Advertisement
one day world cup
-
ODI WC 1996: అప్పుడు కారు.. ఇప్పుడు మీరు! ఈ క్రికెటర్ని గుర్తుపట్టారా?
Sanath Jayasuriya- “Golden memories”: శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య 1996 ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. నాటి వన్డే వరల్డ్కప్ టోర్నీలో తన అత్యుత్తమ ప్రదర్శనకు ప్రతిఫలంగా లభించిన కారుతో ఉన్న ఫొటోలు పంచుకున్నాడు. ఇన్స్టాలో షేర్ చేసిన ఈ అపురూప చిత్రానికి.. ‘‘మరుపురాని జ్ఞాపకాలు: 27 ఏళ్ల క్రితం.. 1996 వరల్డ్కప్ మ్యాన్ ఆఫ్ సిరీస్ కార్తో ఇలా’’ అని తన పాత, ప్రస్తుత ఫొటోను జతచేసి క్యాప్షన్ ఇచ్చాడు. సనత్ జయసూర్య అభిమానులను ఆకర్షిస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అప్పుడు కారు మెరిసింది.. ఇప్పుడు మీరు మెరుస్తున్నారు అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కంగారూ జట్టును చిత్తుచేసి ప్రపంచకప్- 1996 ఫైనల్లో లాహోర్ వేదికగా శ్రీలంక- ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో లంక ఆసీస్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కంగారూ జట్టును చిత్తు చేసి జగజ్జేతగా అవతరించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి 221 పరుగులు సాధించడంతో పాటు.. ఏడు వికెట్లు తీసిన లంక ఆల్రౌండర్ సనత్ జయసూర్య మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఈ క్రమంలో అతడికి ఆడి కారు బహుమతిగా లభించింది. ఇదిలా ఉంటే.. సనత్ జయసూర్య తన కెరీర్లో 445 వన్డేల్లో 13,430, 110 టెస్టుల్లో 6973 పరుగులు, 31 టీ20 మ్యాచ్లలో 629 పరుగులు సాధించాడు. ఇందులో 42 సెంచరీలు, మూడు ద్విశతకాలు ఉన్నాయి. ఇక ఈ స్పిన్ ఆల్రౌండర్ తన కెరీర్ మొత్తంలో వన్డే, టెస్టులు, టీ20లలో వరుసగా.. 323, 98, 19 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. IPL 2023: ధోనికి సరైన వారసుడు.. అతడికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో!: సెహ్వాగ్ View this post on Instagram A post shared by Sanath Jayasuriya (Official) (@sanath_jayasuriya) -
టీమిండియా ప్రపంచకప్ గెలవదు.. నటరాజన్కు అవకాశం ఇవ్వాలి: పాక్ మాజీ క్రికెటర్
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో 1-2 తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా భారత్ అంతగా రాణించలేకపోయింది. వన్డే వరల్డ్కప్ సన్నహాకాల్లో భాగంగా జరిగిన సిరీస్లో ఓటమిపాలైన రోహిత్ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్ను భారత్ గెలవాలంటే మెరుగైన బౌలింగ్ యూనిట్ అవరమని కనేరియా అభిప్రాయపడ్డాడు. కనేరియా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. "ప్రస్తుతం టీమిండియా చెత్త బౌలింగ్ లైనప్ కలిగి ఉంది. వన్డే ప్రపంచకప్లో భారత్కు మెరుగైన బౌలర్లు అవసరం. ప్రస్తుత బౌలర్లతో భారత్ వన్డే ప్రపంచకప్ను గెలవలేదు. బుమ్రా అందుబాటులో లేడు కాబట్టి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్,టి నటరాజన్ వంటి బౌలర్లకు అవకాశం ఇవ్వాలి. ఇక భారత బ్యాటర్లు స్పిన్కు అద్భుతంగా ఆడుతారని అందరూ అంటుంటారు. వారు నెట్స్లో ముఖ్యంగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్లను ఎదుర్కొంటారు. వారి కొంచెం వేగంగా బౌలింగ్ చేయడం వల్ల బంతి పెద్దగా టర్న్ కాదు. అయితే మూడో వన్డేలో ఆస్ట్రేలియా స్పిన్నర్లు బంతిని అద్భుతంగా టర్న్ చేశారు. కాబట్టి భారత బ్యాటర్లు స్పిన్కు వికెట్లు సమర్పించుకున్నారు అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే? -
ఇదేమి సెలబ్రేషన్రా నాయనా... ఇప్పటివరకు చూసి ఉండరు! వీడియో వైరల్!
వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫియర్స్ ఆశలను నేపాల్ జట్టు సజీవంగా నిలుపుకుంది. ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2లో భాగంగా యూఏఈతో జరిగిన డూ ఆర్డై మ్యాచ్లో 42 పరుగుల తేడాతో నేపాల్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. నేపాల్ బ్యాటర్లలో భీమ్ షార్కి(70), ఆరిఫ్ షేక్(43) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో జూనైడ్ సిద్దూఖి మూడు వికెట్లు, ముస్తఫా, లాక్రా తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. 45 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లో ఆసిఫ్ ఖాన్(82), ఆర్యన్ లాక్రా(50) పరుగులతో రాణించనప్పటికీ.. ఓటమి మాత్రం యూఏఈ వెంట నిలిచింది. ఇక నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, కామి తలా మూడు వికెట్లతో యుఏఈ పతనాన్ని శాసించారు. దీపేంద్ర సింగ్ స్పెషల్ సెలబ్రేషన్స్... నేపాల్ విజయంలో ఆ జట్టు స్పిన్నర్ దీపేంద్ర సింగ్ కీలక పాత్ర పోషించాడు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన దీపేంద్ర సింగ్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో దీపేంద్ర సింగ్ ఓ స్పెషల్ సెలబ్రేషన్స్తో అందరని ఆశ్చర్యపరిచాడు. యూఏఈ ఇన్నింగ్స్ 42 ఓవర్ వేసిన దీపేంద్ర.. అద్భుతంగా ఆడుతున్న ఆసిఫ్ ఖాన్ను రిటర్న్ క్యాచ్తో పెవిలియన్కు పంపాడు. దీంతో నేపాల్ జట్టు సంబురాల్లో మునిగి తేలిపోయింది. దీపేంద్ర సింగ్ అయితే గ్రౌండ్లో పై ఫ్లిప్స్ (గెంతులు) వేసి వికెట్ సెల్బ్రేషన్స్ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
అగ్రస్థానానికి ఎగబాకిన ఇంగ్లండ్
ICC Cricket World Cup Super League Points Table: ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అగ్రస్థానానికి ఎగబాకింది. శుక్రవారం (మార్చి 3) బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్ టాప్ ప్లేస్కు చేరుకుంది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలుండగానే 3 మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో గెలుపొందిన ఇంగ్లండ్.. 20 పాయింట్లు ఖాతాలో వేసుకుని మొత్తంగా 155 పాయింట్లు (23 మ్యాచ్లు) సాధించింది. ఇంగ్లండ్ భారీగా పాయింట్లు సాధించడంతో అగ్రస్థానంలో ఉండిన న్యూజిలాండ్.. 150 పాయింట్లకు (21 మ్యాచ్ల్లో) పరిమితమై రెండో స్థానానికి దిగజారింది. 21 మ్యాచ్ల్లో 139 పాయింట్లు కలిగిన టీమిండియా మూడో స్థానంలో, 21 మ్యాచ్ల్లో 130 పాయింట్లు సాధించిన పాకిస్తాన్ నాలుగులో, 18 మ్యాచ్ల్లో 120 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా ఐదో స్థానంలో, ఆతర్వాత బంగ్లాదేశ్ (20 మ్యాచ్ల్లో 120), ఆఫ్ఘనిస్తాన్ (15 మ్యాచ్ల్లో 115), వెస్టిండీస్ (24 మ్యాచ్ల్లో 88), సౌతాఫ్రికా (19 మ్యాచ్ల్లో 78), శ్రీలంక (21 మ్యాచ్ల్లో 77), ఐర్లాండ్ (21 మ్యాచ్ల్లో 68), జింబాబ్వే (21 మ్యాచ్ల్లో 45), నెదర్లాండ్స్ (19 మ్యాచ్ల్లో 25) వరుస స్థానాల్లో నిలిచాయి. కాగా, ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ సూపర్ లీగ్ పాయింట్ల ఆధారంగా వన్డే వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించే బెర్తులు ఖరారవుతాయి. 2023 వన్డే ప్రపంచకప్కు ఆతిధ్యమిస్తున్న కోటాలో భారత్ నేరుగా వరల్డ్కప్కు క్వాలిఫై కాగా.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇప్పటివరకు 2023 వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించాయి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'అతడికి 300 వికెట్లు తీసే సత్తా ఉంది.. ప్రపంచకప్లో అదరగొడతాడు'
