-
విషం పెట్టి చంపాలని ప్లాన్ చేశారు, ఆ ఒక్క ఫోన్కాల్తో..
తన కామెడీతో జనాలను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు కమెడియన్ బాబూ మోహన్. సినిమాలతో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టాడు. అయినప్పటికీ ఆయనకు సినిమాల మీద ప్రేమ తగ్గలేదు. ప్రస్తుతం పలు సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్న బాబూ మోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఢిల్లీలో 'వన్స్మోర్' సినిమా షూటింగ్ చేస్తున్నాం. సెట్స్లో తనికెళ్ల భరణి పాన్ తింటున్నాడు. నన్ను రుచి చేయమన్నాడు. సరేనని ఒకటి నోట్లో పెట్టుకున్నా, కానీ ఛీఛీ అని దాన్ని ఊసేశా. విచిత్రంగా తర్వాతి రోజు నుంచి నేనే ఒక పాన్ ఇవ్వమని అడిగేవాడిని. అలా ఒకానొక దశలో రోజుకు 30 నుంచి 40 దాకా పాన్లు తినేవాడిని. సంగారెడ్డి వచ్చానంటే అక్కడ ఓ డబ్బాలో కచ్చితంగా పాన్ తినేవాడిని. నేను అక్కడ పాన్ కట్టించుకుంటానని తెలిసిన కొందరు ఓసారి అందులో విషాన్ని కలిపారు. నేను ఆ డబ్బా దగ్గరకు వెళ్లి పాన్ తీసుకుని కారులో వెళ్లాను. ఇక తిందామనుకునే సమయానికి ఫోన్ వచ్చింది. దయచేసి పాన్ తినకండి, అందులో విషం ఉందని చెప్పారు. వెంటనే పాన్ పక్కన పడేశాను. అంతలోనే మరో ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి పాన్ కట్టే వ్యక్తి భార్య మాట్లాడుతూ.. తప్పయిపోయింది సార్, విషం కలిపిన పాన్ ఇవ్వమని మమ్మల్ని ఒత్తిడి చేశారంటూ ఏడ్చింది. రాజకీయాలు ఇంత ప్రమాదమా? అని అప్పుడు తెలిసొచ్చింది' అని చెప్పుకొచ్చాడు బాబూ మోహన్. చదవండి: రాకెట్రీలో ఆ సీన్ మళ్లీ మళ్లీ చూశానన్న నెటిజన్, హీరో దెబ్బకు ట్వీట్ డిలీట్! ప్రేయసితో హృతిక్ రోషన్ రోడ్ ట్రిప్, వీడియో చూశారా? -
భారీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? కొత్త రూల్స్ ఈ రోజు నుంచే
సాక్షి, న్యూడిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఇటీవల జారీ చేసిన కొత్త నిబంధనలు నేటి (మే 26) నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం 20 లక్షలు రూపాయలు అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలకు పాన్ లేదా ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. మే 10 నాటి నోటిఫికేషన్లో ప్రకటించిన కొత్త నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్డ్రా చేసినా, డిపాజిట్ చేసినా తన పాన్ నెంబర్ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ నంబర్ను వెల్లడించాలి. ఇంతకుముందు, ఒకే రోజులో రూ 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసేటప్పుడు మాత్రమే పాన్ నంబర్ అవసరం. కానీ నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణకు వార్షిక పరిమితి లేదు. కొత్త నిబంధనలు ఖాతాదారులు ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులతోపాటు, కోఆపరేటీవ్ బ్యాంకుల్లో రూ.20 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లు, విత్డ్రాయల్స్ చేసినా కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. బ్యాంకులేదా పోస్ట్ ఆఫీసులో కరెంట్ ఖాతా క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఓపెన్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి. అంతేకాదు ఒకేసారి రూ.20 లక్షల ట్రాన్సాక్షన్ చేసినా, వేర్వేరు సందర్భాల్లో మొత్తం కలిపి రూ.20 లక్షల లావాదేవీలు జరిపినా పాన్ నెంబరును నమోదు చేయాలి. అయితే ఈ లావాదేవీలు జరిపే సందర్భంలో పాన్ నెంబర్, ఆధార్ నంబర్లను తీసుకునే వ్యక్తులు అవి సరైన వివరాలేనా కాదా అని నిర్థారించుకోవాలని సీబీడీటీ వెల్లడించింది. ఏయే వ్యక్తులు పాన్ కార్డ్ కోసం అప్లై చేయాలో, ఎవరు పాన్ కార్డ్ వివరాలను వెల్లడించాలో సెక్షన్ 139ఏ తెలుపుతుంది. అందుకే సీబీడీటీ రూ.20 లక్షల కన్నా ఎక్కువ లావాదేవీలకు పాన్ కార్డ్ లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఒకవేళ భారీ ఆర్థిక లావాదేవీలు జరిపే వారి దగ్గర పాన్ కార్డ్ లేకపోతే లావాదేవీ చేసే తేదీకి కనీసం 7 రోజుల ముందు పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సీబీడీటీ తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. లేదంటే సంబంధిత లావాదేవీలకు ఆస్కారం ఉండదు. -
‘‘పాన్’’ కంపల్సరీ.. కాదంటే కుదరదు..
