-
ఆ టోర్నీ కోసం పాక్కు టీమిండియా...?
-
IND Vs PAK: ఈసీబీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన బీసీసీఐ!
క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్లకు ఎనలేని క్రేజ్ ఉంటుదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు మాత్రం జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఐసీసీ, ఆసియా కప్ లాంటి మేజర్ టోర్నీల్లో తప్ప పెద్దగా మ్యాచ్లు ఆడలేదు. అందుకే భారత్, పాక్ మ్యాచ్కు అంత క్రేజ్ ఉంటుంది. ఇక అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్లో ఈ చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడనున్నాయి. ఆ మ్యాచ్ కోసం ఇరుదేశాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా టీమిండియా, పాకిస్తాన్లు ఒప్పుకుంటే మా దేశంలో ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు సిద్ధమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే ఈసీబీ ప్రతిపాధించింది వన్డేలు, టీ20లు కాదు. ఐదు రోజుల పాటు జరిగే టెస్టు సిరీస్ కోసం. బీసీసీఐ, పీసీబీ ఒప్పుకుంటే తమ దేశంలో ఇండియా-పాక్ లతో మూడు టెస్టులు ఆడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈసీబీ ప్రతిపాదించింది. కానీ ఈసీబీ ప్రతిపాదనను ఇరు దేశాల బోర్డులు తిరస్కరించినట్టు సమాచారం. తటస్థ వేదికపై ఇండియా-పాక్ టెస్టు మ్యాచ్ లు జరిపించాలన్న ఆలోచన తమకు లేదని.. ఆడితే ఇండియాలో అయినా లేదంటే పాకిస్తాన్ లో ఓకే గానీ టెస్టులను కూడా ఇతర దేశాలలో తాము ఆడబోమని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తున్నది. ఇక సుమారు 17 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి తర్వాత సుమారు పదేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు లేక అల్లాడిన పాకిస్తాన్ కు ఇప్పుడిప్పుడే విదేశీ జట్లు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా రాగా ఇప్పుడు ఇంగ్లండ్ పాక్ పర్యటనకు వచ్చింది. టి20 సిరీస్ ముగిశాక డిసెంబర్లో ఇంగ్లండ్ టెస్టులు ఆడేందుకు మరోసారి పాక్కు రానుంది. ఈ సిరీస్ చర్చ సందర్బంగానే ఈసీబీ పీసీబీ ఎదుట ప్రతిపాదనను తెచ్చినట్టు సమాచారం. ఇంగ్లండ్లో దక్షిణాసియా వాసులు అధికంగా ఉన్నారని.. తద్వారా అక్కడ ఇండియా-పాకిస్తాన్ టెస్టు సిరీస్ సూపర్ హిట్ అవుతుందని ఈసీబీ భావిస్తున్నది. మరోవైపు బీసీసీఐ కూడా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ''ఇండియా-పాక్ సిరీస్ గురించి ఈసీబీ మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది. పాకిస్తాన్తో మ్యాచ్లు అంటే అది బీసీసీఐ పరిధిలో లేదు. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఇప్పటివరకైతే ఇండో-పాక్ ద్వైపాక్షిక సిరీస్ గురించి మా వైఖరిలో మార్పు లేదు. పాకిస్తాన్తో ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లో మాత్రమే ఆడతాం'' అని కుండబద్దలు కొట్టాడు. భారత్-పాకిస్తాన్ లు చివరిసారిగా 2007లో టెస్టు సిరీస్ ఆడాయి. ముంబై ఉగ్రదాడుల తర్వాత ఈ రెండు దేశాల మధ్య దూరం నానాటికీ పెరుగుతున్నది. -
'అక్క మరణం నా జీవితాన్ని తలకిందులు చేసింది'
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షాన్ మసూద్ దాదాపు ఆరు నెలల తర్వాత పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్టు ఓపెనర్గా ముద్రపడిన షాన్ మసూద్ ఇంతకాలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. తన కెరీర్లో ఒక్క టి20 మ్యాచ్ ఆడని షాన్ మసూద్ను పీసీబీ ఏకంగా ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్కు ఎంపికచేసింది. గాయంతో బాధపడుతున్న ఫఖర్ జమాన్ స్థానంలో షాన్ మసూద్ను ఎంపిక చేసింది. 2013లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షాన్ మసూద్ ఇప్పటివరకు 25 టెస్టులాడి 1378 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఆరు అర్థసెంచరీలు ఉండడం విశేషం. కాగా టి20 ప్రపంచకప్కు ఎంపిక చేయడంపై షాన్ మసూద్ శనివారం స్పందించాడు. ''పాక్ జట్టుకు ఆడని కాలంలో చాలా విషయాలు తెలుసుకున్నా.. ఒక వ్యక్తిగా, ఆటగాడిగా చాలా ఎదిగాననిపిస్తుంది. క్రికెట్ కంటే జీవితంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉంటాయని తెలుసుకున్నా. మన ఆత్మీయులను పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ మనకు తెలుస్తుంది. అది నేను అనుభవించా. ఈ ఏడాది మా అక్క మరణం నా జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె మరణంతో ఒక్కసారిగా అంతా కోల్పోయానన్న భావన కలిగింది. కానీ దేశం కోసం మనకిష్టమైన ఆట ఆడినప్పుడు విఫలం కంటే సఫలం ఎక్కువగా ఉంటుందని అక్క చెప్పిన మాటలు మనసులో ఉంచుకున్నా. జట్టులో ఎంపికవుతామా అన్న విషయాన్ని పక్కనబెట్టి రాణిస్తే ఫలితాలు వెతుక్కుంటూ వస్తాయని నా విషయంలో నిరూపితమైంది. ఇక జట్టులోకి తిరిగి రావడం సంతోషమనిపించింది. జట్టులో నా పాత్రను సమర్థంగా పోషిస్తానని అనుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్ ఏడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడనుంది. ఇది ముగిసిన అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లనున్న పాకిస్తాన్ టి0 ప్రపంచకప్లో ఆడనుంది. తమ తొలి మ్యాచ్ను చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్ 23న(ఆదివారం) ఆడనుంది. చదవండి: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. మొహాలీకి చేరుకున్న భారత ఆటగాళ్లు -
'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!'
