-
Anikha Surendran: ‘ఓహ్ మై డార్లింగ్’ హీరోయిన్ అనిఖా సురేంద్రన్ అందమైన లుక్స్ (ఫోటోలు)
-
Eesha Rebba Photos: హాట్ ఫోజులతో కిర్రెక్కిస్తోన్న ఈషా రెబ్బ (ఫొటోలు)
-
Kavya Kalyanram Photos: బలగం బ్యూటీ ఫోటోషూట్.. కావ్య కల్యాణ్రామ్ స్మైల్కి నెటిజన్లు ఫిదా (ఫొటోలు)
-
యంగ్ హీరోయిన్కు ప్రెగ్నెన్సీ.. ఫోటోషూట్ వైరల్!
కన్నడ హీరోయిన్ ఆదితి ప్రభుదేవా శాండల్వుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. శాండల్వుడ్లో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్వుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే కొత్త ఏడాది ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా నెల క్రితమే ఆదితి సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్వుడ్కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెటర్నిటీ ఫోటో షూట్ నిర్వహించింది. తన భర్తతో పాటు దిగిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. చివరికీ నా చిన్న కోరిక కూడా తీరింది.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆదితి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
రెడ్ చీరలో RGV గర్ల్ అప్సర రాణి హాట్ ట్రీట్ (ఫొటోలు)
-
అయ్ బాబోయ్ ఇదేంటండీ!
‘వెర్రి వెయ్యి విధాలు’ అంటారు. ఆ జాబితాలో అర్జంటుగా చేర్చదగ్గ వెర్రి ఇది. కర్నాటకలోని చిత్రదుర్గ ప్రభుత్వ ఆస్పత్రిలోని కాంట్రాక్ట్–బేస్డ్ ఫిజీషియన్ అభిషేక్ తన ప్రి–వెడ్డింగ్ షూట్ కోసం అందరిలాగా ఆహ్లాదకరమైన, అందమైన ప్రదేశాన్ని ఎంచుకోలేదు. ఏకంగా ఆపరేషన్ థియేటర్నే ఎంచుకున్నాడు. ఈ వీడియోలో బెడ్పై పడుకున్న పేషెంట్కు సర్జరీ చేస్తున్నట్లు డాక్టర్ నటిస్తుంటే, కాబోయే శ్రీమతి సర్జరీకి తనవంతుగా సహకరిస్తున్నట్లు నటించింది. (ఉత్తుత్తి) ఆపరేషన్ పూర్తికాగానే (ఉత్తుత్తి) పేషెంట్ లేచి ‘ఇప్పుడు నాకు ఫరవాలేదు’ అన్నట్లుగా కూర్చోవడం మరో వినోదం. ఆపరేషన్ థియేటర్లో కెమెరాలు, లైట్లతో హడావిడి చేస్తున్న వ్యక్తులు కనిపిస్తారు.ఈ వీడియో వీర లెవెల్లో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా సదరు డాక్టర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఈ వీడియో పుణ్యమా అని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని లో΄ాల నుంచి వెర్రితలలు వేస్తున్న ప్రి–వెడ్డింగ్ షూట్ల వరకు ఎన్నో విషయాలపై గరం గరంగా నెటిజనులు చర్చ చేస్తున్నారు. -
స్టూడెంట్తో అసభ్య ఫోటోషూట్.. టీచర్ సస్పెండ్
పదో తరగది విద్యార్ధితో ఫోటోషూట్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీచర్పై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. బీఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా చిక్కబళ్లాపూర్ జిల్లా విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (డీడీపీఐ) బైలాంజినప్ప ఉత్తర్వులు జారీ చేశారు అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని చిక్కబళ్లపూర్లోని మురుగమళ్ల ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్ధులు, ఉపాధ్యాయులు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, పదో తరగది చదువుతున్న విద్యార్ధితో కలిసి అసభ్యకరంగా ఫోటోలు దిగారు. టీచర్ అనే పదానికి అర్ధాన్ని మార్చేస్తూ స్టూడెంట్తో