్ధాలు..!
సాక్షి, అమరావతి: పోలవరంలో గైడ్ బండ్ జారడానికి దారితీసిన కారణాలను తేల్చేందుకు సీడబ్ల్యూసీ మాజీ ౖౖచైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో కేంద్ర జల్ శక్తి శాఖ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ అసలు ఇప్పటిదాకా నివేదిక ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో గైడ్ బండ్ను పరిశీలించిన అనంతరం కారణాలను గుర్తించేందుకు మరికొన్ని పరీక్షలు అవసరమని కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో గైడ్ బండ్కు తాత్కాలిక మరమ్మతులు, శాశ్వతంగా పటిష్టం చేయడంపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం జరిగింది. జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీడబ్ల్యూసీ చైర్మన్ కుస్విందర్సింగ్ వోరా, నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, పోలవరం సీఈ సుధాకర్బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈలోగానే గైడ్ బండ్ కుంగడానికి బాధ్యులెవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని జల్ శక్తి శాఖ ఆదేశించినట్లు ఈనాడు రామోజీ అచ్చేశారు. ఆ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి ఆయన చెవిలో చెప్పారా? లేదంటే ఆ సమావేశంలో ఎక్కడైనా బల్ల కింద నక్కి విన్నారా? బాధ్యతా రాహిత్యంగా కథనాలను ప్రచురించారు. ఈనాడు ఆరోపణ: గైడ్ బండ్ను 4 నెలల్లోనే పూర్తి చేయాలనేది తొలి ప్రణాళిక. అలాంటిది ఏడాదికిపైగా పట్టింది. ఇలా ఆలస్యం కావడం వల్లే నిర్మాణ ప్రదేశంలో మార్పులు జరిగి గైడ్ బండ్, రిటైనింగ్ వాల్ దెబ్బతిన్నాయి. వాస్తవం: గోదావరి సహజ మార్గాన్ని స్పిల్వే మీదుగా మళ్లించడానికి వీలుగా స్పిల్వే ఎడమ వైపు స్క్యూబండ్ నిర్మి ంచాలని సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ తొలుత ప్రతిపాదించాయి. సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్)లో నిర్వహించిన అధ్యయనంలో స్క్యూబండ్ నిర్మిస్తే స్పిల్వేకు ఎడమ వైపున వరద ఉద్ధృతి సెకనుకు 13.6 మీటర్లకు పెరిగి సుడిగుండాలకు దారి తీస్తుందని తేలింది. దీనిపై 2019 మార్చి 26న నిర్వహించిన డీడీఆర్పీ 12వ సమావేశంలో స్క్యూబండ్ స్థానంలో గైడ్ బండ్ నిర్మి ంచాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అప్రోచ్ చానల్కు సమాంతరంగా 500 మీటర్ల పొడవున గైడ్ బండ్ నిర్మి స్తే వరద ఉద్ధృతి సెకనుకు 3 నుంచి 6.5 మీటర్లకు తగ్గుతుందని 2021 మార్చి 23న జరిగిన డీడీఆర్పీ 17వ సమావేశంలో సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదించింది. ఆ మేరకు గైడ్ బండ్ డిజైన్ రూపొందించాలని డీడీఆర్పీ ఆదేశించింది. దీంతో 2021 మార్చిలో గైడ్బండ్ నిర్మి ంచే ప్రాంతంలో ఎనిమిది చోట్ల ఈసీపీటీ(ఎలక్ట్రో కోన్ పినట్రేషన్ టెస్ట్) నిర్వహించారు. అదే ఏడాది ఏప్రిల్ 12న రిటైనింగ్ వాల్, మే 15న స్టోన్ కాలమ్స్తో గైడ్ బండ్ డిజైన్లను సీడబ్ల్యూసీకి రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించింది. రిటైనింగ్ వాల్ డిజైన్ను 2021 ఏప్రిల్ 30, స్టోన్ కాలమ్స్తో కూడిన గైడ్ బండ్ డిజైన్ను 2021, మే 24న సీడబ్ల్యూసీ ఆమోదించింది. గైడ్ బండ్లో మొత్తం 13,762 స్టోన్ కాలమ్స్కుగానూ 8,388 కాలమ్స్ను 2021 మే 25 నుంచి జూన్లోపే కాంట్రాక్టు సంస్థ పూర్తి చేసింది. రిటైనింగ్ వాల్లో మొత్తం 105 ప్యానళ్లకుగానూ 35 ప్యానళ్లను 2021 మే నెలలో పూర్తి చేసింది. జూలైలో వరదలు వచ్చాయి. వరదలు తగ్గాక 2021 డిసెంబర్లో మళ్లీ పనులను ప్రారంభించింది. 