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్పై వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న వన్డే ప్రపంచకప్లో సిరాజ్ అద్భుతంగా రాణిస్తాడని కార్తీక్ కొనియాడు. కాగా గత కొంత కాలంగా సిరాజ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ హైదారాబాదీ ప్రస్తుతం వన్డేల్లో ప్రపంచ నెం1 బౌలర్గా ఉన్నాడు. అదే విధంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా సిరాజ్ మెరుగ్గా రాణిస్తున్నడు. మొదటి టెస్టులో మహమ్మద్ సిరాజ్ తన స్పెల్తో ఆసీస్కు చుక్కలు చూపించాడు. ఇక రెండో టెస్టులో స్పిన్నర్లు చెలరేగడంతో సిరాజ్కు బౌలింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో కార్తీక్ క్రిక్బజ్ షో రైజ్ ఆఫ్ న్యూ ఇండియాలో మాట్లాడుతూ.. "సిరాజ్ వన్డే ప్రపంచకప్ భారత జట్టులో ఖచ్చితంగా భాగమవుతాడు. అతడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది మెగా ఈవెంట్లో అదరగొడతాడని భావిస్తున్నాను. అయితే గతేడాది ఐపీఎల్ సీజన్ అతడికి చాలా విషయాలు నేర్పించింది. వైఫల్యాలను ఎలా ఎదుర్కొవాలో తెలుసుకున్నాడు. అదే విధంగా అతడు పూర్తి ఫిట్నెస్తో తన కెరీర్ను కొనసాగిస్తే.. కనీసం 300 టెస్టు వికెట్లు అయినా సాధిస్తాడు" అని కార్తీక్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: గుజరాత్ టైటాన్స్కు ఊహించని షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం! -
రిషబ్ పంత్ హెల్త్ అప్డేట్.. టీమిండియాకు షాకింగ్ న్యూస్
Rishabh Pant Likely To Miss ODI WC 2023: కారు ప్రమాదానికి గురైన భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ సాధారణ స్థితికి రావడానికే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఆ తర్వాతే ఫిట్నెస్, ఆట గురించి ఆలోచించగలిగేది! ఈ నేపథ్యంలో పంత్ స్వదేశంలో అక్టోబర్–నవంబర్లలో జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీతోపాటు 2023 మొత్తం సీజన్కు దూరమయ్యే చాన్స్ ఉంది. పంత్ కుడి మోకాలిలో మూడు లిగ్మెంట్లు బాగా దెబ్బ తినగా...రెండింటిని శస్త్ర చికిత్సతో చక్కదిద్దారు. మరో ఆరు వారాల్లో పంత్కు మరో కీలక సర్జరీ జరుగనున్నట్లు బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు వెల్లడించారు. -
'జడేజా, చాహల్కు నో ఛాన్స్.. వరల్డ్ కప్కి ఆ నలుగురు స్పిన్నర్లే బెస్ట్'
వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో తలపడుతోంది. ఇప్పటికే వరుసగా రెండు వన్డేలు గెలిచిన భారత్.. 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఇక సిరీస్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.. వన్డే ప్రపంచకప్లో భారత్ తరుపున బరిలోకి దిగే నలుగురు స్పిన్నర్లరను ఎంచుకున్నాడు. కాగా ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. గంభీర్ స్టార్ స్పోర్ట్ షోలో మాట్లాడుతూ.. "ప్రపంచకప్లో మణికట్టు స్పిన్నర్ అక్షర్ పటేల్కు కచ్చితంగా చోటు ఇవ్వాలి. అక్షర్ గత కొన్ని సిరీస్ల నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. అదే విధంగా స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో ఉండాలి. ఇక కుల్దీప్ యాదవ్కు స్వదేశంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. భారత్లో అతడు బంతితో మ్యాజిక్ చేయగలడు. కాబట్టి కుల్దీప్ కూడా ప్రపంచకప్ భారత జట్టులో అవకాశం ఇవ్వాలి. ఇక ఆఖరిగా యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ని జట్టులోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. రవి ప్రస్తుతం భారత్ సన్నాహాకాల్లో లేనప్పటికీ.. ఐపీఎల్లో అద్భుతంగా రాణించి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది" అని పేర్కొన్నాడు. కాగా భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్కు గంభీర్ ఎంపిక చేయకపోవడం గమానార్హం. చదవండి: Virat Kohli: 'సచిన్ సాధించిన ఆ రికార్డును కోహ్లి సాధించలేడు' -
వన్డే ప్రపంచకప్ను గెలవడమే మా లక్ష్యం: హార్ధిక్ పాండ్యా
2023 ఏడాదిలో టీమిండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ముంబై వేదికగా జనవరి 3న శ్రీలంకతో తొలి టీ20లో తలపడేందుకు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు తలపడనుంది. ఈ క్రమంలో తొలి టీ20కు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన్న భారత తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ను సొంతం చేసుకోవడమే ఈ ఏడాది భారత జట్టు లక్ష్యమని హార్దిక్ తెలిపాడు. హార్దిక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "ప్రపంచకప్ను గెలవడమే ఈ ఏడాది మా జట్టు అతి పెద్ద రిజల్యూషన్. నిజంగా ప్రపంచ కప్ను గెలవాలనుకుంటున్నాము. అందుకోసం అన్ని విధాల మేము సన్నద్దం అవుతాము. ప్రస్తుతం మా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. కాబట్టి