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పీసీబీ సెలెక్టర్లపై మండిపడ్డాడు. టి20 ప్రపంచకప్కు ఎంపిక చేసిన పాక్ జట్టు పరమ చెత్తగా ఉందని.. ఇలా అయితే ప్రతిష్టాత్మక టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరుగుతుందంటూ పేర్కొన్నాడు. టి20 ప్రపంచకప్కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈ గురువారం ప్రకటించారు. బాబర్ ఆజం కెప్టెన్ కాగా.. షాదాబ్ ఖాన్ వైస్కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది తిరిగి జట్టులోకి రాగా.. చాలాకాలం తర్వాత హైదర్ అలీ జ్టుటలో చోటు సంపాదించాడు. అయితే ఆశ్చర్యంగా ఫఖర్ జమాన్ను రిజ్వర్ జాబితాలో చోటు కల్పించింది. ఇక సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్కు సెలక్టర్లు మరో సారి మొండి చేయి చూపించారు. ఇక ఆసియా కప్ ఫైనల్ ఆడిన జట్టులోని ఆటగాళ్లంతా టి20 ప్రపంచకప్కు ఎంపికయ్యారు. కాగా జట్టు ఎంపికపై షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. ''టి20 ప్రపంచకప్కు ప్రకటించిన పాకిస్తాన్ జట్టు సమతుల్యంగా లేదు. ముఖ్యంగా మిడిలార్డర్ చాలా వీక్గా కనిపిస్తోంది. ఇలాంటి మిడిలార్డర్ ఉంటే ప్రతిష్టాత్మక టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరగడం గ్యారంటీ. మిడిలార్డర్లో సమర్థుల అవసరం ఉంది.. బ్యాటింగ్ డెప్త్ పెంచాల్సిందే. ఇది సాధ్యం కాకపోతే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఒక్కో మ్యాచ్ గెలవడానికి కష్టపడాల్సిందే. అలా జరగకూడదని కోరుకుంటున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అక్తర్ వ్యాఖ్యలపై అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''మొన్ననే కదా ఆసియాకప్లో ఫైనల్ వరకు చేరారు.. అంత మాట ఎలా అంటావు అక్తర్''.. ''మిడిలార్డర్ కాదు.. ముందు బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తీసేయాలి.. అప్పుడే టీం బాగా ఆడుతుంది.'' అంటూ పేర్కొన్నారు. ఇక టి20 ప్రపంచకప్లో గ్రూఫ్-2లో ఉన్న పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ను చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్ 23న(ఆదివారం) ఆడనుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, క్వాలిఫయర్తో మ్యాచ్లు ఆడనుంది. టి20 ప్రపంచకప్కు పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది మసూద్, ఉస్మాన్ ఖాదిర్ రిజర్వ్ ఆటగాళ్లు: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ చదవండి: క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఉసేన్ బోల్ట్ కడసారి చూపులకు 13 గంటలు నిరీక్షించిన మాజీ కెప్టెన్ -
ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు..
రాబోయే టి20 ప్రపంచకప్కు సన్నాహకంగా ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై సుధీర్ఘ టి20 సిరీస్ ఆడనుంది. గురువారం రాత్రి పాకిస్తాన్కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు ఏడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్కు ఇది మంచి ప్రాక్టీస్లా ఉపయోగపడనుంది. ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ బట్లర్ సహా ఇతర ఆటగాళ్లకు పాకిస్తాన్లో ఒక్క మ్యాచ్ ఆడిన అనుభవం లేదు. అలెక్స్ హేల్స్, మొయిన్ అలీ, లియామ్ డాసన్ లాంటి ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడడం ద్వారా పాక్ పిచ్లపై కాస్త అవగాహన ఉంది. అయితే గాయంతో బాధపడుతున్న కెప్టెన్ జాస్ట్ బట్లర్ సిరీస్లో ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. పాకిస్తాన్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. పాక్లోని చాలా ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ క్రికెటర్లు పెద్ద మనసు చాటుకున్నారు. ఇదే విషయమై కెప్టెన్ జాస్ బట్లర్ మాట్లాడుతూ..'' పాకిస్తాన్ ప్రస్తుతం భారీ వరదలతో అతలాకుతలమైంది. ఇలాంటి క్లిష్ట సమయంలో మేము పాక్ గడ్డపై సిరీస్ ఆడేందుకు వచ్చాం. ఒక జట్టుగా గెలుపోటములు పక్కనబెడితే.. మ్యాచ్కు సంబంధించిన డొనేషన్స్ను వరద బాధితులకు అందేలా చూస్తాం. ఇందుకోసం ఈసీబీతో ఇప్పటికే మాట్లాడాము. ఈసీబీ కూడా మా వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని పెద్ద మొత్తంలో సాయం చేడయానికి ముందుకు రానుంది. క్రికెట్లో ఇలాంటి స్నేహపూరిత వాతావరణం ఉండడం చాలా మంచిది. ఇక ఇరుజట్ల మధ్య జరగనున్న టి20 సిరీస్.. వరద నష్టాల నుంచి పాక్ ప్రజలకు, అక్కడి అభిమానులకు మంచి ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో లంక చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్.. స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్లో గెలిచి టి20 ప్రపంచకప్కు ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ విజయం అనంతరం పాక్ గడ్డపై అడుగుపెట్టింది. చదవండి: 'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా' -
