phd
-
ఫేక్ పీహెచ్డీ ఫ్యాకల్టీలదే హవా!
సాక్షి, కాకినాడ: ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో నకిలీ పీహెచ్డీలతో విద్యాబోధన యథేచ్ఛగా కొనసాగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన వర్సిటీల అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జేఎన్టీయూ (కాకినాడ) వర్సిటీ ఏపీలోని 8 జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని పరిధిలో 180 అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో ఒకరిద్దరు చొప్పున ఎనిమిది జిల్లాల్లో సుమారు 200 మంది నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో విద్యాబోధన చేస్తున్నట్లు తేటతెల్లమయ్యింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిబంధనల మేరకు అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ స్థాయిలో బోధించాలంటే పీహెచ్డీ తప్పనిసరి. గుర్తింపు పొందిన వర్సిటీల్లో పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థిని కళాశాలల్లో నియమిస్తే నెలకు రూ.90,000 నుంచి రూ.1,20,000 వరకు వేతనం ఇవ్వాలి. ఇంత మొత్తం ఇవ్వడం ఇష్టం లేని ప్రైవేట్ యాజమాన్యాలు తక్కువ జీతానికి వచ్చే ఫేక్ పీహెచ్డీ అభ్యర్థులకు రూ.40 వేల వరకు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఎక్కడివీ ఫేక్ పీహెచ్డీలు.. కొంతమంది అభ్యర్థులు కర్నాటక, తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోని కొన్ని వర్సిటీలకు ఎంతో కొంత సమర్పించుకుని నకిలీ పీహెచ్డీ పట్టా తెచ్చుకుంటున్నారు. తక్కువ జీతానికే పనిచేస్తామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను ఆశ్రయిస్తున్నారు. వారు సైతం ఖర్చు తక్కువ అవుతుందని భావించి.. అతి తక్కువ జీతాలిస్తూ వీరిని ప్రోత్సహిస్తున్నారు. కీలక ఉద్యోగాల్లో నియమిస్తున్నారు. అనుభవం లేని నకిలీ అధ్యాపకులు పాఠాలు బోధిస్తుండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎడారిలో ఎండమావిలా మారింది. నిద్రమత్తులో వర్సిటీ యంత్రాంగం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో యూనివర్సిటీ అధికారులు ప్రతి ఏటా నిజ నిర్ధారణ కమిటీల పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్నా.. నకిలీ పీహెచ్డీలపై దృష్టి సారించడం లేదు. యాజమాన్యాలు ఇచ్చే ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో మచ్చుకు కొన్ని.. రాష్ట్రంలో నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి జాబితా చాంతాడంత ఉంది. ఏలూరు, తాడేపల్లిగూడెం, కాకినాడ, కృష్ణాజిల్లా చల్లపల్లి, గుంటూరు, నర్సాపురంలోని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇదే తంతు సాగుతోంది. దాదాపు 200 మంది వివిధ హోదాల్లో నకిలీ సర్టిఫికెట్లతో కొనసాగుతున్నారని తెలుస్తోంది. విచారించి చర్యలు తీసుకుంటాం.. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలు తప్పకుండా పాటించాలి. నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో కళాశాలల్లో పనిచేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిజనిర్ధారణ కమిటీలు తనిఖీ సైతం నిర్వహించాయి. – డాక్టర్ సుమలత, రిజిస్ట్రార్, జేఎన్టీయూ(కే) ఫేక్ పీహెచ్డీలను గుర్తించాలి.. నకిలీ పీహెచ్డీ అభ్యర్థులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు పీహెచ్డీ పూర్తి చేసిన వారి డేటా వర్సిటీ వెబ్సైట్లలో ఉంచుతున్నారు. మిగతా యూనివర్సిటీలు కూడా పాటిస్తే పారదర్శకత పెరుగుతుంది. –డాక్టర్ జ్యోతిలాల్ నాయక్, విద్యావేత్త -
ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం.. దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ 81వ స్నాతకోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తేదీన జరిగే కార్యక్రమంలో డిగ్రీ పట్టాలను అందుకోవాలనుకునే పీహెచ్డీ అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ శుక్రవారం తెలిపారు. బంగారు పతకాలు అందుకునే అభ్యర్థుల జాబితాను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు. 18 వరకు డిగ్రీ సప్లిమెంటరీ, ఇన్స్టంట్ పరీక్షల ఫీజు చెల్లింపు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 1, 3, 5 బ్యాక్లాగ్లతో పాటు కోవిడ్ కారణంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ ఇన్స్టంట్ 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 18 వరకు చెల్లించవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ శుక్రవారం తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో 23 వరకు, రూ.500 రుసుముతో 26, 27 వరకు, రూ.1000 రుసుముతో 28, 29 వరకు, రూ.2000 రుసుముతో నవంబరు 1, 2 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో నవంబరు 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునన్నారు. వివరాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ వెబ్సైట్ చూడాలన్నారు. 26 నుంచి ఎంబీఏ పరీక్షలు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వరకు ఎంబీఏ రెగ్యులర్ 2వ సెమిస్టర్, బ్యాక్లాగ్ 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. పరీక్షల టైంటేబుల్ను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఓయూ దూరవిద్యలో సెమిస్టర్ విధానం ఉస్మానియా విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రంలో వివిధ కోర్సులలో సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు మాత్రమే ఉన్న సెమిస్టర్ పరీక్ష విధానాన్ని ఇతర పీజీ కోర్సులకు కూడా అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2021–22) ఎంసీఏ కోర్సును మూడు నుంచి రెండు సంవత్సరాలకు కుదించి సెమిస్టర్ పరీక్షను అమలుపర్చనున్నారు. రానున్న విద్యా సంవత్సరం (2022–23) నుంచి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీడీసీఏ కోర్సులకు సెమిస్టర్ పరీక్ష విధానాన్ని అమలు చేస్తామని అధికారులు వివరించారు. అందుకు అనుగుణంగా పీజీ పుస్తకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పీజీ తర్వాత డిగ్రీ కోర్సులకు కూడ సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టేయోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విద్యా సంవత్సరానికి (2021–22) వివిధ కోర్సులలో జోరుగా అడ్మిషన్లు సాగుతున్నాయన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం,బీఎస్సీ), పీజీ (బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ) పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుము రూ. 