లవర్లాగా పోజులు ఇచ్చారు. ముద్దులు కౌగిలింతలతో హద్దులు మీరి ప్రవర్తించారు. విద్యార్ధి సైతం ఉపాధ్యాయురాలిని ఎత్తుకొని, ప్రేమతో ఆమె కొంగు లాగుతున్నట్లు ఫోటోలకు పోజులు ఇచ్చాడు. ఇంకేముంది ఈ ఫోటోలోను అమిత్ సింగ్ రాజవత్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Where are we heading as a society ? Pictures and videos from a romantic photoshoot of a government school teacher with a Class 10 student in Karnataka's Murugamalla Chikkaballapur district, went viral, following which the student's parents filed complaint with the Block… pic.twitter.com/WviIHtOP3J — Amit Singh Rajawat (@satya_AmitSingh) December 28, 2023 ఈ ఫోటోషూట్పై నెటిజన్లు మండుపడుతున్నారు. గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆ పదవికి కలంకం తెచ్చే ప్రవర్తించిన టీచర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక విద్యార్ధిపై కూడా చివాట్లు పెడుతున్నారు. వీళ్ల కారణంగా ఇతరులు చెడిపోయే ప్రమాదం ఉందని, ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు ఫోటోషూట్ సమాచారం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పాఠశాలకు వెళ్లి సైతం టీచర్తో గొడవకు దిగారు. దీంతో ఫిర్యాదు అందుకున్న బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టి టీచర్ను సస్పెండ్ చేశారు. -
కెమెరాల్లో రీళ్లు వేసుకుని, ఫొటోలు తీసేలా ఫిల్మ్రోల్
డిజిటల్ కెమెరాలు, స్మార్ట్ఫోన్లు వచ్చాక రీళ్లు వేసుకునే పాతకాలం కెమెరాలు కనుమరుగైపోయాయి. పాత పద్ధతిలో కెమెరాల్లో రీళ్లు వేసుకుని, ఫొటోలు తీయడం ఇష్టపడేవారి కోసం తాజాగా డిజిటల్ ఫిల్మ్రోల్ అందుబాటులోకి వచ్చింది. అమెరికన్ ఫొటోగ్రఫీ కంపెనీ ‘ఐయామ్ బ్యాక్’ ఈ డిజిటల్ ఫిల్మ్రోల్ను ఇటీవల రూపొందించింది. ఇందులోని ఫిల్మ్ రోల్ హోల్డర్లో 20 మెగాపిక్సెల్ సోనీ 4/3 సెన్సర్, బ్యాటరీ, మెమరీ కార్డ్ స్లాట్ ఉంటాయి. ఈ డిజిటల్ ఫిల్మ్ రోల్ హోల్డర్ను ఎలాంటి 35 ఎంఎం కెమెరాలోనైనా ఉపయోగించుకోవచ్చు. పాతకాలం నికాన్, కేనన్, పెంటాక్స్, ఒలింపస్ తదితర కంపెనీల 35 ఎంఎం కెమెరాల్లో ఈ డిజిటల్ ఫిల్మ్రోల్ను వేసి, వాటితో ఇంచక్కా ఫొటోలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ‘కిక్స్టార్టర్’ ద్వారా ఆన్లైన్లో ప్రీఆర్డర్పై అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. -
Hebah Patel Stills: ‘అలా నిన్ను చేరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హెబ్బా పటేల్ కిల్లింగ్ లుక్స్ (ఫొటోలు)
-
టార్చర్.. రోజూ కొట్టేవాడు, పార్కింగ్ ప్లేస్లో పడుకునేదాన్ని: నటి
పుట్టినరోజు, పెళ్లిరోజు, ప్రేమికుల రోజు.. కాదేదీ సెలబ్రేట్ చేసుకోవడానికి అనర్హం అన్నట్లుగా బోలెడన్ని స్పెషల్ డేలు ఉన్నాయి. స్పెషల్ డే రోజు స్పెషల్ షూట్ సరేసరి. ఈ మధ్య అయితే ప్రీవెడ్డింగ్ షూట్, మెటర్నటీ షూట్.. ఇలా అనేక రకాల ఫోటోషూట్లు కూడా చేస్తున్నారు. అయితే తమిళ బుల్లితెర నటి షాలిని మాత్రం వినూత్నంగా విడాకులను సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త పీడ విరగడైందన్నట్లుగా అతడి ఫోటోలు చింపుతూ ఇన్నాళ్లకు విముక్తి లభించిందన్నట్లుగా ఫోటోలకు పోజులిచ్చింది. ఇది చూసి కొందరు విస్తుపోగా ఆమె బాధ అర్థం చేసుకున్నవాళ్లు మాత్రం మెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ నటి తను విడాకులు తీసుకునేంత కష్టం ఏమొచ్చిందో వెల్లడించింది. అంతేకాదు ఆ ఫోటోషూట్ పబ్లిసిటీ కోసం చేయలేదని, తనలాంటి మహిళలకు ఓ మెసేజ్గా ఉపయోగపడాలని భావించానంది. భర్త పెట్టిన టార్చర్ గురించి ఆమె మాట్లాడుతూ.. 