రాను రాను పర్మనెంట్ అకౌంట్ నంబర్ లేకపోయినా, వాడకపోయినా, పేర్కొనకపోయినా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఎన్నోసార్లు మనం ప్రస్తావించాం. ఏయే సందర్భాల్లో పాన్ని తెలియజేయాలో .. ఇప్పుడు అదే దిశలో ఆదాయపు పన్ను శాఖ మరో పెద్ద ముందడుగు వేసింది. మే 10వ తేదీన ఒక నోటిఫికేషన్ వచ్చింది. అందులో పేర్కొన్న నిబంధనలు త్వరలోనే అమల్లోకి వస్తాయి. ఆ మార్పులు, చేర్పుల సారాంశం ఏమిటంటే .. కొన్ని నిర్దేశిత వ్యవహారాలకు నిర్దిష్ట పరిమితులను పొందుపర్చారు. ఆ లావాదేవీలు చేసే ముందు విధిగా పాన్ లేదా ఆధార్ గురించి ప్రస్తావించాలి. ఈ లావాదేవీలు ఏ సంస్థతో జరుపుతారో ఆ సంస్థ పాన్ / ఆధార్తో పాటు ఆ వ్యక్తి యొక్క ‘‘వివరాలు’’ (ఉదాహరణకు వయస్సు, లింగభేదం, చదువు, జాతీయత, మతం మొదలైనవి) అడిగే అవకాశం ఉంది. డెమోగ్రాఫిక్ సమాచారంలో అన్ని వివరాలు అడగవచ్చు. బయోమెట్రిక్ సమాచారం కూడా అడుగుతారు. అంటే సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. నిర్దేశిత ఆర్థిక వ్యవహారాలు ఏమిటంటే.. - ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు లేదా ఇతర డిపాజిట్లకు సంబంధించి ఒకటి లేదా ఎన్ని బ్యాంకు ఖాతాల్లోనైనా లేదా పోస్టాఫీసులో రూ. 20,00,000 లేదా అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే, డిపాజిట్దారు పాన్/ఆధార్ సంఖ్య వేయాలి. పుచ్చుకున్న బ్యాంకు/పోస్టాఫీసు ముందుగా పేర్కొన్నట్లు ఆదాయపు పన్ను శాఖలోని ఉన్నతాధికారులకు సమగ్ర సమాచారాన్ని అందించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక బ్రాంచ్ కాదు.. ఒక బ్యాంకు కాదు అన్ని బ్యాంకుల్లోనూ ఎక్కడ డిపాజిట్ చేసినా ఈ రూలు వర్తిస్తుంది. - ఇదే మాదిరిగా బ్యాంకు నుంచి, పోస్టాఫీస్ నుంచి మనం చేసే విత్డ్రాయల్స్, అకౌంట్ నుంచి .. ఒకసారి కాదు అనేక దఫాలుగా ఒక ఆర్థిక సంవత్సరంలో తీసినది, డెబిట్ అయినది, నగదు విత్డ్రాయల్ కాకుండా చెక్, బదిలీ ద్వారా విత్డ్రా చేసినది ఇలాంటి వాటన్నింటికీ కలిపి మొత్తం పరిమితి రూ. 20,00,000గాఉంటుంది. ఇటువంటి సందర్భంలోనూ అవే రూల్సు వర్తిస్తాయి. - బ్యాంకులో కరెంటు అకౌంటు తెరిచినా, క్యాష్ క్రెడిట్ అకౌంటు తెరిచినా, అలాగే పోస్టాఫీసులో కరెంటు ఖాతా తెరిచినా ఎటువంటి పరిమితులు లేవు. ఇవన్నీ ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయి. తగిన జాగ్రత్త వహించి అడుగేయండి. ఎన్ని నిబంధనలు ఎంత కఠినంగా అమలుపర్చినా మీ డిపాజిట్లకు సరైన ‘‘సోర్స్’’ ఉంటే .. సరిలేరు మీకెవ్వరు. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
LIC IPO: పాన్ నంబరు అప్డేట్ చేయండి.. ఎల్ఐసీ సూచన
న్యూఢిల్లీ: ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో పాల్గొనేందుకు తమ తమ పాన్ నంబర్లను అప్డేట్ చేయాల్సిందిగా పాలసీదారులకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సూచించింది. ఇష్యూకి సబ్స్క్రయిబ్ చేయాలంటే కంపెనీ రికార్డుల్లో పాలసీదారుల తాజా పాన్ వివరాలు ఉండాలని, అలాగే చెల్లుబాటయ్యే డీమ్యాట్ ఖాతా అవసరమని పేర్కొంది. దీనిపై పాలసీహోల్డర్లలో అవగాహన పెంచేందుకు ప్రచార కార్యకర్మాలు నిర్వహిస్తున్నామని ఎల్ఐసీ తెలిపింది. ఒకవేళ ఎవరికైనా డీమ్యాట్ ఖాతా లేకపోతే తమ సొంత ఖర్చుతో ఒక అకౌంటును తీసుకోవాలని పేర్కొంది. సదరు డీమ్యాట్ ఖాతా తెరవడం, నిర్వహణ.. పాన్ జారీ మొదలైన వాటికి అయ్యే ఖర్చు లను పాలసీదారే భరించాల్సి ఉంటుందని, కంపెనీకి సంబంధం లేదని ఎల్ఐసీ స్పష్టం చేసింది. ఐపీవోకి రెడీ ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనకు ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదన ప్రకారం ఇష్యూ పరిమాణంలో 10 శాతం దాకా షేర్లను పాలసీదారులకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ కీలకంగా ఉండనుంది. చదవండి: ఎల్ఐసీ ఐపీవోకు మర్చంట్ బ్యాంకర్లు రెడీ -
ఆర్థిక నేరాల కట్టడికి ‘ఆధార్’ టెక్నాలజీ
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలను గుర్తించేందుకు ఆధార్ ఆధారిత టెక్నాలజీలను ఉపయోగించుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ దిలీప్ అస్బే తెలిపారు. రాబోయే మూడు–నాలుగేళ్లలో ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రాగలదని ఆధార్ 2.0 వర్క్షాప్లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముందే గుర్తించే వీలు విశిష్ట గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఆధార్ ఎంతో విలువైనదని, కానీ దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని దిలీప్ అభిప్రాయపడ్డారు. ‘మన దేశంలో పన్నులు ఎగ్గొట్టడమనేది పెద్ద సమస్యగా ఉంటోంది. ప్రస్తుతం పాన్ను, ఆధార్ను అనుసంధానించడం వల్ల, ఒక వ్యక్తికి పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా.. అన్నీ కూడా ఆధార్కు లింక్ అయి ఉంటాయి. అనుమానాస్పద కేసుల్లో ఈ డేటాను మరింత లోతుగా పరిశీలించడం ద్వారా పన్ను ఎగవేత సందర్భాలను కూడా గుర్తించవచ్చు‘ అని దిలీప్ చెప్పారు. ఎవరైనా కస్టమర్ ఆర్థిక మోసానికి పాల్పడితే .. పలు సంస్థలపై దాని ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. ‘ఇలాంటి మోసాలను ఎవ్వరూ ఆపలేకపోవచ్చు. అయితే, ఆధార్లాంటి విశిష్టమైన పత్రంతో మోసాలకు సంబంధించిన ఒక రిపాజిటరీని తయారు చేయొచ్చు. ఒక వ్యక్తి మోసం చేస్తే వారికి సిమ్ కార్డ్ మొదలుకుని బ్యాంక్ ఖాతా, వాలెట్ లాంటివి ఏవీ మళ్లీ లభించకుండా చేయొచ్చు. ఈ విధంగా మోసగాళ్లను ఆదిలోనే గుర్తించి, వారికి అడ్డుకట్ట వేయొచ్చు’ అని అన్నారు. చదవండి:‘ఆధార్పై ఆంక్షలు పెడితే.. అసలుకే ఎసరు’ -
మీ పాన్ కార్డ్ పోయిందా..! ఇలా డౌన్లోడ్ చేసుకోండి
పాన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం మన దగ్గర ఉండాల్సిన కీలకమైన డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం దగ్గరి నుంచి బ్యాంక్ ఖాతా ఓపెనింగ్, క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవడం వరకు చాలా సందర్భాల్లో పాన్ కార్డు అవసరం పడుతూ వస్తుంది. అందుకే పాన్ కార్డును జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకవేళ మీ పాన్ కార్డు కనిపించకుండాపోతే మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు మళ్లీ పాన్ కార్డు కోసం అప్లిచేసుకోవచ్చు. డూప్లికేట్ పాన్ కార్డు మీ ఇంటికి వస్తుంది. దీనికి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లోనే డూప్లికేట్ ఈ-పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ-పాన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.. ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ ఓపెన్ చేయండి డౌన్లోడ్ ఈ-పాన్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ పాన్ నెంబరు, ఆధార్ నెంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. మీ పుట్టిన తేదీని నమోదు చేసి, నియమ నిబంధనలను ఆమోదించండి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుపై ఓటీపీని అందుకుంటారు. ఓటీపీ ధృవీకరించిన తర్వాత పేమెంట్ చేయడానికి ఒక ఆప్షన్ మీ ముందు కనిపిస్తుంది. మీరు రూ.8.26 చెల్లించాల్సి ఉంటుంది. మీరు పేటిఎమ్, యుపీఐ, క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత పీడిఎఫ్ లో ఈ-పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు పాస్ వర్డ్ అవసరం అవుతుంది. దీనికి పాస్ వర్డ్ మీ పుట్టిన తేదీ. ఒకవేళ మీరు ఎప్పుడైనా పాన్ కార్డును కోల్పోతే, మీరు ఒకేసారి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇది కాకుండా, మీ పాన్ తో ఏదైనా బినామీ లావాదేవీ జరిగిందా లేదా అని ఫారం 26ఎఎస్ నుంచి మీరు తెలుసుకోవచ్చు.(చదవండి: రుణ గ్రహీతలకు ఎస్బీఐ పండుగ బొనాంజా ఆఫర్లు) -
స్టాక్ మార్కెట్,నెలాఖరులోగా పాన్–ఆధార్ లింక్ చేసుకోవాలి
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు సెప్టెంబర్ 30 నాటికి తమ పాన్ను ఆధార్తో అనుసంధానించుకోవాలని సెబీ కోరింది. తద్వారా లావాదేవీలు సాఫీగా నిర్వహించుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. పాన్–ఆధార్తో లింక్ చేసుకోవాలని కేంద్ర సర్కారు ఎప్పటి నుంచో కోరుతోంది. కాకపోతే కరోనా వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో గడువును పొడిగిస్తూ వచ్చింది. ఈ నెల 30 వరకు పాన్–ఆధార్ అనుసంధానానికి గడువు ఉంది. గడువులోపు లింక్ చేసుకోకపోతే పాన్ పనిచేయదు. పాన్ పనిచేయనప్పుడు కేవైసీ అసంపూర్ణంగా మారుతుంది. పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు కేవైసీ తప్పనిసరి అని తెలిసిందే. దీంతో పాన్ బ్లాక్ చేయడం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోలేని, కొత్తగా పెట్టుబడులు చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ‘‘సెక్యూరిటీస్ మార్కెట్లో అన్ని లావాదేవీలకు పాన్ ఏకైక గుర్తింపు సంఖ్య. సీబీడీటీ నోటిఫికేషన్ నిబంధనలను సెబీ నమోదిత సంస్థలు అమలు చేయాలి. సెప్టెంబర్ 30 తర్వాత కొత్త ఖాతాల ప్రారంభానికి ఆపరేటివ్ పాన్నే అనుమతించాలి’’ అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. చదవండి: స్పెషల్ ఎకనామిక్ జోన్, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు -
మీ పాన్ కార్డ్ పోయిందా..! వెంటనే ఇలా చేయండి..!
e-PAN Card Download Online: పర్మినెంట్ అకౌంట్ నెంబర్(PAN) పాన్ కార్డు దేశవ్యాప్తంగా ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటి. బ్యాంకుల్లో ఎక్కువ లావాదేవీలను జరిపే వారికి పాన్కార్డ్ అనేది తప్పనిసరి. దురదృష్టవశాత్తు మీ పాన్కార్డు పోతే బాధపడకండి. పాన్కార్డును ఆన్లైన్లో తిరిగి పొందవచ్చును. మీ పాన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, పాన్ కార్డులను జారీ చేసే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) అధికారిక వెబ్సైట్ నుంచి పాన్కార్డును మరల పొందవచ్చును. ఏదైనా అత్యవసర పని కోసం మీకు మీ పాన్ కార్డ్ అవసరమైతే, మీరు కేవలం ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ లేదా ఈ-పాన్ డౌన్లోడ్ చేసుకోనే సౌకర్యాన్ని ఎన్ఎస్డీఎల్ కల్పిస్తోంది. మీరు ఆన్లైన్లో ఈ-పాన్ను ఇలా పొందండి స్టెప్1: ఆన్లైన్లో ఈ-పాన్ కార్డును డౌన్లోడ్ చేయడానికి, మీరు యుటిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ https://www.utiitsl.com/ అధికారిక వెబ్సైట్కు సందర్శించండి. స్టెప్ 2: అందులో 'పాన్ కార్డ్ సర్వీసెస్ ' ఆప్షన్ను ఎంచుకోండి. స్టెప్ 3: క్లిక్ చేశాక మీరు మరో వెబ్పేజీకి మళ్ళించబడతారు. అందులో 'డౌన్లోడ్ ఇ-పాన్' పై క్లిక్ చేయండి. స్టెప్ 4: తరువాత వచ్చే వెబ్పేజీలో మీ పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి. స్టెప్ 5: మీ పుట్టిన తేదీ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి. మీరు మీ GSTIN నంబర్ను కూడా నమోదు చేయవచ్చు. స్టెప్ 6: క్యాప్చా వివరాలను సబ్మిట్ చేసి మీ వివరాలను ధృవీకరించండి. స్టెప్ 7: ఇప్పుడు, మీరు మీ ఇమెయిల్ ఐడి మరియు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్పై లింక్ను అందుకుంటారు స్టెప్ 8: ఇప్పుడు మీరు మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్పై లింక్ వస్తుంది. మీ ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ను ధృవీకరించడానికి ఓటీపీ వస్తోంది. ఓటీపీని ఎంటర్చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత మీ ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. గమనిక: మీరు మీ ఈ- పాన్కార్డును పొందాలంటే కచ్చితంగా మీ ఫోన్ పాన్కార్డుతో రిజిస్టరై ఉండాలి. అధికారిక వెబ్సైట్ నుంచి మీరు నెలకు మూడుసార్లు మాత్రమే ఈ-పాన్ను పొందుతారు. -
పాన్–ఆధార్ గడువు మరో 3 నెలలు
న్యూఢిల్లీ: పర్మనెంట్ అకౌంట్ నంబరు (పాన్)తో ఆధార్ను అనుసంధానించేందుకు నిర్దేశించిన డెడ్లైన్ను కేంద్రం మూడు నెలల పాటు పొడిగించింది. జూన్ 30 దాకా దీన్ని పెంచుతున్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాల నేపథ్యంలో ఆఖరు తేదీని పొడిగించాలంటూ పన్నుచెల్లింపుదారుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి దీనికి ముందుగా నిర్దేశించిన గడువు మార్చి 31. మరోవైపు, పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్ స్కీమ్’ గడువు మార్చి 31తో ముగిసింది. వాస్తవానికి డిక్లరేషన్ దాఖలు చేయడానికి ఫిబ్రవరి 28, చెల్లింపులు జరిపేందుకు మార్చి 31 ఆఖరు తేదీలు. అయితే, ఆదాయ పన్ను శాఖ ఈ డెడ్లైన్లను గతంలో పొడిగించింది. దీని ప్రకారం డిక్లరేషన్ల దాఖలుకు మార్చి 31తో గడువు ముగిసింది. ఏప్రిల్ 30లోగా చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఈ స్కీము కింద ఫిబ్రవరి 22 దాకా సుమారు రూ. 98,328 కోట్ల విలువ చేసే పన్ను వివాదాలకు సంబంధించి 1.28 లక్షల డిక్లరేషన్లు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గత నెలలో లోక్సభకు తెలిపారు. దీని ద్వారా సుమారు రూ. 53,346 కోట్లు ఖజానాకు వచ్చాయి. గతేడాది ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం 50.95 కోట్ల పాన్ కార్డులు ఉండగా 32.71 కోట్ల పాన్ కార్డులను ఆధార్తో అనుసంధానించారు. -
బ్యాంకులకు ఐటీఆర్ దాఖలు వివరాలు
న్యూఢిల్లీ : ఆదాయపన్ను శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఆధారంగా సంస్థల రిటర్నుల దాఖలు వివరాలను షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు తెలుసుకునే ఏర్పాటును (ఐటీఆర్ ఫైలింగ్ కాంప్లియన్స్) ఆదాయపన్ను శాఖ ప్రారంభించింది. భారీ మొత్తాల్లో నగదును ఖాతాల నుంచి తీసుకుంటున్న వారు ఇప్పటి వరకు రిటర్నులు దాఖలు చేయలేదని డేటా ఆధారంగా తెలుస్తోందని ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఇటువంటి వ్యక్తులు రిటర్నులు దాఖలు చేసేలా చూసేందుకు, నల్లధనాన్ని నియంత్రించేందుకు కేంద్రం చట్టంలో పలు సవరణలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నగదు ఉపసంహరణలు రూ.20 లక్షలు, అంతకుమించి చేస్తే టీడీఎస్ అమలు ఇందులో భాగమే. (స్కూల్నెట్ ఇండియా విక్రయానికి ఓకే..) ఐటీ రిఫండ్స్... రూ.98,625 కోట్లు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గడచిన ఐదు నెలల్లో (2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్1వ తేదీ వరకూ) 26.2 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.98,625 కోట్ల రిఫండ్స్ ఇచ్చింది. బుధవారం వెలువరించిన సవరిత గణాంకాల ప్రకారం– 24,50,041 లక్షల మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు జరిపిన రిఫండ్స్ విలువ రూ.29,997 కోట్లు. కార్పొరేట్ల విషయంలో 1,68,421 లక్షల మందికిపైగా పన్ను చెల్లింపుదారులకు జరిపిన రిఫండ్స్ విలువ రూ.68,628 కోట్లు. కోవిడ్–19 మహమ్మారి సవాళ్లు విసురుతున్న ప్రస్తుత సమయంలో ఎటువంటి జాప్యం లేకుండా పన్ను చెల్లింపుదారులకు సంబంధిత సేవలు సకాలంలో అందాలని ఆదాయపు పన్ను శాఖను కేంద్రం నిర్దేశించింది. పన్ను రిఫండ్స్ ఎప్పటికప్పుడు జరగాలని స్పష్టం చేసింది. (ఫార్చూన్ ‘40’లో అంబానీ వారసులు) -
ఆధార్తో తక్షణం పాన్ నంబరు
న్యూఢిల్లీ: ఆధార్ వివరాలు సమర్పిస్తే చాలు తక్షణమే ఆన్లైన్లో పాన్ నంబరు కేటాయించే విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రారంభించారు. ‘ఆధార్ నంబరుతో పాటు దానికి అనుసంధానమైన మొబైల్ నంబరు ఉండి, పాన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. పూర్తిగా పేపర్ రహితంగా, ఎలక్ట్రానిక్ పాన్ (ఈ–పాన్) నంబరును ఉచితంగా కేటాయించడం జరుగుతుంది’ అని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ ఈ–ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తుదారు ఇన్స్టంట్ పాన్ పొందవచ్చు. వెబ్సైట్లో తన ఆధార్ నంబరు పొందుపర్చాక, దానికి అనుసంధానమైన దరఖాస్తుదారు మొబైల్ నంబరుకు వన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఓటీపీని సమర్పించాక 15 అంకెల అక్నాలెడ్జ్మెంట్ నంబరు వస్తుంది. కేటాయింపు పూర్తయ్యాక ఈ–పాన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆధార్తో రిజిస్టరైన మెయిల్–ఐడీ ఉంటే దానికి కూడా ఈ–మెయిల్ వస్తుంది. తక్షణం పాన్ కేటాయించే ప్రక్రియకు సంబంధించిన బీటా వెర్షన్ను ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఆదాయపు పన్ను శాఖ తమ ఈ–ఫైలింగ్ వెబ్సైట్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మే 25 దాకా దీని ద్వారా 6,77,680 పాన్ నంబర్లు కేటాయించింది. కేవలం 10 నిమిషాల్లోనే ఈ–పాన్ కేటాయించగలిగినట్లు సీబీడీటీ వర్గాలు తెలిపాయి. -
ఆధార్తో పాన్ లింక్ ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్-పాన్ లింకింగ్పై తాజా డెడ్లైన్ మార్చి 31లోగా అనుసంధానం చేసుకోవడంలో విఫలమైతే రూ 10,000 జరిమానా, పాన్ కార్డు పనిచేయదని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. కీలక పత్రాలైన ఆధార్ కార్డు, పాన్ కార్డు అనుసంధానంపై కేంద్రం ఇప్పటికే పలుమార్లు గడువు తేదీలను పొడిగించింది. ఇప్పటికీ చాలా మంది ఆధార్తో పాన్ అనుసంధానం చేయని వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. తాజా డెడ్లైన్లోగా ఈ రెండింటినీ లింక్ చేసుకోవాల్సి ఉండగా వీటి అనుసంధానానికి అవసరమైన దశలను చూద్దాం. ఆధార్తో పాన్ లింక్ చేసుకోవడం సులభమే. అయితే కొన్ని సందర్భాల్లో రెండు అనుసంధానం కాకపోవచ్చు. ఆధార్, పాన్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉన్నా కూడా రెండు లింక్ కావు. ఆధార్ కార్డును యూఐడీఏఐ జారీ చేస్తే, పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. పాన్, ఆధార్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉంటే అప్పుడు ఆధార్, పాన్ కార్డుల్లో వివరాలను సరిచేయాలి. ఆధార్ కార్డులో తప్పుగా ఉన్న పేరును మార్చుకోవాలంటే https://ssup.uidai.gov.in/ssup/login.html లింక్పై క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్లో లేదా ఎన్రోల్మెంట్ సెంటర్కు వెళ్లి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆదాయ పన్నుశాఖ వెబ్సైట్ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html లో పాన్ వివరాలను సరిచేసుకోవచ్చు. వివరాలు ఏమీ తప్పుగా లేకపోతే ఆన్లైన్, ఎస్ఎంఎస్, పాన్ కేంద్రాల్లో రెండింటిని లింక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా 567678 లేదా 56161 నెంబర్కు యూఐడీపాన్ 12 అంకెల ఆధార్ పది అంకెల పాన్ నెంబర్ను ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పాన్ ఆధార్ లింకేజ్ను పూర్తిచేయవచ్చు. ఇక నేరుగా ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ www.incometaxindiaefiling.gov.in లోకి వెళ్లి పాన్ (యూజర్ ఐడీ), పాస్వర్డ్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ప్రొఫైల్ సెట్టింగ్ ట్యాబ్పై క్లిక్ చేసి లింక్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీ పాన్ ఆధార్ నెంబర్తో లింక్ అయినట్టు మెసేజ్ కనిపంచనిపక్షంలో అక్కడ కనిపించే ఫామ్లో మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. ఒకసారి మీ వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత స్క్రీన్పై సక్సెస్ మెసేజ్ కనిపిస్తుంది. చదవండి : ఆధార్- పాన్ లింకింగ్ : డెడ్లైన్ మిస్సయితే భారీ షాక్.. -
ఆధార్- పాన్ లింకింగ్ : డెడ్లైన్ మిస్సయితే భారీ షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్-పాన్ అనుసంధానానికి ఆదాయ పన్నుశాఖ తాజా డెడ్లైన్ మార్చి 31ని మిస్ అయితే పాన్కార్డుదారులకు భారీ షాక్ తప్పదు. ఈ గడువులోగా ఆధార్-పాన్ లింకేజ్ పూర్తిచేయడంలో విఫలమైతే పాన్ కార్డు పనిచేయకపోవడంతో పాటు రూ 10,000 జరిమానా విధించనున్నట్టు ఐటీ శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. పనిచేయని పాన్ కార్డు వాడినట్టు తేలితే వారికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 272 బీ కింద రూ 10,000 పెనాల్టీ విధిస్తారు. పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయడంలో విఫలమైన వారు పన్ను చెల్లింపులు మినహా బ్యాంక్ ఖాతా తెరిచేందుకు గుర్తింపు కార్డుగా వాడటం వంటి వెసులుబాటు ఉన్నా రూ 50,000 మించి లావాదేవీలు జరిపే క్రమంలో రూ 10,000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయని వారి పాన్ ఏప్రిల్ 1 నుంచి పనిచేయదు..అయితే ఆధార్తో అనుసంధానం పూర్తి చేసిన అనంతరం వారి పాన్ కార్డు తిరిగి పనిచేస్తుంది. చదవండి : ఆధార్తో పాన్ లింకింగ్ ఇలా.. -
ఆధార్తో లింకు కాకుంటే పాన్ కట్
న్యూఢిల్లీ: శాశ్వత ఖాతా నెంబరు (పాన్) విషయంలో ఆదాయ పన్ను శాఖ తుది హెచ్చరికను జారీ చేసింది. ఆధార్ నెంబర్తో పాన్ కార్డు అనుసంధానం తప్పదని ఇప్పటికే పలు సార్లు సూచించి, గడువు తేదీలను పొడగిస్తూ వచ్చిన ఐటీ శాఖ.. లింక్ కాని పాన్ కార్డులను పనిచేయకుండా (ఇన్ ఆపరేటివ్) చేయనున్నామని శుక్రవారం ప్రకటించింది. ఇందుకు మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139ఏఏ సబ్ సెక్షన్ (2) ప్రకారం.. 2017 జూలై ఒకటి వరకు జారీ చేసిన పాన్ కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరని, పేర్కొన్న గడువు తేదీ లోపు లింక్ చేయకుంటే ఇన్ఆపరేటివ్ చేసేందుకు ఇన్కం ట్యాక్స్ రూల్స్లో 114ఏఏఏ చేర్చినట్లు ప్రకటించింది. జనవరి 27 నాటికి 30.75 కోట్ల పాన్లకు ఆధా ర్ అనుసంధానం జరగ్గా, ఇప్పటికీ 17.58 కోట్ల పాన్ కార్డులు లింక్ కాలేదని వెల్లడించింది. -
పాన్ - ఆధార్ లింకింగ్ : మరోసారి ఊరట
సాక్షి, ముంబై: ఆధార్తో పాన్ వివరాలను లింక్ చేయని వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వారికి శుభవార్త అందించింది. పాన్ - ఆధార్ లింకింగ్ తేదీని పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. నేటితో( డిసెంబర్ 31, 2019) గడువును దీనిని మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139ఏఏ లోని ఉప-సెక్షన్ 2 కింద పేర్కొన్న విధంగా పాన్ను ఆధార్తో అనుసంధానించడానికి వచ్చే ఏడాది (2020) మార్చి 31వ తేదీ వరకు దీనిని పొడిగించింది. పాన్-ఆధార్ లింకింగ్ను ఇప్పటికే పలుమార్లు పొడిగించిన సీబీడీటీ తాజాగా గడువును పొడిగించడం ఇది ఎనిమిదోసారి. పాన్-ఆధార్ అనుసంధానం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రం తప్పనిసరి చేసింది. ఇటీవల ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి తప్పనిసరి అయింది. డిసెంబర్ 31వ తేదీలోపు ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ తెలిపింది. -
ఫ్రీగా పాన్ ఇవ్వలేదని పెదవి కొరికేశాడు..!
లక్నో: ఉచితంగా పాన్ ఇచ్చేందుకు నిరాకరించిన దుకాణ యజమాని చెవి, పెదవి కొరికేశాడో యువకుడు. లక్నోలోని అలంబాగ్లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో పాన్ ఫ్రీగా ఇవ్వమని అడగగా.. ఇవ్వనని పాన్ షాపు యజమాని చెప్పడంతో ఈ గొడవ జరిగింది. వెంటనే గాయపడిన పాన్ షాపు యజమానిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వివరాల్లోకెళ్తే.. శాలు(28) అనే ఓ వీడియో గ్రాఫర్ మంగళవారం రాత్రి పాన్ తీసుకునేందుకు ఓ షాపు వద్దకు వెళ్లాడు. అప్పటికే ఆలస్యమవడంతో పాన్ షాప్ యాజమాని సత్యేంద్ర దుకాణాన్ని మూసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శాలు తనకు ఫ్రీ గా కిళ్లీ ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. కుదరదని షాపు యజమాని సత్యేంద్ర చెప్పడంతో కోపంతో వెంటనే పక్కనే ఉన్న రాయితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా యజమాని ఎడమ చెవి, కింది పెదవిని కొరకడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలైన సత్యేంద్రను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: 'ఆయనకు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వండి' -
ఆధార్, పాన్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్.. అన్నిటికీ ఒకటే కార్డు
న్యూఢిల్లీ: ఆధార్, పాన్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అనేక గుర్తింపు కార్డుల స్థానంలో దేశవ్యాప్తంగా ఒకే ఒక్క బహుళార్థక గుర్తింపు కార్డు ఉండాల్సిన అవసరముందని హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. సమాచారాన్నంతటినీ డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చేందుకు 2021లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణకు మొబైల్ యాప్ను వాడనున్నట్లు ప్రకటించారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, జనగణన కమిషనర్ కార్యాలయ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేసిన అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ.. ‘2021 నాటి జనాభా లెక్కల సేకరణకు మొట్టమొదటి సారిగా మొబైల్ ఫోన్ అప్లికేషన్ను ఉపయోగించనున్నాం. జనగణనలో ఇదో విప్లవాత్మకమైన మార్పు కానుంది. అన్ని వివరాలను ఒకే కార్డులో నిక్షిప్తం చేసేందుకు ఇది సాయపడుతుంది’ అని వివరించారు. దేశ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు, సంక్షేమ పథకాలకు 2021 జనాభా లెక్కలే ప్రాతిపదికగా మారనున్నాయన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘దేశంలోని 130 కోట్ల మందికి జనాభా లెక్కల సేకరణ వల్ల కలిగే లాభాలను వివరించాలి. ప్రభుత్వ పథకాలకు ఈ జాబితా, వివరాలను ఎలా ఉపయోగకరమో తెలియజేయాలి. ఈ సమాచారం దేశ పురోగతిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది’’అన్నారు. 2011 జనగణన ఆధారంగా కేంద్రం చేపట్టిన 22 సంక్షేమ పథకాల్లో విజయవంతంగా అమలవుతున్న ‘ఉజ్వల’, ‘బేటీ బచావో బేటీ పఢావో’ ఉన్నాయన్నారు. అధికారులూ పుణ్యం కట్టుకోండి..! జనాభా లెక్కలను నిజాయతీతో నిర్వహించడం ద్వారా అధికారులు పుణ్యం కట్టుకోవాలని, జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని హోం మంత్రి కోరారు. జనగణన మున్సిపాలిటీ వార్డుల హద్దులు నిర్ణయించడం మొదలుకొని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలను గుర్తించడం వరకూ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటివరకూ ప్రభుత్వం అరకొర పద్ధతుల్లోనే సంక్షేమ పథకాలను చేపట్టిందని, గత ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయకపోవడమే దీనికి కారణమని వ్యాఖ్యానించారు. 2021 నాటి జనగణనపై హోం మంత్రి మాట్లాడుతూ.. మంచు ప్రాంతాలతో కూడిన జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో రెఫరెన్స్ డేట్ 2020 అక్టోబరు ఒకటో తేదీ కాగా దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు 2021 మార్చి 21గా ఉండనుందని చెప్పారు. మొత్తం 16 భాషల్లో రూ.12 వేల కోట్ల ఖర్చుతో జనగణన చేపట్టనున్నామని వివరించారు. దీంతోపాటు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కోసం కూడా వివరాలు సేకరిస్తామని మంత్రి తెలిపారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీకి ఈ జాబితా ప్రాతిపదిక కావచ్చునని అధికారుల అంచనా. -
ఆధార్తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా? మీకో గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శుభవార్త అందించింది. పాన్ లేకుండా కేవలం ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి ఆదాయపన్ను శాఖ ఆటోమేటిక్గా పాన్ కార్డును జారీ చేయనుంది. ఈ మేరకు సీబీడీటీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. సీబీడీటీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వ్యక్తిగతంగా ఆధార్ నెంబరు ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి ఆటోమేటిక్గా పాన్ కార్డును ఇవ్వనుంది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్ కార్డును ఉపయోగించడం అంటే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసినట్లుగా పరిగణింస్తున్నట్టు సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని, త్వరలోనే పాన్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని సీబీడీ ఛైర్మన్ పీసీ మోడీ తెలిపారు. ఆధార్ కార్డులో వినియోగదారుడి పేరు, పుట్టిన తేదీ, జండర్, ఫోటో, అడ్రస్, తదితర వ్యక్తిగత వివరాలను యూఐడీఏఐ ద్వారా ఆదాయ పన్ను శాఖ సేకరించి దాని ఆధారంగా 10 అంకెల పాన్ కార్డును జారీ చేస్తామన్నారు. పాన్ కార్డులేని పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ కార్డును ఉపయోగించు కోవచ్చునని ఆదాయపన్ను చట్టం ప్రకారం పాన్కు ఆధార్ ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. -
సుమోటోగా పాన్ జారీ
న్యూఢిల్లీ: పాన్, ఆధార్ను అనుసంధానించే దిశగా ఆదాయ పన్ను శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేవలం ఆధార్తోనే ఐటీ రిటర్నులు దాఖలు చేసే వారికి సుమోటో ప్రాతిపదికన పాన్ (పర్మనెంట్ అకౌంటు నంబరు) జారీ చేసే యోచన ఉన్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ తెలిపారు. పాన్ లేని వారు ఆధార్ నంబరుతోనైనా ఐటీ రిటర్నులు దాఖలు చేయొచ్చంటూ బడ్జెట్లో ప్రతిపాదన చేసిన నేపథ్యంలో ఇకపై పాన్ అవసరం ఉండదా అన్న ప్రశ్నలకు స్పందిస్తూ మోదీ ఈ మేరకు సమాధానమిచ్చారు. ‘ఈ ప్రతిపాదన అర్థం? పాన్ పూర్తిగా నిరుపయోగంగా మారుతుందని కాదు. పాన్ లేకుండా.. కేవలం ఆధార్ మాత్రమే ఉన్న పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేసేందుకు ఇది అదనపు సదుపాయంగా మాత్రమే భావించాలి‘ అని ఆయన చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో అసెసింగ్ అధికారి తనంత తానుగా పాన్ నంబరును కేటాయించవచ్చని మోదీ వివరించారు. ప్రస్తుతం దేశీయంగా 120 ఆధార్ నంబర్లు, 41 కోట్ల పాన్ నంబర్లు జారీ అయ్యాయి. వీటిల్లో 22 కోట్ల పాన్ లు మాత్రమే ఆధార్తో అనుసంధానమయ్యాయి. -
ఇలా చేయకపోతే.. మీ పాన్ రద్దు
న్యూఢిల్లీ : మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తారా? పాన్తో ఆధార్ను అనుసంధానం చేశారా. చేయకపోతే త్వరపడండి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలులో పాన్కార్డు, ఆధార్ లింకుచేయకపోతే పాన్కార్డు రద్దయ్యే ప్రమాదం ఉంది. ఇన్కం టాక్స్ రిటర్నలతో అను సంధానం కాని ప్యాన్లను రద్దుచేస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఛైర్మన్ సుశీల్ చంద్ర తాజాగా వెల్లడించారు. ఆధార్, పాన్కార్డు నంబర్ల లింకింగ్కు గడువు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో సిబిడిటి ఛైర్మన్ ఈ హెచ్చరిక చేశారు. బయోమెట్రిక్ ఐడి ఆధార్ను పాన్కార్డుతో తక్షణమే లింక్చేయాలని సిబిడిటి ఛైర్మన్ తెలిపారు. అసోచామ్ సదస్సులో పాల్గొన్న సుశీల్చంద్ర పాన్ ఆధార్ లింకింగ్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఐటిశాఖ ఇప్పటివరకూ 42 కోట్ల పాన్ నెంబర్లను జారీచేయగా, వీటిలో 23 కోట్ల పాన్కార్డులు మాత్రమే లింక్ అయ్యాయని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చే మార్చి 31వ తేదీలోపు లింక్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆధార్ను పాన్కార్డుతో లింక్చేస్తే పాన్కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇలా చేయడం వల్ల సంక్షేమపథకాలు అర్హులైన వ్యక్తులకు అందుతున్నాయా లేదా అన్నది కూడా తెలుసుకునే వీలుంటుందన్నారు. కాగా సుప్రీంకోర్టు ఆదాయపు పన్ను రిటర్నుల్లో విధిగా ఆధార్ను పాన్తో లింక్చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకు ఖాతాలు, మొబైల్ సేవలకు పాన్ లింకింగ్ తప్పనిసరి కాదు. -
కార్డు పోయిందా? పొందడం సులువే!
గుంటూరు, తుళ్లూరు: గతంలో ప్రతి ఒక్కరూ తమ వెంట ఫోన్ బుక్, అవసరమైన వాళ్లు కాలిక్యులేటర్, నగదు ఉంచుకునేవారు. కాలం మారుతోంది. అవసరాలు పెరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు వివిధ రకాల కార్డులు భాగస్వామ్యం అయ్యాయి. ఆధార్, ఓటర్, రేషన్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఏటీఎం, పాస్పోర్ట్ తదితర కార్డులను సిటిజన్లు అధికంగా వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఒకానొక కార్డును వినియోగించాల్సి వస్తోంది. ఆర్థిక లావాదేవీల కోసం ఏటీఎం కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యమైంది. ఎప్పుడు దేని అవసరం వస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో అన్నీ ఒకేచోట ఉంచుకోవాల్సి వస్తోంది. అనుకోని పరిస్థితుల్లో మొత్తం కార్డులన్నీ ఒకేసారి పోగొట్టుకుంటే ఏమి చేయాలి? వాటిని తిరిగి ఎలా పొందాలన్న సందేహం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకు కంగారు పడాల్సిన అవసరం లేదని, కొంత సమయం తరువాత పొందే సదుపాయం ఉంది. ఆధార్ కార్డు భారతీయుడిగా గుర్తింపు ఉండాలి అంటే ఆధార్కార్డు తప్పనిసరి. ఎక్కడికెళ్లినా గుర్తింపు కోసం దీనినే అడుగుతున్నారు. ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఆధార్ తప్పనిసరి చేశారు. ఏ కార్డును పొందాలన్నా కూడా ఇది అవసరం. ఇలా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆధార్కార్డు పోతే టోల్ ఫ్రీ నంబర్ 18001801947 కి కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదుచేయాలి. ఇలా చేస్తే ఎలాంటి రుసుం లేకుండా కొత్త కార్డును మళ్లీ పోస్టులో పంపిస్తారు. అలాగే ఆధార్ వెబ్సైట్కు వెళ్లి help@uiadi.gov.in లో పూర్తి సమాచారాన్ని పొందుపరిచి మళ్లీ కార్డును పొందవచ్చు. పాస్పోర్టు పాస్పోర్టు పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. వారు విచారణ జరిపి పాస్పోర్టు లభించకుంటే నాన్ ట్రేస్డ్ ధ్రువపత్రం జారీ చేస్తారు. అనంతరం పాస్పోర్ట్ అధికారి, హైదరాబాద్ పేరిట, రూ.1000 డీడీ తీయాలి. రెండింటినీ జతపరచి దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ చేసి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. విచారణ పూర్తయిన మూడు నెలల అనంతరం డూప్లికేట్ పాస్పోర్టు జారీ చేస్తారు. తత్కాల్ పాస్పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి.వివరాలకు www.ceoandhra.nic.in ను సంప్రదించడం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఓటరు కార్డు ఓటరు గుర్తింపు కార్డు కూడా చాలా విధాలుగా పౌరులకు ఉపయోగ పడుతుంది. కేవలం ఓటు వేయడానికే కాకుండా నివాస, జనన తేదీ ధ్రువపత్రంగా కూడా కొన్ని సందర్భాల్లో దీనిని అడుగుతుంటారు. ఓటరు గుర్తింపు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్ బూత్, కార్డు నంబర్తో రూ.10 రుసుం చెల్లించి మీ సేవా కేంద్రాల్లో మళ్లీ కార్డును పొందవచ్చు. కార్డు నంబర్ ఆధారంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా కార్డును పొందవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు కోసం మరిన్ని వివరాలకు www. passportindia.gov.in ను సందర్శించి తెలుసుకోవచ్చు. రేషన్కార్డు కుటుంబ అవసరాలకు రేషన్కార్డు చాలా కీలకం. కేవలం ప్రభుత్వం అందించే సరుకుల కోసమే కాక పలు ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్కార్డును కీలక ఆధారం. తెల్లకార్డు ఉంటే ప్రభుత్వం వైద్య ఆరోగ్య పథకం కూడా వర్తిస్తుంది. అత్యంత ప్రాధాన్యం ఉన్న రేషన్ కార్డును పొగొట్టుకుంటే బాధితులు www. icfs2.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అక్కడ ఉన్న user name: guest, password: guest123 లాగిన్ అయి రేషన్కార్డు నంబర్ను వేసి రేషన్ జిరాక్స్ కాపీ ప్రతిని పొందవచ్చు. దీని ద్వారా ఏపీ ఆన్లైన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ పరిశీలించి నామమాత్రపు రుసుంతో అదే నంబర్పై కార్డును జారీ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ వాహనం నడిపేందుకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. అది పోతే వెంటనే స్థానికంగా ఉండే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయలి. వారందించే నాన్ ట్రేస్డ్ పత్రంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ప్రతిని ఎల్ఎల్డీ దరఖాస్తుకు జత చేసి ఆర్డీఓ కార్యాలయంలో అందించాలి. అలాగే రూ.10 బాండ్ పేపర్పై కార్డు పోవడానికి కారణాలను అందజేయాల్సి ఉంటుంది. నెల రోజుల్లో తిరిగి అధికారుల నుంచి కార్డును పొందవచ్చు. www.aptransport.org నుంచి ఎల్ఎల్డీ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని మరిన్ని వివరాలు పొందవచ్చు. అందులోని వివరాలను పొందుపరచడం ద్వారా కూడా పోయిన కార్డును పొందవచ్చు. ఏటీఎం కార్డు ఏటీఎం కార్డు పోగొట్టుకున్నా ఎవరైనా దొంగతనం చేసినా ముందుగా సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాక్ చేయించాలి. తరువాత ఫిర్యాదు ఆధారంగా బ్యాంకులో కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు మేనేజర్ ఈ విషయాన్ని నిర్ధారించుకుని కొత్తకార్డును జారీ చేస్తారు. ఇందుకోసం ఆయా బ్యాంకుల నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి. పాన్ కార్డు ఆర్థిక లావాదేవీల్లో పాన్కార్డు ఇప్పుడు చాలా అవసరం. ఆదాయపన్ను శాఖ అందించే పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్) కార్డు పోగొట్టుకుంటే సంబంధిత ఏజెన్సీలో కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు పాత కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫోటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. కొత్త కార్డు కోసం అదనంగా రూ.90 చెల్లించాలి. కొత్తకార్డు వచ్చే సరిని మూడు వారాల సమయం పట్టవచ్చు. www.nsdl.pan అనే వెబ్ సైట్లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. -
కారు కోసం కట్టుకున్న భార్యను..
చండీగఢ్ : కారు కొనటానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కట్టుకున్న భార్యను పెనంతో కొట్టి చంపాడు ఓ భర్త. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్లోని మొహలి జిల్లాకు చెందిన మమన్దీప్ కౌర్(28), భర్త గురుప్రీత్ సింగ్తో కలిసి జిరక్పూర్లో నివాసముంటోంది. గురుప్రీత్ సింగ్ 10 సంవత్సరాలు లండన్లో ఉండి సంవత్సరం క్రితమే ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆనాటి నుంచి ఉద్యోగానికి వెళ్లకుండా అదనపు కట్నం కావాలంటూ భార్యను వేధించేవాడు. గత కొద్దినెలలుగా కారు కొనటానికి డబ్బులు కావాలని మమన్దీప్ను ఇబ్బంది పెట్టేవాడు. క్యాబ్ సర్వీస్ మొదలుపెట్టడానికి ఇంటి నుంచి డబ్బులు తెమ్మంటూ హింసించే వాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. గురువారం గొడవ తారాస్థాయికి చేరటంతో ఆగ్రహానికి గురైన గురుప్రీత్ ఆమెను పెనంతో కొట్టి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె సోదరుడు గురుప్రీత్కు ఫోన్ చేయగా.. అతని మాటలు అనుమానానికి దారితీశాయి. అనుమానంతో చెల్లెలి కోసం ఇంటికి వెళ్లి చూడగా.. సోదరి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న గురుప్రీత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
‘పాన్–ఆధార్’ గడువు పెంపు
న్యూఢిల్లీ: పాన్ను ఆధార్తో అనుసంధానం చేసుకునేందుకు గడువును ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) జూన్ 30 వరకు పొడిగించింది. మార్చి 31తో ముగియాల్సిన ఈ గడువును పెంచుతూ మంగళవారం ఒక ప్రకటన జారీచేసింది. ఆధార్తో పాన్ లింకేజీకి చివరి తేదీని పొడిగించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మొబైల్, బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేసుకోవడానికి గడువును సుప్రీంకోర్టు ఇటీవలే నిరవధికంగా పొడిగించిన నేపథ్యంలోనే సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలకు లభించని పొడిగింపు సంక్షేమ పథకాలను ఆధార్తో అనుసంధానించుకోవడానికి గడువును పొడిగించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఆ గడువు మార్చి 31తో ముగియనుంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తిరస్కరించింది. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడటానికి పటిష్ట చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందంది. ప్రైవేట్ సంస్థలు ఆధార్ సమాచారాన్ని బహిర్గతం చేయకుండా తీసుకుంటున్న చర్యలేంటని ఆధార్ ప్రాధికార సంస్థను ప్రశ్నించింది. యూఐడీఏఐ కేంద్రీయ డేటా నిల్వ కేంద్రం నుంచి సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాల్లేవని ఆ సంస్థ తెలిపింది. -
పన్ను ఎగవేతదారుల నుంచి భారీగా నగదు
పన్ను ఎగవేతదారులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీగానే చుక్కలు చూపిస్తోంది. బ్యాంకు ఖాతాలకు, రెండు లక్షలు దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్ కార్డును తప్పనిసరి చేయడంతో, దాంతో పాటు ఆధార్ లింక్ చేయడం వంటి వాటితో పన్ను ఎగవేతదారులకు ప్రభుత్వం గండికొడుతోంది. తాజాగా అదనపు రిటర్నులలో రూ.1.7 కోట్ల ఫైల్ చేశారని, దీంతో మొత్తంగా ప్రభుత్వం డిసెంబర్ వరకు రూ.26,500 కోట్లు ఆర్జించినట్టు తెలిసింది. ఇన్-హౌజ్ సమాచారంతోనే నాన్-ఫైలర్స్ను ఆదాయపు పన్ను శాఖ గుర్తిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పార్లమెంట్కు తెలిపారు. ఈ డేటాను టీడీఎస్, టీసీఎస్ ద్వారా సేకరించిన ఎక్కువ విలువ ఉన్న లావాదేవీలతో ట్యాలీ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్ నెంబర్ను రూ.2 లక్షలకు పైన జరిపే లావాదేవీలు ప్రాపర్టీ, షేర్లు, బాండ్లు, ఇన్సూరెన్స్, విదేశీయ ప్రయాణం వంటి అన్నింటికీ తప్పనిసరి చేసినట్టు చెప్పారు. గతేడాది 35 లక్షల నాన్-ఫైలర్స్ను గుర్తించామని, ఆ ముందటేడాది ఈ సంఖ్య 67 లక్షలుగా ఉండేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. నాన్-ఫైలర్స్ను గుర్తించిన అనంతరం పలు కేటగిరీలోకి కేసులను వర్గీకరించి, మానిటర్ చేస్తున్నట్టు అరుణ్జైట్లీ తెలిపారు. రిటర్నులు ఫైల్ చేయాలని టార్గెట్ చేసిన గ్రూప్లుకు టెక్ట్స్ మెసేజ్లు, ఈమెయిల్స్ను పంపుతున్నట్టు కూడా పేర్కొన్నారు. వారి స్పందనలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్ట్ ఇన్సైట్ అనే కొత్త మెకానిజం ద్వారా మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
వారానికి పాన్ కార్డు అప్లికేషన్స్ ఎన్నో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖకు పాన్ కార్డ్ కోసం రోజుకు సగటున 15నుంచి 25లక్షల దరఖాస్తులు అందుతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేవలం కొన్ని గంటలు లేదా రెండువారాల్లో పాన్ కార్డులను జారీ చేస్తున్నట్టు అయితే ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. పాన్కార్డు దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి , పాన్కార్డు కేటాయింపు కోసం కొన్ని గంటల నుండి రెండు వారాలు సమయం పడుతోందని ఆర్థిక శాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వారానికి సగటున 25లక్షల దాకా అప్లికేషన్స్ ఐటీ శాఖకు అందుతున్నాయని శుక్లా తెలిపారు. జనవరి 28, 2018 నాటికి, మొత్తం 20,73,434 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. పాన్ కార్డు జారీకి రెండు సర్వీసు ప్రొడైవర్లు ఎన్ఎస్డిఎల్ ఇ-గోవ్ , యూటీఐఐటీఎస్ (NSDL e-Gov and UTIITS) ఆదాయ పన్నుశాఖ కలిసి పనిచేస్తోందన్నారు. అలాగే పాన్ కార్డుతోపాటు ఇ పాన్ కార్డు ఒకేసారి జారీ చేస్తున్నామని వివరించారు. పాన్కార్డు జారీ ప్రక్రియ ఆలస్యమైనా, నిబంధనలు ఉల్లంఘించినా భారీ జరిమానా విధించేలా సర్వీసు ప్రొవైడర్లతో ఒప్పందం ఉన్నట్టు స్పష్టం చేశారు.