200 తో చివరి తేదీ అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను https://www.braouonline.in/లో పొందుపర్చినట్లు వెల్లడించారు. వివరాలకు 7382929570/580 లేదా విశ్వవిద్యాలయ 040–23680290/291/294/295 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
నాటి టీమిండియా క్రికెటర్.. నేడు ఖగోళ శాస్త్రవేత్త
ముంబై: సాధారణంగా ఆటగాళ్లు క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడం వల్ల వారి విద్యాభ్యాసం సజావుగా సాగదు. క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చాలా మంది క్రికెటర్లు చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే, ఇప్పుడు మనం చూపబోయే ఈ టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించి ఆస్ట్రోఫిజిస్ట్ అయ్యాడు. ఈ శతాబ్దపు ఆరంభంలో(2003) టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆవిష్కార్ సాల్వి.. తాజాగా ఆస్ట్రోఫిజిక్స్లో పీహెచ్డీ పూర్తి చేసి, క్రికెట్ ఫ్యాన్స్ను ఆశ్చర్యపరుస్తూ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యున్నత విద్యావంతుల జాబితాలో ముందువరుసలో నిలిచాడు. ఒకప్పటి టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకుని క్రికెట్ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు నాసా లేదా ఇస్రో వంటి సంస్థల్లో పని చేస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖగోళ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేయాలంటే అసాధారణమైన తెలివితేటలతో పాటు ఓర్పు, సహనం ఉండాలి. అయితే అంతరిక్ష అధ్యయనాలపై మక్కువతో తాను ఆస్ట్రో ఫిజిక్స్లో పీహెచ్డీ పూర్తి చేశానని సాల్వి చెప్పుకొచ్చాడు. కాగా, సాల్వి.. 2003లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో అతను 2 వికెట్లు పడగొట్టాడు. అయితే కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడిన సాల్వి.. తీవ్రమైన గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఐపీఎల్లో కూడా పాల్గొన్నారు. 39 ఏళ్ల సాల్వి పదవీ విరమణ పొందిన అనంతరం క్రికెట్ కోచ్గా కూడా మారాడు. 2018లో పుదుచ్చేరి జట్టు కోచింగ్ స్టాఫ్లో ఒకరిగా పని చేశారు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన సాల్వి.. 50 ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్ల్లో ఆడాడు. ఇదిలా ఉంటే, భారత మాజీ క్రికెటర్లలో కుంబ్లే, లక్ష్మణ్, అశ్విన్, ద్రవిడ్ లాంటి క్రికెటర్లు అత్యున్నత చదువులు చదువుకున్నారు. అయితే వారందరికంటే అత్యున్నత విద్యను అభ్యసించిన సాల్వి 'ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ క్రికెటర్'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదవండి: వికెట్లను కాకుండా వ్యక్తులను టార్గెట్ చేయడమేంటి..? -
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ ఉండాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హతగా పీహెచ్డీని తప్పనిసరి చేశారు. గతంలో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) లేదా స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్లెట్) ఉంటే సరిపోయేది. కానీ ఈసారి ఆ రెండూ ఉన్నా పీహెచ్డీ తప్పనిసరి చేసినట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఈ కొత్త నిబంధనను యూజీసీ అమల్లోకి తెచ్చిందని అధికారులు చెబుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్డీ ఉండాలి. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు వెళ్లాలంటే పీహెచ్డీతో పాటు, 8 ఏళ్ల టీచింగ్ అనుభవం, నిర్ణీత మేగజీన్లలో ఆర్టికల్స్ ముద్రితమై ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ పోస్టుకు వెళ్లాలంటే 10 ఏళ్ల అనుభవం సహా మేగజీన్లలో ఆర్టికల్స్ ముద్రితమై మంచి స్కోర్ సాధించి ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్గా వెళ్లాలంటే మూడేళ్ల అనుభవంతో పాటు పైన పేర్కొన్న విధంగా అర్హతలు ఉండాలి. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో భర్తీ చేయబోయే 1,195 పోస్టులను యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే భర్తీ చేస్తామని ఉన్నత విద్యామండలి చెబుతోంది. అసిస్టెంట్ పోస్టుల భర్తీలో నెట్, స్లెట్ ఉన్నవారికి 10 మార్కులు వెయిటేజీ ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 6 వేల మంది ఎదురుచూపులు రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో భర్తీ చేయబోయే అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ సహా ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. ఏకీకృత రాత పరీక్ష, ఇంటర్వూ్య ప్రకారం పోస్టులను భర్తీ చేయా లని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడమే అవుతుందని కొన్ని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అన్ని యూనివర్సిటీల హక్కులను కాలరాసి కేంద్రీకృత పద్ధతిలో నియామకాలు చేపడితే అక్రమాలు జరగవన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో పీహెచ్డీ చేసి పోస్టుల కోసం ఎదురుచూసేవారు దాదాపు 6 వేల మంది ఉంటారని ఉన్నత విద్యామండలి అంచనా వేసింది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వారు దాదాపు 1,300 మంది ఉంటారని తెలుస్తోంది. మొత్తం పోస్టుల్లో దాదాపు సగం మేర ఆ కాంట్రాక్టు ఉద్యోగులే దక్కించుకునే అవకాశముంది. ఎందుకంటే వీరికి వెయిటేజీ ఉంటుంది. ఏకీకృత పరీక్ష పేరుతో కాలయాపన చేయకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్రెడ్డి డిమాండ్ చేశారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం కాల రాస్తోందని మండిపడ్డారు. -