'దుబాయ్లో నా భర్త నన్ను కొట్టినప్పుడు పార్కింగ్లో వచ్చి పడుకునేదాన్ని. ఎందుకంటే గొడవను పెద్దది చేయకుండా, దాన్ని ఆపేయడానికే ప్రయత్నించేదాన్ని. అంతకుమించి ఏం చేయాలో తెలియకపోయేది. ఒక్క క్షణం పోలీసుల దగ్గరకు వెళ్దామా.. అనిపించినా మళ్లీ అతడి జీవితం నాశనం అవుతుంది కదా అని నేను అడ్జెస్ట్ అయిపోయేదాన్ని. అలా అతడు కొట్టినప్పుడల్లా కింద పార్కింగ్ ప్రదేశంలో పడుకునేదాన్ని. తెల్లారాక ఇంటికి వెళ్లేదాన్ని. 2019 వరకు నాలుగేళ్లదాకా అతడితో దెబ్బలు తిన్నాను. అన్నేళ్లు తిన్న దెబ్బలను ఆరోజు అతడికి తిరిగివ్వాలనిపించింది. తిరగబడ్డాను, కొట్టాను. 'ఇన్ని రోజులు నా పాప కోసం ఆలోచించి మర్యాద ఇస్తూ వచ్చాను. కానీ ఎప్పుడైతే నా బిడ్డ ఏడుస్తున్నా పట్టించుకోకుండా రాక్షసుడిలా మారి తన ముందే నన్ను కొట్టావు.. ఇకపై నీలాంటి తండ్రి తనకు అవసరం లేదు' అని ముఖం మీదే చెప్పాను. అతడిపై చేయి చేసుకున్నందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. అయినా ధైర్యంగా నేను వెళ్లడం కుదరదు.. కావాలంటే నువ్వే వెళ్లిపో అని చెప్పాను' అంటూ తను అనుభవించిన నరకం గురించి చెప్పుకొచ్చింది. కాగా ముల్లుమ్ మల్లురమ్ సీరియల్తో పాపులారిటీ తెచ్చుకున్న షాలిని సూపర్ మామ రియాలిటీ షోలోనూ మెరిసింది. ఆమె రియాజ్ను పెళ్లాడగా వీరికి రియా అనే కుమార్తె ఉంది. భర్త శారీరకంగా, మానసికంగా వేధించడంతో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవలే న్యాయస్థానం విడాకులు మంజూరు చేయడంతో ఫోటోషూట్ నిర్వహించి మరీ సంబరాలు జరుపుకుంది నటి. View this post on Instagram A post shared by shalini (@shalu2626) చదవండి: వెకేషన్లో దిల్ రాజు కుమార్తె, ఫోటోలు వైరల్ -
నగ్నంగా స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రాతో ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని జైసల్మీర్లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సరదాగా ఎంజయ్ చేసిన ఈ కొత్తజంట ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గతంలో కియారా చేసిన ఓ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబూ రత్నానీ తీసిన ఫోటోను తాజాగా తన ఇన్స్టాలో షేర్ చేశారు. గతంలో 2021 క్యాలెండర్ కోసం ఈ ఫోటోకు ఫోజులిచ్చినట్లు తెలుస్తోంది. అయితే కియారా డబ్బు కోసం టాప్లెస్గా కనిపించలేదని ఫోటోగ్రాఫర్ రత్నానీ తెలిపారు. కియారా చిత్రాన్ని ముంబైలోని ఒక హోటల్లో చిత్రీకరించినట్లు ఆయన వెల్లడించారు. నేను గతంలో కూడా చాలా మంది హీరోయిన్లతో ఇలాంటి ఫోటో షూట్ తీశానని తెలిపారు. 2020లో కియారా చేసిన ఫోటోషూట్ కూడా వివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. గతంలో కృతి సనన్, దీపికా పదుకొనే, విద్యాబాలన్, సన్నీ లియోన్, పరిణీతి చోప్రా, టబు క్యాలెండర్ కోసం టాప్లెస్గా పోజులిచ్చారు. View this post on Instagram A post shared by Dabboo Ratnani (@dabbooratnani) -
విడాకుల రూమర్స్.. హీరోయిన్గా నిహారిక రీఎంట్రీ?
మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల రూమర్స్ హాట్టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటుందని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య కొంతకాలంగా విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని,దీంతో విడిపోనున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేయడం, పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేయడంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై అటు చైతన్య కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే కెరీర్పై మరింత ఫోకస్ పెట్టిన నిహారిక సొంతంగా ప్రొడక్షన్ హౌస్ను స్థాపించి నిర్మాతగా మారింది. ఈమధ్య కాలంలో వరుస ఫోటోషూట్స్తో అలరిస్తుంది. ఈ క్రమంలో నిహారిక మళ్లీ హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తుందా అనే సందేహం కలుగుతుంది. ఒక మనసు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఆమె పెళ్లి తర్వాత నటనకు గుడ్బై చెప్పేసి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా విడాకుల రూమర్స్ నేపథ్యంలో నిహారిక ఫోటోషూట్స్ నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
బేబీబంప్తో బిగ్బాస్ బ్యూటీ పూజా.. ఫొటోలు వైరల్
బిగ్బాస్ బ్యూటీ, స్వామిరారా నటి పూజా రామచంద్రన్ త్వరలోనే తల్లికాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె సీమంతం వేడుక ఘనంగా జరిగింది. తాజాగా ఆమె బేబీ బెంప్తో ఫొటోషూట్ ఇచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ‘సమయం అనేది పరిమితం. కాబట్టి మరొకరి జీవితంలో జీవించడం కోసం వెచ్చించకండి. ప్రతి క్షణాన్ని స్వాధినం చేసుకోండి’ అంటూ తన పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చింది. చదవండి: హౌజ్ కీపర్గా, సేల్స్ గర్ల్గా చేశా: నటి పవిత్ర బీచ్ ఒడ్డున ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో తన భర్త, నటుడు జాన్ కొక్కెన్తో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అంతేకాదు ఈ ఫొటోల్లో భర్తకు లిప్లాక్ ఇస్తూ రొమాంటిక్గా ఫొజులు ఇచ్చింది. ప్రస్తుతం పూజా రామచంద్రన్ బేబీ బంప్ ఫొటోలను నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. క్యూట్ కపుల్, మీకు త్వరలోనే పండంటి బిడ్డ పుట్టాలంటూ నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. చదవండి: NTR30 నుంచి క్రేజీ అప్డేట్... అలాంటి పాత్రల్లో తారక్! కాగా లవ్ ఫెయిల్యూర్, స్వామిరారా అడవి కాచిన వెన్నెల వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించిన పూజా రామచంద్రన్ తన కర్లీ హెయిర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు బిగ్బాస్ 2 సీజన్లో పాల్గొన్ని మరింత పాపులర్ అయ్యింది. అనంతరం వెంకీ మామ, ఎంత మంచివాడవురా, పవర్ ప్లే వంటి సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో 2010లో వీజే క్రెగ్ను పెళ్లాడిన పూజా.. 2017లో విడాకులు ఇచ్చేసింది. 2019లో జాన్ కొక్కెన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో త్వరలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by John Kokken (@highonkokken) View this post on Instagram A post shared by John Kokken (@highonkokken) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) -
ఒకేసారి గర్భందాల్చిన అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ.. ఫొటోలు వైరల్!