17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు దాదాపు 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై గురువారం అడుగు పెట్టింది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ 7 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. కాగా ఇంగ్లండ్ చివరిసారిగా 2005లో పాకిస్తాన్లో ఆడింది. 2007లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్పై ఉగ్రదాడి తర్వాత ఏ జట్టు కూడా పాక్లో పర్యటించడానికి ముందుకు రాలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ కూడా భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్లో ఇంగ్లండ్ అడుగుపెట్టలేదు. 2012, 2015లో యూఏఈ వేదికగా ఇరు జట్ల మధ్య సిరీస్లు జరిగాయి, కాగా గత ఐదు ఏళ్లలో పరిస్థితులు సద్దుమణగడంతో అంతర్జాతీయ జట్లు పాకిస్తాన్లో పర్యటిస్తున్నాయి. ఈ క్రమంలో గతేడాది టీ20 ప్రపంచకప్ ముందు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సింది. అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా అఖరి నిమిషంలో పాక్ పర్యటను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. కాగా టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు దుబాయ్లో సమావేశమయ్యారు. 2022 ఏడాది మధ్యలో ఇంగండ్ జట్టు పాక్లో పర్యటించి ఏడు మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఈసీబీ ఒప్పందంకుదర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగానే ఇంగ్లండ్ జట్టు పాక్ గడ్డపై అడుగుపెట్టింది. భారీ భద్రత కరాచీ విమానాశ్రయానికి చేరుకున్న ఇంగ్లండ్ ఆటగాళ్లను భారీ భద్రత నడుమ హాటల్కు తరలించారు. ఇరు జట్లు మధ్య మ్యాచ్ జరిగే సమయంలో జట్టు బస చేస్తున్న హాటల్తో పాటు కరాచీ నేషనల్ స్టేడియం వద్ద రోడ్లు మొత్తం బ్లాక్ చేయనున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా హాటల్తో పాటు స్టేడియం వద్ద కూడా సాయుధ బలగాలను భారీగా మోహరించినట్లు పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. 7టీ20ల సిరీస్ పాకిస్తాన్తో ఇంగ్లండ్ ఏడు టీ20ల సిరీస్లో తలపడనుంది. ఈ టీ20 సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి ఆక్టోబర్2 వరకు జరగనుంది. ఈ సిరీస్లోని తొలి నాలుగు మ్యాచ్లు కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. అఖరి మూడు టీ20లకు లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. The England squad has arrived at the team hotel in Karachi ✅#PAKvENG pic.twitter.com/M5esMUlDMT — Pakistan Cricket (@TheRealPCB) September 15, 2022 చదవండి: T20 World Cup 2022: జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్.. యువ బౌలర్ ఎంట్రీ -
క్రతువు ముగిసింది.. కాలుష్యం మిగిలింది!
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. హుస్సేన్సాగర్ సహా సుమారు వంద జలాశయాల్లో వేలాదిగా గణపతి ప్రతిమలను నిమజ్జనం చేశారు. నిమజ్జన క్రతువు ముగిసిన వెంటనే వ్యర్థాలను గణనీయంగా తొలగించినట్లు బల్దియా యంత్రాంగం ప్రకటించినప్పటికీ.. ప్లాస్టర్ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కారణంగా టన్నుల కొద్దీ ఘన వ్యర్థాలు, అధిక గాఢత రసాయనాలు, హానికారక మూలకాలు, ఇనుము, కలప, పీఓపీ ఆయా జలాశయాల్లో కలిసినట్లు పీసీబీ నిపుణులు చెబుతున్నారు. త్వరలో నిమజ్జన కాలుష్యంపై తుది నివేదిక విడుదల చేయనున్నట్లు తెలిపారు. హుస్సేన్సాగర్లో అంచనా ఇలా.. జలాశయంలోకి సుమారు 5 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 2 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగరంలో కలిసినట్లు పీసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఇనుము, కలపను బల్దియా ఆధ్వర్యంలో తొలగించినా.. పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్సాగర్ మరింత గరళమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు ప్రవేశించడంతో జలాశయంలో ప్రతి లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్లు పరిమితులకు మించి నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. రసాయనాలు, మూలకాలిలా.. రసాయన రంగుల అవశేషాలు: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టరీ్పన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్ని‹Ù. హానికారక మూలకాలు: కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, మాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జిక్ సలై్ఫడ్, మెర్క్యురీ, మైకా. తలెత్తే అనర్థాలు.. ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి. మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపాలుగా ఏర్పడతాయి. (చదవండి: రూబీ లాడ్జీ: ఎనమిదికి చేరిన మృతుల సంఖ్య..ఫైర్ అధికారి కీలక వ్యాఖ్యలు) -
పాక్కు మరో ఎదురుదెబ్బ.. వెన్నునొప్పితో కీలక బౌలర్ దూరం!
ఆసియాకప్లో భాగంగా భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మోకాలి గాయంతో స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది దూరం కాగా.. తాజాగా ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ వసీమ్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ సెషన్లో పాల్గొన్న మహ్మద్ వసీమ్ బౌలింగ్ చేస్తున్న సమయంలోనే వెన్నునొప్పి వచ్చింది. దీంతో జట్టు సిబ్బంది వెంటనే అతన్ని ఐసీసీ అకాడమీకి తరలించి ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. రిపోర్ట్స్లో వసీమ్కు వెన్నునొప్పి తీవ్రంగానే ఉన్నట్లు తేలింది. దీన్నిబట్టి అతను ఆసియాకప్కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆసియా కప్ ముగిసిన తర్వాత పాకిస్తాన్కు బిజీ షెడ్యూల్ ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో వరుస సిరీస్లు ఆడనుంది. ఆ తర్వాత టి20 ప్రపంచకప్లో ఆడనుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ వసీమ్కు విశ్రాంతినివ్వడమే కరెక్టని పీసీబీ అభఙప్రాయపడుతోంది. ఇప్పటికే మోకాలి గాయంతో నాలుగు వారాల పాటు ఆటకు దూరమైన షాహిన్ అఫ్రిది అక్టోబర్లో జరగనున్న టి20 ప్రపంచకప్లో ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక మహ్మద్ వసీమ్ పాక్ తరపున 11 టి20 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. చదవండి: ఆఫ్రిది లేకున్నా మాకు ఆ ముగ్గురు ఉన్నారు.. భారత బ్యాటర్లకు సవాల్! Asia Cup 2022: భారత్- పాకిస్తాన్ ఏ జట్టు ఆటగాడైనా ఒకటే! మేము అన్నదమ్ముల్లా ఉంటాం! -
17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. షెడ్యూల్ విడుదల చేసిన పాకిస్తాన్!