పీహెచ్డీ చేసి.. కల్లు కాంపౌండ్కు ‘మత్తు’ సరఫరా
సాక్షి, కుత్బుల్లాపూర్: ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన వ్యక్తి బుద్ధి వక్రమార్గంలో మళ్లింది. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో అల్ఫ్రాజోలమ్ గుళికలను హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లకు మరో వ్యక్తితో కలిసి సరఫరా చేస్తున్నాడు. వీరికి సహకరించిన మరో ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 8.50 కోట్ల విలువ చేసే 140 కిలోల అల్ఫ్రాజోలమ్ డ్రగ్తో పాటు రూ.50 వేల నగదు, బొలారో, ఎర్టికా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను బాలానగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు కార్యాలయంలో డీసీపీ పి.వి.పద్మజారెడ్డి సోమవారం మీడియాకు వివరించారు. బాలానగర్లో ముడిసరుకులు.. విజయవాడలో తయారీ మెదక్ జిల్లా శంకరంపేట్కు చెందిన గుడికాడి లింగాగౌడ్ (37) ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేశాడు. ఇతనికి సింథటిక్ డ్రగ్ తయారీలో పరిజ్ఞానం ఉంది. అయితే కులవృత్తిలో భాగంగా కల్లు తయారీలో కొంత మత్తు పదార్థం కలపడాన్ని చూసిన లింగాగౌడ్ తనకున్న పరిజ్ఞానంతో అల్ఫ్రాజోలమ్ తయారుచేసి కల్లు కాంపౌండ్లకు విక్రయించడం మొదలుపెట్టాడు. కొండాపూర్లో నివాసముంటూ గౌడ్ లేబొరేటరీస్ పేరుతో గత ఐదేళ్లుగా ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. అల్ఫ్రాజోలమ్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాన్ని బాలానగర్ ప్రశాంత్నగర్ ఇండస్ట్రీ ప్రాంతంలోని నర్మద కెమికల్స్ నుంచి కొనుగోలు చేసేవాడు. వీటిని తన స్నేహితుడు కిరణ్కు చెందిన విజయవాడలోని ఫార్మస్యూటికల్ పరిశ్రమకు పంపించి అక్కడా ప్రాసెసింగ్ చేయించేవాడు. కిరణ్ ఆల్ఫ్రాజోలమ్ గుళికలను తన డ్రైవర్ వినోద్ (27) ద్వారా విజయవాడ నుంచి హైదరాబాఉఉద్కు వాహనంలో పంపిస్తుంటాడు. ఏఆర్ కానిస్టేబుల్ సహకారం అయితే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు లింగాగౌడ్ వరుసకు బామమరిది అయ్యే మెదక్లో ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మదురి రామకృష్ణ గౌడ్(36) సహకారాన్ని తీసుకుంటున్నాడు. ఈ డ్రగ్ కల్లు కాంపౌండ్కు తరలించే సమయంలో మార్గం మధ్యలో పోలీసుల తనిఖీ లేకుండా జాగ్రత్తగా వ్యవహరం నడిపేవాడు. ఇందుకుగాను రామకృష్ణగౌడ్కు వచ్చిన ఆదాయంలో 30 శాతం వరకు కమిషన్ ఇస్తున్నాడు. అయితే విజయవాడ నుంచి కిరణ్ డ్రైవర్ వినోద్ వాహనంలో అల్ఫ్రాజోలమ్ తీసుకొచ్చాడని విశ్వసనీయ సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, పేట్బషీరాబాద్ ఇన్స్పెక్టర్ రమేష్ నేతృత్వంలోని బృందం జీడిమెట్ల పైపులైన్న్ రోడ్డులో దాడులు చేసి బొలేరో (టీఎస్ 08 యుహెచ్ 8029), ఎర్టికా ( టీఎస్ 35 సీ 7237) వాహనాల నుంచి 139 కిలోల అల్ఫ్రాజోలమ్ను స్వాధీనం చేసుకున్నారు. లింగాగౌడ్, డ్రైవర్ వినోద్లను అరెస్టు చేశారు. అనంతరం మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం పరిధార్ గ్రామంలోని రామకృష్ణగౌడ్ ఇంట్లో మరో కిలో అల్ఫ్రాజోలమ్ డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి కూడా అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కిరణ్ కోసం గాలిస్తున్నారు. చదవండి: పొలిమేరలో ఉన్న సమీప బంధువు ఇంటికి తీసుకెళ్లి.. ఫోన్కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా అంటూ.. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: సాంకేతిక సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించింది. డివిజన్ బెంచ్ తీర్పును సవాల్చేస్తూ ప్రియదర్శిని తదితరులు దాఖలు చేసిన పలు స్పెషల్ లీవ్ పిటిషన్లను బుధవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హృషీకేష్రాయ్ల ధర్మాసనం విచారించింది. ‘‘పే స్కేల్స్, సర్వీస్ కండీషన్స్, క్వాలిఫికేషన్ ఫర్ ద టీచర్స్, అదర్ అడకమిక్ స్టాఫ్ ఇన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ రెగ్యులేషన్స్, 2010’’ని ఏఐసీటీఈ 2010 మార్చిలో జారీ చేసిందని కేరళ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వి.చిదంబరేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నిబంధనల ప్రకారం 2010 మార్చి 5 నుంచి సాంకేతిక సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీ చేసిన వారే అర్హులని కోర్టుకు తెలిపారు. చిదంబరేష్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ‘‘2003 ఫిబ్రవరి 18 నోటిఫికేషన్ ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్ (తదనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్గా మార్చారు) పోస్టు వచ్చిన ఏడేళ్లలో పీహెచ్డీ పొందాలి. అయితే ఇది 2010 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత నుంచి పీహెచ్డీ పొందిన తర్వాత తేదీ నుంచి పోస్టు పరిగణనకు అర్హులు’’ అని ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టివేసింది. -
పీహెచ్డీ పూర్తి చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పీహెచ్డీ పూర్తయింది. శుక్రవారం జేఎన్టీయూ స్నాతకోత్సవంలో ఆయన తన పీహెచ్డీ పట్టా అందుకున్నారు. వర్సిటీ వీసీ ఇన్ఛార్జి వీసీ జయేశ్రంజన్ పీహెచ్డీ పట్టాను డీజీపీ మహేందర్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆన్లైన్ ద్వారా అధ్యక్ష ఉపన్యాసం చేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ ‘‘ఇంపాక్ట్ ఆఫ్ ఇనర్మేషన్ టెక్నాలజీ ఆన్ పోలిసింగ్’’ పురస్కారం పొందడం ఆనందంగా ఉందన్నారు. పోలీసింగ్, సమాజ భద్రతలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంపై తాను పదేళ్లుగా అధ్యయనం చేస్తున్నానన్నారు. తన పీహెచ్డీ పూర్తి చేయడంలో సహకరించిన గైడ్, ఇతర సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. తన పరిశోధన తెలంగాణ పోలీసులకు ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