2022 మార్చికి రిటైనింగ్ వాల్, ఏప్రిల్కు స్టోన్ కాలమ్స్ను పూర్తి చేసింది. గైడ్ బండ్ పనులను 2022 ఏప్రిల్ 12న ప్రారంభించింది. వరదలు వచ్చేలోగా గైడ్ బండ్ను +35 మీటర్ల ఎత్తుకు పూర్తి చేయాలని 2022 జనవరిలో పీపీఏ నిర్దేశించింది. ఆ ప్రకారం +34 మీటర్ల ఎత్తు వరకూ గైడ్ బండ్ను పూర్తి చేశారు. గతేడాది ఎన్నడూ లేని విధంగా జూలై 10న గోదావరికి లక్ష క్యూసెక్కుల వరద వ చ్చింది. జూలై 17 నాటికి అది 25 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో పీపీఏ నిర్దేశించిన విధంగా వరద తగ్గాక మిగిలిన కొద్దిపాటి పనిని చేపట్టి ఈ ఏడాది ఏప్రిల్కు పూర్తి గైడ్ బండ్ +51.32 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. ఈనాడు ఆరోపణ: గైడ్ బండ్ కుంగడానికి డిజైన్ పరంగా, నిర్మాణపరంగా వైఫల్యం. వాస్తవం: జాతీయ ప్రాజెక్టు పోలవరం పనులపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పీపీఏ, సీడబ్ల్యూసీ, డీడీఆర్సీ, సీఎస్ఆర్ఎంఎస్, వ్యాప్కోస్, జీఎస్ఐ అజమాయిషీ ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణలో నిర్మాణంలో లోపాలకు అవకాశమే ఉండదు. నాణ్యత పరీక్షలు నిర్వహించి ««ధ్రువీకరించాకే పనులు చేస్తారు. గైడ్ బండ్ అంటే.. నీటి ప్రవాహానికి మార్గ నిర్దేశం చేయడానికి ప్రత్యేకంగా నిర్మించే వంతెనలాంటి కట్టడాన్ని గైడ్ బండ్ అంటారు. పోలవరం ప్రతిపాదిత ప్రాజెక్టు వద్ద ఉన్న భౌగోళిక పరిస్థితుల రీత్యా గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్ చానల్ ద్వారా మళ్లించి స్పిల్ వే నిర్మించారు. తద్వారా స్పిల్ వే ఎడమ వైపున వరద ఉధృతి ఎక్కువగా ఉంటుందని, దీంతో సుడిగుండాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తించారు. స్పిల్ వే కు కూడా కొంత ఇబ్బంది ఉంటుందని భావించారు. ఆ సమయంలో నీటి వేగాన్ని తగ్గించి, సుడిగుండాల నివారణ కు రాళ్లు, మట్టితో స్పిల్ వే కు ఎగువన ఎడమ వైపున గైడ్ బండ్ను నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్పిల్ వే పొడవునా నీటి ప్రవాహ వేగం ఒకేలా ఉండేందుకే దీనిని నిర్మించారు. నిపుణులంటూ ఊహాగానాలా.. ఇప్పుడు చెప్పండి రామోజీ.. పనుల్లో ఎక్కడ జాప్యం జరిగింది? గైడ్ బండ్ను 4 నెలల్లోనే నిర్మించాలన్నది తొలి ప్రణాళికని మీకు మీరే ఊహించుకున్నారా? నిర్మాణంలో జాప్యం వల్లే గైడ్ బండ్, రిటైనింగ్ వాల్ దెబ్బ తిన్నట్లు ప్రాథమికంగా తేల్చిన నిపుణుడు మీరేనా? వరద తగ్గాక అప్రోచ్ చానల్ గైడ్ బండ్ వద్ద మట్టి తవ్వకం పనులు చేస్తున్నప్పుడు రిటైనింగ్ వాల్ 144 మీటర్ వద్ద వంగినట్లు, గైడ్ బండ్ 51.32 మీటర్ల నుంచి జారినట్లు జూన్ 3న అధికారులు గమనించారు. ఆ వెంటనే సీడబ్ల్యూసీకి తెలిపారు. దీనిపై జూన్ 5న సీడబ్ల్యూసీ చైర్మన్ కుస్విందర్సింగ్ వోరా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాక గైడ్ బండ్ జారలేదు. -
పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా దుష్ప్రచారం
-
పోలవరం అడవిలో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లి