17 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో అడుగు పెట్టనుంది. ఈ పర్యటనలో భాగంగా 7 టీ20లు, మూడు టెస్టుల సిరీస్లో అతిథ్య జట్టుతో ఇంగ్లండ్ తలపడనుంది. కాగా ఇప్పటికే టీ20 సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. తాజాగా టెస్టు సిరీస్ షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. ఇక ఇరు జట్లు మధ్య చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 21 వరకు జరగనుంది. తొలి టెస్టుకు రావల్పిండి, రెండో టెస్టుకు మూల్తాన్ అతిథ్యం ఇవ్వనుండగా.. అఖరి టెస్టు కరాచీ వేదికగా జరగనుంది. అదే విధంగా పాకిస్తాన్ ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి ఆక్టోబర్2 వరకు జరగనుంది. ఈ సిరీస్లోని తొలి నాలుగు మ్యాచ్లు కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. అఖరి మూడు టీ20లకు లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ ముందు ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా అఖరి నిమిషంలో పాక్ పర్యటను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. అయితే టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు దుబాయ్లో సమావేశమయ్యారు. 2022 ఏడాదిలో ఇంగండ్ జట్టు పాక్లో పర్యటించి ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు ఇరు బోర్డులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగానే ఇంగ్లండ్ జట్టు పాక్ గడ్డపై అడుగు పెట్టనుంది. చదవండి: IND vs ZIM: మూడేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చేలరేగిన శుబ్మన్ గిల్ -
'నా క్రికెట్ కెరీర్ ముగిసి పోయిందని భావించాను.. పాకిస్తాన్ క్రికెట్కు ధన్యవాదాలు'
పాకిస్తాన్ టెస్టు ఓపెనర్ ఆబిద్ అలీ గతేడాది జరిగిన క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో తీవ్రమైన గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడికి యాంజియో ప్లాస్టీ నిర్వహించి రెండు స్టంట్లను వైద్యులు అమర్చారు. అయితే అతడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆబిద్ అలీ భావోద్వేగానికి లోనయ్యాడు. తన ఆరోగ్యం బాగాలేనప్పుడు తనకు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, చైర్మన్ రమీజ్ రాజా,ఎన్సీఎ వైద్యులకు అలీ కృతజ్ఞతలు తెలిపాడు. "గత 5-6 నెలలుగా నేను ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. మళ్లీ ఈ స్థితికి వస్తానని అస్సలు నేను ఊహించలేదు. నా క్రికెట్ కెరీర్ ముగిసి పోయిందని భావించాను. సర్వశక్తిమంతుడైన అల్లాకు ధన్యవాదాలు. నేను మళ్లీ తిరిగి కోలుకోవడానికి సహాయపడిన పిసిబి, చైర్మన్ రమీజ్ రాజా,ఎన్సిఎ వైద్యులకు ధన్యవాదాలు. అదే విధంగా పునరావాస కేంద్రంలో నాకు మద్దతుగా నిలిచిన నా సహాచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు" అని ఆబిద్ అలీ పేర్కొన్నాడు. చదవండి: Attack On Cricketer Mondli Khumalo: కోమా నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్.. -
ఏ ముహుర్తానా పాక్ గడ్డపై అడుగుపెట్టిందో అన్ని విచిత్ర పరిస్థితులే; తాజాగా
ఆస్ట్రేలియా జట్టు ఏ ముహుర్తానా పాక్ గడ్డపై అడుగుపెట్టిందో కానీ.. అన్ని విచిత్ర పరిస్థితులే ఎదురవుతున్నాయి. 24 ఏళ్ల అనంతరం పాకిస్తాన్లో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 ఆడేందుకు ఆస్ట్రేలియా వచ్చింది. వచ్చీ రాగానే పెషావర్లో బాంబుల మోత.. తమను స్వాగతం పలికామా అన్నట్లుగా ఆస్ట్రేలియా జట్టును ఉలిక్కిపడేలా చేసింది. మసీదును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సుమారు 50 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అప్పటికే పక్కనే ఉన్న రావల్పిండి సిటీలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ మొదలైంది. సిరీస్ రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలు వచ్చినప్పటికి.. పీసీబీ ఆసీస్ ఆటగాళ్ల భద్రత మాదేనని పేర్కొంది. అలా మొదటి టెస్టు పూర్తి కాగానే.. దేశంలో రాజకీయ సంక్షోభ దుమారం రేగింది. అధికారంలో ఉన్న ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా తమ పార్టీలు ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తాజాగా రాజకీయ సంక్షభం సెగ పాకిస్తాన్- ఆస్ట్రేలియా సిరీస్ను తాకింది. మూడు వన్డేల సిరీస్తో పాటు ఏకైక టి20 మ్యాచ్ మార్చి 29, 31, ఏప్రిల్ 2, 4 తేదీలలో రావల్పిండి వేదికగా జరగాల్సి ఉంది. అయితే రాజకీయ సంక్షోభం కారణంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్తో పాటు పక్కనే ఉన్న రావల్పిండిలో అల్లర్లు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా రావల్పిండి నుంచి లాహోర్కు మ్యాచ్ వేదికలను మారుస్తున్నట్లు దేశ విదేశాంగ మంత్రి షేక్ రషీద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. లాహోర్ వేదికగా అవే తేదీల్లో మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ జరగనుందని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే మూడో టెస్టు కోసం ఇరుజట్లు లాహోర్లోని గడాఫీ వేదికగా ఆడనున్నాయి. ఇక సిరీస్లో మిగిలిన మ్యాచ్లు కూడా అక్కడే ఆడనున్నట్లు పీసీబీ తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపామని.. వారు తమ క్రికెటర్ల క్షేమ సమాచారాలు మాత్రమే అడిగారని.. సిరీస్ ముగిశాక జాగ్రత్తగా పంపించాలని కోరారని షేక్ రషీద్ తెలిపారు. చదవండి: 'ఇప్పుడు కాదు రోహిత్.. ఆస్ట్రేలియాపై గెలిచి చూపించు' Glenn Maxwell Marriage: గర్ల్ఫ్రెండ్ను పెళ్లాడిన ఆసీస్ విధ్వంసకర ఆటగాడు -