భారతీయ విద్యార్థికి రూ.1.3కోట్ల స్కాలర్షిప్
న్యూఢిల్లీ: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)కి చెందిన ఓ విద్యార్థికి ప్లాంట్స్ సైన్స్ అంశంలో ఆస్ట్రేలియాలో పీహెచ్డీ చేసేందుకు గాను 1.3 కోట్ల రూపాయలు ఫుల్ పెయిడ్ స్కాలర్షిప్ లభించింది. ఈ రంగంలో ఇంతవరకు లభించిన అత్యధిక స్కాలర్షిప్ ఇదే కావడం విశేషం. వివరాలు.. సుమంత్ బిందాల్ అనే యువకుడు ఎల్పీయూలో వ్యవసాయ రంగంలో ప్రత్యేకంగా జన్యుశాస్త్రం, మొక్కల పెంపకంలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ చదువుతున్నాడు. ఈ క్రమంలో బిందాల్కు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ(ఏఎన్యూ)లో పీహెచ్డీ చేయడానికి స్కాలర్షిప్ లభించింది. దీనితో బిందాల్ టమోటా మొక్కలను నాశనం చేసే ఫ్యూసేరియం అనే ఒక రకమైన ఫంగస్ గురించి పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఈ ఫంగస్ వల్ల ఏటా భారతదేశంలో టమోటా రైతులు 45శాతం దిగుబడిని కోల్పోతున్నారు. (ఆస్ట్రేలియాలో సింబా) ఈ నేపథ్యంలో బిందాల్ మాట్లాడుతూ.. ‘ఈ స్కాలర్షిప్ అందుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఏఎన్యూ ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఒకటి. ఇక్కడ పీహెచ్డీ చేయాలనేది నా జీవిత ఆశయం. ఇందుకు సహకరించిన నా అధ్యాపకులకు, సలహాదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు. -
ఎస్వీయూలో ఇక పీహెచ్డీ ఈజీ కాదు
చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో ఇకపై పీహెచ్డీ డిగ్రీ పొందటం అంత తేలిక కాదు. ఇకపై పరిశోధక విద్యార్థులు సమర్పించే సిద్ధాంత గ్రంథాన్ని మూల్యాంకనం కోసం విదేశీ యూనివర్సిటీలకు పంపనున్నారు. అలాగే ప్రీ–పీహెచ్డీ పాసు మార్కులు 50 నుంచి 55 శాతానికి పెంచారు. ఎస్వీయూలో ఇకపై అడ్మిషన్ పొందే విద్యార్థులకు ఈ నూతన నియమావళి వర్తించనుంది. 2019 గైడ్లైన్స్ పేరిట రూపొందించిన ఈ నూతన నియమావళికి యూఆర్సీæ ఆమోదం తెలిపింది. ఎస్వీ యూనివర్సిటీ రీసెర్చ్ కమిటీ (యూఆర్సీ) సమావేశం సోమవారం నిర్వహిం చారు. వీసీ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో యూనివర్సిటీ రీసెర్చ్ గైడ్లైన్స్–2019కి ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు ఉన్న యూనివర్సిటీ గైడ్లైన్స్–2016 స్థానంలో ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలన్నీ ఇకపై అడ్మిషన్ తీసుకునే వారికి వర్తించనున్నాయి. ఏపీఆర్సెట్ ద్వారా అర్హత సాధించిన వారికి వెంటనే అడ్మిషన్ ఇచ్చి ఈ నిబంధనలు అమలు చేయనున్నారు. ఇప్పటికే అడ్మిషన్ పొందిన వారు పాత నిబంధనలకు అనుగుణంగానే తమ పరిశోధనలు చేయవచ్చు. 14 సంవత్సరాల తర్వాత ఫారిన్ ఎగ్జామినర్ పీహెచ్డీ చేస్తున్న పరిశోధక విద్యార్థులు వర్సిటీకి సమర్పించిన సిద్ధాంత గ్రంథం ముగ్గురు అధ్యాపకులకు మూల్యాంకనానికి పంపుతారు. గతంలో ఇక విదేశీ యూనివర్సిటీ అధ్యాపకుడికి, ఇద్దరు మన దేశంలోని యూనివర్సిటీల అధ్యాపకులకు మూల్యాంకనానికి పంపేవారు. దీనివల్ల ఆలస్యమవుతోందని భావించిన మాజీ వీసీ ఎస్.జయరామిరెడ్డి 2005లో విదేశీ వర్సిటీల మూల్యాంకనం రద్దు చేశారు. దీనివల్ల పీహెచ్డీల మూల్యాంకనం తేలిక అయింది. 14 సంవత్సరాల్లో సుమారు 5 వేల మంది పీహెచ్డీ డిగ్రీలు పొందారు. అయితే ఇటీవల కాలంలో పీహెచ్డీలలో నాణ్యత తగ్గిందని భావించిన యూజీసీ, ఏపీ ఉన్నతవిద్యామండలి విదేశీ వర్సిటీ మూల్యాం కనం తప్పని చేయాలని వర్సిటీలను ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్వీయూలో నిర్వహించిన యూఆర్సీలో ఫారిన్ యూనివర్సిటీ మూల్యాంకనానికి ఆమోదం తెలిపింది. ఇకపై అడ్మిషన్ పొందేవారు వర్సిటీకి సమర్పించే సిద్ధాంత గ్రంథాల్లో ఒకటి విదేశీ వర్సిటీకి, రెండు మన దేశంలో ఇతర యూనివర్సిటీలకు మూల్యాంకనానికి వెళ్లనున్నాయి. 2019 రీసెర్చ్ గైడ్లైన్స్ పేరిట నూతన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ఇకపై పీహెచ్డీ అడ్మిషన్ పొందేవారంతా ఈ నిబంధనలు పాటించాలి. ఇది వరకే అడ్మిషన్ పొందినవారికి ఈ నిబంధనలు వర్తించవు. ఈ నిబంధనల్లో మరికొన్ని ఇలా ఉన్నాయి.. ♦ ఇకపై అడ్మిషన్ పొందే వారు పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం సమర్పించే లోపు మూడు సెమినార్లు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో సెమినార్కు 50 మార్కులు(ఒక్కో సెమినార్కు 2 క్రెడిట్స్). ♦ ప్రీ పీహెచ్డీలో రీసెర్చ్మెథడాలజీ 100 మార్కులు(4 క్రెడిట్స్), సబంధిత సబ్జెక్ట్కు 100 మార్కులు(4 క్రెడిట్స్) ఉంటాయి. ♦ ప్రీ పీహెచ్డీలో పరిశోధక విద్యార్థుల పాస్ మార్కుల శాతాన్ని 50 నుంచి 55కు పెంచారు. ♦ పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం సమర్పించే లోపు 2 పరిశోధన వ్యాసాలు ప్రచురించాలి. ♦ పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం సమర్చించే సమయంలో ప్లాగరిథం(కాపీయింగ్) టెస్ట్ చేయిం చుకోవాలి. ♦ పీహెచ్డీ అడ్మిషన్ పొందేవారు యూజీసీ నెట్, ఏపీ సెట్, ఏపీ రీసెర్చ్ సెట్(ఏపీ ఆర్సెట్)లలో ఏదో ఒక దానిలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. ♦ వివిధ పరిశోధన సంస్థల నుంచి ఫెలోషిప్లకు ఎంపికైన వారు కూడా పై మూడు ప్రవేశ పరీక్షల్లో ఒకదానిలో అర్హత సాధించాలి. ♦ పీహెచ్డీ కోర్సుల్లో ఇకపై ప్రాథమిక(ప్రొవిజనల్) అడ్మిషన్ ఉండదు. ♦ పీహెచ్డీ అడ్మిషన్ పొందిన వారు తమ పరిశోధన అంశం(టైటిల్) ఖరారు చేసుకునే సమయంలో ఒకటి, ప్రీ పీహెచ్డీకి ముందు ఒకటి, సినాప్సిస్ సమర్పించేందుకు ముందు ఒకటి సెమినార్ ఇవ్వాలి. త్వరలో అడ్మిషన్లు ఎస్వీయూ రీసెర్చ్ నూతన గైడ్లైన్స్కు యూఆర్సీ అనుమతి రాకపోవడంతో ఏపీఆర్సెట్–2018లో అర్హత సాధించిన వారికి ఇప్పటివరకు అడ్మిషన్ ఇవ్వలేదు. సోమవారం నూతన నియమావళికి అనుమతి లభించిన నేపథ్యంలో ఏపీఆర్సెట్–2018లో అర్హత సాధించిన 150 మందికి వచ్చే వారంలో అడ్మిషన్ ఇవ్వనున్నారు. సోమవారం నిర్వహించిన యూఆర్సీ సమావేశంలో రెక్టార్ జీ.జానకిరామయ్య, రిజిస్ట్రార్ ఆర్కే అనురాధ, రీసెర్చ్ డీన్ విజయభాస్కర్రావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