సాక్షి, ఏలూరు: అరుదైన జాతికి చెందని బంగారు బల్లి అంతరించిపోతున్న జీవుల్లో ముఖ్యమైనది. ఇప్పుడివి పోలవరం అడవిగా పిలిచే పాపికొండలు అభయారణ్యంలోని కొండ గుహల్లో సందడి చేస్తున్నాయి. బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టి లోడస్ అరీస్. సాధారణంగా ఇవి రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు.. లేత పసుపు రంగులో 150 మిల్లీమీటర్ల నుంచి 180 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో మాత్రమే సంచరిస్తాయి. రాతి గుహలు, వాటి సందు మధ్య ఉండే తేమ ప్రాంతాలంటే బంగారు బల్లులకు మహా ఇష్టం. 40 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయి ఇవి ఒకేసారి సుమారు 40 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయ. ఇవి గుడ్లను విచిత్రంగా కిందకి వేలాడే విధంగా పెడతాయి. ఈ గుడ్లను పాములు, క్రిమికీటకాలు తినేస్తుండటంతో ఇవి అంతరించిపోయే జాతుల్లోకి చేరుతున్నాయని అంటున్నారు. పాపికొండలు అభయారణ్య గోదావరి పరీవాహక రాతి ప్రాంతాల్లో సుమారు 250 వరకు బంగారు బల్లులు ఉన్నట్టు అటవీ శాఖ అంచనా వేశారు. బంగారు బల్లుల్లోనూ రెండు జాతులుగా ఉన్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. వాటిలో ఒకటి కాలొడాక్టి లోడస్ అరీస్. ఇవి సాధారణ బల్లుల కంటే పెద్దగా అరుస్తూ వింత శబ్దం చేస్తాయని చెబుతున్నారు. పాపికొండలు అభయారణ్యంలో బంగారు బల్లుల సంచారం ఉంది పాపికొండలు అభయారణ్యంలో బంగారు బల్లుల జాడ ఉంది. రెండేళ్ల క్రితం నేను, విశాఖపట్నానికి చెందిన శాస్త్రవేత్త కలిసి పోలవరం మండలం సిరివాక గ్రామంలోని గోదావరి సమీపంలో గల రాతి ప్రదేశాల్లో అధిక సంఖ్యలో బంగారు బల్లులు పెట్టిన గుడ్లు గుర్తించాం. 250కి పైగా బంగారు బల్లులు ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. – దావీదురాజు నాయుడు, ఇన్చార్జి ఫారెస్ట్ అధికారి, పోలవరం ఫొటోలు తీశా పాపికొండలు అభయారణ్యంలో అరుదైన పక్షులను, జంతువులను ఫొటోలు తీశాను. బంగారు బల్లి కూడా నా కెమెరాకు చిక్కింది. అభయారణ్యం రాతి ప్రాంతాల్లో ఈ బల్లుల సంచారం ఉంది. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్థారించారు. – కె.బాలాజీ, ఫొటోగ్రాఫర్, రాజమండ్రి చదవండి: పేదలనూ పిండుకున్న ‘పసుపు రాబందులు’ -
బాబు నిర్వాకంతో రూ.2,020 కోట్లు నష్టం
సాక్షి, అమరావతి: అవగాహనా రాహిత్యంతో పనులు చేపట్టడంతోపాటు పోలవరం నిర్మాణంలో జాప్యం, భారీ నష్టానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ హయాంలో ప్రోటోకాల్ ప్రకారం వరదను మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేయకుండా కమీషన్ల దాహంతో ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్వాల్ను చంద్రబాబు చేపట్టారని విమర్శించారు. కాఫర్ డ్యామ్ను పూర్తి చేయకుండా ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల గోదావరి వరద ఉధృతికి డయాఫ్రమ్వాల్ దెబ్బ తినడంతోపాటు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం కోతకు గురై అగాధాలతో ధ్వంసమైందన్నారు. డయాఫ్రమ్వాల్లో దెబ్బతిన్న చోట్ల కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి, అగాధాలను పూడ్చివేసి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చేందుకు రూ.2,020 కోట్లు వ్యయం అవుతుందని సీడబ్ల్యూసీ తేల్చిందన్నారు. ఈ నష్టానికి చంద్రబాబు, దేవినేని