ఈ రోజుల్లో ఫొటోషూట్లు సర్వసాధారణమైపోయాయి. జీవితంలో ముఖ్యమైన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మంచి మంచి లోకేషన్లకు వెళ్లి షూట్లు నిర్వహిస్తున్నారు. బర్త్డే, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్, ప్రెగ్నెన్సీ.. ఇలా చాలా సందర్బాల్లో వినూత్న రీతిలో ఫొటోలు దిగుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఫొటోషూట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఓ మహిళతో పాటు ఆమె అమ్మ, అత్తమ్మ, అమ్మమ్మ ప్రెగ్నెన్సీతో ఉన్న ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షించాయి. ఒకేసారి మూడు తరాలకు చెందిన మహిళలు గర్భం దాల్చడం అత్యంత అరుదు కావడంతో ఈ ఫొటోలు, వీడియోను చూసిన వారు తెగ కామెంట్లు చేశారు. ఇతరులకు కూడా షేర్ చేసి వాటిని వైరల్ చేశారు. నిజంగా సాధ్యమేనా? ఒకేసారి మూడు తరాలకు చెందిన మహిళలు గర్భం దాల్చడం నిజంగా సాధ్యమేనా? అంటే దాదాపు అసాధ్యమే. ఈ వీడియో కూడా నిజం కాదు లేండి. ఇందులో కన్పిస్తున్న యువతి మాత్రమే గర్భం దాల్చింది. ఆమె అమ్మ, అత్తమ్మ, అమ్మమ్మ దిండు ధరించి ఫొటోషూట్లో ప్రెగ్నెంట్లా కన్పించారు. ఎందుకిలా? జిబిన్ అనే వ్యక్తి ఫొటోగ్రాఫర్. అతని భార్య చింజు ఇటీవలే ప్రెగ్నెంట్ అని తెలిసింది. దీంతో ఇరు కుటుంబాలు సంతోషంలో మునిగిపోయాయి. అయితే భార్య ప్రెగ్నెన్సీ ఫొటో షూట్ను భిన్నంగా ప్లాన్ చేయాలనుకున్నాడు జిబిన్. అందుకే ఇంట్లోని మహిళలంతా గర్భం దాల్చినట్లు ఫొటోలు తీద్దామని, ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందని భార్యకు చెప్పాడు. ఈ ఆలోచన నచ్చి ఆమె కూడా అందుకు ఒప్పుకుంది. దీంతో అందరూ కలిసి ఈ ఫొటోషూట్ నిర్వహించారు. దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రావడంతో ఆనందపడ్డారు. View this post on Instagram A post shared by chinju🌼 (@chinju_p_s) చదవండి: ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్..! -
బేబీ బంప్తో నటి పూర్ణ.. ఫొటోలు వైరల్
-
ఫోటో షూట్ రద్దు చేసిన అల్లు అర్జున్.. బోరున ఏడ్చేసిన ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ బన్నీ అంటే రచ్చ మామూలుగా ఉండదు. ఆయన ఎంట్రీ ఇచ్చాడంటే అక్కడ ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా కాదు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైజాగ్లో ఏర్పాటు చేసిన ఫోటో షూట్లో బన్నీ పాల్గొన్నారు. అయితే అభిమానులు అత్యుత్సాహానికి ఏకంగా ఆ కార్యక్రమం రసాభాసగా మారింది. ఫ్యాన్స్ దెబ్బకు ఫోటో షూట్ రద్దయినట్లు తెలుస్తోంది. దీంతో ఎంతో ఆశగా బన్నీ అన్నను చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశకు గురయ్యారు. కొందరేమో ఏకంగా వేదికపైనే బోరున విలపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. బన్నీ చూసేందుకు వచ్చిన వేలాది మంది ఆయన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. VizAAg Fans Meet Got Cancelled 🥺💔@AlluArjun Anti @imsarathchandra Anna idi 🥺 It's Not The First Time.🥺 It's Repeating From 2-3 Yrs We're Not Happy With AUDIO Launch, SUCCESS Meet & FANS Meet Don't Play With Fans Emotions#AlluArjun𓃵 #Pushpa#PushpaTheRise #PushpaTheRule pic.twitter.com/BMHAHv3fiQ — Praveen 🪓 ™ (@_AlluBoyPraveen) February 6, 2023 Vizag craze @alluarjun 🔥#PushpaTheRulepic.twitter.com/WvziuNvxuM — Sumanth (@SumanthOffl) February 6, 2023 Bunny Anna fans meet 🔥❤️💥 #PushpaTheRule @alluarjun pic.twitter.com/lFEl9DTMYi — Virat bunny cult™🦁🪓 (@ViratBunny14) February 6, 2023 -
ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్లో నవ్వులు పూయించిన తాత.. వీడియో వైరల్..
ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ సర్వసాధారణమైపోయింది. వధూవరులు అందమైన లోకేషన్లకు వెళ్లి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లను పెట్టుకుని ఫొటోలు దిగుతున్నారు. దీని కోసం వేల రుపాయలు, అవసరమైతే లక్షలు కూడా ఖర్చు చేస్తున్నారు. ఉత్తరాంద్రలో కూడా ఓ జంట ఇలాగే ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్కు వెళ్లింది. కాస్త ఢిపరెంట్గా ఆలోచింది నాటు పడవలో ఓ నదిలో ఫొటోలు దిగాలనుకుంది. అయితే ఇక్కడే వాళ్లకు వింత అనుభవం ఎదురైంది. నాటు పడవ నడిపిన ఓ తాత టాలెంట్ చూసి ఈ జంట అవాక్కైంది. అమ్మాయి అబ్బాయి ఫొటో ఎలా దిగాలి, ఏ ఫోజు ఇవ్వాలో కూడా తాత చెప్పేస్తున్నాడు. చేతి ఇలా పెట్టు, కాలు ఇలా పెట్టు, అమ్మాయిని ఇలా పట్టుకో, ఇద్దరూ అటు చూసి ఫోజు ఇవ్వండి అంటూ డైరెక్షన్లు ఇచ్చేస్తున్నాడు. ఉత్తరాంద్ర యాసలో మాట్లాడుతూ తాత ఫోజులు చెప్పడం చూస్తుంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్గా మారింది. పడవ నడిపే తాతే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లా కన్పిస్తున్నాడని నెటిజన్లు చమత్కరిస్తున్నారు. ఈయన టాలెంట్ సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి. భలే భలే ఓ అమ్మాయీ - పాత రోజులు మారాయీ ఆడపిల్లా తిరిగినచో - పట్టుకొనునూ అబ్బాయీ భలే భలే ఓ అబ్బాయీ - ఈ ఒక్క రోజే నీది పైచేయీ ఆ పిల్ల వేలెత్తినచో - నీకు మూడెను తెలుసుకోవోయీ భలే భలే ఓ అమ్మాయీ - ఈ ఒక్క రోజు నే చెప్పినట్టు చేయీ వాడి మీదకు కాలెత్తాలీ - లేకపోతే వాడికి భయముండదమ్మాయీ వాడిదేముంది వెధవాయి పట్టుకుంటాడులే బడుద్దాయి — రామ్ కేసరి, అమెరికా (ఆరుద్ర గారికి సన్నాయి) -
ఏదో చేద్దామనుకుంటే.. ఏదో జరిగింది.. వైరల్ వీడియో
-
వైరల్ అవుదామని పెళ్లిలో అతి చేశారు.. వధువు రియాక్షన్ చూడాల్సిందే..
మన దేశంలో పెళ్లి కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో పెళ్లి ఫిక్స్ అవగానే వధవరులిద్దరూ ఫొటో షూట్స్, ఫొటోలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో ఫొటోలకు ఫోజులు ఇచ్చే సందర్బగా జరిగిన తప్పిదాల కారణంగా నవ్వు తెప్పించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వధువు, వరుడు ఇద్దరు ఎదురుగా ఉన్న ఫొటోగ్రాఫర్కు స్టిల్స్ ఇస్తుంటారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ వినూత్నంగా ఫొటోలు తీసే క్రమంలో వారితో కొత్త స్టిల్స్కు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో వారిద్దరూ ఒక్కనొకరు హత్తుకునే క్రమంలో వరుడు బ్యాలెన్స్ కోల్పోయి వధువుపై పడిపోతాడు. ఫొటోలు దిగుతున్న క్రమంలో వధువు.. కిందపడిపోతుంది. అప్పటి వరకు నవ్వుతూ గింగిరాలు తిరిగిన జంట.. ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో, కిందపడిన వధువు షాక్కు గురైంది. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ సారీ.. సారీ.. అంటూ కామెంట్స్ చేయడం వినిపిస్తుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా!
తిరువనంతపురం: ఆలయానికి వెళ్లిన ఓ కొత్త జంటకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోని గజరాజు ముందు ఫోటోలు దిగాలనుకున్నారు. కానీ, ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆ ఏనుగు దాడి చేసింది. ఈ వీడియోను ఓ ఫోటోగ్రాఫర్ ‘వెడ్డింగ్ మొజిటో’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా.. వైరల్గా మారింది. ఈ సంఘటన కేరళ త్రిస్సూర్లోని గురువాయుర్ ఆలయంలో నవంబర్ 10న జరిగింది. గజరాజు ఒక్కసారిగా దాడి చేయడంతో సమీపంలోని భక్తులంతా పరుగులు పెట్టాల్సి వచ్చింది. వీడియో ప్రకారం.. కొత్త జంట మెడలో మాలలతో ఏనుగు సమీపంలోకి వెళ్లి ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. వారికి గజరాజు కుడివైపున ఉంది. ఫోటోగ్రాఫర్ కెమెరాను క్లిక్ మనిపించగా.. ఆగ్రహానికి గురైన ఏనుగు ఒక్కసారిగా దాడి చేసింది. మావటి అదుపు చేసేందుకు ప్రయత్నించగా ఎత్తి కుమ్మిపడేసింది. తొండంతో పైకెత్తేందుకు ప్రయత్నించగా కింద పడిపోయాడు. ఆ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, అతని శరీరంపై ఉన్న బట్టలను ఏనుగు లాగేసింది. ఆ తర్వాత ఏనుగుపై ఉన్న మరో మావటి దానిని అదుపు చేశాడు. తమకు ఎదురైన ఈ సంఘటనను వీడియోలో వివరించాడు పెళ్లి కొడుకు. తాము ఫోటోలు దిగుతుండగా అంతా అరుస్తూ పరుగెడుతున్నారని, తన భార్య చేతిని పట్టుకుని లాక్కెళ్లినట్లు చెప్పాడు. View this post on Instagram A post shared by Wedding Mojito (@weddingmojito) ఇదీ చదవండి: Video: లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ముగ్గురు చిన్నారులు.. భయంతో కేకలు, ఏడుపు -
బీచ్లో ఉంగరాలు మార్చుకుని ఒక్కటైన లెస్బియన్ జంట.. ఫొటోలు వైరల్..