ఈ ఏడాది ప్రపంచకప్ను సొంతం చేసుకుంటామన్న నమ్మకం నాకు ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్లో కూడా మేము మా శక్తికి మించి ప్రయత్నించాం. కానీ మేము మా లక్ష్యాన్ని నేరవేర్చుకోలేకపోయాం. దురదృష్టవశాత్తు సెమీస్లోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రపంచకప్లో కూడా 100% శాతం ఎఫక్ట్ పెట్టేందుకు సిద్దంగా ఉన్నాము. అంతకంటే ముందు శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్లపై మేము దృష్టి సారించాల్సి ఉంది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. పంత్ దూరం! ఆంధ్రా ఆటగాడు అరంగేట్రం.. -
WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్ సైన్యం
ముంబై: ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా క్రికెటర్ల ఫిట్నెస్కు ప్రాధాన్యమివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ఆదివారం బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆటగాళ్లకు కఠిన పరీక్ష పెట్టే యో–యో ఫిట్నెస్ టెస్టును తిరిగి ప్రవేశ పెట్టనున్నారు. ప్రత్యేకించి ఈ ఏడాది వరల్డ్కప్తో పాటు, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కూడా ఉండటంతో భారత ప్రపంచకప్ సైన్యంపై అదనపు ఒత్తిడి, క్రికెట్ భారం లేకుండా పక్కా ప్రణాళికతో సిరీస్లకు ఎంపిక చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ► బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో బోర్డు కార్యదర్శి జై షా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ పాల్గొన్నారు. బిన్నీ మాత్రం వీడియో కాన్ఫరెన్స్లో హాజరయ్యారు. ► కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ ఇలా గత కొంతకాలంగా భారత కెప్టెన్లను మార్చినప్పటికీ పూర్తిస్థాయి సారథిగా రోహిత్ శర్మనే కొనసాగించాలని తీర్మానించారు. తద్వారా సారథ్య మార్పు ఉండదని స్పష్టం చేశారు. ► మెగా టోర్నీ, మేటి జట్లతో సిరీస్ల నేపథ్యంలో జట్టు సెలక్షన్ కోసం యో–యో టెస్టు, డెక్సా (ఎముకల పరిపుష్టి పరీక్ష) టెస్టుల్ని నిర్వహిస్తారు. ఎంపికవ్వాలంటే ఈ టెస్టులు పాసవ్వాలి. ► ఎమర్జింగ్ ప్లేయర్లు ఐపీఎల్తో పాటు ప్రాధాన్యత గల దేశవాళీ టోర్నీల్లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్న వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారు. ► ప్రపంచకప్కు ఎంపికయ్యే క్రికెటర్లంతా పూర్తి ఫిట్నెస్తో మెగా ఈవెంట్కు అందుబాటులో ఉండేలా చూడటమే ప్రాధాన్య అంశంగా భేటీ జరిగింది. ఆటగాళ్లపై బిజీ షెడ్యూల్ భారం, ఒత్తిడి, మెంటల్ కండిషనింగ్, ఫిట్నెస్ అంశాల్ని ఇందులో చర్చించారు. ► మంచి ఆల్రౌండర్ అవుతాడనుకున్న దీపక్ చహర్, భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాల పాలవడంపై చర్చించిన మీదట ఫిట్నెస్పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ► అవసరమైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలతో కూడా బోర్డు పెద్దలు మాట్లాడతారు. ఈ ఏడాది భారత క్రికెట్కు అత్యంత కీలకం కాబట్టి ఆయా ఫ్రాంచైజీలు ఐపీఎల్ టోర్నీ సమయంలో తమ స్టార్ ఆటగాళ్లపై పెనుభారం మోపకుండా చూస్తారు. ► గతంలో కోహ్లి కెప్టెన్సీ హయాంలో యో–యో టెస్టు వార్తల్లో నిలిచింది. అయితే ఇది స్టార్, ఎలైట్ ఆటగాళ్లను కష్టపెట్టడంతో తాత్కాలికంగా యో–యో టెస్టును పక్కన పెట్టారు. ► ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచకప్లో టీమిండియా సెమీఫైనల్ వైఫల్యం దరిమిలా తొలగించిన సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఈ కీలక మీటింగ్లో పాల్గొనడం గమనార్హం. 20 మందితో ప్రపంచకప్ సైన్యం... సొంతగడ్డపై ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరిగే ప్రపంచకప్ కోసం 20 మందితో కూడిన జాబితాను సిద్ధం చేశారు. మెగా టోర్నీ జరిగేదాకా వీరందరూ కూడా ఒకే టోర్నీలో బరిలోకి దిగరు. రొటేషన్ పద్ధతిలో ఆడతారు. కొందరికి విశ్రాంతి... ఇంకొందరు బరిలోకి అన్నట్లుగా ఈ పద్ధతి సాగుతుంది. గాయాల పాలవకుండా, మితిమీరిన క్రికెట్ భారం పడకుండా ఉండేందుకు బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఈ ఏడాదైనా భారత్కు కలిసోచ్చేనా? టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే?