ఉమా, నవయుగ కారణమని స్పష్టం చేశారు. నవయుగ సంస్థ రామోజీ కుమారుడి వియ్యంకుడిది కావడంతో ఈ నష్టం ఈనాడుకు కనపడదని వ్యాఖ్యానించారు. కమీషన్ల దాహంతో మీరు చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తుంటే ఎందుకంత కడుపుమంట? అని చంద్రబాబు, ఎల్లో మీడియాను నిలదీశారు. ప్రచార పిచ్చితో ఆర్నెల్ల క్రితం పోలవరాన్ని పరిశీలిస్తానంటూ రాత్రి పూట చంద్రబాబు రాద్ధాంతం చేస్తే మాజీ మంత్రి దేనినేని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాజాగా వీరంగం సృష్టించారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ శరవేగంగా పూర్తిచేస్తున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించాలనుకుంటే అనుమతి కోరితే ఇస్తామని చెప్పారు. మంత్రి అంబటి ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పూర్తవుతుండటం కానరాదా? సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసి స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానళ్లను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని 6.1 కి.మీ. పొడవున 2021 జూన్ 11నే మళ్లించారని మంత్రి అంబటి గుర్తు చేశారు. దిగువ కాఫర్ డ్యామ్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్ను పూర్తి చేశామన్నారు. విద్యుత్కేంద్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల ప్రకారం ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాల పూడ్చివేత వేగంగా సాగుతోందన్నారు. అది పూర్తయ్యాక డయాఫ్రమ్ వేసి వరదల్లోనూ ప్రధాన డ్యామ్ను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే పోలవరం పనుల్లోపురోగతే లేదంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా దు్రష్ఫచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెస్తున్న సీఎం జగన్ 2013–14 ధరల ప్రకారం రూ.20,398 కోట్లతో పోలవరం పూర్తి చేస్తానంటూ కేంద్రంతో చేసుకున్న ఒప్పందంపై 2016లో చంద్రబాబు సంతకం చేశారని మంత్రి అంబటి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 48 శాతం పూర్తయ్యాయని, వ్యయం మాత్రం రూ.20,398 కోట్ల కంటే ఎక్కువ అయ్యిందన్నారు. చంద్రబాబు కమీషన్ల దాహంతో 2013–14 ధరలకే పనులు చేస్తానని అంగీకరించడం వల్ల 2017–18 ధరల ప్రకారం పోలవరానికి ఇవ్వాల్సిన రూ.55,548 కోట్లను కేంద్రం ఇవ్వడం లేదన్నారు. 2017–18 ధరల ప్రకారం నిధులిచ్చి ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేసేందుకు సహకరించాలని సీఎం జగన్ పలుదఫాలు ప్రధాని మోదీ, జల్ శక్తి, ఆరి్థక శాఖల మంత్రులను కోరారని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం తొలుత 41.15 మీటర్ల పరిధిలో పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,911 కోట్లు విడుదలకు అంగీకరించిందన్నారు. ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో 41.15 మీటర్ల పరిధిలోకి మరో 36 గ్రామాల్లోని 16 వేల నిర్వాసిత కుటుంబాలు వస్తాయని తేలిందని, వారికి పునరావాసం కలి్పంచేందుకు రూ.5,127 కోట్లను అదనంగా ఇవ్వడానికి కూడా కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. నిధుల సమస్యను పరిష్కరించిన సీఎం జగన్ పోలవరాన్ని సందర్శించి శరవేగంగా పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయడాన్ని చూసి ఓర్వలేని ఈనాడు రామోజీరావు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గైడ్ బండ్ కుంగలేదన్నారు. కొంత జారిందని, కారణాలపై సీడబ్ల్యూసీ కమిటీ అన్వేííÙస్తుందన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా దాన్ని చక్కదిద్దుతామని స్పష్టం చేశారు. వైఎస్సార్ స్వప్నం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించేది సీఎం వైఎస్ జగనేనని స్పష్టం చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశావ్ బాబూ? చంద్రబాబుకు మతిభ్రమించి సీఎం జగన్, మంత్రులపై విమర్శలు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. ‘సీఎంగా 14 ఏళ్లు పనిచేసి కుప్పాన్ని మున్సిపాలిటీగా చేశావా? కనీసం రెవెన్యూ డివిజన్గా కూడా ఎందుకు చేయలేకపోయావ్?’ అని చంద్రబాబును నిలదీశారు. కుప్పం కాలువను కూడా పూర్తిచేయలేని దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబుదన్నారు. కుప్పంలో ఎలాంటి అభివృద్ధీ చేయని చంద్రబాబుకు మంత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉందా? అని నిలదీశారు. ఐదేళ్లలో పులివెందులను దివంగత వైఎస్సార్ ఎలా అభివృద్ధి చేశారో వెళ్లి చూడాలని సలహా ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్కు విశ్వాసపాత్రుడిగా ఉంటూ టికెట్ తెచ్చుకుని సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా అంబటి చెప్పారు. చంద్రబాబు, పవన్ పార్టీలు మారిన వస్తాదులను ఎంత మందిని పోటీకి పెట్టినా ప్రజలు తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
‘పోలవరం’ వద్ద మాజీ మంత్రి ఉమా హడావుడి
పోలవరం రూరల్/ గోపాలపురం/బుట్టాయగూడెం : ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలిస్తామంటూ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, టీడీపీ నేత బొరగం శ్రీనివాసరావులు పోలవరం ఏటిగట్టు సెంటర్కు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో రహస్యంగా మాజీ మంత్రి ఏజెన్సీ గ్రామాల్లోని రోడ్డు మార్గం మీదుగా మోటార్ సైకిల్పై స్థానిక ఏటిగట్టు సెంటర్కు చేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. టీడీపీ హయాంలో పనులు జరిగాయని, ఇప్పుడు ఎంతవరకు జరిగాయో చూస్తామంటూ వాదించారు. ఈ క్రమంలో డీఎస్పీ కె.శ్రీనివాసులు, సీఐ కె.విజయబాబులు వారిద్దరినీ పోలీస్ వాహనంలో ఎక్కించి బుట్టాయగూడెం స్టేషన్కు తరలించారు. కన్నాపురం అడ్డరోడ్డు వద్ద టీడీపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్ను కూడా అడ్డుకుని అక్కడ నుంచే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామారాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, బడేటి చంటి, ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మద్దిపాటి వెంకటరాజులు పోలవరం ప్రాజెక్టు వద్దకు ఏలూరు నుంచి బయలు దేరారు. గోపాలపురం మండలం కొవ్వూరుపాడు వద్దకు చేరు కోగానే పోలీసులు వారిని అడ్డుకుని, గోపాలపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం పలువురు టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని హడావుడి చేశారు. తర్వాత పోలీసులు టీడీపీ నేతలను విడుదల చేశారు. అనంతరం ఉమ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందన్నారు. -
