pd act
-
ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీ యాక్ట్
-
హైదరాబాద్ సీపీ సంచలన ప్రకటన.. రాజా సింగ్పై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్ నమోదు అయినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. చాలాసార్లు ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో గతంలో రాజాసింగ్పై రౌడీషీట్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ కేసులు ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టుకు ముందు ఆయనకు 32 పేజీల పీడీ యాక్ట్ డాక్యుమెంట్ను అందించినట్టు కమిషనర్ వెల్లడించారు. కాగా, ఈనెల 22న ఓ యూట్యూబ్ చానల్లో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా రాజాసింగ్ మాట్లాడారని అన్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదవ్వడం ఇదే తొలిసారి. ఇక 2004 నుంచి రాజాసింగ్పై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. వీటిలో కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేక వీగిపోయాయి. మరికొన్నికోర్టు విచారణలో ఉన్నాయి. చదవండి: ఒక్క ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా: ఎంపీ అసదుద్దీన్ -
యువతులు, ఒంటరి మహిళలే టార్గెట్.. జీవనోపాధి కల్పిస్తానని చెప్పి
సాక్షి, హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తూ అమాయక మహిళలను మోసం చేసిన ఓ మహిళపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం పీడీ యాక్టు నమోదు చేశారు. జవహర్నగర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిగాడి అరుణ దమ్మాయిగూడ వాయుశక్తినగర్లో ఓ ఇంట్లో నివాసం ఉంటూ కళాశాల యువతులు, ఒంటరి మహిళలకు జీవనోపాధి కల్పిస్తానని చెప్పి వ్యభిచారం నిర్వహిస్తుంది. వ్యభిచారం నిర్వహిస్తున్న అరుణను జూన్ 16న పోలీసులు అదుపులోకి తీసుకొని చంచల్గూడ జైలులో తరలించారు. ఈ మేరకు అరుణపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు తెలిపారు. మసాజ్ సెంటర్పై దాడి.. ముగ్గురు మహిళల అరెస్టు అనుమతి లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న బ్యూటీ సెలూన్ వెల్నెస్ సెంటర్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పనామా చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఎస్బీ బ్యూటీ అండ్ సెలూన్ వెల్నెస్ సెంటర్లో అనుమతి లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందంది. దీంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా బుధవారం దాడి చేశారు. అందులో పనిచేస్తున్న ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. మసాజ్ సెంటర్ నిర్వాహకుడు రాధామనోహర్రెడ్డి, మేనేజర్ ప్రశాంత్లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారి నుంచి 4 సెల్ఫోన్లు, రూ. 500 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి..
సాక్షి, ఉప్పల్: యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతున్న యువకుడిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బాసవి రవితేజ (35), రామంతాపూర్ గోకులేనగర్లో నివాసముంటున్నాడు. అమాయక యువతులను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దింపుతున్నాడు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు గత నెల 7న రవితేజను రిమాండ్కు తరలించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు శనివారం పీడీయాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాసవి రవితేజ (35) చదవండి: రాత్రి ఇంట్లో నిద్రించారు.. తెల్లారేసరికి మాయం.. ఎటు వెళ్లినట్లు? -
వెబ్సైట్లో యువతుల చిత్రాలు పెట్టి వ్యభిచారం..
సాక్షి, చైతన్యపురి: వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలోని మరో ఇద్దరిపై చైతన్యపురి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన అల్లని శ్యాం (49), విజయవాడకు చెందిన రామిశెట్టి సంధ్య (32) హైదరాబాద్కు వచ్చి సులువుగా డబ్బు సంపాదించేందుకు లొకాంటో వెబ్సైట్లో యువతుల అర్ధనగ్న చిత్రాలు పెట్టి ఆన్లైన్ ద్వారా వ్యభిచారం ప్రారంభించాడు. పేదలు, కార్మికుల, ఒంటరి మహిళలకు డబ్బు ఆశచూపి వారి ద్వారా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. మార్చి నెలలో అల్కాపురిలోని ఓ అపార్టుమెంటులో పోలీసులు దాడి చేసి నిర్వహకులతో పాటు పలు యువతులను రక్షించారు. అనంతరం నిందితులు ఇద్దరిని రిమాండ్కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఇద్దరి పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: జూబ్లీహిల్స్: ఓయో రూమ్లో వ్యభిచారం.. -
ఆన్లైన్ సెక్స్ రాకెట్.. నిర్వాహకుడిపై పీడీయాక్ట్
సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్న కీసరకు చెందిన వంశీరెడ్డిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఉద్యోగం పేరుతో పశ్చిమ బెంగాల్ నుంచి అందమైన అమ్మాయిలను హైదరాబాద్కు తీసుకొచ్చి వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. ఆన్లైన్లో అమ్మాయిల ఫోటోలను పోస్ట్ చేసి విటులను ఆకర్షించేవాడు. నచ్చిన అమ్మాయిను వారి వద్దకు పంపించి రూ.వేలల్లో డబ్బు తీసుకునేవాడు. ఈ వ్యవహారం మొత్తం ఆన్లైన్లోనే సాగిపోయేది.(ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కేసు విషాదాంతం!) దీనిపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు వీరి స్థావరంపై దాడి చేసి అమ్మాయిలను రక్షించారు. వంశీరెడ్డితో పాటు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యువతుల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించిన వంశీరెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశించారు. దీంతో పోలీసులు అతడిపై అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.(పీఎన్బీ స్కాం : నీరవ్ భార్యకు రెడ్ కార్నర్ నోటీసు) -
నూకల మనోహర్పై పీడీ యాక్ట్
కోవెలకుంట్ల/ కర్నూలు(టౌన్): కోవెలకుంట్ల కేంద్రంగా నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్న నూకల మనోహర్పై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ సుబ్బరాయుడు ఆదివారం కోవెలకుంట్ల సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన మనోహర్ కొన్నేళ్ల నుంచి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులతో కలిసి గుట్కా వ్యాపారం చేస్తున్నాడు. జిల్లాలోని ఆళ్లగడ్డ, శిరివెళ్ల, నంద్యాల, బనగానపల్లె, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాలకు గుట్కా ప్యాకెట్లను సరఫరా చేసేవాడు. ఇందుకు సంబంధించి అతనిపై 14 కేసులు నమోదయ్యాయి. కోవెలకుంట్ల పోలీస్స్టేషన్లో ఎనిమిది, ఆళ్లగడ్డ పీఎస్లో మూడు, ఆళ్లగడ్డ రూరల్, శిరివెళ్ల, నంద్యాల తాలూకా స్టేషన్లలో ఒక్కొక్క కేసు ఉన్నాయి. ఈ కేసుల్లో పలుమార్లు అరెస్టయ్యి.. జైలుకు కూడా వెళ్లొచ్చినా నేర ప్రవృత్తిని మాత్రం మార్చుకోలేదు. గత నెల 22వ తేదీన రూ.60 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి తెస్తూ స్పెషల్ పార్టీ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని గుట్కా వ్యాపారాన్ని సీరియస్గా పరిగణించిన పోలీసులు పీడీయాక్ట్ నమోదు కోసం జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్పకు ప్రతిపాదనలు పంపగా..వారు అనుమతి ఇచ్చారు. దీంతో మనోహర్పై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. -
గుట్కా డాన్పై పీడీ యాక్ట్..
సాక్షి, కర్నూలు జిల్లా: గుట్కా డాన్ నూకల మనోహర్పై కోవెలకుంట్ల పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అతనిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో మనోహర్పై 14 కేసులు నమోదయ్యాయి. బళ్లారి, రాయచూరు, హైదరాబాద్ల నుండి గుట్కా కొనుగోలు చేసి కర్నూల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో గుట్కా సరఫరా కొనసాగిస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించిన నేర ప్రవృత్తి మార్చుకోకుండా గుట్కా సరఫరా చేస్తున్న గుట్కా డాన్పై సెస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. మనోహర్పై పీడీయాక్ట్ నమోదుకు కలెక్టర్కు జిల్లా ఎస్పీ ప్రతిపాదనలు పంపించగా.. కలెక్టర్ వీరపాండ్యన్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇసుక, మద్యం అక్రమార్కులపై రౌడీషీట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమాల కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ వెల్లడించారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించే దిశగా డీజీపీ సవాంగ్ ఆదేశాల మేరకు ఎస్ఈబీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ► ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు చేపడతాం. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపుదాడులు నిర్వహిస్తాం. ► అక్రమాలకు పాల్పడే పాత నేరస్థులపై పీడీ యాక్టు ప్రయోగిస్తాం. ఎస్ఈబీ హెచ్చరికలను పెడచెవిన పెట్టి నిబంధనలు ఉల్లంఘించే అక్రమార్కులపై రౌడీషీట్స్ తెరిచే యోచనలో ఉన్నాం. ► పట్టుబడిన అక్రమార్కుల ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకుంటాం. వారిని వెంటనే రిమాండ్కు పంపించేలా న్యాయ వ్యవస్థనూ సంప్రదిస్తున్నాం. మద్యం, ఇసుక అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు ముమ్మరం చేస్తాం. ► రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉండే ఇసుక, సిలికాన్, గ్రావెల్ నిల్వలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ► ఇసుక అక్రమంగా తరలింపు, మద్యం అక్రమ రవాణా, మద్యం అక్రమ తయారీపై నిఘా పెంచాం. రాత్రివేళల్లోను గస్తీని ముమ్మరం చేశాం. మొబైల్ చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. ► ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రత్యేకంగా ఉపయోగించుకుంటున్నాం. ► అక్రమ రవాణా జరిగే ప్రాంతాలు, మార్గాలను ఇప్పటికే గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను వినియోగిస్తాం. ► ప్రత్యేకంగా ఇన్ఫార్మర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్ఈబీ అధికారులు ఎంత పటిష్టంగా పనిచేస్తున్నప్పటికీ ప్రజల సహకారం కూడా కీలకమే. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరిస్తే ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో ఎస్ఈబీ సాధిస్తుంది. ► గడిచిన 15 రోజుల్లో ఇసుక అక్రమాలకు పాల్పడిన 955 మందిపై 485 కేసులు నమోదు చేసాం. 730 వాహనాలు సీజ్ చేశాం. 29,629.075 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నాం. -
అక్రమార్కులపై పీడీ పంజా!
సాక్షి, హైదరాబాద్: అక్రమ లే–అవుట్లపై ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. పీడీ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేయనుంది. అనుమతుల్లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెంచర్లను నియంత్రించడానికి కఠిన చర్యలు తప్పవని భావించిన సర్కారు.. పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా పదేపదే అనధికార లే–అవుట్లు చేస్తున్న డెవలపర్లు/భూ యజమానులపై ఈ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ఆలోచన చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ... ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయనుంది. లే–అవుట్లకు అనుమతిలో గ్రామ పంచాయతీలకు ఎలాంటి పాత్ర ఉండదు. పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ (డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)కి మాత్రమే లే–అవుట్లను మంజూరు చేసే అధికారం ఉంటుంది. అయితే, ఈ నిబంధనలను పట్టించుకోని రియల్టర్లు.. పంచాయతీల పాలకవర్గాలతో కుమ్మక్కైఅడ్డగోలుగా వెంచర్లను అభివృద్ధి చేస్తున్నారు. డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు జారీ చేసే లే–అవుట్లతో పోలిస్తే.. ఇందులో స్థలాల ధరలు చౌకగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా ఇబ్బడిముబ్బడిగా అనధికార లే–అవుట్లు వెలుస్తున్నాయి. దాదాపు 3 వేల పైచిలుకే..! రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా అక్రమ లే–అవుట్లు ఉన్నట్లు పంచాయతీరాజ్శాఖ లెక్క తేల్చింది. నిబంధనలు ఉల్లంఘించి అనధికార లే–అవుట్లు చేసిన రియల్టర్లపై పీడీ చట్టం మేరకు కేసులు నమోదు చేసే అధికారాన్ని పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వనుంది. ఈ అంశంపై పోలీసుశాఖతో కూడా చర్చించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి ‘సాక్షి’కి తెలిపారు. -
పొట్టి రవిపై పీడీ యాక్టు
జేసీ కోటలో ఆయనో అరాచకశక్తి. పెద్దాయన (మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి) అండ.. చిన్నాయన (మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి) సపోర్టు చూసుకొని పాతికేళ్లుగా తాడిపత్రిలో ఆయన చెప్పిందే వేదం. ఏకంగా తాడిపత్రికి ‘చిన్నబాస్’గా ఎదిగాడు. రూ.కోట్లకు పడగెత్తాడు. ఆయన ఎవరో కాదు.. టీడీపీ నాయకుడు, జేసీ ప్రభాకర్రెడ్డి ముఖ్య అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి. నియోజకవర్గంలో పొట్టిరవిగా చలామణి అవుతూ సెటిల్మెంట్స్ కింగ్గా పేరుగడించాడు. పాతికేళ్లుగా అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ అతడ్ని ‘టచ్’ చేయడానికే పోలీసులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. సమాజ భద్రతకు, ప్రశాంతతకు భంగం కలిగిస్తున్న పొట్టిరవిపై తాజాగా పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించడం జిల్లాలో సంచలనం కలిగిస్తోంది. సాక్షి, అనంతపురం : తాడిపత్రి మండలం దిగువపల్లికి చెందిన ఉపాధ్యాయుడు సంగటి వీరారెడ్డి కుమారుడు సంగటి రవీంద్రారెడ్డి. 2003లో జేసీ సోదరుల పంచన చేరాడు. అప్పటి నుంచి జేసీ సోదరుల నమ్మకాన్ని చూరగొన్న రవీంద్రారెడ్డి క్రమక్రమంగా వారికి నమ్మినబంటుగా మారాడు. అప్పటి నుంచి జేసీ సోదరులను అడ్డుపెట్టుకుని చేయని దందా అంటూ లేదు. తాడిపత్రిలో మీడియాను తన గుప్పిటో పెట్టుకుని హవా నడిపించాడు. స్వయంగా ఓ మీడియాను స్థాపించడమే కాకుండా మిగతా పత్రికల్లో తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులు చేయించడంతో పాటు తన సొంత మీడియాలో అసభ్యకరంగా రాతలు రాయించడం లాంటి బ్లాక్మెయిల్ కార్యకలాపాలకు పాల్పడేవాడు. దీంతో పాతికేళ్లుగా తాడిపత్రిలో చీకటిరాజ్యం బాహ్య ప్రపంచానికి తెలియకుండా పోయింది. పెద్ద, చిన్న బాస్లతో పాటు పొట్టిరవి పేరు చొప్పుకొని అనేక మంది తాడిపత్రిలో పేకాట, మట్కా డాన్లుగా ఎదిగారు. గతేడాది పక్కా సమాచారంతో తాడిపత్రిలో ఓ ఇంటిపై కడప సీఐ హమీద్ఖాన్ దాడిచేసి నిందితులను పట్టుకునేందుకు యత్నించాడు. పోలీసులనే తిప్పికొట్టే పనిలో భాగంగా సీఐ హమీద్ఖాన్తో పాటు మరో కానిస్టేబుల్పై దాడి చేయడంతో పాటు పోలీసులు వచ్చిన వాహనాన్ని తగలబెట్టించారు. తాడిపత్రిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల విషయం స్థానిక పోలీసులకు తెలిసినప్పటికీ వారి జోలికెళ్లే సాహసం చేయలేకపోయారు. ప్రబోధానంద కేసులో ఏకంగా పోలీసుస్టేషన్పైకే దాడికి యత్నించిన ఘటనలో పొట్టి రవి కీలకంగా వ్యవహరించాడు. సహకార ఉద్యోగి హత్య కుట్ర భగ్నం తాడిపత్రిలో ఇటీవల సహకార సొసైటీ ఉద్యోగి హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యకర విషయం తెలిసింది. హత్యకు యత్నించే ముందు దుండగులు ఎస్వీ రవీంద్రారెడ్డితో ఫోన్లో సంభాషించారు. తర్వాత తప్పించుకున్న విషయం కూడా తెలియపరిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఈ కేసులో పొట్టి రవి కూడా నిందితుడని తేలింది. దీంతో ఇటీవల ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నట్లు పోలీసువర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎస్వీ రవీంద్రారెడ్డిపై పీడీ యాక్టు తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవిపై పీడీ యాక్టు ప్రయోగించినట్లు పోలీసులు ప్రకటించారు. హత్యాయత్నం, దొమ్మి, మారణాయుధాలు కలిగి ఉండటం తదితర 11 కేసుల్లో ఎస్వీ రవీంద్రారెడ్డి నిందితుడుగా ఉన్నాడు. ఇతని నుంచి సమాజ ప్రశాంతతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పీడీ యాక్టుపై కడప సెంట్రల్ జైలుకు తరలించారు. రవీంద్రారెడ్డిపై నమోదైన కేసుల్లో కొన్ని.. 2003లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటన(క్రైం నెంబర్155/03,332,160 ఐసిఎస్). 2004లో ( క్రైం నెంబర్ 43/04,147, 148,324,332,435,27 ) ఆయుధ చట్టం కింద కేసు. 2015లో అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమలో సామగ్రిని ధ్వంసం చేసిన కేసులో హెడ్కానిస్టేబుల్ వన్నూర్రెడ్డి ఫిర్యాదు మేరకు(క్రైం నెంబర్ 246/15) రూరల్ పీఎస్లో కేసు. 2017లో తాడిపత్రి మండలం పెద్దపొలమడ గ్రామ సమీపంలో శ్రీ ప్రభోదాశ్రమానికి చెందిన ఓ ట్యాంకర్ను దగ్ధం చేసిన కేసులో ఎస్వీ రవీంద్రారెడ్డి నిందితుడు. శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్స్టేషన్లో (క్రైంనెంబర్292/17) కేసు నమోదు. 2018లో వినాయక చవితి నిమజ్జనోత్సవం సందర్భొంగా చెలరేగిన ఘర్షణల్లో వద్దిపాటి దేవేంద్ర ఫిర్యాదు మేరకు (క్రైం నెంబర్ 210/18) కేసు. ఈ ఘటనలో ఎస్వీ రవీంద్రారెడ్డిపై నాలుగు కేసులు నమోదు చేశారు.(క్రైం నెంబర్ 210, 211, 212, 227) 2019లో వీరాపురం గ్రామానికి చెందిన అనీల్కుమార్రెడ్డిపై హత్యాయత్నం కేసు(క్రైం నెంబర్ 182/19). -
ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు
సాక్షి, గోదావరిఖని : జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. రామగుండం అడిషనల్ డీసీపీ అశోక్కుమార్ కమిషనరేట్లో శనివారం వివరాలు వెల్లడించారు. రామగుండం మండలం రాయదండికి చెందిన గుమ్మాల వసంతకుమార్, ఓ మైనర్, పాత రామగుండం హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన పల్లికొండ సురేష్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఏడాది క్రితం మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో మోటార్ల దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. మహిళను కత్తితో బెదిరించి.. అంతకు పదినెలల ముందుగానే 2017నవంబర్లో పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దంపేట గ్రామశివారులో పత్తి చేనులో పత్తి తీస్తున్న విమలను బెదిరించి రూ.1.05 లక్షల విలువైన మూడు తులాల బంగారు పుస్తెలుతాడు చోరీచేశారు. అప్పటినుంచి అనుమానం రాకుండా సెంట్రింగ్ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని పగటిపూట ఆటోలో తిరుగుతూ.. పంటపొలాల్లో ఒంటరిగా ఉన్నమహిళలను టార్గెట్ చేసుకొని వారిని బెదిరించి దొంగతనాలు చేశారు. ఎఫ్సీఐ టౌన్షిప్లోని ఆలయం, టెలిఫోన్ కార్యాలయాల్లో సైతం చోరీలకు పాల్పడ్డారు. దొంగతనం చేసిన సొత్తును అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవారు. శనివారం సీఐ బుద్దస్వామి, అంతర్గాం ఎస్సై రామకృష్ణ, సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లు బి–పవర్హౌస్ వద్ద ఆకస్మికంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఈ ముగ్గురు పట్టుపడ్డారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు.మూడు తులాల బంగారు పుస్తెలుతాడు రికవరీ చేశారు. నిందితులపై పీడీయాక్టు.. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు అడిషనల్ డీసీపీ వెల్లడించారు. మైనర్ను జూవైనల్ హోంకు తరలిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన సీసీఎస్ సీఐలు ఎ.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్రావు, ఎస్సైలు మంగిలాల్, నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి, కానిస్టేబుళ్లు దేవేందర్, సుధాకర్, శ్రీనివాస్, అలెక్స్, రవి, రమేష్లను అడ్మిన్ డీసీపీ అభినందించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, సీఐలు బుద్దె స్వామి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్రావు, ఎస్సై రామక్రిష్ణ పాల్గొన్నారు. -
రౌడీ షీటర్లపై నిఘా
సాక్షి, అనకాపల్లి (విశాఖపట్నం) : త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలు, పట్టణాల్లో ఉండే రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ చెప్పారు. అనకాపల్లిలోని కొత్తూరు మహార్షి ఫంక్షన్ హాల్లో పోలీస్సబ్ డివిజన్ పరిధిలో అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నేరాల సంఖ్యను తగ్గించామన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్కు పాల్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. అలాగే ప్రస్తుతం ఎక్కువగా గొడవలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై రౌడీ షీట్ నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది వేసవిలో చోరీలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో క్రైం రేటు తగ్గించగలిగామన్నారు. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారించేందుకు ఆర్అండ్బీ, రవాణాశాఖ, వివిధశాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మావోస్టుల ప్రభావం ఏజెన్సీ ప్రాంతంలో తగ్గుముఖం పట్టిందని, గతంలో గిరిజనులు వారికి ఆశ్రయం ఇచ్చేవారని, ఇప్పడు ఆ పరిస్థితి లేకుండాపోయిందన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందాలని రోడ్లు, సెల్టవర్లు ఏర్పాట్లు చేసేందుకు సహకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. బెల్ట్షాపులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, అటువంటి వారు తరుచూ ఏర్పాటు చేసినట్లయితే పీడీ యాక్టులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న పాత నేరస్తులపై ఎప్పటికప్పుడు దృష్టిపెడుతూ, ఎక్సైజ్ శాఖతో చర్చిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎస్.వి.వి.ప్రసాదరావు, సీఐలు కిరణ్కుమార్, తాతారావు, రామచంద్రరావు, శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
తప్పును కప్పిపుచ్చుకునేందుకు పీడీ యాక్టా?
సాక్షి, హైదరాబాద్: ఓ కేసులో నిందితుడిని తీవ్రంగా గాయపరిచిన పోలీసులు, దానిని కప్పిపుచ్చుకునేందుకు అతనిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. అతన్ని వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించే వెసులుబాటును బాధితునికి ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తన సోదరుడు శీలం వినయ్కుమార్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ శీలం రవికుమార్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.మోహనారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఓ కేసుకు సంబంధించి వినయ్కుమార్ని పోలీసులు గత ఏడాది అక్టోబర్ 8న అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. మాదాపూర్ ఎస్ఐ రామకృష్ణ, సీఐ నాగేశ్వరరావులు కలిసి వినయ్ను కొట్టారని, దీంతో ప్రస్తుతం అతను కూర్చునే, నిలబడే పరిస్థితిలో కూడా లేడని ఆమె వివరించారు. అతను తీవ్ర హింసకు గురైనట్లు నిమ్స్ వైద్యులు సైతం ధ్రువీకరించారని తెలిపారు. దీంతో పోలీసులు వినయ్పై పలు కేసులున్నాయని పేర్కొంటూ పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారని తెలిపారు. దీనిని సమర్థిస్తూ హోంశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం, పోలీసుల తీరును తప్పుపట్టింది. ఒక్క కేసు ఉన్న వ్యక్తిపై పలు కేసులున్నట్లు పేర్కొంటూ పీడీ చట్టం కింద ఉత్తర్వులు జారీ చేయడం సమంజసం కాదని తేల్చింది. -
టార్గెట్ సెల్ఫోన్స్!
సాక్షి, సిటీబ్యూరో: అతనో రౌడీషీటర్ నగర పోలీసులు రెండుసార్లు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు... అయినా పంథా మార్చుకోని అతను మరో ముగ్గురితో కలిసి దృష్టి మళ్లించి సెల్ఫోన్లు తస్కరించడం మొదలెట్టాడు. ఇటీవల కాలంలో మొత్తం ఐదు చోరీలు చేసిన ఈ ముఠాలో ముగ్గురిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం పటుకున్నారు. వీరి నుంచి 11 సెల్ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్రావు తెలిపారు. యాకత్పురకు చెందిన మహ్మద్ పర్వేజ్ అలియాస్ ఫర్రు వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. దురలవాట్లకు బానిసైన అతను నేరాలు చేయడం మొదలెట్టాడు. హత్య, హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద నమోదైన వాటితో సహా మొత్తం 24 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉండటంతో రెయిన్బజార్ పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ఇతడి నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం 2015, 2017ల్లో పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఈ రెందు సందర్భాల్లోనూ ఏడాది చొప్పున జైల్లో ఉండి బయటకు వచ్చిన ఇతను సైనిక్పురికి మకాం మార్చాడు. మురాద్నగర్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్, చిలకలగూడ వాసి మహ్మద్ నదీమ్లతో పాటు గౌస్తో ముఠా కట్టాడు. వీరిలో నేరచరితుడైన ఇమ్రాన్పై మూడు కేసులు ఉన్నాయి. పర్వేజ్ పరిచయస్తులైన ఆటో యజమానుల నుంచి వాహనాన్ని అద్దెకు తీసుకునేవాడు. తాను ఆటోడ్రైవర్గా నటిస్తూ తన ముగ్గురు అనుచరులను ప్యాసింజర్ల మాదిరిగా వెనుక కూర్చోబెట్టుకుంటాడు. సికింద్రాబాద్ బస్టాండ్, రైల్వేస్టేషన్లతో పాటు మెహదీపట్నం బస్టాండ్లలో మాటు వేసూ ఈ ముఠా ఒంటరి ప్రయాణికుల్ని ఎంపిక చేసుకుని వారు వెళ్లాల్సిన గమ్యాలను చేరుస్తామని ఎర వేసి ఎక్కించుకుంటుంది. ఆటో కాస్త ముందుకు వెళ్లిన తర్వాత ప్రయాణికుడి దృష్టి మళ్లించే నిందితులు అతడి సెల్ఫోన్ కాజేస్తారు. ఆపై తమకు వేరే పని ఉందంటూ మార్గమధ్యంలో ఆ ప్రయాణికుడిని దింపేసి.. అతడు సెల్ఫోన్ పోయిన విషయం గుర్తించేలోపే వేగంగా ఉడాయిస్తారు. ఈ గ్యాంగ్ ఇటీవల కాలంలో ఇదే తరహాలో మహంకాళి, గోపాలపురం. ఆసిఫ్నగర్, బంజారాహిల్స్, రాయదుర్గం ఠాణాల పరిధిలో 11 సెల్ఫోన్లు చోరీ చేశారు. వీటిని అమ్మగా వచ్చిన మొత్తాన్ని అంతా పంచుకుని జల్సాలు చేస్తుంటారు. ఈ తరహా ఫిర్యాదులు వరుసగా అందడంతో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా అనుమానితులను గుర్తించారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.పరమేశ్వర్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ తమ బృందాలతో వలపన్నారు. సికింద్రాబాద్లోని 31 బస్టాప్ వద్ద గౌస్ సహా మిగిలిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును మహంకాళి పోలీసులకు అప్పగించారు. -
‘పీడీ’కిలి బిగిసింది
రాష్ట్రంలో క్రైమ్రేటు తగ్గుదలలో పీడీ యాక్ట్ బాగా ఉపకరించింది. సాధారణ దొంగలు, రౌడీషీటర్లు, పదే పదే లైంగిక వేధింపులకు గురిచేస్తున్నవారు తదితర నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీనివల్ల వ్యవస్థీకృత నేరాల్లో తగ్గుదల కనిపించినట్టు డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. పీడీ యాక్ట్ కింద కేసులు మోపబడిన వారు చేసే నేరాల్లో గతేడాదికి ఇప్పటికీ 37% క్రైమ్ రేటు తగ్గుదల కనిపించిందని వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2018 డిసెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,199 మంది నేరస్థులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. – సాక్షి, హైదరాబాద్ ఒత్తిడి ఉన్నా తగ్గేది లేదు... ఈ మొత్తం నేరాల్లో కొంతమంది రాజకీయ నాయకుల అనుచరులు కూడా ఉండటంతో వారిపై పీడీ యాక్ట్ అమలు చేయకుండా పోలీస్శాఖపై మొదట్లో ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదేశాలతో పోలీస్ ఉన్నతాధికారులు కేసుల నమోదుకు వెనుకాడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేరాల నియంత్రణలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదన్న వైఖరితో పీడీ యాక్ట్ అమలు చేశారు. పీడీ యాక్ట్ మోపబడినవారిలో ముగ్గురు లైంగిక వేధింపులకు గురిచేసిన వారుండటం సంచలనం రేపుతోంది. షీ టీమ్స్ ద్వారా ఈవ్టీజింగ్, లైంగిక వేధింపుల నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్శాఖ చర్యలు చేపడుతోంది. మొదటిసారి పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్ ఇస్తుండగా, రెండోసారి పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్, వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. మూడోసారి పట్టుబడితే ఏకంగా కేసు నమోదు చేసి రిమాండ్ చేస్తున్నారు. ఇన్ని చేసినా నాలుగోసారి పట్టుబడుతున్న వారిని పీడీ యాక్ట్కు సిఫారసు చేసినట్టు స్పష్టమవుతోంది. పదే పదే అదే నేరానికి పాల్పడితే ఉపేక్షించకుండా పీడీ యాక్ట్ అమలు చేస్తున్నామని ఐజీ స్వాతి లక్రా స్పష్టం చేశారు. నేరాలను బట్టి చూస్తే... రౌడీషీటర్లు–129, బూట్ లెగ్గర్– 18, అనైతిక కార్యకలాపాల నేరాలు–67, డ్రగ్ సరఫరా నేరస్థులు–42, మోసపూరిత వ్యక్తులు–62, పీడీఎస్ బియ్యం దొంగలు–17, మత ఘర్షణ, సంబంధిత నేరస్థులు– 2, డెకాయిటీస్–13, రాబరీ నేరస్థులు–55, దోపిడీ దొంగలు–202, చైన్స్నాచర్లు–122, దృష్టి మరల్చే దొంగలు–98, గూండాలు–34, లైంగిక వేధింపుల నిందితులు–3, ఆర్థిక నేరస్థులు–15, వాహనాల దొంగలు–2, ఇతర సాధారణ నేరస్థులు–57.. మొత్తం 1,199 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. అటవీ శాఖ కూడా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటకు పాల్పడే వారిపై అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అక్రమ కలప రవాణాతో ముడి పడిన వివిధ అంశాలపై జిల్లాల్లో పోలీసు అధికారు లతో కలిసి అటవీశాఖ సంయుక్తంగా అమలుచేస్తున్న కార్యా చరణ కారణంగా ఇప్పటికే 200 కేసులకు పైగా నమోదు చేశారు. వివిధ జిల్లాల్లో దాదాపు రూ. 40–50 లక్షల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా కలప స్మగ్లింగ్కు పాల్పడుతున్న 500మంది బడా స్మగ్లర్లను అటవీ అధి కారులు గుర్తించారు. కలప అక్రమ రవాణాపై సాగిస్తున్న ప్రత్యేక కార్యాచరణను ఈ నెలాఖరు వరకు కొనసాగించ నున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. ఆ తర్వాత కూడా నిరంతర నిఘా కొనసాగుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా వారిపై పీడీయాక్ట్ సహా కఠినమైన చట్టాల ప్రయోగానికి ఆ శాఖ సిద్ధమవుతోంది. కఠిన శిక్షలు అమలు..: తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా ఆదిలాబాద్, నాగర్కర్నూలు తదితర జిల్లాల్లో దాదాపు 20 మంది స్మగ్లర్లపై పీడీయాక్ట్ ప్రయోగానికి అనువుగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు, మూడురోజుల వ్యవధిలోనే పలువురిపై పీడీయాక్ట్ కింద కేసు నమోదుచేసి, ఏడాదిపాటు బెయిల్ దొరకని విధంగా శిక్ష విధించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. స్మగ్లింగ్కు పాల్పడుతున్న వారిపైనే కాకుండా వారి వెనక ఉండి ప్రోత్సహించే వారిని కూడా పీడీ యాక్ట్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. కలప స్మగ్లింగ్ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు పీసీసీఎఫ్ (విజిలెన్స్) రఘువీర్ సాక్షికి తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా నిరంతర నిఘాతోపాటు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
క్రైమ్స్ డౌన్
సాక్షి, సిటీబ్యూరో: సిటీ కమిషనరేట్ పరిధిలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. వీటిని కొలిక్కి తేవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి. పీడీ యాక్ట్ ప్రయోగం వంటి చర్యలతో నేరగాళ్ల దూకుడుకు కళ్లెం పడింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే అన్ని రకాల నేరాలూ సరాసరి ఆరు శాతం తగ్గాయి. తీవ్రమైన నేరాల్లో పోలీసులు 92 శాతం రికవరీ సాధించారు. వరకట్న మరణాలు నగరంలో 38 శాతం నమోదు కాగా, మహిళలపై జరిగే దాడులు కూడా తగ్గాయి. హత్య కేసులు మాత్రం గత ఏడాదికంటే 8 శాతం పెరిగాయి. బుధవారం చౌమొహల్లా ప్యాలెస్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కొత్వాల్ అంజనీ కుమార్ 2018 నేర గణాంకాలను విడుదల చేశారు. ప్రతి అంకంలోనూ టెక్నాలజీ వినియోగం... నేరాలు కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాల కీలకపాత్ర... నేరాలు నిరోధించడంలో పీడీ యాక్ట్ ప్రయోగం వంటి చర్యలు... వెరసి నగరంలో నేరాలు నమోదు గణనీయంగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే అన్ని రకాలైన నేరాల్లోనూ కలిపి సరాసరిన ఆరు శాతం తగ్గుదల నమోదు చేసుకుంది. సొత్తు సంబంధం నేరాలు 20.5 శాతం తగ్గాయి. తీవ్రమైన నేరాల్లో రికవరీ 92 శాతానికి చేరుకుంది. వరకట్న చావుల్లో 38 శాతం తగ్గుదల కనిపించడంతో పాటు మహిళలపై నేరాలు సైతం తగ్గాయి. కేవలం హత్య కేసులు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 8 శాతం పెరిగాయి. పాతబస్తీలోని చౌమొహల్లా ప్యాలెస్లో బుధవారం నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించిన కొత్వాల్ అంజనీ కుమార్ ఆ గణాంకాలను విడుదల చేశారు. కోర్టుల్లో కేసుల నిరూపణ సైతం 10 శాతం పెరిగి 34కి చేరిందని తెలిపారు. ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యల కారణంగా నగరంలో మరణాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు సరాసరి వేగం గంటలకు 18 నుంచి 25 కిమీకి చేరిందని వివరించారు. ఈ ఏడాది కొత్తగా సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, వెరీ ఫాస్ట్ యాప్, ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్, ఉమెన్ ఆన్ వీల్స్ (వావ్) బృందాలను రంగంలోకి దింపారు. ‘ఈ ఏడాది సాధించిన విజయాలపై నేను మాట్లాడుతున్నా... అవి సాధించడంలో కొత్వాల్ నుంచి కానిస్టేబుల్ వరకు అహర్నిశలు శ్రమించారు’ అని అంజనీకుమార్ పేర్కొన్నారు. ‘ఫోర్స్’ చూపిన ‘టాస్క్’... నగర పోలీసు కమిషనర్ టాస్క్ఫోర్స్లో ప్రస్తుతం డీసీపీ, అదనపు డీసీపీలతో పాటు ఐదు జోన్లకు ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. కేసుల్ని కొలిక్కి తీసుకురావడంతో పాటు ఇతర రాష్ట్రాల ముఠాలను చెక్ చెప్పడంతో వీటిది ప్రత్యేక పాత్ర. సిటీలో నమోదైన భారీ, సంచలనాత్మక నేరాల్లో దాదాపు 80 శాతం ఈ టీమ్స్ ద్వారానే కొలిక్కి వచ్చాయి. ఈ ఏడాది టాస్క్ఫోర్స్ టీమ్స్ 20 హత్య, 54 దోపిడీ, 4 బందిపోటు దొంగతనం, 100 చోరీలు, 33 స్నాచింగ్స్, 29 దాడులు, 63 డ్రగ్ కేసుల్లో నిందితుల్ని పట్టుకున్నాయి. 54 క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై దాడులు చేసి 101 మందిని అరెస్టు చేశాయి. ఇతర నేరాల్లో 85 మందిని పట్టుకున్నాయి. 107 చీటింగ్ కేసుల్లో 121 మందిని అరెస్టు చేశాయి. వీటితో పాటు పెండింగ్లో ఉన్న 103 నాన్–బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేశాయి. -
‘పీడీ’తో పరార్!
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్ పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో ఐదు నెలలుగా పరారీలో ఉన్న ఘరానా దొంగను ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఓసారి ఈ యాక్ట్ కింద ఏడాది జైల్లో ఉన్నా ఇతడిలో మార్పు రాలేదని అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెందిన మహ్మద్ మన్సూర్కు కాలా కవ్వా, దేవ వంటి మారుపేర్లూ ఉన్నాయి. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన అతను కొన్నేళ్లుగా చోరీలు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ఇతడిపై 2015 నాటికే 32 కేసులు నమోదయ్యాయి. వీటిలో సెల్ఫోన్ స్నాచింగ్, అక్రమాయుధాలతో సంచరించడం, సెల్ఫోన్స్ చోరీ వంటివి ఉన్నాయి. దీంతో నగర పోలీసులు 2015లో పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. ఏడాది పాటు కటకటాల్లో ఉండి బయటకువచ్చినా ఇతడి వైఖరిలో మార్పు రాలేదు. మళ్లీ పాత పంథానే అనుసరించడంతో గత ఏడాది మరోసారి అరెస్టయ్యాడు. తాజాగా అఫ్జల్గంజ్, చాదర్ఘాట్, చార్మినార్, మలక్పేట ఠాణాల్లో మరో 10 నేరాలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు మరోసారి ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ ఉత్తర్వులు అతడికి చేరేలోగా బెయిల్పై బయటికి వచ్చిన మన్సూర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతడి కోసం రంగంలోకి దిగిన ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు పి.రమేష్, జి.శ్రీనివాస్రెడ్డి, గోవిందు స్వామి, సి.వెంకటేష్ ముమ్మరంగా గాలించి శుక్రవారం పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. -
‘ప్రణయ్’ నిందితులపై పీడీ యాక్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసు నిందితులపై పీడీ యాక్ట్ మోపాలని పోలీస్శాఖ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నులపై నల్లగొండ ఎస్పీ రంగనాథ్తో వెస్ట్జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ కేసులో ఉన్న నిందితుల నేరచరిత్ర వెలుగులోకి తీసుకురావడంతో పాటు పాత నేరాల ఆధారంగా వారిపై పీడీ యాక్ట్ మోపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు ప్రణయ్ భార్య అమృతకు సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపులపై స్టీఫెన్ రవీంద్ర ఆరా తీశారు. అమృతను బెదిరిస్తున్న వారి సోషల్మీడియా ఖాతా వివరాలు తెలుసుకోవటంతో పాటు హంతకులతో వారికేమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో దర్యా ప్తు చేపట్టాలని ఐజీ ఆదేశించినట్లు తెలిసింది. బెదిరింపుల వ్యవహారంపై ఇప్పటికే అమృత పోలీసులకు ఫిర్యాదు చేసిందని, దీంతో ఆమెకు భద్రతగా ఇద్దరు సాయుధ సిబ్బందితో పాటు ఇద్దరు మహిళా పోలీసుల్ని కూడా నియమించినట్లు నల్లగొండ పోలీసులు తెలిపారు. ఆమెకు వస్తున్న బెదిరింపులు, భద్రత వ్యవహారలపై ఎప్పటికప్పుడు నిఘా విభాగం అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
మహిళల అక్రమ రవాణా.. దంపతులపై పీడీ యాక్ట్
నాగోలు: మహిళలను అక్రమ రవాణా చేస్తూ వ్యభిచార గృహాలకు తరలిస్తున్న ఇద్దరి నిందితులపై రాచకొండ పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెస్ట్ బెంగాల్, కోల్కతా ప్రాంతానికి చెందిన బెనిడ్ వర్మా ఆలియాస్ షేక్ మిజాన్ (35) ఇతడి భార్య షేక్ నియాల్ఫా అలియాస్ లీలా(35) ఇద్దరు కలిసి నగరానికి వచ్చి నేరెడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చంద్రగిరి కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొంత కాలం వివిధ కంపెనీల్లో పనిచేసినా సరిపడా డబ్బులు రాచపోవడంతో వ్యభిచార దందాను నిర్వహించాలనుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి బాలికలను, మహిళలను నెల జీతం లెక్కన తీసుకువచ్చి నగరంలో వ్యభిచార దందాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వర్మను 2014లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. గత నెల 17న నేరెడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయగా ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలు పట్టుబడ్డారు. దీంతో వీరిని నేరెడ్మెట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జైలులో ఉన్న వీరిపై కమిషనర్ పీడీయాక్ట్ నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
అసలు సూత్రధారులు ఎవరు?
-
మైనర్లకు ‘ఇంజెక్షన్’ ఇస్తున్నదెవరు?
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో వ్యభిచార వృత్తి నివారణకు రాచకొండ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బలవంతంగా.., బతుకుదెరువు కోసం.. ఇలా పలు రకాల్లో జరుగుతున్న వ్యభిచార వృత్తికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు నీరుగారిపోతున్నాయి. ఈ వృత్తి కోసం బాలికల అక్రమ రవాణాను ఎంచుకున్నారన్న విషయం బయటపడటంతో పోలీసు యంత్రాంగం కంగుతింది. ప్రస్తుతం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడంపై పోలీసులు దృష్టిపెట్టారు. కాగా, యాదగిరిగుట్టలో తరచూ పోలీసులు కార్డన్ సెర్చ్, ఇతరత్రా తనిఖీలు చేస్తున్నా ఇలాంటి అమానుష సంఘటన వెలుగు చూడటం నిఘా సంస్థల వైఫల్యమేనని విమర్శలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం పట్టుబడిన వ్యక్తి ద్వారా బాలికల అక్రమ రవాణా విషయం వెలుగు చూసినప్పటికీ దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకపోవడం వల్లే అది కొనసాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న దందాను అరికట్టడానికి ఇప్పటికే పలువురిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. అయినా అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండటం వెనుక గల వైఫల్యాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ డాక్టర్ ఎవరు? పలు ప్రాంతాల నుంచి సుమారు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను యాదగిరిగుట్ట పట్టణానికి తీసుకువస్తున్నారు. వీరిని త్వరగా వ్యభిచార వృత్తిలో దింపడానికోసం నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ముందుగా ఇతరులకు అనుమానం రాకుండా స్థానికంగా బాలికలను చదివించి, వారికి 12 సంవత్సరాలు రాగానే శరీర పెరుగుదలకు ఇంజెక్షన్లు ఇస్తున్న విషయాన్ని రాచకొండ సీపీ మహేష్భగవత్ వెల్లడించారు. కాగా, వ్యభిచార గృహాలతో సంబంధం పెట్టుకున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడు రూ.20 వేల నుంచి రూ.50 వేలు తీసుకుని 12 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇంజెక్షన్ ఇవ్వడంవల్ల చిన్న వయసులో ఉన్న పిల్లలు యుక్తవయసు ఉన్న అమ్మాయిల్లా కనిపించడంతో పాటు వారి శరీర ఎదుగుదలలో కూడా భారీ మార్పులు వస్తాయి. అసలు ఈ ఇంజెక్షన్ ఇస్తున్న వైద్యుడు యాదగిరిగుట్టకు చెందిన వ్యక్తా లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇస్తున్నాడా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వైద్యుడిని పట్టుకుని విచారిస్తే ఇప్పటి వరకు ఎంత మందికి ఇంజెక్షన్లు ఇచ్చారనేది తేలుతుందని అంటున్నారు. అసలు సూత్రధారులు ఎవరు? చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నది ఎవరు? అనే అంశం పోలీసులను వెంటాడుతోంది. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరుగుతున్న వ్యభిచార నిర్మూలన ఒక్కరోజుతో అంతమయ్యేది కానప్పటికీ నివారణ కోసం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడంలేదు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన శంకర్ అనే వ్యక్తికి చిన్నారుల అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్లు 2015లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కేసు నమోదైంది. శంకర్తో పాటు కంసాని యాదగిరి అనే వ్యక్తి పేరు కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. యాదగిరి, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట శివారులో వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తుంటాడు. ఇప్పటివరకు ఇక్కడి ప్రజలకు ఈ విషయం మాత్రమే తెలుసు. కానీ శంకర్తో పాటు యాదగిరి సైతం చిన్నారుల అక్రమ రవాణాలో ప్రధాన వ్యక్తి అని తాజా విచారణలో తెలిసింది. ఇదిలా ఉండగా శంకర్ గత ఏడాది క్రితమే మరణించగా ఇటీవలనే పీడీ యాక్టు కింద యాదగిరి జైలులో ఉన్నాడు. చిన్నారుల అక్రమ రవాణా గుట్టు తెలియాలంటే యాదగిరిని విచారించాలని పలువురు అంటున్నారు. అంతేకాకుండా చిన్నారిని ఇబ్బందులకు గురిచేసిన కంసాని కల్యాణికి సంబంధించిన ఓ వ్యక్తికి సైతం అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మూడున్నర ఏళ్ల క్రితమే చర్యలు తీసుకుని ఉంటే.. మూడున్నర ఏళ్ల క్రితమే సికింద్రాబాద్లో నమోదైన కేసు నేపథ్యంలో అక్రమ రవాణా ముఠాపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత దారుణాలు జరిగేవి కాదని వివిధ స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. యాదగిరిగుట్ట కేంద్రంగా సాగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యాపారానికి చెక్ పెట్టాలంటే వ్యభిచార గృహాల నిర్వాహకులకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని ఆ సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. పోలీసుల అదుపులో ఆర్ఎంపీ డాక్టర్? వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జీల నిర్వాహకులపై రౌడీషీట్ సాక్షి, యాదాద్రి: బాలికలు త్వరగా యుక్త వయసులోకి రావడానికి ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు ఇచ్చాడనే అనుమానంతో యాదగిరిగుట్టకు చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాలికలను కొనుగోలు చేసి వ్యభిచార వృత్తిలోకి దించుతున్న నిర్వాహకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 11మంది బాలికలను కాపాడిన నేపథ్యంలో వారికి ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. దీంతో వ్యభిచారం నిర్వహిస్తున్నవారితో సంబంధాలు కలిగి ఉన్న ఆర్ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకుని నిజానిజాలు తెలుసుకోవడానికి అతడిని విచారిస్తున్నట్లు తెలిసింది. ఎంత మంది పిల్లలకు ఇంజక్షన్లు ఇచ్చారు, ఈ దారుణం వెనుక ఎవరెవరి హస్తం ఉంది, ఏ మేరకు డబ్బులు చేతులు మారుతాయి.. వంటి పలు అంశాలపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా పోలీసులు మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. లాడ్జీలపై నిఘా తీవ్రతరం యాదగిరిగుట్ట, వడాయిగూడెం, భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల్లో గల లాడ్జీలు, రిసార్ట్స్లపై దాడులు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించిన కొన్ని లాడ్జీలను సీజ్ చేయడంతోపాటు నిర్వాహకులపై ఇప్పటికే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. రెండు కంటే ఎక్కువసార్లు కేసులు నమోదైన వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇళ్ల మధ్య గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని కూడా గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు -
ఇద్దరు దొంగలపై పీడియాక్ట్ నమోదు
రాజేంద్రనగర్ రంగారెడ్డి : వరుస దొంగతనాలకు పాల్పడుతూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఇద్దరు దొంగలపై సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. గత నెలలో మైలార్దేవ్పల్లి పోలీసులకు చిక్కిన ఇద్దరిపై మొదటిసారిగా పీడీ యాక్ట్ను ప్రయోగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని అప్కోకాలనీలో సతీష్ ఉత్తమ్కుమార్ రాథోడ్(24), కేతావత్ రాజు(25)లు నివసిస్తున్నారు. రాథోడ్ ప్రైవేటు డ్రైవర్ కాగా, రాజు కూలి పని చేస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో ఆదర్శ్నగర్కాలనీ, ముస్తాఫానగర్, టీఎన్జీఓస్ కాలనీ, టాటానగర్, మధుబన్కాలనీలలో సంచరిస్తూ ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవారు. అనంతరం ఇళ్లల్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను తస్కరించేవారు. కేవలం మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని 8 దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనమే వృత్తిగా ఎంచుకున్న వీరు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం తిరిగి ఇదే దందాను కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులతో పాటు స్థానికులకు కంటినిద్ర కరువైంది. గత నెల 7వ తేదీన మైలార్దేవ్పల్లి పోలీసులకు నిందితులిద్దరూ పట్టుబడ్డారు. ఆ సమయంలో వారి నుంచి రూ.13 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటు సెల్ఫోన్, నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై సైబరాబాద్ కమిషనర్ శుక్రవారం పీడీ యాక్ట్ను ప్రయోగించారు. -
దొంగలపై పీడీయాక్ట్ నమోదు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేశారు. నాందేడ్కు చెందిన సతీష్ ఉత్తమ్ కుమార్, కేతవాద్ రాజులు నగరంలోని రాజేంద్ర నగర్ ఆప్కో కాలనీలో నివసిస్తున్నారు. సతీష్ డ్రైవర్గా పనిచేస్తుండగా.. కేతవాద్ రాజు కూలీగా పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి రాత్రి వేళలో సంచరిస్తూ.. మారడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆప్కో, ఆదర్శ్, ముస్తఫా నగర్, టీఎన్జీవో, టాటా నగర్, మదుబాన్ కాలనీల్లో తాళాలు వేసిన ఎనిమిది ఇళ్లలోకి చోరబడి 13 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను దొంగలించారు. పగలు రిక్కీ నిర్వహించి రాత్రి వేళలో చోరీలకు తెగబడే వీరిని శుక్రవారం మారేడ్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరికి నేరచరిత్ర ఉండటంతో పీడీయాక్ట్ నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
సిటీ పోలీసులకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: అయూబ్ఖాన్ అనే వ్యక్తిపై పీడీ యాక్ట్ ప్రయోగించిన హైదరాబాద్ సిటీ పోలీసులకు హైకోర్టులో చుక్కెదురైంది. అయూబ్ఖాన్పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గతేడాది జనవరి 25న జారీ చేసిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి మార్చి 24న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టే సింది. న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కెయిత్, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్రావుల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. తన తండ్రి అయూబ్ఖాన్పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను, వాటిని సమర్థిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి జారీ చేసిన ఉత్తర్వులనూ కొట్టేయాలని కోరుతూ షాబాజ్ అనే వ్యక్తి హైకోర్టులో గతేడాది పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కెయిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాదులు సి.వి.మోహన్రెడ్డి, బి.మోహనారెడ్డి వాదనలు వినిపించారు. పీడీ యాక్ట్ ఉత్తర్వులు, వాటిని సమర్థిస్తూ జారీ అయిన ఉత్తర్వులు ఇంగ్లిష్లోనే ఉన్నాయని, కాని అయూబ్ఖాన్ మాతృభాష ఉర్దూ అని వారు కోర్టుకు వివరించారు. నిబంధనల ప్రకారం నిర్బంధానికి గురైన వ్యక్తికి తెలియని భాషలో ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇంగ్లిష్రాని అయూబ్ఖాన్ తన నిర్బంధంపై ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించుకునే అవకాశం కోల్పోయారని, ఇది అతని హక్కులను హరించడమేనని వివరించారు. 27.2.17న సలహా బోర్డు ముందు అయూబ్ఖాన్ను ప్రవేశపెట్టిన అధికారులు, మార్చి 3న అతనికి ఉర్దూలో నిర్బంధ ఉత్తర్వులు అందజేశారని కోర్టుకు నివేదించారు.