‘అమరరాజా’ ఉల్లంఘనలపై వచ్చే విచారణలో ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: అమరరాజా బ్యాటరీస్పై వచ్చిన పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలపై వచ్చే విచారణ సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాటికి ఆ సంస్థ ఉద్యోగుల రక్తనమూనాల పరీక్షల నివేదికను, కౌంటర్ను తమ ముందుంచాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.శ్రీ భానుమతిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ గతేడాది ఏప్రిల్ 30న ఉత్తర్వులిచ్చింది. వీటిని సవాల్ చేస్తూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు మూసివేత ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పీసీబీ తరఫు న్యాయవాది వి.సురేందర్రెడ్డి స్పందిస్తూ.. అమరరాజా ఉద్యోగుల రక్త నమూనాలపై ఐఐటీ–మద్రాస్ బృందం పరీక్ష చేయాల్సి ఉందన్నారు. అయితే కోవిడ్ కారణంగా అది సాధ్యం కాలేదని చెప్పారు. దీంతో ప్రైవేటు ల్యాబ్లో పరీక్షలు చేయించాల్సి వచ్చిందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘గత విచారణ సమయంలో నివేదిక ఇస్తామని చెప్పారు. అన్ని వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. ఇంతవరకు వేయలేదు’ అని వ్యాఖ్యానించింది. తనకు కోవిడ్ సోకడంతో హోం ఐసోలేషన్లో ఉన్నానని, అందువల్ల నివేదిక తెప్పించుకోవడంలో జాప్యం జరిగిందని సురేందర్రెడ్డి విన్నవించారు. అనంతరం అమరరాజా తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో తప్ప ప్రపంచంలో ఏ సంస్థ ద్వారానైనా పరీక్షలకు సిద్ధమన్నారు. ఏపీ ప్రభుత్వం తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వచ్చే విచారణలో కేసు పూర్వాపరాల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేస్తామంది. -
అదే జరిగితే, యావత్ పాకిస్థాన్ మీకు స్వాగతం పలుకుతుంది.. మహ్మద్ రిజ్వాన్
Australia Tour Of Pakistan 2022: 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది మార్చ్-ఏప్రిల్ నెలల్లో పాకిస్థాన్లో పర్యటించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఒప్పుకుంది. పర్యటనలో భాగంగా ఆసీస్-పాక్ జట్ల మధ్య మూడు టెస్ట్లు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ జరగనున్నాయి. అయితే, ఇటీవల న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు భద్రతా కారణాలను సాకుగా చూపి పాక్ పర్యటనకు డుమ్మా కొట్టిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనపై పాక్ మాజీలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలాకాలం తర్వాత ప్రపంచ మేటి జట్టు తమ దేశంలో పర్యటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. ఇటీవల కాలంలో కొన్ని జట్లు నిరాధారమైన కారణాల చేత తమతో క్రికెట్ ఆడేందుకు వెనకడుగు వేశాయని, ఇది తమను, తమ అభిమానులు తీవ్రంగా కలచి వేసిందని, అంతే కాకుండా తమ దేశ క్రికెట్ బోర్డును భారీగా నష్టాల పాలు చేసిందని వాపోయాడు. ఫైనల్గా ఆసీస్ జట్టు తమ దేశంలో పర్యటించేందుకు ఒప్పుకోవడం శుభపరిణామమని, ఈ పర్యటన కార్యరూపం దాల్చితే, యావత్ పాక్ ఆసీస్ జట్టుకు స్వాగతం పలుకుతుందని, ఈ సిరీస్ కోసం తామెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చాడు. పాక్ ఆటగాళ్లు షాదాబ్ ఖాన్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్లు బిగ్బాష్ లీగ్లో ఆడుతూ.. ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడుతూ ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నారని పేర్కొన్నాడు. ఈ బంధం బలపడేందుకు పాక్ బ్యాటింగ్ కన్సల్టెంట్ మాథ్యూ హేడెన్ తన వంతు సహకారాన్ని అందించాడని గుర్తు చేశాడు. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్తో తెగదెంపులు.. ఇకపై..! -
మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా మహ్మద్ రిజ్వాన్ ..
2021 ఏడాదికి గాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వార్షిక అవార్డులను ప్రకటించింది. 2021లో పాకిస్తాన్ అద్భుతమైన విజయాలు సాధించింది. టీ20 ప్రపంచకప్-2021లో చిరకాల ప్రత్యర్థి భారత్పై 10 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ ఈవెంట్లలో భారత్పై పాకిస్తాన్ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు(20) నమోదు చేసిన జట్టుగా పాక్ నిలిచింది. పాక్ విజయాల్లో ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజం కీలక పాత్రపోషిస్తున్నారు. వీరితో పాటు హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది బౌలింగ్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. గత ఏడాది టీ20ల్లో రిజ్వాన్ 1,326 పరుగులు సాధించాడు. ఇక హసన్ అలీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకోగా,కెప్టెన్ బాబర్ అజామ్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. అదే విధంగా పాక్ యువ బౌలర్ మహ్మద్ వసీం జూనియర్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ను అందుకున్నాడు. చదవండి: టాప్-5లోకి సౌతాఫ్రికా ... టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే! -
ఇకపై పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్ కూడా...
పాకిస్తాన్ పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్ పదవి కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. అదే విధంగా లహోర్లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో వివిధ కోచ్ పదవిల కోసం కూడా పీసీబీ దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా ఇప్పటివరకు పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్ ఏ జట్టుకు లేరు. అయితే ఆధునిక క్రికెట్కు అనుగుణంగా తమ ఆటగాళ్లను సన్నద్దం చేయడానికే పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ కోచ్ను నియమిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా తెలిపారు. ఇక హై ఫార్మమన్స్ కోచ్ పదవికు గల అర్హతలను పీసీబీ ప్రకటించింది."గత 10 సంవత్సరాలలో కనీసం ఐదేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. అంతేకాకుండా జాతీయ లేదా అంతర్జాతీయ జట్లకు లైఫ్ కోచ్గా పని చేసి ఉండాలి. మిగితా నాలుగు కోచ్లకు గత10 సంవత్సరాలలో కనీసం ఐదేళ్ల మూడవ స్థాయి క్రికెట్ కోచింగ్ అక్రిడిటేషన్లో పని చేసి వుంటే చాలు" అని పీసీబీ పేర్కొంది. చదవండి: IND Vs SA ODI Series: టీమిండియా వన్డే కెప్టెన్గా కేఎల్ రాహుల్ -
వెస్టిండీస్తో సిరీస్కు జట్టును ప్రకటించిన పాక్.. స్టార్ ఆటగాడికి నోఛాన్స్
Pakistan name squads for home series against West Indies: వెస్టిండీస్తో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ జట్టును గురువారం ప్రకటించింది. టీ20 సిరీస్కు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేయగా, వన్డే సిరీస్ 17 మందితో కూడిన జట్టును వెల్లడించారు. ఈ సిరీస్కు హసన్ అలీ, ఇమాద్ వసీం, సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్కు విశ్రాంతి ఇచ్చారు. కాగా ఈ జట్టులో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ హస్నైన్కు చోటు దక్కింది. ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్, పాకిస్తాన్తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. కాగా తొలి టీ20 డిసెంబర్ 13న కరాచీ వేదికగా జరగనుంది. పాకిస్తాన్ టీ20 జట్టు: బాబర్ అజాం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్ పాకిస్తాన్ వన్డే జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (డబ్ల్యుకె), మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ హస్నైన్, సౌద్ షకీల్, షాహీన్ ఆఫ్రిది, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్ చదవండి: IND VS NZ: అతడు టీమిండియా ఓపెనర్గా రావాలి... -
టెస్టులకు గుడ్బై చెప్పిన పాక్ క్రికెటర్
Usman Shinwari Announces Retirement From Test Cricket.. పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ షిన్వరీ టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ఈ విషయాన్ని షిన్వరీ ట్విటర్ ద్వారా ప్రకటించాడు. '' ఇటీవలే వెన్నునొప్పి నుంచి కోలుకున్నా. వేగంగా కోలుకోవడంలో సహాయపడిన స్పోర్ట్స్ ఫిజియో అహ్మదుల్లాకు కృతజ్క్షతలు. ఫిజియో, డాక్టర్లు సూచన మేరకు టెస్టు క్రికెట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. సుధీర్ఘంగా బౌలింగ్ చేస్తే గాయాలు మళ్లీ తిరగబెట్టే అవకాశాలున్యాయని వైద్యులు హెచ్చరించారు. అందుకే టెస్టులకు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇక వన్డేలు, టి20లపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతానంటూ'' చెప్పుకొచ్చాడు 27 ఏళ్ల షిన్వరీ పాకిస్తాన్ జట్టు తరపున 17 వన్డేల్లో 34 వికెట్లు, 16 టి20ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక తన కెరీర్లో ఒకే ఒక టెస్టు ఆడిన షిన్వరీ 2013లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇక 33 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 96 వికెట్లు తీసిన షిన్వరీ రెండుసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 2019 డిసెంబర్లో ఆఖరిసారిగా పాక్ జట్టు తరపున ఆడాడు. -
అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యంపై హైకోర్టు సీరియస్
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే చర్యలను తాము ఎంత మాత్రం సహించబోమని, డబ్బు కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్లో పర్యావరణ కాలుష్యంపై న్యాయస్థానం మరోసారి తీవ్రంగా స్పందించింది. కాసుల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? అంటూ యాజమాన్యాన్ని నిలదీసింది. ఈ వ్యవహారాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తేల్చి చెప్పింది. కార్మికుల రక్త నమూనాల్లో సీసం ఆనవాళ్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అమరరాజా బ్యాటరీస్లో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ కృష్ణమోహన్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ ఈ ఏడాది ఏప్రిల్ 30న ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరరాజా బ్యాటరీస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై తాజాగా జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం, గతంలో అమరరాజా ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య స్థితిపై పీసీబీ సమర్పించిన నివేదికలను పరిశీలించింది. ఆ నివేదికల్లో కార్మికులు, ఉద్యోగుల రక్త నమూనాల్లో సీసం ఉన్నట్లు తేలడంతో తీవ్రంగా స్పందించింది. ఇదిలాఉంటే ఇదే కేసులో, తమ సంస్థలో ఎలాంటి అధ్యయనం చేయకుండా పీసీబీని నియంత్రించాలని కోరుతూ అమరరాజా బ్యాటరీస్ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. -
పాకిస్తాన్ టి20 జట్టులో మూడు మార్పులు.. ఆ ముగ్గురికి చోటు
3 Players Added In Pakistan T20 Worldcup Team.. టి20 ప్రపంచకప్ 2021 ప్రారంభానికి ముందు పాకిస్తాన్ తన జట్టులో మూడు మార్పులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫఖర్ జమాన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్, మిడిలార్డర్ బ్యాటర్ హైదర్ అలీ జట్టులోకి వచ్చారు. కాగా ముందు ప్రకటించిన జట్టులో సర్ఫరాజ్తో హైదర్ అలీకి చోటు లేదు. అజమ్ ఖాన్, మహ్మద్ హస్నైన్ల స్థానంలో వీరిద్దరు చోటు దక్కించుకోగా.. ఇక ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్గా ఉన్న ఫఖర్ జమాన్ను కుష్దిల్ షా స్థానంలో జట్టులోకి ఎంపిక చేశారు. తాజాగా జరిగిన నేషనల్ టి20 కప్లో ప్రదర్శన ఆధారంగా ఈ ముగ్గురిని తుది జట్టులోకి తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ ముహముద్ వసీమ్ పేర్కొన్నారు. ''ఈ ముగ్గురు నేషనల్ టి20 కప్లో ఆకట్టుకున్నారు. వాళ్ల అనుభవం ప్రస్తుతం జట్టుకు ఎంతో అవసరం. వీరు చేరడం వల్ల జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఇక అజమ్ ఖాన్, కుష్దిల్ షా, హస్నైన్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ను టీమిండియాతో అక్టోబర్ 24న ఆడనుంది. టి20 ప్రపంచకప్ పాకిస్తాన్ 15మందితో కూడిన జట్టు బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, సోహైబ్ మక్సూద్ రిజర్వ్ ఆటగాళ్లు- కుష్దిల్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్ -
పాకిస్తాన్కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క్షమాపణలు
ECB Chief issues apology To Pakistan: భద్రతా సమస్యల కారణంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్ల మానసిక, శారీరక క్షేమం ముఖ్యమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పాక్ పర్యటను రద్దు చేసుకుంది. ఈ అయితే పాక్ పర్యటనను ఇంగ్లండ్ రద్దు చేసుకోవడంపై ఆ జట్టు క్రికెట్ బోర్డుపై పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో ద్వజం ఎత్తారు. ఈ క్రమంలో స్పందించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛీప్ ఇయాన్ వాట్మోర్ క్షమాపణలు తెలిపారు. కాగా వచ్చే ఏడాది తమ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుందని ఆయన మాటిచ్చారు. "ముఖ్యంగా మా నిర్ణయంతో పాకిస్తాన్ బాధపడినందకు నేను చింతిస్తున్నాను. బోర్డు తీసుకున్న నిర్ణయం చాలా క్లిష్టమైనది. మా ఆటగాళ్లు, సిబ్బంది సంక్షేమం, మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటన కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎదురుచూస్తోంది ”అని వాట్మోర్ డైలీ మెయిల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పారు. అయితే ఈసీబీ ఛీప్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ సమాచార ప్రసార మంత్రి ఫవాద్ చౌదరి ముక్తకంఠంతో స్వాగతించారు. "వచ్చే ఏడాది పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్ రాబోతుందని ప్రకటించడం చాలా సంతోషకరం. పాకిస్థాన్ క్రికెట్కు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని మాజీ క్రికెటర్లకు, మీడియా, క్రికెట్ అభిమానులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా''. అని ఆయన ట్వీట్ చేశారు చదవండి: కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది ఆ ముగ్గురేనా..? -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం..
No More Neutral Venues For Us Says PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ అతిధ్యం ఇచ్చే హోమ్ సిరీస్లను తటస్థ వేదికలలో ఇప్పటినుంచి నిర్హహించబోమని ఆ దేశ క్రికెట్ బోర్డు సృష్టం చేసింది. అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించడానికి తమ దేశం చాలా సురక్షితం అని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2005 తర్వాత మొదటిసారి పాక్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ భద్రతా కారణాల దృష్ట్యా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా సీరిస్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదే విధంగా ఇంగ్లండ్ జట్టు కూడా న్యూజిలాండ్ బాటలోనే పయనించింది. పాక్తో సీరీస్ను రద్దు చేసుకున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా 2009లో శ్రీలంక జట్టు బస్సుపై జరిగిన ఉగ్రదాడి తర్వాత అన్ని దేశాల క్రికెట్ జట్లు పాకిస్తాన్లో పర్యటించడనికి విముఖత చూపాయి. దీంతో పాక్తో జరగాల్సిన సీరీస్లను తటస్థ వేదికగా యూఏఈలో పీసీబీ నిర్వహించేది. చదవండి: T20 World Cup 2021: శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం -
అమరరాజాపై కక్ష సాధింపుల్లేవు
తిరుపతి మంగళం: అమరరాజా ఫ్యాక్టరీలపై ఎలాంటి కక్ష సాధింపుల్లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరరాజా ఫ్యాక్టరీల ద్వారా వెలువడే కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి హాని కలుగుతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ), హైకోర్టు పలుమార్లు స్పష్టం చేశాయని గుర్తుచేశారు. అయినా ఫ్యాక్టరీల తీరులో మార్పు రాకపోవడంతో వాటిని మూసివేయాలని పీసీబీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. అమరరాజా సంస్థల యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించినా అదే తీర్పు ఇచ్చిందన్నారు. విశాఖలో విషవాయువు వెలువడుతున్న ఓ ఫ్యాక్టరీని మూసివేసినట్లు ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని 66 పరిశ్రమలకు నోటీసులిచ్చామని తెలిపారు. కొన్ని పత్రికలు, చానళ్లు మాత్రం కక్షసాధింపుతో అమరరాజా ఫ్యాక్టరీలు పక్కరాష్ట్రాలకు తరలిపోయేలా ప్రభుత్వం చేస్తోందని చెప్పడం దారుణమన్నారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. టీడీపీ పోతూపోతూ రాష్ట్రాన్ని ఎంతగా నష్టాల్లోకి నెట్టేసిందో అందరికీ తెలుసన్నారు. అప్పులు చెల్లించాలని ఆర్బీఐ నుంచి హెచ్చరికలు వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్తో రాష్ట్రానికి ఆర్థికంగా ఎంతో నష్టం జరిగినప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు ఏవీ ఆగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. -
మైనింగ్ ఆధారిత పరిశ్రమలపై హేతుబద్ధ ఫీజులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖనిజాధారిత పరిశ్రమలపై శాస్త్రీయంగా హేతుబద్ధమైన ఫీజులు విధించాలని గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు సూచించారు. విజయవాడలోని పీసీబీ కార్యాలయంలో మంగళవారం ఇంధన, అటవీ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి కాలుష్యకారక పరిశ్రమలు, వాటి నియంత్రణ తదితర అంశాలపై పెద్దిరెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రోత్సాహకరమైన వాతావరణంలోనే పరిశ్రమలు పనిచేసేందుకు సహకరించాలన్నారు. మైనింగ్ పరిశ్రమలకు అనుమతులు, నిర్వహణ సందర్భంగా విధిస్తున్న సీఎఫ్ఓ, సీఎఫ్ఈ ఫీజుల పెంపు హేతుబద్ధంగా ఉండాలన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే మైనింగ్ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారో పరిశీలించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించిన ఫీజులు తమకు ఆర్థికంగా భారంగా మారుతున్నాయని మైనింగ్ పరిశ్రమల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారని, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలనే సీఎం ఆశయానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. ఘన, ద్రవరూప వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయాలన్నారు. దీనికి అవసరమైన సహాయ సహకారాలను మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు అందించాలని సూచించారు. కోవిడ్ నేపథ్యంలో ఆస్పత్రులు, ల్యాబ్ల నుంచి పెద్దఎత్తున వస్తున్న బయో మెడికల్ వ్యర్థాలను తగిన జాగ్రత్తలతో నాశనం చేయాలని ఆదేశించారు. పీసీబీ చైర్మన్ ఏకే ఫరీడా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కెప్టెన్ చెప్పిన వాళ్లను ఎంపిక చేయరు.. మా పద్దతి అదే
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. తాజాగా సౌతాఫ్రికా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సిరీసుల్లో కూడా పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కోరుకున్నట్లుగా జట్టును ఎంపిక చేయలేదని ఆ జట్టు సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు. '' కెప్టెన్ బాబర్ అడిగిన చాలా మంది ఆటగాళ్లను ఇటీవలి దక్షిణాఫ్రికా, జింబాబ్వే సిరీసులకు తీసుకోలేదు. తమ వద్ద నచ్చడం.. నచ్చకపోవడం అనే పద్దతి ఉంది. సెలక్షన్ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాలకు విలువ ఉన్నా తుది నిర్ణయం తీసుకోవాల్సింది కెప్టెనే. ఇంకోవిషయం ఏంటంటే ఆటగాళ్ల ఎంపికలో పక్షపాత ధోరణి నడుస్తుంది. ఇది సరైనది కాదు.. పీఎస్ఎల్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి. కనీసం రెండు సీజన్ల పాటు అందులో ఆడే ఆటగాళ్లను పరిశీలించి అప్పుడు జట్టులోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని ఇలా బయటపెట్టడం వల్ల నాకే నష్టం జరిగినా పరవాలేదు. నన్ను మళ్లీ టీ20ల్లో ఆడనివ్వకపోయినా నేనేమి బాధపడను. నేను ఇప్పటివరకు ఎంతోమంది కెప్టెన్లతో ఆడాను. వకార్ యూనిస్, వసీమ్ అక్రమ్, ఇంజమామ్, అఫ్రిది లాంటి దిగ్గజాలతో ఆడాను. కెప్టెన్గా ఉండాలంటూ ఇతరులను కాకా పట్టడం చేయొద్దు. అలా చేయకుండా ఉంటే తప్పకుండా గొప్ప కెప్టెన్గా మిగిలిపోతారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు' -
'చాలా థ్యాంక్స్.. మమ్మల్ని బాగా చూసుకున్నారు'
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జట్టు జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చింది. మూడు టీ20, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ నిమిత్తం పాకిస్తాన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్ను 2-1, టెస్టు సిరీస్ను 2-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది. డబుల్ సెంచరీ చేసిన ఆబిద్ అలీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలవగా... 14 వికెట్లు పడగొట్టిన హసన్ అలీ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ గా నిలిచాడు. తాజాగా పాక్ జట్టు ప్రదర్శనపై ఆ జట్టు మేనేజర్ మన్సూర్ రాణా ప్రశంసలతో ముంచెత్తాడు. '' జింబాబ్వేను టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్ చేయడం సూపర్ అని.. జట్టుగానే గాక ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన నాకు సంతోషాన్ని కలిగించింది. బౌలర్ హసన్ అలీకి ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. ఇక జింబాబ్వేలో మేం బస చేసిన హోటల్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. వారు మమ్మల్ని బాగా చూసుకున్నారు. రంజాన్ మాసం దృష్టిలో ఉంచుకొని ఇఫ్తార్, సెహర్ సమయాల్లో రకరకాల డిషెస్ను వడ్డించారు. చాలా థ్యాంక్స్ జింబాబ్వే క్రికెట్ బోర్డ్'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్లో పాక్ బౌలర్ హసన్ అలీ అద్బుత ప్రదర్శనతో అదరగొట్టాడు. రెండు మ్యాచ్లు కలిపి 8.93 యావరేజ్తో మొత్తం 14 వికెట్లు తీయగా.. ఇందులో ఒకే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. చదవండి: 'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు' నా తండ్రి ఆటను టీవీలో చూశా.. అప్పడే నిశ్చయించుకున్నా