భారత జట్టుకు 2022 ఏడాది పెద్దగా కలిసి రాలేదు. గతేడాది జరిగిన ఆసియాకప్తో పాటు టీ20 ప్రపంచకప్లో టీమిండియా నిరాశ పరిచింది. ఇక 2023 కొత్త సంసంవత్సరంలో క్రికెట్ ప్రపంచంలో సత్తా చాటేందుకు భారత జట్టు సిద్దమైంది. స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్తో ఈ ఏడాదిని టీమిండియా ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో 2023 ఏడాదిలో భారత జట్టు పూర్తి షెడ్యూల్ను ఓ సారి పరిశీలిద్దాం. శ్రీలంకతో మొదలు.. టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. తొలుత మూడు టీ20ల సిరీస్ల జరగనుంది. జనవరి 3న ముంబై వేదికగా జరగనున్న మొదటి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రెండో టీ20 జనవరి 5న పుణేలో, మూడో టీ20 జనవరి 7న రాజ్కోట్ వేదికగా జరగనుంది. అదే విధంగా వన్డే సిరీస్లో భాగంగా మూడు వన్డేలు జనవరి 10, 12, 15 తేదీల్లో గువాహటి, కోల్కతా, త్రివేండ్రంలలో జరగనున్నాయి. న్యూజిలాండ్తో పోరు శ్రీలంకతో వైట్ బాల్ సిరీస్ ముగిసిన అనంతరం సొంత గడ్డపై న్యూజిలాండ్తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లు టీమిండియా ఆడనుంది. ఇందులో భాగంగా తొలి వన్డే జనవరి 18న హైదరాబాద్లో జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 21, 24 తేదీల్లో రాయ్పూర్, ఇండోర్లలో మిగతా రెండు వన్డేలు జరుగుతాయి. ఇక టీ20 సిరీస్లో భాగంగా జనవరి 27, 29, ఫిబ్రవరి 1న రాంచీ, లక్నో, అహ్మదాబాద్లలో జరుగుతాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లక్ష్యంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు స్వదేశంలో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియాతో తలపనుంది. టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 సైకిల్లో టీమిండియాకు ఇదే ఆఖరి సిరీస్. భారత్ ఈ సిరీస్లో మెరుగ్గా రాణిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను ఖారారు చేసుకుంటుంది. ఇక టెస్టు సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 9-13 వరకు నాగ్పూర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అనంతరం ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్ ఢిల్లీలో, మార్చి 1-5 వరకు ధర్మశాలలో మూడో టెస్టు, మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్ అహ్మదాబాద్లో జరుగుతాయి. ఇక టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం ఆసీస్తో భారత్ మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. మార్చి 17, 19, 22 తేదీల్లో ముంబై, విశాఖపట్నం, చెన్నై వేదికలగా ఈ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్లో జరగనుంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్లో భారత్ విజయం సాధిస్తే ఖచ్చితంగా ఫైనల్లో అడుగు పెడుతోంది. విండీస్ పర్యటనకు.. జూలై-ఆగస్టులో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. మ్యాచ్ల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఆసియా కప్ 2023.. 2023 ఆసియా కప్ సెప్టెంబర్లో పాకిస్తాన్ వేదికగా జరగనుంది. ఆసియా కప్లో భారత్ పాల్గొనడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా వెళ్లే అవకాశాలు దాదాపు లేనట్లే. ఒకవేళ తటస్థ వేదికపై ఆసియా కప్ను నిర్వహిస్తేనే భారత జట్టు ఆడుతోంది అని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. స్వదేశంలో మళ్లీ ఆసీస్తో.. వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్లో భారత్కు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇంకా షెడ్యూల్ ఖారారు కాలేదు. సొంత గడ్డపై ప్రపంచకప్.. ఈ ఏడాది ఆక్టోబర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. తొలి సారిగా ఐసీసీ వన్డే ప్రపంచకప్కు పూర్తి స్థాయిలో భారత్ అతిథ్యం ఇవ్వనుంది. గతంలో 1987, 1996, 2011లలోనూ భారత్ అతిథ్యం ఇచ్చినప్పటకీ.. పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలతో సంయుక్తంగా నిర్వహించింది. ముచ్చటగా మూడో సారి ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా జట్టు మరోసారి భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా కంగారూలు ఐదు టీ20ల సిరీస్ ఆడనున్నారు. ఈ సిరీస్ నవంబర్ ఆఖరిలో జరిగే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనతో ముగింపు ఏడాది చివర్లో భారత్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. -
'ప్రపంచకప్కు ఇంకా చాలా సమయం ఉంది.. ఇప్పడు మా దృష్టి అంతా దాని పైనే'
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ గురించి ఇప్పుడు నుంచి ఆలోచించడం తొందరపాటే అవుతుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బంగ్లాదేశ్తో తొలి వన్డే సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోహిత్ ఈ వాఖ్యలు చేశాడు. ప్రస్తుతం మా దృష్టి అంతా బంగ్లా సిరీస్పైనే ఉంది అని రోహిత్ తెలిపాడు. "మేము ఆడే ప్రతి సిరీస్ వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగానే జరగుతుంది. కానీ ప్రపంచకప్కు ఇంకా 8-9 నెలల సమయం ఉంది. ఇప్పటికైతే అంత దూరం ఆలోచించడం లేదు. ప్రస్తుతం ఒక జట్టుగా సమిష్టింగా ఎలా రాణించాలన్న విషయంపై దృష్టి సారిస్తాం. మేమ ఇంకా చాలా విషయాల్లో మెరుగుపడాలి. ఇలాంటి కాంబినేషన్, అలాంటి కాంబినేషన్ అని ఇప్పుడే నిర్ణయించుకోం. మేము ప్రస్తుతం ఏమి చేయాలనుకుంటున్నాము అనే దాని గురించి నేను, కోచ్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నాము. ప్రపంచ కప్కు సమయం దగ్గరపడినప్పుడు అందుకు తగ్గట్టు ప్రాణాళికలు రచించేందుకు సిద్దంగా ఉన్నాము. వరల్డ్కప్ వరకు మేము అన్ని మ్యాచ్ల్లో అత్యుత్తమంగా రాణించాలి అనుకుంటున్నాము. బంగ్లాతో వన్డే సిరీస్ గెలవడమే మా ప్రస్తుత లక్ష్యం" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. చదవండి: IND vs BAN 1st ODI: తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్.. యువ బౌలర్ ఎంట్రీ -
ధవన్ లాగే రోహిత్నూ వన్డేలకు మాత్రమే పరిమితం చేస్తారా..?
గడిచిన 9 ఏళ్లలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోడం అభిమానులు, ఆటగాళ్లను ఎంత బాధిస్తుందో బీసీసీఐని కూడా అంతే ఆవేదనకు గురి చేస్తుంది. ఈ విషయంలో భారత్ ఓ మోస్తరు జట్ల కంటే హీనంగా ఉండటాన్ని టీమిండియా ఫ్యాన్స్, బీసీసీఐ చిన్నతనంగా భావిస్తుంది. వెస్టిండీస్, శ్రీలంక లాంటి జట్లు సైతం ఐసీసీ ట్రోఫీలు గెలవడంతో మెగా ఈవెంట్ల సందర్భంగా భారత అభిమానులు తలెత్తుకోలేకపోతున్నారు. భారత్ చివరి సారిగా 2013 ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. నాడు ధోని సారధ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి తాజాగా ముగిసిన టీ20 వరల్డ్కప్-2022 వరకు టీమిండియా ఆడిన ప్రతి ఐసీసీ టోర్నీలో రిక్త హస్తాలతో ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) జరుగబోయే వన్డే వరల్డ్కప్ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఇందులో భాగంగా ఇప్పటినుంచే ప్రక్షాళనను మొదలుపెట్టింది. ఇప్పటికే సెలెక్షన్ కమిటీపై వేటు వేసిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. అతి త్వరలో టీ20 జట్టు నుంచి సీనియర్లను పూర్తిగా తప్పించి.. వన్డేలు, టెస్ట్లకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను టీ20 జట్టు నుంచి తప్పించి వన్డే, టెస్ట్లకు మాత్రమే పరిమితం చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం శిఖర్ ధవన్ను వన్డేలకు మాత్రమే ఎలా వాడుకుంటున్నారో, రోహిత్ను కూడా మున్ముందు వన్డేల్లో మాత్రమే ఆడించాలని బీసీసీఐ యోచినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా రోహిత్.. టీ20ల్లో, టెస్ట్ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోవడం, వయసు మీదపడటం, ఫిట్నెస్ కారణంగా చూపి కెప్టెన్పై వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. రోహిత్ను వన్డేలకు మాత్రమే పరిమితం చేస్తే.. ఈ ఫార్మాట్పై అతను ఎక్కువ ఫోకస్ పెట్టి వరల్డ్కప్ను సాధించి పెట్టగలడని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బీసీసీఐ ప్లాన్లు ఎలా ఉన్నా అతి త్వరలో రోహిత్ విధుల్లో కోత పడటంతో పాటు ఏదో ఒకటి లేదా రెండు ఫార్మాట్లకు మాత్రమే పరిమతం కావడం ఖాయమని తెలుస్తోంది. -
టీమిండియా ఫేవరెట్ ఏంటి..? ఆ జట్టుకు అంత సీన్ లేదు.. నాన్సెన్స్..!