విదేశీ పీహెచ్డీలకూ అసిస్టెంట్ ప్రొఫెసర్
న్యూఢిల్లీ: టాప్–500 విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ పూర్తిచేసిన వారు కూడా భారత వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రత్యక్ష నియామకానికి అర్హులేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. క్వాకరెలి సైమండ్స్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్, షాంఘై జియావో టోంగ్ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న వర్సిటీల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్ట్స్, కామర్స్, హ్యుమానిటీస్, లా, సోషల్ సైన్సెస్, లాంగ్వెజేస్, లైబ్రరీ సైన్స్, జర్నలిజం–మాస్ కమ్యూనికేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో నియామకాలకు తాజా నిబంధనలు వర్తిస్తాయని యూజీసీ తెలిపింది. ప్రస్తుతం, అసిస్టెంట్ ప్రొఫెసర్కు అర్హత సాధించాలంటే అభ్యర్థులు భారతీయ విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత కోర్సులో 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి. నెట్, సెట్, స్లెట్ లాంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హత సాధించడం ద్వారా రాత పరీక్ష నుంచి మినహాయింపు పొందినా, ఇంటర్వ్యూలో చూపే ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని యూజీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
వర్సిటీ ప్రొఫెసర్లకు పీహెచ్డీ తప్పనిసరి
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రత్యక్ష నియామకానికి పీహెచ్డీని తప్పనిసరి చేసినట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. 2021–22 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని, జాతీయ అర్హత పరీక్ష(నెట్)లో ఉత్తీర్ణతను మాత్రమే ఇకపై ఏకైక అర్హతగా పరిగణించబోమని తెలిపారు. అయితే కళాశాలల్లో నియామకాలకు.. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ లేదా పీహెచ్డీ కనీస అర్హతగా కొనసాగుతుందని సీనియర్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం పీజీ పట్టా కలిగి ఉండి నెట్లో అర్హత సాధించిన వారు లేదా పీహెచ్డీ పట్టా ఉన్న వారు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయవచ్చు. ఇటీవల సవరించిన యూజీసీ నిబంధనలను జవడేకర్ బుధవారం వెల్లడిస్తూ..తీవ్ర వ్యతిరేకత రావడంతో అకడమిక్ పెర్ఫామెన్స్ ఇండికేటర్స్(ఏపీఐ)ని రద్దుచేసినట్లు తెలిపారు. కళాశాల లెక్చరర్లకు పరిశోధనను తప్పనిసరి చేస్తూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2021 నుంచి యూనివర్సిటీల్లో ప్రారంభ స్థాయి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా కూడా పీహెచ్డీ చేసిన వారే ఉంటారని అన్నారు. -
జేఎన్యూలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జేఎన్యూలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ పీహెచ్డీ విద్యార్థిని ఆరోపిస్తూ అదృశ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జేఎన్యూలో లైఫ్ సైన్స్ మొదటి సంవత్సరం స్కాలర్ పూజ కసానా రెండు రోజుల క్రితం హాస్టల్ విడిచి వెళ్లిపోయింది. ఆమె జాడ తెలియకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం లక్నోలో పూజని గుర్తించి, ఢిల్లీకి తీసుకొచ్చారు. తాను హాస్టల్ విడిచి వెళ్లడానికి తన మెంటర్ ప్రొఫెసర్ అతుల్ కుమార్ జోహ్రీ లైంగిక వేధింపులే కారణమని పూజ పోలీసులకు తెలిపింది. అతుల్ను తన ప్రవర్తన మార్చుకోవాలని ఈ మెయిల్ ద్వారా సూచించినా మార్పు రాలేదని తెలిపింది. ‘అతుల్ నువ్వు జేఎన్యూలోనే కాదు, ఇండియాలోనే బెస్ట్ గైడ్ కావచ్చు, ప్రతి ఒక్కరు నీ పర్యవేక్షణలో పీహెచ్డీ చేయాలని ఆశపడవచ్చు, కానీ చదువుకోనివారు కూడా బుద్ధిలో నీ కన్నా నూరుపాళ్లు నయం. నేను పీహెచ్డీని వదిలి వెళ్లడానికి నీ ప్రవర్తనే కారణం. నీకు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, నీ ప్రవర్తనతో ఎన్నో సార్లు విసుగు చెందిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని పూజ ఆ మెయిల్లో పేర్కొంది. మరోవైపు పూజ ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. అనుహ్యంగా గురువారం సాయంత్రం మరో 12 మంది లైఫ్ సైన్స్ విద్యార్థినిలు అతుల్పై ఇదే రకమైన ఆరోపణలతో ముందుకొచ్చారు. అతుల్ తమకు అసభ్యకరమైన మెసెజ్లు చేయడం, శరీరాకృతి మీద కామెంట్లు చేసేవాడని వారు తెలిపారు. అతుల్పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్టూడెంట్ ఫ్యాకల్టీ కమిటీ మెంబర్ ఒకరు వెల్లడించారు. దీంతో ప్రొఫెసర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నీ కూతురికి అదే గతి పట్టాలి: ఓ విద్యార్థిని