తిరువనంతపురం: కేరళకు చెందిన లెస్బియన్ జంట అదిలా నసరీన్, ఫాతిమా నూరా ఎట్టకేలకు ఒక్కటయ్యింది. బీచ్లో ఘనంగా జరిగిన వేడుకలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకొని కొత్త జీవితానికి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కోర్టు తీర్పుతో ఈ ఇద్దరూ స్కూల్లో చదువుకునే సమయం నుంచే స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసి జీవించాలనుకున్నారు. కానీ ఈ జంట ప్రేమ విషయం తెలిసినప్పుడు ఇద్దరి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సమాజంలో తమ పరువు ఏమవుతుందని ఒప్పుకోలేదు. దీంతో ఈ ఏడాది మేలో ఇద్దరూ కోజికోడ్ పారిపోయారు. ఎల్జీబీటీక్యూ సొసైటీ ఆశ్రమంలో ఉన్నారు. అయితే తల్లిదండ్రులు వారి వద్దకు వెళ్లి పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లను తీసుకెళ్లారు. కానీ ఇంటికెళ్లాక పెళ్లి కుదరదని మాట మార్చారు. తన ప్రేమను దక్కించుకునేందుకు నసరీన్ హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పు అనుకూలంగా వచ్చింది. వీరిద్దరికి కలిసి జీవించే హక్కు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టబద్దమైన చిక్కులు వీడటంతో ఎల్జీబీటీక్యూ సొసైటీ వీరి కోసం బీచ్లో వేడుక ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లోనే ఇద్దరూ రింగ్లు మార్చుకుని ఒక్కటయ్యారు. లెహంగా ధరించి, పూలదండలు వేసుకుని ఎంతో సంతోషంగా కన్పిస్తున్న ఈ జంట ఫొటోలను నసరీన్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా.. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీచ్లో ఇలాంటి ఫొటో షూట్లు నిర్వహించడం ఆసక్తిగా ఉందని నసరీన్ చెప్పింది. భవిష్యత్తులో తామిద్దరం పెళ్లి చేసుకుంటామని పేర్కొంది. తండ్రి పేరుతో ఇబ్బంది.. నసరీన్, ఫాతిమా కుటుంబాలు వీళ్లను దూరం పెట్టాయి. అయితే ఇంకా ఏవైనా ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు తల్లిదండ్రుల పేర్లు ఉపయోగించాల్సి వస్తోందని, ఇది తమకు ఇబ్బందిగా ఉందని నజరీన్ చెబుతోంది. ఇటీవల తామిద్దరం ఆస్పత్రిలో చేరినప్పుడు హాస్పిటల్ ఫాంలో తండ్రి పేరు అడిగారని చెప్పుకొచ్చింది. స్వలింగ సంపర్క వివాహాలకు భారత్లో ఇంకా చట్టబద్దత లేదు. సేమ్ సెక్స్ రిలేషన్స్ నేరమని నిబంధనలు ఉన్నప్పటికీ 2018లో వాటిని నిలిపివేశారు. అయితే కొంతమంది స్వలింగ సంపర్కులు మాత్రం వేడుకలు నిర్వహించి అధికారికంగా ఒక్కటవుతున్నారు. ఘనంగా వివాహాలు కూడా చేసుకుంటున్నారు. చదవండి: పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు.. -
బీచ్లో ఒకేసారి 2500 మంది ఫొటో షూట్.. ఎందుకో తెలుసా?