Fact Check: కుంగుతున్నది రామోజీ బుద్ధే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ చకచకా పూర్తి చేస్తుండటంతో రాజకీయంగా చంద్రబాబుకు నూకలు చెల్లడం ఖాయమనే భయం.. వియ్యంకుడిని కాంట్రాక్టర్గా తప్పించడంతో తమ దోపిడీకి అడ్డుకట్ట పడిందనే అక్కసుతో రామోజీరావు పదే పదే విషం చిమ్ముతున్నారు. గైడ్ బండ్లో ఉత్పన్నమైన చిన్న సమస్యను పెద్ద విపత్తుగా చూపిస్తూ.. విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజినీర్, విశ్రాంత చీఫ్ ఇంజినీర్, కీలక ఇంజినీరింగ్ అధికారి అంటూ.. వారి పేర్లు ప్రస్తావించకుండా.. ఆ ముసుగులో తన అభిప్రాయాలనే వారి అభిప్రాయాలుగా ‘ఈనాడు’లో రోతరాతలు అచ్చేశారు. టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు, నవయుగ చేసిన తప్పిదం వల్ల గోదావరి వరదల ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. వీటిని చక్కదిద్దడానికి రూ.2020.05 కోట్లు అదనంగా వ్యయం చేయాలని సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) తేల్చి0ది. ఈ విపత్తుకు చంద్రబాబు చేసిన మానవ తప్పిదమే కారణమని ఐఐటీ(హైదరాబాద్), డీడీఆర్పీ, ఎన్హెచ్పీసీ నిపుణులు తేల్చిచెప్పారు. ఇవన్నీ తన బాబు సీఎం కుర్చిలో లేరని కుంగిపోతున్న రామోజీరావుకు కన్పించవు. ఎందుకంటే.. చంద్రబాబు, వియ్యంకుడి సంస్థ నవయుగతో కలిసి పోలవరంలో రామోజీరావు డీపీటీ (దోచుకో పంచుకో తినుకో) పద్ధతిలో దోచుకున్నారు కాబట్టి. ఆ పెను విపత్తును కప్పిపెడుతూ.. గైడ్ బండ్లో ఉత్పన్నమైన చిన్న సమస్యను పెద్ద విపత్తుగా చిత్రీకరిస్తూ శుక్రవారం ‘మెగా వైఫల్యం’ శీర్షికన ప్రచురించిన కథనంలో వీసమెత్తు వాస్తవం లేదు. ఆరోపణ: రిటైనింగ్ వాల్ కమ్ గైడ్ బండ్ పూర్తిగా కుంగిపోయి ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడింది. వాస్తవం: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్కు తగ్గట్టుగానే గైడ్ బండ్ నిర్మాణం జరిగింది. రిటైనింగ్ వాల్ కమ్ గైడ్ బండ్ నిర్మాణానికి ముందు.. దాని నిర్మాణ ప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్ కాలమ్స్తో భూమిని అభివృద్ధి చేశారు. జీఎస్ఐ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అనుమతి ఇచ్చాకే రిటైనింగ్ వాల్ కమ్ గైడ్ బండ్ నిర్మాణం చేపట్టారు. డిజైన్ ప్రకారం నిర్మించకపోయి ఉంటే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన జీఎస్ఐ, వ్యాప్కోస్, సీఎస్ఎంఆర్ఎస్, పీపీఏలు మౌనంగా ఉండవు. వీటిని పరిశీలిస్తే.. డిజైన్లోనూ లోపం లేదు. నిర్మాణంలోనూ లోపం లేదన్నది స్పష్టమవుతోంది. ఇక గైడ్ బండ్ పూర్తిగా కుంగిపోయిందనడం అవాస్తవం. రిటైనింగ్ వాల్లో ఒక చోట స్టోన్ కాలమ్స్ కాస్త ఒంగిపోవడం వల్ల గైడ్ బండ్లో 134 మీటర్ల మేర కొంత జారింది. దీనిని సరిచేయడంలో నిపుణులు నిమగ్నమయ్యారు. ఆరోపణ: కుంగిపోయిన గైడ్ బండ్ స్థానంలో మళ్లీ మొదటి నుంచి నిర్మించాల్సి వస్తుందేమోనని ఇంజినీర్లు చెబుతుంటే.. సాక్షాత్తు సీఎం జగన్ దీన్ని చిన్న అంశంగా తేల్చి పారేయడం విస్మయం కలిగించింది. వాస్తవం: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీడబ్ల్యూసీ, పీపీఏ, సీఎస్ఆర్ఎంఎస్, సీడబ్ల్యూపీఆర్ఎస్, వ్యాప్కోస్, జీఎస్ఐ వంటి సంస్థల అధికారుల పర్యవేక్షణలో పోలవరం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుని.. చకచకా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ సదుద్దేశం. గైడ్ బండ్ పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. సమీక్షించి.. జారడానికి గల కారణాలను మదింపు చేసి నివేదిక ఇవ్వడానికి సీడబ్ల్యూసీ ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 16లోగా నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా గైడ్ బండ్ను చక్కదిద్దుతారు. ఈ చిన్న సమస్యను సాకుగా చూపి ప్రాజెక్టు నిర్మాణంలో అహర్నిశలు శ్రమిస్తోన్న అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం, నిర్మాణ సంస్థ సమర్థతను ప్రశ్నిం ర్నిచడం అవివేకమే అవుతుంది. ఆరోపణ: గైడ్ బండ్లో రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణ శైలిని 2ః1 నిష్పత్తిలో కాకుండా.. 3ః1 నిష్పత్తిలో నిర్మించి ఉంటే కుంగిపోయేది కాదు. (విశ్రాంత ఇంజినీర్ పేరుతో రామోజీ మనసులోని మాట ఇది) వాస్తవం: డిజైన్ల రూపకల్పన, ఖరారులో సీడబ్ల్యూసీ అత్యున్నత సంస్థ. ఆ సంస్థ ఆమోదించిన డిజైన్ ప్రకారం సైడ్ స్లోప్ 2ః1 నిష్పత్తితోనే గైడ్ వాల్ నిర్మించారు. స్పిల్ వేకు ఎగువన సుడిగుండాలను నియంత్రించి.. స్పిల్ వేపై ఒత్తిడి తగ్గించడానికి నిర్మించిందే గైడ్ బండ్. సముద్ర తీర ప్రాంతాలు కోతకు గురవకుండా గేబియన్లు వేస్తారు. గైడ్ బండ్కు అలాంటివి వేయరు. ఇది రామోజీరావు వంటి విశ్రాంత చీఫ్ ఇంజినీర్కు తెలియదేమో? సుడిగుండాలను నియంత్రించడం, స్పిల్ వేపై ఒత్తిడిని తగ్గించడానికి.. వరద సులభంగా దిగువకు వెళ్లడానికి వీలుగా.. స్పిల్ వేకు ఎగువన ఎడమ గట్టు కొండకు సమాంతరంగా 500 మీటర్ల పొడవుతో గైడ్ బండ్ నిర్మించాలన్న సూచన మేరకు రిటైనింగ్ వాల్ కమ్ గైడ్ బండ్ను నిర్మించారు. -
చిన్నారి నిస్సి వ్యథ.. చలించిపోయిన సీఎం జగన్
సాక్షి, ఏలూరు: ప్రజల బాగోగుల గురించి కేవలం స్టేట్మెంట్లకే పరిమితమయ్యే నేతలు ఉన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వెళ్లిన ప్రతీ చోటల్లా జనాలకు దగ్గరగా ఉండడం, బిజీ షెడ్యూల్లోనూ వాళ్ల సమస్యలను సావధానంగా వినడం, అప్పటికప్పుడే వాళ్ల సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపడం.. నిత్యం చూస్తున్నదే. బహుశా.. ప్రజల సమస్యలను తన పాదయాత్రలో స్వయంగా దగ్గరుండి చూడడమే అందుకు కారణం కాబోలు. తాజాగా పోలవరం పర్యటనలోనూ ఆయన మానవత్వం ప్రదర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని దగ్గరకు తీసుకుని.. ఆ తల్లికి నేనున్నానమ్మా అంటూ భరోసా ఇచ్చే యత్నం చేశారు. ఆ చిన్నారి వైద్య చికిత్స కు హామీ ఇవ్వడంతో పాటు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కొవ్వూరు మండలం ఔరంగబాద్ గ్రామానికి చెందిన పాక నాగ వెంకట అపర్ణ తన ఏడు నెలల కుమార్తె నిస్సి ఆరాధ్య కిడ్నీ సంబంధిత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిపి ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్కు అర్జిని అందచేశారు. ఆ చిన్నారి గురించి తెలుసుకున్నాక ఆయన చలించిపోయారు. తక్షణ ఆర్థిక సహాయం అందించి, తగిన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తల్లికి అన్నగా.. నిస్సికి మేనమామగా ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారాయన. -
తల్లీ.. నేనున్నా
-
పోలవరం సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు