-
వైరల్ వీడియో: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి...
-
విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....
విమానంలోని ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. పైగా విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగి వేలు కొరికేశాడు. ఈ ఘటన ఇండోనేషియా రాజధాని జకర్తాకు బయలుదేరిన టర్కిష్ ఎయిర్లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణికులు అందరూ చూస్తుండగా సిబ్బందిపై పంచ్లు విసురుతూ చాలా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విమాన సిబ్బంది అతనిని కట్టడి చేసే క్రమంలో సిబ్బందిలో ఒకరు ప్రయాణికుడుని తన్నడం వంటివి చేశారు. ఐతే ప్రయాణికుడు తనకు మరింత కోపం తెప్పించందంటూ..హెచ్చరిస్తూనే ఆ ఫ్టైట్ అటెండెంట్ వేలుని కొరికేశాడు. దీంతో ఇస్తాంబుల్ నుంచి జకర్తా వెళ్తున్న ఆ టర్కీష్ విమానాన్ని అత్యవసరంగా మలేషియాలో కౌలాంలంపూర్కి మళ్లించారు. ఈ మేరకు మెడాన్లోని కౌలానాము అంతర్జాతీయ విమానశ్రంయంలో అత్యవసర ల్యాండింగ్ చేసి...ఈ వాగ్వాదానికి కారకుడైన సదరు ప్రయాణికుడిని దించేసి, గాయపడ్డ సిబ్బందికి చికిత్స అందించారు. సదరు ప్రయాణికుడు ఇండోనేషియా పౌరుడు, పైగా అతను సరుకు రవాణ చేసే క్యారియర్ ఫైలెట్గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనపై మెడాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చ్ చేస్తోంది. (చదవండి: ఇక ఆపండి ప్లీజ్! దయచేసి ఇలాంటి వంటకం ట్రై చేయొద్దు.. ఇప్పటికైనా డిలీట్ చేయడం మంచిది) -
మాస్కో విమానంలో బాంబు కలకలం... అప్రమత్తమైన అధికారులు
న్యూఢిల్లీ: మాస్కో విమానంలో బాంబు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని అంతర్జాతీయ మిమానాశ్రయానికి గురువారం రాత్రి 11.15 నిమిషాలకు మాస్కో విమానంలో బాంబు ఉందంటూ ఈమెయిల్ హెచ్చరికి వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. అంతేగాదు విమానాశ్రయ భద్రతను కూడా పెంచారు. ఈ మేరకు విమానం ఎస్యూ 232 శుక్రవారం తెల్లవారుజామున 3.20 గం.లకు మాస్కో నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ విమానంలో ప్రయాణిస్తున్న దాదాపు 386 మంది ప్రయాణికులను సుమారు 16 మంది సిబ్బందిని తక్షణమే దించేశారు. విమానం మొత్తం తనీఖీ చేయడం ప్రారంభించారు అధికారులు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. అచ్చం అలానే గతనెల సెప్టెంబర్10న లండన్కి వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసింది. (చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్) -
ప్యాసింజర్ షార్ట్ టెంపర్.. దెబ్బకు ఫ్లైట్ జర్నీ చేయనీకుండా జీవితకాల నిషేధం
కొంతమందికి చిన్న చిన్న వాటికే కోపాలు వచ్చేస్తుంటాయి. దీంతో ముందు వెనుక ఆలోచించకుండా అనుచితంగా ప్రవర్తించి లేనిపోనీ తంటాలను కొని తెచ్చుకుంటారు. ఇక్కడో ఒక విమాన ప్రయాణికుడు అలానే ప్రవర్తించి జీవితంలో విమాన ప్రయాణమే చేయనీకుండా నిషేధింపబడ్డాడు. వివరాల్లోకెళ్తే... మెక్సికోలోని ఒక అమెరికన్ ఎయిర్లైన్స్ లాస్ కాబోస్ నుంచి లాస్ ఏంజెల్స్కు వెళ్తున్న సమయంలో ఒక ప్రయాణికుడు విమాన సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో జీవితంలో అసలు ప్లైట్ జర్నీ చేసేందుకు లేకుండా నిషేధం విధించింది. ఈఘటన అమెరికన్ ఎయిర్లైన్స్ 377 విమానంలో చోటు చేసుకుంది. ఒక విమాన సహయకుడుని నన్ను బెదిరిస్తున్నావా అంటూ ఒక ప్రయాణికుడు వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. సదరు ప్రయాణికుడు పిడికిలితో ఫ్లైట్ అటెండెంట్ తల వెనుక భాగంలో కొట్టాడు. దీంతో సదరు అటెండెంట్ ఈ ఆకస్మిక దాడికి వెంటనే కిందపడిపోయాడు. వాస్తవానికి సదరు ఫ్లైట్ అటెండెంట్ ప్రయాణికుడి ప్రవర్తన విషయమై కంప్లైంట్ చేసేందుకు వెళ్తున్నసమయంలోనే ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఈ అనుహ్య ఘటనకి విమాన సిబ్బంది ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆ విమానంలోని ఒక హోస్ట్ గాయపడిన అటెండెంట్కి సపర్యలు కూడా చేసింది. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన అమెరికా విమాన ఎయిర్లైన్స్ వెంటనే స్పందించి...ఈ దాడికి పాల్పడిన వ్యక్తి 33 ఏళ్ల అలెగ్జాండర్ తుంగ్ క్యూ లేగా గుర్తించి అతన్ని వెంటనే విమానం నుంచి దించేయడమే కాకుండా జీవితకాలం విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించింది. అంతేగాదు తమ సిబ్బందిని గాయపరిచినందుకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విచారణలో నేరం రుజువైతే సదరు ప్రయాణికుడికి 20 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని కూడా పేర్కొంది. ఈ మేరకు అమెరికా ఎయిర్లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది కూడా. తమ ఎయిర్లైన్స్ పట్ల అనుచితంగా ప్రవర్తించి దాడి చేస్తే... చూస్తూ ఊరుకోమని, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A man was arrested by Los Angeles Airport police after assaulting a flight attendant on an American Airlines flight from Cabo. pic.twitter.com/2VDXxIqUfn — 🇺🇸BellaLovesUSA🍊 (@Bellamari8mazz) September 22, 2022 (చదవండి: మూడేళ్ల చిన్నారి చేతిలో తల్లి మృతి) -
బస్సులో నాగుపాము రభస
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం కెఎస్ఆర్టిసి బస్టాండు నుంచి బస్సులో ప్రయాణికులను ఎక్కించుకొని శిడ్లఘట్ట వైపు వెళుతుండగా బస్సులో కలకలం రేగింది. అందరూ ఏమిటా అని చూడగా ఒక నాగుపాము బస్సులో ప్రయాణం చేస్తూ ఉంది. ప్రయాణికులు భయంతో ఒకరిపై ఒకరు పడి కిందకు దిగడానికి ప్రయత్నించారు. ఈ అల్లరితో పాము ఇంజన్ వద్దకు జారుకుంది. పాముల నిపుణుడు పృథ్వీరాజ్ను పిలిపించగా, ఆయన పామును పట్టి దూరంగా వదిలేశారు. బస్సు శిడ్లఘట్టకు వెళ్లిపోయింది. (చదవండి: అయ్యో పాపం.. ప్లాస్టిక్ దారంతో విలవిల్లాడిన అడవి కుక్క) -
రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..: వీడియో వైరల్
ఒక మహిళ రైలు పైకి ఎక్కి కూర్చునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ఇంతలో రైల్వే పోలీస్ రాగానే పాపం ఇక చేసేదేమిలేక ప్రయత్నం విరమించుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన బంగ్లాదేశ్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. ఆ రైల్వేస్టేష్న్లో ఒక ఇంటర్ ఎక్స్రెస్ రైలు ఆగి ఉంది. ఆ రైలు ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంది. మొత్తం బోగీలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. దీంతో కొంతమంది రైలు పైకి ఎక్కి కూర్చున్నారు. పాపం మరీ ఆ మహిళకు రైలులో సీటు దొరకలేదు కాబోలు, ఎలాగైనా వెళ్లాలనుకుని ఆమె కూడా రైలు ఎక్కేందుకు యత్నించింది. ఈ మేరకు సదరు మహిళ రైలు విండో పై నుంచి ఎక్కేందుకు శతవిధాల ప్రయత్నం చేసింది. రైలు పైన ఉన్న కొందరు ఆమెకు సాయం చేశారు కూడా. కానీ ఆమె రైలు పైకి ఎక్కలేకపోతోంది. ఇంతలో రైల్వే పోలీస్ లాఠీతో రావడంతో ఒక్కసారిగా ఆమె దిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు అధిక జనాభా ప్రభావం వల్ల ఇలా జరిగిందని ఒకరు, ఐనా అలాఎలా రైలు పైకి ఎక్కేందుకు అనుమతించారు, చాలా ప్రమాదం, నేరం అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Vidyadhar Jena (@fresh_outta_stockz) (చదవండి: ఉన్నట్టుండి చేతిపంపు నుంచి మంటలు, ఆ వెంటనే నీరు.. ఆందోళనలో స్థానికులు!) -
పేరుకే ఫ్రీక్వెన్సీ! తప్పని నిరీక్షణ
సాక్షి,హైదరాబాద్: నగరంలో రద్దీ వేళల్లో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి నాలుగైదు నిమిషాలకోసారి మెట్రో రైలు నడుపుతామన్న అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో 8 నుంచి 10 నిమిషాల పాటు నిరీక్షణ తప్పడంలేదని చెబుతున్నారు. కొన్నిసార్లు ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం మూడు మెట్రో కారిడార్ల పరిధిలోని 54 మెట్రో మెట్రో స్టేషన్లకు చేరుతున్న ప్రయాణికులు ప్లాట్ఫారాలపై కిక్కిరిసిపోతున్నారు. రైలులోకి ప్రవేశించే సమయంలోనూ తోపులాట తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బోగీల్లోనూ బయటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏసీని పెంచడం లేదా తగ్గించడం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ.. మధ్యాహ్నం వేళల్లో బోగీల్లో ఉక్కపోతతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు విలవిల్లాడుతున్నారు. మెట్రో అధికారుల పర్యవేక్షణ లోపంతోనే తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. క్రమంగా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య.. కోవిడ్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో నగరంలో మెట్రో రైళ్లలో రద్దీ క్రమంగా పెరుగుతోందని మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సాధారణ రోజుల్లో మూడు కారిడార్లతో కలిపి రద్దీ 3 నుంచి 3.5 లక్షలుకాగా.. సెలవు రోజుల్లో రద్దీ నాలుగు లక్షలకు చేరువవుతోందని పేర్కొన్నాయి. సాధారణ రోజుల్లో అత్యధికంగా ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో నిత్యం సరాసరిన సుమారు 1.75 లక్షల మంది జర్నీ చేస్తున్నారని.. ఆతర్వాత నాగోల్– రాయదుర్గం మార్గంలో 1.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారని.. ఇక జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో రద్దీ 25 వేలుగా ఉంటుందని తెలిపాయి. నగరంలో అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాలు, కార్లను పార్కింగ్ చేసుకునే అవకాశం లేకపోవడం, పార్కింగ్ ఉన్న చోట చార్జీల బాదుడు షరామామూలే. సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ఇటీవలి కాలంలో పలు మెట్రో స్టేషన్లలో మధ్యభాగం (కాన్కోర్స్)వద్ద చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు నిర్మాణ సంస్థ అవకాశం ఇచి్చంది. ఈ ప్రాంతంలో నిత్యావసరాల దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో రైలు దిగిన వెంటనే సిటీజన్లు వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. (చదవండి: మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో హైటెన్షన్) -
స్పైస్జెట్ నిర్లక్ష్యం.. విమానం వద్దే ప్రయాణికుల పడిగాపులు!
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయంలో దిగాక బస్సు ఏర్పాటు చేయకపోవటం వల్ల సుమారు 45 నిమిషాల పాటు అక్కడే నిరీక్షించారు. ఎంతకూ బస్సు రాకపోవటంతో చాలా మంది తమ లగేజీని పట్టుకుని కాలినడకన టర్మినల్కు వెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 186 మంది ప్రయాణికులతో వెళ్లిన స్పైస్జెట్ విమానం శనివారం రాత్రి 11.24 గంటలకు హస్తినలో దిగింది. వెంటనే ఓ బస్సు వచ్చి కొంత మందిని టర్మినల్కు తీసుకెళ్లింది. మిగిలిన వారు సుమారు 45 నిమిషాలు అక్కడే వేచి ఉన్నారు. బస్సు రాకపోవటంతో అక్కడి నుంచి టర్మినల్ వైపు నడక ప్రారంభించారు. 11 నిమిషాలు నడిచాక 12.20కి బస్సు వచ్చి వారిని తీసుకెళ్లినట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. ఈ విషయంపై స్పైస్జెట్ వివరణ ఇచ్చింది. బస్సు రావటానికి కాస్త ఆలస్యం అయిందని, ఆ తర్వాత విమానం వద్ద ఉన్న ప్రయాణికులతో పాటు నడక ప్రారంభించిన వారందరినీ బస్సులో ఎక్కించుకుని టర్మినల్కు చేర్చినట్లు తెలిపింది. ‘మా సిబ్బంది ఎన్నిసార్లు సూచించినా కొందరు టర్మినల్ వైపు నడిచారు. బస్సులు వచ్చే సరికి కొంత దూరం వెళ్లారు. వారితో పాటు మిగిలిన వారందరిని బస్సుల్లో టర్మినల్ చేర్చాం.’ అని పేర్కొంది స్పైస్జెట్. How often do you see this happening at T3 of the Indira Gandhi International Airport in New Delhi? @flyspicejet kept up cooked up for 45 minutes after announcing “early arrival” of 6 mins at 11:24pm on the SG 8108 Hyd-Delhi. They parked the flight really far away with no buses. pic.twitter.com/sgkR9gXs3Y — Lasya Nadimpally (@nlasya) August 6, 2022 ఇదీ చదవండి: ‘ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలం’.. ఇస్రో అధికారిక ప్రకటన -
విజయవాడ ప్యాసింజర్ లేనట్టేనా?
అనంతపురం సిటీ: కరోనా సాకుతో మూడేళ్ల క్రితం రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లలో ‘అనంతపురం–విజయవాడ’ ఒకటి. అయితే, కోవిడ్ మహమ్మారి ఉధృతి తగ్గినా నేటికీ ఈ రైలును పునఃప్రారంభించలేదు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. రెండేళ్ల తరువాత దశల వారీగా రైళ్లను పునఃప్రారంభిస్తున్నా.. ఈ ప్యాసింజర్ రైలు విషయంలో రైల్వే శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేద,మధ్య తరగతికి పెద్దదిక్కు విజయవాడకు వెళ్లే (ట్రైన్ నంబర్:56503/04) ఈ ప్యాసింజర్ రోజూ ఉదయం 7.20 గంటలకు బెంగళూరు (యశ్వంతపుర)లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం చేరేది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు విజయవాడ చేరుకునేది. మొత్తం 13 బోగీలతో 700 మంది ప్యాసింజర్ల కెపాసిటీతో 75 స్టేషన్లలో ఆగుతూ ప్రయాణించి ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేది. రైలు ద్వారా రోజూ 2 వేల నుంచి 3 వేల మంది దాకా ప్రయాణికులు రాకపోకలు సాగించే వారు. వీరిలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే అధికం. రాష్ట్ర విభజన తరువాత విజయవాడకు పెరిగిన రద్దీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్నత చదువులు గానీ, మెరుగైన వైద్యసేవల కోసం గానీ మరే ఇతర అవసరాల కోసమైనా ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్కు రాకపోకలు సాగించేవారు. అయితే రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్తో సత్సంబంధాలు తగ్గిపోయాయి. పిల్లల చదువులు, ఇతర పనులపై ఇప్పుడు ఎక్కువగా విజయవాడకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు ఎక్కువగా విజయవాడకు తిరగడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచాల్సిందిపోయి, ఉన్న రైళ్లను రద్దు చేయడం ఏమిటో అంతుబట్టడం లేదు. (చదవండి: కోర్టు ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం) -
డోంట్ బీ ప్రాంక్..సరదా కాస్త సీరియస్ ఇష్యూగా..
సాక్షి, హైదరాబాద్, హిమాయత్నగర్: అది జడ్చర్ల బస్టాండ్. గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా కొందరు యువకులు ప్రత్యక్షమై భిక్షాటన పేరిట ప్రయాణికులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ప్రారంభించారు. డబ్బులు అడుక్కుంటూ మహిళల పాదాల మీద పడ్డారు. వీరి ప్రవర్తన శృతి మించడంతో ప్రయాణికుల్లో సహనం నశించి వారిని పట్టుకుని చితకబాదారు. దాంతో యువకులు ఇదంతా ప్రాంక్ అని రహస్యంగా వీడియో చిత్రీకరణ చేస్తున్నామని వివరించారు. దీంతో మరింత అసహనానికి గురైన ప్రయాణికులు వారిని పోలీసులకు అప్పగించబోయారు. అయితే వారు కాళ్లావేళ్లా పడి బతిమాలాడడంతో వదిలేశారు. ఒకటి కాదు రెండూ కాదు ప్రాంక్ వీడియోల పేరిట పలువురు చెలరేగిపోతున్న సంఘటనలు నగరం చుట్టుపక్కల తరచు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో ప్రాంక్ వీడియో సృష్టించిన వివాదంతో మరోసారి ఈ ప్రాంక్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. . ప్రాంక్...యాక్... ఇలాంటి వీడియోలకు మంచి వ్యూస్ వస్తుండడంతో అనేక మంది యూ ట్యూబర్స్ ప్రాంక్ బాట పడుతున్నారు. వీరిలో కొందరు పరిధిలో ఉండి పెద్దగా ఇబ్బంది పెట్టని ప్రాంక్ వీడియోలు చేస్తుండగా మరికొందరు మాత్రం మరీ బరి తెగిస్తున్నారు. ఓ లేడీ యూట్యూబర్ తాను చేసే ఓ గేమ్షో కోసం జనాల మధ్య వీడియోస్ చేస్తుంది. మెట్రో రైలులో కింద కూర్చుని కర్చీఫ్ వేసుకుని అడుక్కోవడం మొదలుకుని మెట్రో రైలులో వీరి టీమ్కు చెందిన అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకోవడం, ఇతరులను ముద్దు అడగడం వంటివీ చేయిస్తోంది. ఫిర్యాదు చేస్తే చర్యలు... ప్రాంక్ వీడియోల పేరుతో పబ్లిక్ ప్రదేశాలు సహా ఎక్కడా అశ్లీలం, అభ్యంతరకరమైన కార్యకలాపాలకు పాల్పడకూడదు. ఇటీవల ఇలాంటి వీడియోలు యూట్యూబ్లోనూ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. ప్రాంక్స్ వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. వీటి ఆధారంగా కేసులు నమోదు చేసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రై మ్ ఏసీపీ -
క్యాబ్.. ఓన్లీ క్యాష్!
సాక్షి, హైదరాబాద్: క్యాబ్లో కాసింత ప్రశాంతంగా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీ జేబులో నగదు ఉందో లేదో చూసుకొని మరీ క్యాబ్ బుక్ చేసుకోండి. గూగుల్ పే నుంచి, పేటీఎం వంటి యూపీఐ సేవల నుంచి చార్జీలు చెల్లించవచ్చనుకుంటే క్యాబ్ లభించడం కష్టమే. ఆన్లైన్ పేమెంట్లపై సేవలను అందజేసేందుకు నగరంలో క్యాబ్ డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న వెంటనే చార్జీల చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. నగదు రూపంలోనే చెల్లించనున్నట్లు ప్రయాణికులు భరోసా ఇస్తేనే క్యాబ్లు వస్తున్నాయి. లేదంటే ఉన్నపళంగా రైడ్స్ రద్దవుతున్నాయి. కొంతమంది ఆటోడ్రైవర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. చివరి నిమిషంలో రైడ్స్ రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉబెర్, ఓలా తదితర సంస్థలకు చెందిన క్యాబ్లు, ఆటోలు ప్రయాణికులకు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు, పోలీసులు క్యాబ్ల నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో కొంతమంది డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మోటారు వాహన నిబంధనల ప్రకారం ప్రయాణికులు నమోదు చేసుకున్న రైడ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడానికి వీల్లేదు. అలాంటి రైడ్స్ రద్దును పోలీసులు, రవాణా అధికారులు తీవ్రంగా పరిగణించి రూ.500 వరకు జరిమానా విధించవచ్చు, కానీ ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ రకాల కారణాలతో డ్రైవర్లు ప్రతి పది రైడ్లలో 3 నుంచి 4 రైడ్లను రద్దు చేయడం గమనార్హం. డ్రైరన్ల నెపంతో రద్దు.. మరోవైపు డ్రై రన్ సాకుతో కొందరు డ్రైవర్లు రైడ్లను రద్దు చేస్తున్నారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకొన్న సమయానికి కనీసం 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉంటే క్యాబ్లు, ఆటోలు ఠంచన్గా బుక్ అవుతున్నాయి. అంతకంటే ఎక్కువ దూరంలో ఉంటే మాత్రం వెంటనే రద్దవుతున్నాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘మహిళలు, పిల్లలతో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఆకస్మిక రద్దులతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. క్యాబ్లను నమ్ముకొని ప్రయాణం చేయడం కష్టమనిపిస్తుంది.’ అని మారేడుపల్లికి చెందిన సుధీర్ విస్మయం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో రైడ్ల రద్దు ఎక్కువగా ఉంటోంది. ‘పెళ్లిళ్లు, పుట్టిన రోజు వంటి వేడుకల్లో పాల్గొనేందుకు క్యాబ్లను నమ్ముకొని నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లకు వెళ్తే తిరిగి ఇల్లు చేరుకోవడం కష్టమే’నని ఎల్బీనగర్కు చెందిన నవీన్ చెప్పారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకున్న తరువాత 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే డ్రైవర్లు వెంటనే రైడ్ రద్దు చేస్తున్నారు. మరోవైపు దూరాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా కొందరు ఆకస్మిక రద్దుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గిట్టుబాటు కావడం లేదు డ్రై రన్లలో డ్రైవర్లు ఎక్కువ దూరం ఖాళీగా వెళ్లాల్సి ఉంటుంది. పెరిగిన డీజిల్ ధరల దృష్ట్యా ఇది ఎంతో భారం. ఓలా, ఉబెర్ సంస్థలు ఇచ్చే కమీషన్లు గిట్టుబాటు కావడం లేదు. ఆన్లైన్ చెల్లింపుల్లో సదరు క్యాబ్ అగ్రిగేటర్ల ఖాతాల్లోంచి డ్రైవర్ ఖాతాలోకి జమ కావడానికి చాలా సమయం పడుతోంది. అందుకే కొంతమంది డ్రైవర్లు తప్పనిసరి పరిస్థితుల్లోనే రైడ్స్ రద్దు చేస్తున్నారు. – షేక్ సలావుద్దీన్, చైర్మన్, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ (చదవండి: నిరుద్యోగులకు బస్పాస్లో 20 శాతం రాయితీ) -
ప్రాంక్ వీడియో.. చితకబాదిన ప్రయాణికులు
జడ్చర్ల: ప్రాంక్ వీడియోకోసం భిక్షాటన చేస్తూ.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి యువకులు దెబ్బలు తిన్న ఘటన జడ్చర్ల కొత్త బస్టాండ్లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం ప్రకారం.. జడ్చర్ల కొత్త బస్టాండ్లో మధ్యాహ్నం సమయంలో ఆకస్మికంగా కొందరు యువకులు ప్రయాణికుల దగ్గరకు వచ్చి భిక్షాటనతో హడావుడి చేశాడు. డబ్బులు ఇవ్వని వారి పాదాలను పట్టుకున్నారు. మహిళల పట్ల కొంత అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రవర్తన హద్దు మీరడంతో అక్కడున్న ప్రయాణికులు వారిని పట్టుకుని చితక బాదారు. దీంతో తాము ప్రాంక్ వీడియోలు చేస్తున్నామని, ఈ సన్నివేశాలను తమ మిత్రులు రహస్యంగా చిత్రీకరిస్తున్నారని చెప్పడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో సదరు యువకులు ప్రయాణికులకు క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు. (చదవండి: యాప్స్తోనే లక్ష్మీపతి నెట్వర్క్) -
సొంత దేశంలోనే వెల్లువెత్తుతున్న వ్యతిరేకత... సందిగ్ధ స్థితిలో పుతిన్!
A video of the pilot’s message: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న భీకరమైన పోరు నేటికి 19వ రోజుకు చేరుకుంది. ఒకవైపు ఉక్రెయిన్ లొంగిపోమని రష్యా చెబుతున్న తలవంచేదే లేదంటూ యుద్ధం చేస్తోంది. దీంతో రష్యా వైమానిక క్షిపణి దాడులతో బాంబుల వర్షం కురిపించి ఉక్రెయిన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ విధ్వంస సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలు సైతం హెచ్చరికలు, ఆంక్షలు జారీ చేసిన తనదైన యుద్ధ వ్యూహంతో చెలరేగిపోతుంది. రష్యా సృష్టించి విధ్వంసకర పోరులో వేలాదిమంది ఉక్రెయిన్ పౌరులను పొట్టన పెట్టుకుంది. మహిళలు, పిల్లలు, ఆస్పత్రుల పై దాడులు జరిపి రాక్షస విధ్వంసానికి బీజం వేసింది. దీంతో రష్యా దేశంలోని ప్రజలే ఆ దేశ అధ్యక్షుడి వ్యవహార తీరుపై ఆగ్రహం చెందడమే కాక నిరసనలు చేశారు. అయినప్పటికీ పుతిన్ తన పంథా మార్చుకోకపోగ సరికొత్త వ్యూహాలతో ఉక్రెయిన్ని దురాక్రమణ చేసేందుకు పావులను కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాలోని ఒక పైలెట్ ఉక్రెయిన్పై యుద్ధం నేరమని, దీనిని ఆపేందుకు వివేకవంతమైన పౌరులు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చాడు. ఈ మేరకు అతను విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు తెలివైన పౌరులు తనతో ఏకీభవించడమే కాక ఆపేందుకు తమవంతుగా కృషిచేస్తారని భావిస్తున్నా అని అన్నాడు. అంతేకాదు ప్రయాణికులకు కూడా చప్పట్లతో తమ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఉక్రేనియన్ దౌత్యవేత్త ఒలెగ్జాండర్ షెర్బా మాట్లాడుతూ.. "పైలట్ రష్యాకు చెందిన ఫ్లాగ్ ఎయిర్లైన్ ఏరోఫ్లాట్ అనుబంధ సంస్థ అయిన పోబెడా కోసం పనిచేస్తున్న పైలట్ సాయర్ . అతను టర్కీలోని అంటాల్యకి చేరుకుంటున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశాడు." అని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A Russian pilot tells passengers that he believes “the war in Ukraine is a crime,” adding “I think each sensible citizens will agree with me and will do everything to make it stop.” Rare to see public opposition to the war given the consequences such a statement will have pic.twitter.com/55h18mWI9U — Pjotr Sauer (@PjotrSauer) March 11, 2022 (చదవండి: మాటలు జాగ్రత్త! తేడా వస్తే అంతే.. ఇలా వచ్చి అలా తలపై కోడిగుడ్డుతో...) -
ఆమె కలలో కూడా ఊహించి ఉండదు! ఇలా జరుగుతుందనీ..
she Is The Only Passenger: ఒక్కోసారి మనకు భలే విచిత్రమైన అనుభవాలు చోటు చేసుకుంటాయి. వాటిని మనం కనీసం కలలో కూడా ఊహించి ఉండం. అలాంటి చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. నమ్మశక్యంగా కూడా అనిపించదు. మనం చెప్పిన ఎవరూ నమ్మరు అన్నట్లుగా జరుగుతుంటాయి. అచ్చం అలాంటి విచిత్రమైన అనుభవం ఎదురైంది నార్వేకి చెందిన మహిళకి. వివరాల్లోకెళ్తే...కోవిడ్ -19 ఆంక్షలతో అంతర్జాతీయ ప్రయాణాలు చేయకుండా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో చాలా దేశాల్లో ఇంకా అంతర్జాతీయ విమానాలు తిరగడం లేదనే చెప్పాలి. ఇప్పుడిప్పడే కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో పలు దేశాల్లో ఆంక్షలు సడలించడంతో విమానాయాన సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. ఈ మేరకు నార్వే నుంచి రోరోస్ బయలు దేరుతున్న విమానాన్ని ఒకే ఒక్క మహిళా ప్రయాణికురాలు బుక్ చేసుకుంది. ఇంకా ఎవరు బుక్ చేసుకోలేదు. అయితే సదరు మహిళకు కూడా తెలియదు ఆ విమానంలో తాను ఒక్కత్తే ప్రయాణికురాలినని. దీంతో ఆ మహిలో ఆనందానికి అవధులే లేవు. తాను మాత్రమే ఈ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలినని తెలియడంతో ఆమె ఆ విమానంలో ప్రయాణిస్తున్న సంఘటనను గుర్తుంచుకునేలా వీడియో రికార్డు చేసింది. ఆ విమానంలో ఫైలెట్లు, ఆమె తప్ప మరెవ్వరూ లేరు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Aurora Torres (@aurooratorres) (చదవండి: ఆ రాయి అందర్నీ చంపేస్తుంది) -
మెట్రో స్టేషన్లలో జనరిక్ మెడికల్ షాపులు
సాక్షి హైదరాబాద్: మెట్రో స్టేషన్లలో ఇక నుంచి జనరిక్ ఔషధాలు, ఇతర ఫార్మా ఉత్పత్తులు లభించనున్నాయి. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ , దవా దోస్త్ సంస్థతో భాగస్వామ్యం చేసుకోవడంతో మెట్రో ప్రయాణికులకు ఈ అవకాశం దక్కింది. దవా దోస్త్ సంస్థ ఏర్పాటు చేసిన తొలి హై ఫ్రీక్వెన్సీ స్టోర్ను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైల్ ఉన్నతాధికారులు, ఇతర అతిథులు పాల్గొన్నారు. త్వరలోనే దవా దోస్త్ కేంద్రాలు అమీర్పేట, కెపీహెచ్బీ, హైటెక్ సిటీ, ఎంజీబీఎస్ తదితర స్టేషన్లలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులతో పాటుగా సందర్శకులకు ఇది సంతోషకరమైన సమాచారం. ప్రయాణికులు అత్యంత సౌకర్యవంతంగా జనరిక్ మందులు, ఇతర ఔషధ ఉత్పత్తులను ఆకర్షణీయమైన రీతిలో 15 నుంచి 80 శాతం రాయితీలలో పొందవచ్చన్నారు. ఎల్ అండ్ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో రైల్ వద్ద దవా దోస్త్ను స్వాగతిస్తున్నామన్నారు. ఖైరతాబాద్ వద్ద వచ్చిన ఈ స్టోర్తో రాయితీ ధరలలో ప్రయాణికులు ఔషధాలు పొందవచ్చన్నారు. దవాదోస్త్ సంస్థ సీఈవో అమిత్చౌదరి మాట్లాడుతూ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద దవా దోస్త్ ప్రారంభించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నామన్నారు. -
ఇంటి నుంచి నేరుగా ప్రయాణించేలా ... బస్సు టు క్యాబ్
సాక్షి హైదరాబాద్: గ్రేటర్లో ప్రజా రవాణా సదుపాయాలు విరివిగా అందుబాటులో ఉన్నప్పటికీ ‘సీమ్లెస్’ జర్నీ ఒక కలగానే మారింది. నగరంలోని ప్రధాన రూట్లలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. కానీ ప్రయాణికులు తమ ఇంటి నుంచి నేరుగా మెట్రో స్టేషన్కు చేరుకొనే సదుపాయం లేదు. వందల కొద్దీ కాలనీలు, బస్తీలు, నగరంలోని అనేక ప్రాంతాలు మెట్రో రైలుకు దూరంగానే ఉన్నాయి. మరోవైపు కాలనీలకు మినీ బస్సులను నడపాలనే ప్రతిపాదన కూడా ఇప్పటికీ అమలుకు నోచలేదు. ఇక హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకొనే వారికి కూడా లాస్ట్మైల్ కనెక్టివిటీ అందుబాటులో లేదు. బస్సు దిగిన ప్రయాణికులు గమ్యం చేరుకొనేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో అన్ని అలైటింగ్ పాయింట్ల వద్ద క్యాబ్ సేవలను ఏర్పాటు చేసి ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఎదురు చూపులు లేకుండా... ప్రస్తుతం నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి ఓలా, ఉబెర్ క్యాబ్లు నడుస్తున్నాయి. రైల్వేస్టేషన్కు చేరుకోవడానికి ముందే ప్రయాణికులు క్యాబ్లను బుక్ చేసుకోవచ్చు. శంషాబాద్ విమాశ్రయంలోనూ ఈ తరహా క్యాబ్ సదుపాయం ఉంది. అలాగే మహాత్మాగాంధీ, జూబ్లీ,దిల్సుఖ్నగర్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, తదితర బస్స్టేషన్లు, కోఠీ. కాచిగూడ, కూకట్పల్లి, హయత్నగర్ వంటి ప్రయాణ ప్రాంగణాల నుంచి క్యాబ్ల సేవలను ఏర్పాటు చేయడం వల్ల సిటీ బస్సులు వెళ్లలేని కాలనీలకు ప్రయాణికులు చేరుకోవచ్చు. బస్సు కోసం పడిగాపులు అవసరం లేకుండా లాస్ట్మైల్ వరకు ప్రయాణ సదుపాయం లభిస్తుంది. మరోవైపు ఆర్టీసీపైన ప్రజల్లో మరింత విశ్వసనీయత పెరుగుతుంది. ఇందుకనుగుణంగా క్యాబ్ల అనుసంధానంపైన దృష్టి సారించినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ‘బస్సు దిగిన వాళ్లు ఆటో, క్యాబ్ వంటి వాహనాల్లో తమకు నచ్చినది ఎంపిక చేసుకొని వెళ్లవచ్చు.కానీ ఆర్టీసీ అలైటింగ్ పాయింట్ల వద్ద క్యాబ్లు ఉంటాయనే భరోసా ముఖ్యం. అందుకోసమే ఈ అనుసంధాన ప్రక్రియ..’ అని వివరించారు. అలైటింగ్ పాయింట్ల గుర్తింపు త్వరలోనే నగరంలోని అన్ని ప్రాంతాల్లో అలైటింగ్ పాయింట్లను గుర్తించనున్నారు. ఏయే ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కడికి బయలుదేరుతున్నారనే అంశం ప్రాతిపదికగా వీటి ఎంపిక ఉంటుంది. సిటీ బస్సులు చేరుకోలేని ప్రాంతాలకు క్యాబ్లు వెళ్లే విధంగా అలైటింగ్ కేంద్రాలను గుర్తిస్తారు. మరోవైపు ప్రయాణికుల అవసరాలు, డిమాండ్కు అనుగుణంగా క్యాబ్ల అనుసంధానం ఉంటుంది -
ఓలా, ఉబెర్ క్యాబ్లు సాగిస్తున్న నయా దందా!...భరోసా లేని ప్రయాణం!!
సాక్షి, హైదరాబాద్: హిమాయత్నగర్కు చెందిన రాజేశ్ కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. మధ్యాహ్నం ఏ ఇబ్బంది లేకుండా క్షణాల్లోనే క్యాబ్ బుక్ అయింది. భార్యా పిల్లలతో కలిసి సంతోషంగా బయలుదేరాడు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ నుంచి తిరిగి బయలు దేరేందుకు క్యాబ్ కోసం ప్రయత్నించాడు. రద్దీ సమయం కావడంతో క్యాబ్ బుకింగ్కు పది నిమిషాలు పట్టింది. ‘హమ్మయ్య ఏదో ఒక విధంగా క్యాబ్ బుక్ అయింది. ఇక వెళ్లిపోవచ్చు’ అనుకుంటుండగా క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేశాడు. ఎక్కడెళ్లాలి అని అడిగాడు. హిమాయత్నగర్కు అని చెప్పడంతో ఫోన్ పెట్టేశాడు. గంట గడిచినా క్యాబ్ రాలేదు. బుకింగ్ రద్దు కాలేదు. మరో క్యాబ్ కోసం ప్రయత్నించాడు. క్యాబ్ డ్రైవర్ రూ.1000 డిమాండ్ చేశాడు. బుకింగ్ రద్దు చేసుకొంటే వస్తానన్నాడు.మరో గత్యంతరం లేకపోవడంతో డ్రైవర్ డిమాండ్కు అంగీకరించవలసి వచ్చింది. ఇది ఒక్క రాజేశ్ కు ఎదురైన అనుభవం మాత్రమే కాదు. ఓలా, ఉబెర్ క్యాబ్లు సా గిస్తున్న నయా దందా ఇది. ప్రయాణికులను ఠారెత్తిస్తున్నారు. చివరినిమిషంలో రైడ్లను రద్దు చేసుకొనే విధంగా ఒత్తిడి తెస్తున్నారు. అడిగినంతా ఇస్తే ఓకే అంటున్నారు. దీంతో క్యాబ్ ఉందనే భరోసాతో భార్యా పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తున్న వారు ఆ తరువాత తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఒక్క శంషాబాద్ రూట్లోనే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కొంతకాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. భరోసాలేని క్యాబ్ జర్నీ... సాధారణంగా ఉదయం,సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో క్యాబ్ బుకింగ్లకు కొంత సమయం పట్టవచ్చు. ఏదో ఒకవిధంగా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లొచ్చని భావించే ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రయాణికులకు ఇలా చివరి నిమిషంలో రైడ్స్ రద్దు కావడంతో తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. ‘క్యాబ్ల వల్ల ప్రయాణానికి భరోసా లభించడం లేదని, డ్రైవర్లకు గిట్టుబాటయితేనే వస్తారని’ అంబర్పేట్కు చెందిన రాజు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది డ్రైవర్లు తాము రావడం లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. మరి కొందరు రైడ్ రద్దు చేసుకొని తాము అడిగినంతా నగదు రూపంలోనే చెల్లిస్తే వస్తామని పేచీ పెడుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డ్రైవర్లు డిమాండ్ చేసినంత చెల్లించవలసి వస్తుంది. ‘ఇలాంటి క్యాబ్ డ్రైవర్లపైన ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని’ మల్కాజిగిరికి చెందిన సతీష్ అభిప్రాయపడ్డారు. కమిషన్లు తగ్గినందుకే ఇలా... ఓలా, ఉబెర్ సంస్థలు డ్రైవర్లకు కమిషన్ల రూపంలో చెల్లిస్తాయి. ప్రతి కిలోమీటర్కు కొంత మొత్తాన్ని డ్రైవర్ల ఖాతాలో జమ చేస్తారు. కానీ ఇలా కమిషన్ రూపంలో వచ్చే ఆదాయం తమకు ఏ మాత్రం చాలడం లేదంటూ డ్రైవర్లు నేరుగా ప్రయాణికులతో బేరాలకు దిగుతున్నారు. ఓలా, ఉబెర్ల నుంచి రైడ్ బుకింగ్లు వచ్చే వరకు ఎదురు చూసి ఆ తరువాత ఈ తరహా బేరసారాలను కొనసాగిస్తున్నారు. డిజిటల్ అయితే నో... సదరు ఓలా, ఉబెర్ క్యాబ్ సంస్థలతో తమ కమిషన్లపైన ఒప్పందం చేసుకోవలసిన డ్రైవర్లు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సాయంత్రం 6 దాటితే చాలు. రద్దీ ఉండే రూట్ల లో క్యాబ్లు బుక్ కావడం లేదు. ఒకవేళ అయినా ‘డిజిటల్ పేమెంట్స్’ అనగానే నిరాకరిస్తున్నారు. ఓలా, ఉబెర్ యాప్లలో రెంటల్ బుకింగ్స్ సదుపాయం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆన్లైన్లో రెంటల్ బుకింగ్స్కు డ్రైవర్లు నిరాకరించడం గమనార్హం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులను కూడా క్యాబ్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చివరి నిమిషంలో రైడ్ల రద్దు వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో పడాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓలా, ఉబెర్ ఇబ్బందుల దృష్ట్యా కొద్ది రోజుల క్రితం ఎయిర్పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ క్యాబ్లను అందుబాటులోకి తెచ్చారు. -
కోవిడ్ ప్రమాద ఘంటిక వేళ... సంక్రాంతికి సొంతూళ్లకు పయనమవుతున్న నగరవాసులు
సాక్షి హైదరాబాద్: ఒకవైపు కోవిడ్ ప్రమాద ఘంటికలు. మరోవైపు కలిసొచ్చిన సంక్రాంతి సెలవులు. నగరవాసులు బతుకుజీవుడా అంటూ పల్లెబాట పడుతున్నారు. పిల్లలకు సెలవులు మొదలవడంతో సొంతూరుకు ప్రయాణాలు పెరిగాయి. పది రోజుల పాటు ఊరిలో ప్రశాంతంగా ఉండవచ్చనే ఉద్దేశంతో చాలా మంది తరలివెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత వైరస్ తగ్గుముఖం పట్టవచ్చనే ఆశావహ దృక్పథంతో బయలుదేరుతున్నారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. నగర శివార్లలోని పలు కూడళ్లు సైతం ప్రయాణికులతో పోటెత్తాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు చాలామంది సొంత వాహనాలపై తరలి వెళ్లారు. ఒక్కసారిగా పెరిగిన వాహనాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. మరో వారం రోజుల పాటు సంక్రాంతి ప్రయాణాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. రైళ్లలో పెరిగిన రద్దీ.. కొంతకాలంగా తప్పనిసరి ప్రయాణాలు, సాధారణ రాకపోకలతో కనిపించిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ఒక్కసారిగా రద్దీగా పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూరు, పాట్నా, ముంబై తదితర ప్రాంతాలకు బయలుదేరిన రైళ్లలో రిజర్వేషన్ బోగీలతో పాటు జనరల్ బోగీలు సైతం కిక్కిరిశాయి. సాధారణ రోజుల్లో సుమారు 1.8 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా శనివారం మరో 25 వేల మంది అదనంగా బయలుదేరినట్లు రైల్వే అధికారులు అంచనా వేశారు. ఏపీ, బెంగళూరు వైపు వెళ్లే రైళ్లతో పాటు, ఉత్తరాది రైళ్లలోనూ రద్దీ పెరిగింది. బస్స్టేషన్లలో సందడి.. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సులు ప్రయాణికులతో నిండుగా బయలుదేరాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సందర్భంగా 4,318 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ బస్సుల్లోనే ఎక్కువ మంది తరలివెళ్లారు. ఒకటి, రెండు రోజుల్లో పండుగ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారుల అంచనా. మరోవైపు నగర శివార్లలోనూ అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఉప్పల్ క్రాస్రోడ్స్, ఎల్బీనగర్, మెహిదీపట్నం, ఆరాంఘర్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు పెరిగాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు చాలా మంది సొంత బైక్లు, కార్లలో ఊళ్లకు బయలుదేరారు. సిటీలో పెరిగిన ట్రాఫిక్.. వాహనాల రాకపోకలు ఒక్కసారిగా పెరగడంతో నగరంలోని అనేక చోట్ల ట్రాఫిక్ ర ద్దీ నెలకొంది. ఉప్పల్– వరంగల్, సికింద్రాబాద్–బేగంపేట్, అమీర్పేట్, దిల్సుఖ్నగర్–ఎల్బీనగర్, మెహిదీపట్నం, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ చోటుచేసుకుంది. -
ఊరికి పోతే... జేబుకు వాతే!
సాక్షి హైదరాబాద్: ఏటా అదే తంతు. అదే దోపిడీ. పండగొచ్చిందంటే చాలు ప్రయాణికుల జేబులు లూటీ. కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన వందలాది బస్సులు, టూరిస్ట్ క్యాబ్లు, మ్యాక్సీ క్యాబ్లు, మినీ బస్సులు సంక్రాంతి దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నాయి. డిమాండ్కు తగినన్ని రైళ్లు అందుబాటులో లేకపోవడంతో నగర వాసులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సివస్తోంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలను అమాంతంగా పెంచేసి ‘పండగ’ చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.350 వరకు చార్జీ ఉంటే సంక్రాంతి సందర్భంగా రూ.600 నుంచి రూ.700కు పెంచారు. చార్జీలను పెంచొద్దంటూ ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన బస్సులన్నీ స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్నాయి. ఆన్లైన్లో ప్రయాణికులకు టిక్కెట్ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. అయినప్పటికీ రవాణా అధికారులు మొక్కుబడి తనిఖీలకు పరిమితమవుతున్నారు. అడ్డగోలుగా.. ఈ నెల 8 నుంచి 16 వరకు పిల్లలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. పైగా ఏపీలో సంక్రాంతి వేడుకలకు ఉండే ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా సొంత ఊరుకు వెళ్తున్నారు. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. కొద్దిరోజుల క్రితం దక్షిణమధ్య రైల్వే ప్రకటించిన మరో 16 ప్రత్యేక రైళ్లల్లోనూ కేవలం రెండు రోజుల్లో బెర్తులు భర్తీ అయ్యాయి. నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రైళ్లు, ఆర్టీసీ బస్సుల తరహాలో ప్రైవేట్లోనూ ముందస్తు బుకింగ్లకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చార్జీలను అడ్డగోలుగా పెంచారు. హైదరాబాద్ నుంచి వైజాగ్కు సాధారణ రోజుల్లో రూ.900 వరకు ఉంటే ఇప్పుడు రూ.1600పైనే తీసుకుంటున్నారని కూకట్పల్లికి చెందిన సత్యనారాయణ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి సొంతంగా కారు బుక్ చేసుకొని వెళ్లాలన్నా, కొంతమంది ప్రయాణికులు మినీ బస్సు బుక్ చేసుకోవాలనుకున్నా రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చవుతుంది. ‘సంక్రాంతి చాలా పెద్ద పండగ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరెళ్లాలని ఉంది. కానీ నలుగురం వెళ్లి, తిరిగి రావడానికి చార్జీలే రూ.10 వేలు దాటేటట్లుంది’ అని సైనిక్పురి ప్రాంతానికి చెందిన వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ 4,318 అదనపు బస్సులు.. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 4,318 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 7 నుంచి 14 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఏపీలోని దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు 550 బస్సుల్లో రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, ఈసీఐఎల్, కేపీహెచ్బీ, ఎస్సార్నగర్, అమీర్పేట్, టెలిఫోన్ భవన్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏపీలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు ఇవి నడుస్తాయి. -
సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!
Pilots False Positive Covid Report: కొన్ని ప్రయాణాలు మనం మధురానుభూతుల్ని ఇస్తాయి. కానీ కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్ని ఆందోళనకు గురిచేయడమే కాక మళ్లీ ఇంకెప్పుడు ప్రయాణాలు చేయకూడదనే భావం కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవం బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలోని ప్రయాణీకులకు ఎదురైంది. (చదవండి: ఖరీదైన గిఫ్ట్ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్లు) అసలు విషయంలోకెళ్లితే.....బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణీకుల బృందం ఐదు గంటలకు పైగా చిక్కుకుపోయింది. వారు పయనిస్తున్న విమాన పైలట్కి కరోనా పాజిటివ్ రావడంతో లండన్ నుండి బార్బడోస్కు బయలుదేరాల్సిన విమానాన్ని టేకాఫ్కు ముందు బ్రిటిష్ ఎయిర్వేస్ నిలిపివేసింది. అయితే అప్పటికప్పుడు మరో పైలెట్ని నియమించడం ఆలస్య అవుతుందని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రకటించడమే కాక ప్రయాణికులను విమానంలోంచి దింపేసింది. నిజానికి ఆ విమానం అప్పటికే రెంగు గంటలు ఆలస్యం. అయితే విమానం బయలుదేరడానికి సిద్ధం అయ్యిందో లేదా మళ్లీ ఈ కారణంగా మరింత ఆలస్యం అవ్వడంతో ప్రయాణికులు ఒకింత అసహనానికి గురైయ్యారు. అంతేకాదు ఆ ప్రయాణికులదరికి బ్రిటిష్ ఎయిర్వేస్ ఆహారాన్ని అందజేసింది. అయితే ఐదు గంటల తర్వాత ప్రయాణికులందర్నీ విమానం ఎక్కేందుకు అనుమతి ఇచ్చారు. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే పైలట్కి కోవిడ్ అని తప్పుడు రిపోర్ట్ వచ్చింది అంటూ ఎయిర్వేస్ ప్రకటించడం గమనార్హం. అంతేకాదు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమపణలు మాత్రమే కాదు మాకు చక్కగా సహకరించినందుకు కూడా ధన్యవాదాలు అని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రయాణికులకు తెలియజేసింది. పైగా బార్బడోస్లో దిగినప్పుడు ఆలస్యానికి క్షమాపణలు కోరుతూ ప్రయాణికులకు కరేబియన్ రమ్ బాటిళ్లను అందజేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. (చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!) -
దారి చూడు.. దుమ్ము చూడు
సాక్షి, నేలకొండపల్లి(ఖమ్మం): ఆ రోడ్డులో ప్రయాణించేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనం కనిపించని పరిస్థితి. రోడ్డు నిర్మాణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి పట్టింపు లేకపోవడంతో దుమ్ము లేస్తోంది. దీంతో వాహనదారులతో పాటు నడుస్తూ వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం నీళ్లు కూడా చల్లని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. నీళ్లు చల్లడం లేదు.. మండలంలోని చెరువుమాదారం క్రాస్రోడ్డు నుంచి బౌద్ధక్షేత్రం వరకు ఉన్న రహదారిలో దాదాపు 4 కిలోమీటర్ల మేర ప్రభుత్వం నాలుగు లైన్ల రహదారిని మంజూరు చేసింది. రూ.17 కోట్లతో రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కాగా నేలకొండపల్లిలో రహదారి నిర్మాణ పనుల విషయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస జాగ్రత్తలు మరిచిపోయారని ప్రజలు మండిపడుతున్నారు. కంకరపోసిన రహదారిపై వాహనాలు వెళ్తుంటే వెనుక నుంచి వచ్చే వారికి ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఎండల తీవ్రత వలన రహదారిపై ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొట్టించాల్సి ఉంది. కానీ సదరు కాంట్రాక్టర్ అడపాదడపా నీళ్లు కొట్టించి చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఇటీవల ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. తృటిలో ప్రమాదం తప్పింది. అనేక వాహనాలు పల్టీకొట్టిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని, కాంట్రాక్టర్ దుమ్ము లేవకుండా నిత్యం నీరు చల్లించేలా చూడాలని కోరుతున్నారు. -
చైనాలో పడవ బోల్తా.. 10 మంది మృతి
బీజింగ్: నైరుతి చైనాలోని గిజౌప్రావీన్స్లో పడవ బోల్తా పడటంతో సుమారు 10 మంది మృతి చెందారని, ఐదుగురు గల్లంతు అయినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన లియుపాన్షుయ్ నగరంలోని జాంగే నదిలో చోటు చేసుకుందని. ప్రమాదానికి గురైన పడవ 40 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రయాణించ గలిగే విధంగా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారు) ఈ క్రమంలో ఆ పడవలో ఎంతమంది ప్రయాణించారు అనేది ఇంకా స్పష్టం కాలేదని, ప్రయాణికులంతా విద్యార్థులేనని గుర్తించారు. ఈ ఘటన జరిగిన వెంటనే 17 రెస్య్కూ టీంలు 50 బోట్లతో సహా ప్రయాణికులను కాపాడే ఆపరేషన్లు చేపట్టారని, అధికారులు ఈ ప్రమాదానికి గల కారణాలు గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు చైనా జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. (చదవండి: ఆ విమానాలను పునరుద్ధరిస్తున్నాం: బైడెన్) -
విమానంలో పిచ్చి చేష్టలు.. అందరూ చూస్తుండగా ప్యాంటు విప్పి..
వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచాన్ని మార్చేసింది. కుటుంబాలను, మానవ జీవితాలను అతలాకు తలం చేసింది. అయినా ఇప్పటికీ కొందరు కోవిడ్ని అంత సీరియస్గా తీసుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కోవిడ్ నిబంధనలను పాటించకుండా మూర్ఖంగా వ్యవహరిస్తోన్న వ్యక్తులు మనకు నిత్యం తారసపడుతూనే ఉంటారు. అలాంటి వాడే కొలరాడోకి చెందిన 24 ఏళ్ళ లాండన్ గ్రియర్. ఆలాస్కా ఎయిర్లైన్ ఫ్లైట్లో మార్చి 9న ప్రయాణిస్తోన్న సదరు వ్యక్తిని విమాన సిబ్బంది మాస్క్ పెట్టుకోమని పదేపదే కోరారు. గ్రియర్ నిద్రనటిస్తూ, మాస్క్పెట్టుకోమని పదే పదే విజ్ఞప్తి చేసినా, వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిం చాడు. అంతేకాకుండా ఫ్టైట్లోనే తన సీటుపైనే మూత్రవిసర్జన చేసి అసహ్యంగా ప్రపవర్తించడంతో తోటి ప్రయాణీకులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో విమానం ల్యాండ్ అయిన అనంతరం 24 ఏళ్ళ లాండన్ గ్రియర్ను ఎఫ్బిఐ అరెస్టు చేసింది. డెన్వర్లోని జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేశారు. గ్రియర్ సీటెల్ నుంచి డెన్వర్కి ఫ్లైట్ ఎక్కే ముందు మూడు నుంచి నాలుగు బీర్లను తాగానని ఎఫ్బిఐ ఏజెంట్లతో చెప్పారు. విమాన సిబ్బందిని కొట్టినట్టు తనకు గుర్తు లేదని, తాను మూత్ర విసర్జన చేసిన విషయం కూడా తనకు తెలియదని గ్రియర్ చెప్పుకొచ్చాడు. నిజానికి గ్రియర్ తన ప్యాంట్ విప్పి అసహ్యంగా ప్రవర్తిస్తుండగా విమాన సిబ్బంది హెచ్చరించడంతో తాను మూత్రవిసర్జన చేస్తున్నానిచెప్పాడు. ప్రస్తుతం పదివేల డాలర్ల పూచీకత్తుతో గ్రియర్ విడుదలయ్యాడు. విమాన సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న అభియోగాలతో అరెస్టయిన ఈ తాగుబోతు నేరం రుజువైతే, గరిష్టంగా 20 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే దాదాపు రెండు కోట్ల జరీమానా విధించే అవకాశం వుందట. -
హైదరాబాద్ మెట్రో.. అదే తీరు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పూర్తిస్థాయిలో అన్లాక్ అయినా మెట్రో ప్రయాణికుల సంఖ్య మాత్రం అదే స్థాయిలో పెరగడంలేదు. లాక్డౌన్కు ముందు (ఈ ఏడాది మార్చి 22)తో పోలిస్తే ప్రస్తుతం మూడు రూట్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 38 శాతం దాటకపోవడం గమనార్హం. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో మార్చి నెలకు ముందు నిత్యం 3.5 లక్షల మంది జర్నీ చేసేవారు. ప్రస్తుతం మూడు మార్గాల్లో నిత్యం 1.33 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తుండడం గమనార్హం. సువర్ణ ఆఫర్తో ప్రయాణికులకు ఛార్జీల్లో రాయితీతోపాటు స్మార్ట్కార్డులో రీఛార్జీపై క్యాష్బ్యాక్ ఆఫర్ అమలు చేస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్య అరకొరగానే పెరిగినట్లు స్పష్టమౌతోంది. ఆఫర్లు ప్రకటించినా.. దసరా, దీపావళి సందర్భంగా మెట్రోరైలు సంస్థ మెట్రో సువర్ణ ఆఫర్ను ప్రకటించింది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్లో భాగంగా ఛార్జీల్లో రాయితీ కల్పించడంతోపాటు.. స్మార్ట్కార్డ్ రీఛార్జీపై క్యాష్బ్యాక్ఆఫర్ అమలు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఈ ఆఫర్లు అమలుకానున్నాయి. అయితే ఆఫర్ల ద్వారా మెట్రో ప్రయాణికుల సంఖ్యను లాక్డౌన్ ముందున్న సంఖ్యకు చేర్చేందుకు మెట్రో అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రయాణీకుల సంఖ్య పెరగకపోవడానికి కారణాలివే.. - సిటీజన్లలో కోవిడ్ భయాందోళనలు తొలగకపోవడం. కోవిడ్ సెకండ్వేవ్ మొదలౌతుందన్న ఆందోళన. - ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలవుతుండడం. - మెట్రో స్టేషన్ల వద్ద బైక్, కార్ల పార్కింగ్కు చెల్లించే ఛార్జీలు తడిసి మోపెడు కావడం. - మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు, బస్తీలకు కనెక్టివిటీ లేకపోవడంతో ఆటో, క్యాబ్ ఛార్జీలతో జేబులు గుల్లకావడం. - వ్యక్తిగత వాహనాలపై వెళితే కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చన్న భావన. - మెట్రో కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నప్పటికీ.. ఏసీ బోగీల్లో సులభంగా కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న భయాందోళనలు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది నగరంలో మూడు మార్గాల్లో మెట్రో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. క్యాష్బ్యాక్ ఆఫర్, సువర్ణ ఆఫర్ సత్ఫలితాన్నిస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో 18 ఏళ్లుగా మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నగరం మినహా నూతనంగా మెట్రో ప్రారంభమైన మిగతా మెట్రోసిటీలతో పోలిస్తే నగరంలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు చూస్తే అర్థమౌతుంది. – ఎన్వీఎస్రెడ్డి, హెచ్ఎంఆర్, ఎండీ -
విమానంలో వర్షం.. ఎప్పుడైనా చూశారా?
మాస్కో : విమానంలో వర్షం కురిసే సంఘటనల్ని మనం ఊహిస్తామా? విమానంలో వర్షం రావడమేంటి అనుకుంటున్నారా? రష్యా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఖబరోవ్స్క్ నుంచి నల్ల సముద్రానికి వెళ్లి హాలీడేస్ ఎంజాయ్ చేయాలనుకున్న పలువురు ఔత్సాహికులు విమానంలో బయలు దేరారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే వాన కురవడం మొదలైంది. విమానం క్యాబిన్ లోకి వర్షపు నీరు చేరిపోయింది. దీంతో పలువురు ప్రయాణికులు విమానంలో గొడుగులు పట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన రోసియా ఎయిర్ లైన్స్ అధికారులు విచారణ జరపగా అది వర్షం నీరు కాదని పేర్కొన్నారు. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లే నీరు క్యాబిన్లోకి చేరిందని పేర్కొన్నారు. Volo interno russo #Chabarovsk-Sochi della Rossiya Airlines I passeggeri sono stati costretti ad usare ombrelli per ripararsi da goccioloni d'acqua, parrebbe per un guasto all'aria condizionata Ora sotto inchiesta Non vi lamentate dei treni italiani...pic.twitter.com/HKB1ab66rd — #POLiticamenteScorretto🎹FR© (@PolScorr) July 11, 2020