చర్మ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు కొంత మంది వినూత్న కార్యక్రమం చేపట్టారు. బీచ్లో ఏకంగా 2500 మంది నగ్న ఫోటోషూట్లో పాల్గొన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్పై ఫోకస్ పెట్టాలని పిలుపునిచ్చారు. వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. దీంతో, చర్మ క్యాన్సర్పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద శనివారం ఉదయం సుమారు 2500 మంది ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటోషూట్లో పాల్గొన్నారు. చర్మ క్యాన్సర్పై అవగాహన కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, ఈ వినూత్న కార్యక్రమాన్ని అమెరికా ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే అక్కడ ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ నిర్వహించారు. ఇదిలా ఉండగా.. బీచ్ల్లో నగ్నంగా తిరిగేందుకు ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో, వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. BREAKING: #BNNAustralia Reports. In an effort to raise awareness about skin cancer, over 2,500 people got nude on Saturday to pose for Spencer Tunick, U.S. photographic artist at Sydney's Bondi Beach, in Australia. #Australia #Sydney #Cancer #Health #Photoshoot pic.twitter.com/v2Uwdzse6a — Gurbaksh Singh Chahal (@gchahal) November 26, 2022 -
sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
-
గ్లామర్ డోస్ పెంచేసిన రష్మిక మందన్నా.. కారణమదేనా?
తమిళసినిమా: నటి రష్మిక మందన్నాపై ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. కిరాక్ చిత్రంతో మాతృభాషలో విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీకి వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు రావడం, అక్కడ తొలి చిత్రంతోనే సినీ వర్గాల దృష్టిని తన వైపు తిప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇక రెండవ చిత్రం గీత గోవిందం రష్మికకు ఏకంగా స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. మధ్యలో కొన్ని చిత్రాలు చేసినా పుష్ప చిత్రం ఈ బ్యూటీని బాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్లిపోయింది. అలా తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటిస్తూ టాప్ హీరోయిన్గా రాణిస్తున్న రష్మిక నెక్ట్స్ లెవల్కు వెళ్లాలని చూస్తుందా? ఆమె తదుపరి గురి హాలీవుడ్ పైనా? ఇలాంటి చర్చే ఇప్పుడు హాట్ హాట్గా దిగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. పుష్ప చిత్రం వరకు ఇంకా చెప్పాలంటే బాలీవుడ్లో నటించిన తొలి చిత్రం గుడ్ బై వరకు రష్మిక పక్కింటి అమ్మాయి ఇమేజ్నే కాపాడుకుంటూ వచ్చింది. అయితే బాలీవుడ్ ప్రభావం ఈ అమ్మడి మీద బాగానే పడినట్లుంది. ఇటీవల ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రష్మికకు స్పెషల్ ఫొటో షూట్లో పాల్గొంది. ఈ గ్లామరస్ ఫొటోలను చూసి నెటిజన్లు రషి్మకను ఓ రేంజ్లో ఆటాడేసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఈ భామ తమిళంలో వారీసు చిత్రంలో విజయ్తో రొమాన్స్ చేస్తోంది. -
దాంతో ఫొటో ఏంది మమ్మీ.. భయమైతుంది ప్లీజ్ వెళ్లిపోదాం డాడీ..
అనుకోకుండానే కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఫేమస్ అవుతారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫ్యామిలీ చెందిన వీడియో చక్కర్లు కొడుతోంది. వారితోపాటు ఓ సీల్ చేసిన ఫన్నీ చేష్టలు సైతం నెటిజన్లను తెగనవ్విస్తున్నాయి. అయితే, వీడియో ప్రకారం.. ఓ థీమ్ పార్క్ ఓ ఫ్యామిలీ వెళ్లింది. ఈ క్రమంలో వాటర్ పార్క్ వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఓ జంట రెడీ అయ్యింది. ఇంతలో జంతువుల ట్రైనర్.. సీల్ను నీటిలోకి వెళ్లాలని ఆదేశించాడు. ఈ క్రమంలో ఫొటోలు దిగేందుకు వారు ఓ కుర్చీపై కూర్చుకున్నారు. తర్వాత ట్రైనర్.. సీల్ను ఫొటోలకు ఫోజులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసి ఫొటోలు తీసేందుకు వెళ్లాడు. Family photography 🐬 pic.twitter.com/bjEabbUvl5 — Homestays & Villas (@thehomestays) September 25, 2022 ఇక, ఫొటోలు తీస్తున్న క్రమంలో సీల్ ఇచ్చిన స్టిల్స్ హైలైట్ అని చెప్పవచ్చు. అచ్చం మనుషులు చేసినట్టుగానే ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ సమయంలో ఫొటో తీస్తున్న వైపు చూడాలని బుడ్డోడొకి పేరెంట్స్ చెబుతున్నప్పటికీ.. పిల్లోడు మాత్రం సీల్ను చూసి భయపడినట్టు ఫేస్ పెట్టాడు. మమ్మీ, డాడీ.. ప్లీజ్ ఇంక ఫొటోలు చాలు ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అన్నట్టుగా వారి వైపు చూశాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.