సాక్షి, న్యూఢిల్లీ : 'సార్ మీకు సభ్యత, సంస్కారం లాంటివి లేవు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదు. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నా’ అంటూ వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్కి ఓ పీహెచ్డీ విద్యార్థిని ఈమెయిల్ చేసింది. ప్రొఫెసర్ ప్రవర్తన నచ్చకనే వర్సీటీ నుంచి తాను పారిపోయానని చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కి చెందిన ఓ 26 ఏళ్ల యువతి జేఎన్యూలో ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్, పీహెచ్డీ చేస్తోంది. ఇటీవల ఆమె యూనివర్సిటీ నుంచి పారిపోయి బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై విద్యార్థిని తండ్రి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా గైడ్గా ఉన్న ప్రొఫెసర్ ఎ.కె.జోరి దురుసు ప్రవర్తన వల్లే యూనివర్సీటీని వదిలి వెళ్లాలని ఆ విద్యార్థిని లేఖ సారాంశం. ‘ గౌరవనీయులైన ప్రొఫెసర్ గారికి నమస్కారం. మీరు దేశంలోనే గొప్ప గైడ్ (నిర్దేశకుడు) అని అనుకుంటున్నారు. నేను కూడా మొదట్లో ఇలానే అనుకున్నా. మీరు మాకు గైడ్గా ఉండడం వరంగా భావించా. కానీ తర్వాత మీ నిజస్వరూపం తెలిసింది. మీకు సభ్యత, సంస్కారాలు తెలియవు. ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. నీ దురుసు ప్రవర్తన వల్లే నేను వర్సీటీ వదిలి వెళ్లాను. నాలాగ మరో అమ్మాయి బలి కాకుడదని అనుకుంటున్నాను. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితే రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. కనీసం అప్పుడైనా అమ్మాయిల బాధ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ మెయిల్ పంపింది. కాగా ప్రొఫెసర్ ఎ.కె.జోరి తనపై వచ్చిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. తాను గత నెల 27న వరుసగా గైర్హాజరైన తొమ్మిమంది విద్యార్థులను హెచ్చరిస్తూ లేఖలు పంపాను. ‘మీరు సరిగా తరగతులకు హాజరు కావడం లేదు. ఇలా అయితే మీ పీహెచ్డీని పూర్తి చేయడం కష్టం. మీరు మరో ల్యాబ్ను చూసుకోండి’అని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అందరు విద్యార్థుల్లాగే రెగ్యులర్గా హాజరు కావాలని కోరానన్నారు. అందరితో ప్రవర్తించినట్లే ఆమెతోను వ్యవహరించానని తెలిపారు. ఆ విద్యార్థిని తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమని ప్రొఫెసర్ ఎ.కె.జోరి అన్నారు. -
పీహెచ్డీ ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తప్పనిసరి చేసింది. 2021 జూలై 1 తరువాత చేపట్టే నియామకాలకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో పదోన్నతికీ పీహెచ్డీ ఉండాలని స్పష్టం చేసింది. కాంట్రా క్టు, ఔట్ సోర్సింగ్, తాత్కాలికం.. పేరేదైనా ఉన్నత విద్యా సంస్థలకు మంజూరైన పోస్టుల్లో తాత్కాలిక సిబ్బంది 10 శాతానికి మించొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు వర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది నియామకాలకు సరికొత్త నిబంధనలు రూపొందించింది. ‘యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఆన్ మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ అదర్ అకడమిక్ స్టాఫ్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అండ్ మెజర్స్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2018’పేరుతో డ్రాఫ్ట్ మార్గదర్శకాలను అందుబాటులోకి తెచ్చింది. సీనియర్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెం ట్ ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్ తదితర పోస్టుల భర్తీ, పదోన్నతుల్లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అర్హతలు, పనిదినాలు, అకడమిక్ అంశాలను అందులో పొందుపరిచింది. మార్గదర్శకాలను వెబ్సైట్లో ఉంచిన యూజీసీ.. ఆ అంశాలపై ఈ నెల 28లోగా అభిప్రాయాలు తెలపాలని వర్సిటీలు, కాలేజీలను కోరింది. అభిప్రాయ సేకరణ తరువాత తుది మార్గదర్శకాలను జారీ చేసి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో త్వరలో భర్తీ చేయనున్న 1,061 పోస్టులకూ ఈ నిబంధనలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. మార్గదర్శకాల్లోని ప్రధానాంశాలు ♦ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసే వారికి పీహెచ్డీ ఉండాలి. ♦ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పోస్టు గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులుండాలి. అలాగే నెట్, స్లెట్, సెట్, పీహెచ్డీలలో ఒక అర్హత ఉండాలి. ♦ 1991 సెప్టెంబర్ 19కి ముందు పీహెచ్డీ చేసిన వారికి పీజీలో 50% మార్కులున్నా సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50 శాతం మార్కులున్నా చాలు. ♦ 2021 జూలై 21 తరువాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే పీహెచ్డీ ఉండాల్సిందే. ♦ విద్యా సంస్థలో మంజూరైన మొత్తం పోస్టుల్లో తాత్కాలిక అధ్యాపకులు 10 శాతానికి మించకూడదు. ♦ పేరేదైనా తాత్కాలిక పద్ధతిలో పని చేసే అధ్యాపకులకు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా వేతనమివ్వాలి. ♦ కనీసం 180 పని దినాలు అమలు చేయాలి. వారంలో 6 రోజుల పనిదినాలు ఉంటే.. విద్యా సంవత్సరంలో 30 వారాలు ప్రధాన బోధన కొనసాగించాలి. ♦ మిగిలిన సమయంలో 12 వారాలు ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ, పాఠ్య కార్యక్రమాలు, స్పోర్ట్స్, కాలేజ్డే కార్యకలాపాలకు కేటాయించాలి. ♦ 8 వారాలు సెలవులు, 2 వారాలు ప్రజా సెలవులకు కేటాయించాలి. ♦ వారంలో 40 గంటలకు తక్కువ కాకుండా పనిదినాలు ఉండాలి. రోజుకు 7 గంటలు అధ్యాపకులు కాలేజీలో ఉండాలి. ♦ విద్యార్థులకు వివిధ అంశాలపై మార్గదర్శనం కోసం 2 గంటలు కేటాయించాలి. కమ్యూనిటీ డెవలప్మెంట్, సాంస్కృతిక, గ్రంథాలయ కార్యక్రమాలకు సమయమివ్వాలి. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్ను కోఆర్డినేటర్గా నియమించాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీలో.. అకడమిక్ స్కోర్కు 80 మార్కులు రీసెర్చ్ పబ్లికేషన్స్కు 10 మార్కులు బోధన అనుభవానికి 10 మార్కులు మొత్తంగా 100 మార్కులు అకడమిక్ స్కోర్లో గరిష్టంగా ఇచ్చే మార్కులు ♦డిగ్రీలో 80 శాతానికి పైగా మార్కులొస్తే.. 15 మార్కులు ♦ 60 నుంచి 80 శాతం లోపు ఉంటే.. 13 మార్కులు ♦55 నుంచి 60 శాతం లోపు ఉంటే.. 10 మార్కులు ♦ పీజీలో 80 శాతానికి పైగా మార్కులొస్తే.. 28 మార్కులు ♦ 60 నుంచి 80 శాతం లోపు ఉంటే.. 25 మార్కులు ♦ 55 నుంచి 60 శాతం లోపు ఉంటే.. 20 మార్కులు ♦ ఎంఫిల్లో 60 శాతానికి పైగా మార్కులొస్తే.. 7 మార్కులు ♦ 55 నుంచి 60 శాతం లోపు మార్కులుంటే 5 మార్కులు ♦ పీహెచ్డీకి 30 మార్కులు ♦ నెట్, జేఆర్ఎఫ్ ఉంటే 7 మార్కులు ♦ నెట్/సెట్/స్లెట్ ఉంటే 5 మార్కులు -
పీహెచ్డీలో ప్రవేశాలకు కొత్త నిబంధనలు!
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలో (పీహెచ్డీ) ప్రవేశాలకు కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఉన్నత విద్యామండలి నియమించిన వైస్ చాన్స్లర్ల కమిటీ నిబంధనల రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. వర్సిటీలు ఇష్టానుసారం ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేకుండా కమిటీ నివేదికను సిద్ధం చేస్తోంది. త్వరలోనే నివేదికను ఉన్నత విద్యామండలికి అందజేయనుంది. ప్రాథమిక నిర్ణయం మేరకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ+, ఏ గుర్తింపు కలిగిన యూనివర్సిటీలే ఇకపై పీహెచ్డీ ప్రవేశాలకు పరీక్షలను నిర్వహించనున్నాయి. విద్యార్థులు నిర్ణీత అర్హతలతోపాటు ప్రవేశ పరీక్షలో అర్హత సాధిస్తే పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించనున్నాయి. అయితే రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ వంటి కొన్ని యూనివర్సిటీలకే న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు ఉంది. న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు లేని వర్సిటీలు ఇకపై పీహెచ్డీలో ప్రవేశాలకు సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి వీల్లేకుండా నిబంధనలను రూపొందిస్తోంది. ఆయా వర్సిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీ చేసిన పీహెచ్డీ ప్రవేశాల నిబంధనల ప్రకారమే పీహెచ్డీల్లో ప్రవేశాలు చేపట్టేలా కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు నెట్/స్లెట్/సెట్/జే ఆర్ఎఫ్/ఐసీఎస్ఎస్ఆర్ వంటి అర్హతల ఆధారంగా పీహెచ్డీల్లో ప్రవేశాలు చేపట్టేలా నిబంధనలను సిద్ధం చేస్తోంది. -
పరిశోధనల్లో పూర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశోధనలకు ప్రాధాన్యం తగ్గుతోంది. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల కొరత, ఇతర వివాదాలతో ప్రవేశాలు సజావుగా జరగడం లేదు. రాష్ట్రంలోని వర్సిటీల్లో ఆరేళ్లుగా ప్రొఫెసర్ల నియామకాలు తగ్గడంతో ఎక్కువగా ప్రవేశాలు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. సమాజానికి ఉపయోగపడే పీహెచ్డీలు ఎన్ని ఉన్నాయో పక్కనబెడితే.. మార్గదర్శనం చేసే ప్రొఫెసర్లు లేక రాష్ట్రంలో పరిశోధనలు తగ్గుతున్నాయని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోల్చితే పీహెచ్డీలు చేస్తున్న విద్యార్థుల సంఖ్యలో తెలంగాణ 12వ స్థానంలో ఉన్నా.. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అట్టడుగున ఉండిపోయింది. తమిళనాడులో 28,684 మంది.. 2016–17 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా పీహెచ్డీలు, ఎంఫిల్, పీజీలు చదువుతున్న విద్యార్థుల సంఖ్యపై కేంద్రం లెక్కలు తేల్చింది. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేరుతో ఇటీవల గణాంకాలు విడుదల చేసింది. ఆ ప్రకారం దేశవ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్న విద్యార్థుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 28,684 మంది విద్యార్థులు పీహెచ్డీలు చేస్తున్నారు. 13,227 మంది విద్యార్థులతో ఉత్తరప్రదేశ్, 10,841 మంది విద్యార్థులతో కర్ణాటక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో 5 వేల మంది చొప్పున పీహెచ్డీ విద్యార్థులున్నారు. 4 వేల నుంచి 5 వేలలోపు పీహెచ్డీ విద్యార్థులతో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 10 రాష్ట్రాల్లో పీహెచ్డీలు చేస్తున్న వారి సంఖ్య 1,000కి మించనేలేదు. కేరళలో 58.82 శాతం మహిళలు దేశవ్యాప్తంగా 1,41,037 మంది విద్యార్థులు పీహెచ్డీ చేస్తుండగా.. అందులో 59,242 (42.01 శాతం) మంది మహిళలే ఉన్నారు. 58.82 శాతం మంది మహిళలతో కేరళ తొలి స్థానంలో నిలిచింది. పంజాబ్లో 53.95 శాతం మంది, హర్యానాలో 49.54 శాతం, తమిళనాడులో 42.95, రాజస్తాన్లో 47.61, ఢిల్లీలో 46.39, మహారాష్ట్రలో 41.79, గుజరాత్లో 39.15, కర్ణాటకలో 38.84, అస్సాంలో 38.19, ఆంధ్రప్రదేశ్లో 37.24, తెలంగాణలో 34.28% మంది మహిళలు పీహెచ్డీ చేస్తున్నారు. పీహెచ్డీలతోపాటు మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్.) ప్రవేశాల్లోనూ రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొంది. కానీ పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో మాత్రం రెండు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో సీన్ రివర్స్ అయింది. పీజీ కోర్సులు చదువుతున్న వారు ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా (5,40,138 మంది) ఉండగా, మహారాష్ట్రలో 3,18,077 మంది ఉన్నారు. తమిళనాడులో 2,63,450 మంది, మధ్యప్రదేశ్లో 1,71,801, కర్ణాటకలో 1,69,889, తెలంగాణలో 1,66,186, ఆంధ్రప్రదేశ్లో 1,85,672 మంది విద్యార్థులు పీజీ చదువుతున్నట్లు కేంద్రం లెక్కలు తేల్చింది. -
పీహెచ్డీ చేసిన సమంత
చెన్నై, సాక్షి: నటి సమంత పీహెచ్డీ చేశారు. ఏమిటీ నమ్మశక్యంగా లేదా? సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సమంత ఏ రంగంలో ఏ సబ్జెక్ట్ మీద పీహెచ్డీ చేశారని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం ఏమిటంటే.. ఇటీవలే యువ నటుడు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమంత నటనకు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. తెలుగులో రామ్చరణ్కు జంటగా 'రంగస్థలం' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం 'మహానటి'లో పాత్రికేయరాలిగా ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. కన్నడ చిత్రం 'యూటర్న్' రీమేక్లోనూ నటించడానికి రెడీ అవుతున్న సమంత కోలీవుడ్లోనూ రెండు చిత్రాలలో నటిస్తున్నారు. అందులో ఒకటి విశాల్తో జత కడుతున్న 'ఇరంబుతిరై'.. మరొకటి శివకార్తీకేయన్తో నటిస్తున్న చిత్రం.. పొన్రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇక, విశాల్కు జంటగా నటిస్తున్న 'ఇరుంబుతెరై' చిత్రంలో సమంత పీహెచ్డీ చేయబోతున్నారు. సైకాలజీలో పీహెచ్డీ చేసిన డాక్టరుగా ఆమె నటిస్తున్నారు. పేరు డాక్టర్ రతీదేవి. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఎవరికి తన వైద్యం అందిస్తారన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కొత్త సంవత్సరంలో సంక్రాంతికి బరిలోకి దిగడానికి ఇరుంబుతెరై చిత్రం ముస్తాబవుతోంది. అప్పుడు డాక్టర్ రతీదేవిని పరిచయం చేస్తామని విశాల్ ట్విట్టర్లో తెలిపారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలనిజం ప్రదర్శిస్తున్న ఈ చిత్రానికి పీఎస్. మిత్రన్ దర్శకుడు. విశాల్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. -
పీహెచ్డీ విద్యార్థులకు 70 వేల ఫెలోషిప్
కోల్కతా: ఐఐటీ, ఐఐఎస్సీలో పీహెచ్డీలు చేసే పరిశోధకులకు నెలకు రూ. 70వేలు ఫెలోషిప్లు ఇవ్వనున్నట్లు కేంద్ర ఉన్నత విద్య సెక్రటరీ కేవల్ కుమార్ శర్మ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లోని ఐఐటీ ఖరగ్పూర్లో జరిగిన 67వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఫెలోషిప్ స్కీమ్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆర్థిక పరమైన కారణాల వల్లే చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తుతున్నారని అటువంటి వారు స్వదేశంలోనే ఉండేందుకు ఈ నిర్ణయం దోహదపడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోధకులకు ఐదేళ్ల పాటు ప్రతి నెలా రూ.70 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదం తెలపనుందని, వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ఫెలోషిప్లు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
తెలుగు వర్సిటీలో పీహెచ్డీ పేపర్ లీక్
-
పీహెచ్డీ ప్రవేశాలకు కామన్ గైడ్లైన్స్!
రూపకల్పనకు ఉన్నత విద్యామండలి కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్డీ) ప్రవేశాల్లో కామన్ గైడ్లైన్స్ అమలు చేసేలా ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకుంటోంది. యూనివర్సిటీల్లో నాణ్యమైన పరిశోధనలు జరిగే దిశగా కసరత్తు చేస్తోంది. ఒక్కో యూనివర్సి టీలో ఒక్కో విధంగా కటాఫ్ మార్కులు ఉండడం, స్థానిక ఒత్తిళ్ల కారణంగా వాటిల్లో మార్పు చేయడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ‘పరిశోధనలు అంతంతే..’శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లతో కూడిన ఉన్నస్థాయి కమిటీతో సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన పరిశోధనలకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందిం చాలని నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో పరిశోధనలు జరుతున్న తీరు, ఈ అంశాల్లో తెలంగాణ వెనుకబడడానికి దారితీసిన పరిస్థితులపై చర్చించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పీహెచ్ డీల్లో ప్రవేశాలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. వాటి ప్రకారం నేషనల్ ఎలిజిబి లిటీ టెస్టు (నెట్) లేదా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టులో (సెట్) అర్హత సాధించినవారే పీహెచ్డీ చేసేందుకు అర్హులు. వాటిని పక్కాగా అమలు చేయడంతోపాటు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీలు మాత్రమే పీహెచ్డీలో ప్రవేశాలు చేపట్టేందుకు, ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అర్హులన్న యూజీసీ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క యూనివర్సిటీకి కూడా న్యాక్ ఏ గ్రేడ్ లేదు. ఏ గ్రేడ్ వచ్చిన తర్వాతే పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఈలోగా కామన్ గైడ్లైన్స్ రూపొందించడం ద్వారా భవిష్యత్తులో పక్కాగా పీహెచ్డీ ప్రవేశాలు చేపట్టవచ్చని భావిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో యూజీసీ నిర్వహించే నెట్ మాత్రమే అమల్లో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మాత్రం రాష్ట్రాలు నిర్వహించే సెట్లకు మంగళం పాడే అవకాశం ఉందని, ఈ దిశగా యూజీసీ చర్యలు చేపడుతోందన్న ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. -
ముగిసిన పీహెచ్డీ ఇంటర్వ్యూలు
జేఎన్టీయూ : ఎంఫిల్, పీహెచ్డీ, ఎంఎస్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలు శుక్రవారం ముగిశాయని అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్కుమార్ తెలిపారు. ఈఈఈ విభాగానికి సంబంధించి శుక్రవారం 63 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెక్టార్ ప్రొఫెసర్ డి.సుబ్బారావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ, ప్రొఫెసర్ పి.సుజాత ఇంటర్వ్యూలు నిర్వహించారు. -
పీహెచ్డీ ప్రవేశ ఫలితాలు విడుదల
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం పరిధిలో పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇన్చార్జ్ వీసీ ఆచార్య కె.రాజగోపాల్ గురువారం విడుదల చేశారు. 3,049 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 2,493 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు 1:2 నిష్పత్తిలో ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య డి.సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ .కృష్ణయ్య, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య విజయ్కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ఆచార్య డి.రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సజావుగా పీహెచ్డీ రాత పరీక్ష
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ఎక్స్ట్రర్నల్ పీహెచ్డీ, అనుబంధ ఇంజినీరింగ్ కంగీళాశాలల్లోని రీసెర్చ్ సెంటర్లలో పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే రాత పరీక్ష ఆదివారం సజావుగా నిర్వహించినట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య విజయ్కుమార్ తెలిపారు. ఫిజిక్స్కు సంబంధించి 34 మంది అభ్యర్థులు, ఇంగ్లిషు 48, సీఎస్ఈ 696, కెమిస్ట్రి 46, ఈసీఈ 617, మేనేజ్మెంట్ 99, మెకానికల్ 584, సివిల్ 187, ఈసీఈ 453, మేథమేటిక్స్ 62, ఫార్మసీ 220 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్ . కృష్ణయ్య పరిశీలించారు. -
నేడు ఓయూ బంద్
హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అక్రమాలను నిరసిస్తూ వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో గురువారం ఏర్పాటుచేసిన పీహెచ్డీ సాధన సమితి ఆధ్వర్యంలో నేడు (3న) ఓయూ బంద్కు పిలుపునిస్తున్నట్లు విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి పోలీసులను తొలగించాలని, పీహెచ్డీ సీట్ల కేటాయింపు, జాబితా విడుదలపై విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన ప్రొఫెసర్లను తొలగించాలని, రిజర్వేషన్లు పాటించాలని, పీహెచ్డీ అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు 20% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిస్తున్నట్లు పీహెచ్డీ సాధన సమితి నాయకులు తెలిపారు. -
అధ్యాపకురాలికి పీహెచ్డీ ప్రదానం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ) : జేఎ¯ŒSటీయూ ఇంజినీరింగ్ కళాశాల ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ చట్టి సన్యాసలక్షి్మకి ఆంధ్రా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రదానం చేసింది. ‘స్రక్చరల్, మేగ్నేటిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్వెస్టగేష¯Œ్స ఆ¯ŒS ఆంటిమొనో అండ్ నియోబియయ్ డొపడ్నానోక్రిస్టలీ¯ŒS నికెల్ జింగ్ ఫెర్రైట్స్’ అంశంపై దశాబ్దకాలంగా చేసిన పరిశోధనలో ప్రతిపాదించిన అంశాలను వర్సిటీ ఆమోదించినట్టు ఆమె మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ వీసీ జి.నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆమె పీహెచ్సీని అందుకున్నారు. వర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ పీఎస్ బంగారురాజు నేతృత్వంలో ఆమె ఈ పరిశోధన చేశారు. ఈ నూతన ఆవిష్కరణ వల్ల మెక్రో ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో మైక్రోవేవ్ డివైజర్స్, కంప్యూటరియా మెమరీ ఎలిమెంట్స్, వైద్యరంగంలో డీప్ బై¯ŒS స్టిమ్యులేష¯ŒS వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడుతుందన్నారు. మతిమరుపు లక్షణాల గుర్తింపు, సూచనలు, కేన్సర్ ట్రీట్మెంట్లో ఈ పరిశోధన దోహదపడుతుందని ఆమె వివరించారు. దశాబ్ది కాలంగా చేసిన కృషి ఫలించిందని, ఆమె భర్త, విశాఖ గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల మేథమెటిక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేవీఎస్ శర్మ తెలిపారు.