ODI World Cup 2023: టీమిండియాపై తరుచూ అవాక్కులు చవాక్కులు పేలే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్-2022లో తన జట్టు విజేతగా నిలవడంతో కళ్లు నెత్తికి ఎక్కి, భారత జట్టుపై తన నోటి దూలను మరోసారి ప్రదర్శించాడు. సందర్భంతో పని లేకుండా తరుచూ టీమిండియాపై, జట్టులోకి ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాన్.. ఇంగ్లండ్ విశ్వవిజేతగా ఆవిర్భవించడంతో గెలుపు మదంతో కొట్టుకుంటూ టీమిండియాను అవమానకర రితీలో చులకన చేసి మాట్లాడాడు. భారత్ వేదికగా వచ్చే ఏడాది (2023) జరిగే వన్డే వరల్డ్కప్లో ఫేవరెట్ జట్టు ఏదనే అంశంపై ఇంగ్లీష్ దినపత్రిక టెలిగ్రాఫ్కు రాసిన ప్రత్యేక కాలమ్లో టీమిండియాను కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్వదేశంలో వన్డే వరల్డ్కప్ ఆడాల్సి ఉన్నప్పటికీ ఫేవరెట్ జట్టు మాత్రం కాలేదని, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్కే ఆ ట్యాగ్ తగిలించుకునే అర్హత ఉందని గొప్పలు పోయాడు. టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమిండియాకు ఫేవరెట్ అనిపించుకునే అర్హత లేదని, ఇదంతా నాన్సెన్స్ అని అవమానకర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్కప్లో టీమిండియా ఫేవరెట్ అంటే అస్సలు ఒప్పుకోనని, వరల్డ్కప్ ఎక్కడ జరిగినా ఫేవరెట్ జట్టుగా ఇంగ్లండే ఉంటుందని గర్వంతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా లాంటి పేస్ అనుకూలమైన పిచ్లపైనే సత్తా చాటి వరల్డ్కప్ నెగ్గిన తమకు భారత పిచ్లపై రాణించి వరల్డ్కప్ గెలవడం పెద్ద విషయం కాదని అన్నాడు. స్వదేశంలో ఆడుతుంది కాబట్టి టీమిండియానే ఫేవరెట్ అని ఎవరైన అంటే, వారితో ఏకీభవించేది లేదని తెలిపాడు. వన్డే వరల్డ్కప్లో ఏకైక ఫేవరెట్ అయిన ఇంగ్లండ్.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదా నిలబెట్టుకుని మెగా ఈవెంట్లలో జైత్రయాత్ర కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇదే సందర్భంగా బీసీసీఐపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. నేనే ఇండియన్ క్రికెట్కు బాస్ను అయితే, అహంకారాన్ని తగ్గించుకుని ఇంగ్లండ్ విన్నింగ్ మోడల్ను స్పూర్తిగా తీసుకుని ఫాలో అవుతానని అన్నాడు. మేజర్ టోర్నీల్లో టీమిండియా గెలవాలంటే బీసీసీఐ.. ఇంగ్లండ్ను ఫాలో అవ్వాలని సూచించాడు. వాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు, మాజీలు మండిపడుతున్నారు. అతని వ్యాఖ్యలకు కౌంటర్లిస్తూ.. తగు రీతిలో స్పందిస్తున్నారు. వీడి నోటి దూలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది, వరల్డ్కప్ గెలుపుతో వీడి నోటికి తాళం వేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పిచ్చి వెదవ చేసే వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. చదవండి: 'రోహిత్ పని అయిపోయింది.. ఆ ఇద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయండి' -
'వన్డే ప్రపంచకప్లో భారత ఓపెనర్లు వారిద్దరే'
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ టీ20 కెరీర్కు దాదాపు ఎండ్ కార్డ్ పడినట్లే. గతేడాది జూలైలో భారత్ తరపున ధావన్ తన అఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతడిని భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. కాగా ధావన్ టీ20లకు దూరంగా ఉన్నప్పటికీ.. వన్డేల్లో మాత్రం చోటు దక్కించుకుంటున్నాడు. ధావన్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతోన్న వన్డే సిరీస్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ సారథ్యంలోని భారత సీనియర్ జట్టు టీ20 ప్రపంచకప్-2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లడంతో ధావన్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే వరల్డ్కప్-2023 భారత్ వేదికగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్కు భారత జట్టులో ధావన్కు ఖచ్చితంగా చోటు దక్కుతుందని టీమిండియా మాజీ సెలెక్టర్ సబా కరీం థీమా వ్యక్తం చేశాడు. అదే విధంగా రోహిత్తో కలిసి భారత ఇన్నింగ్స్ను శిఖర్ ప్రారంభిస్తాడని కరీం జోస్యం చెప్పాడు. ఇండియా న్యూస్తో కరీం మాట్లాడుతూ.. "వన్డే ప్రపంచకప్కు భారత జట్టులో శిఖర్ ధావన్కు స్థానం దాదాపు ఖారారైంది. అతడు అద్భుతమైన ఆటగాడు. అతడు విఫలమైన మ్యాచ్లు ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటాయి. ప్రపంచకప్లో రోహిత్ శర్మ, ధావన్ను ఓపెనర్లుగా ఉండాలని సెలక్టర్లు ఇప్పటికే నిర్ణయించారని నేను భావిస్తున్నాను" పేర్కొన్నాడు. చదవండి: Ravindra Jadeja: తన క్రష్ ఏంటో చెప్పిన జడేజా.. షాకైన అభిమానులు -
కెప్టెన్లంతా ఔట్.. ఒక్క కేన్ మామ తప్ప..!
ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్గా ఆరోన్ ఫించ్ వైదొలిగిన నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 2019 వన్డే వరల్డ్కప్ ఆడిన పది దేశాల కెప్టెన్లలో ప్రస్తుతం ఒకే ఒక్కరు సారధిగా కొనసాగుతున్నారు. గత వన్డే వరల్డ్కప్లో ఇంగ్లండ్ (డిఫెండింగ్ ఛాంపియన్) కెప్టెన్గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్, విరాట్ కోహ్లి (ఇండియా), ఫాఫ్ డుప్లెసిస్ (సౌతాఫ్రికా), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్తాన్), శ్రీలంక (దిముత్ కరుణరత్నే), ముషరఫే మోర్తజా (బంగ్లాదేశ్), గుల్బదిన్ నైబ్ (ఆఫ్ఘనిస్తాన్), తాజాగా ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) కెప్టెన్సీ బాధ్యతలను నుంచి వైదొలగగా ఒక్క కేన్ విలియమ్సన్ మాత్రమే మూడు ఫార్మాట్లలో న్యూజిలాండ్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. కెప్టెన్లకు ఏమాత్రం కలిసి రానిదిగా చెప్పుకునే గడిచిన వన్డే వరల్డ్ కప్ ఆడిన కెప్టెన్లలో కేన్ మామ తప్ప అంతా ఔటయ్యారు. వీరిలో కొందరు స్వతహాగా కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, మరికొందరిని (హోల్డర్, సర్ఫరాజ్, గుల్బదిన్, మోర్తజా, కరుణరత్నే) బలవంతంగా తప్పించారు. తప్పించబడిన కెప్టెన్లలో కొందరు వన్డే జట్టులో స్థానం సైతం కోల్పోయారు. 2019 వన్డే వరల్డ్కప్ ఆడిన కెప్టెన్లలో మిగిలిన ఒకే ఒక్కడు విలియమ్సన్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. కేన్ మామ కెప్టెన్సీ కూడా ఇప్పుడా అప్పుడా అన్నట్లు ఉంది. గత కొంతకాలంగా అతను మూడు ఫార్మాట్లలో దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో కేన్ను పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ దేశ మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ విలియమ్సన్ కూడా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించబడితే గత వన్డే వరల్డ్కప్ ఆడిన కెప్టెన్లంతా ఔటైనట్లే. వరల్డ్కప్ ఆడిన పది మంది కెప్టెన్లలో ఒక్క మోర్గాన్ తప్ప మిగతా ఎవ్వరూ అంత హ్యాపీగా జట్టుకు దూరం కాలేదు. ఇంగ్లండ్కు తొట్ట తొలి వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్గా మోర్గాన్కు మంచి రెస్పెక్ట్ దక్కింది. ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే.. ఈ టీమిండియా తాజా మాజీ కెప్టెన్కు నాటి వరల్డ్కప్ నుంచే దరిద్రం పట్టుకుంది. 2019 నుంచి మూడేళ్లకు పైగా ఒక్క సెంచరీ కూడా చేయని విరాట్.. ఇటీవలే (ఆసియా కప్ 2022) ఓ సెంచరీ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన పోరులో సుదీర్ఘకాలం తర్వాత సెంచరీ బాదిన కోహ్లి కెరీర్లో 71వ సెంచరీ, అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ సాధించాడు. చదవండి: Asia Cup 2022: లంకకు ఎదురుందా! -
వచ్చే ఏడాది వరల్డ్కప్లో ఆడడమే నా టార్గెట్: ధావన్
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్లో ఆడాలనే తన కోరికను ధావన్ తాజాగా వ్యక్తం చేశాడు. ఇందుకోసం తన ఫిట్నెస్, ఆటపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ధావన్ తెలిపాడు. కాగా వచ్చే ఏడాది వన్డే వరల్ఢ్కప్ భారత్ వేదికగా జరగనుంది. ధావన్ టైమ్స్ ఇండియాతో మాట్లాడుతూ.. "ఐసీసీ టోర్నీల్లో ఆడటం నాకు చాలా ఇష్టం. మెగా టోర్నీల్లో ఆడితే నాకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. నేను గతంలో చాలా ఐసీసీ టోర్నమెంట్లలో భాగమయ్యాను. టీమిండియా జర్సీ ధరించిన ప్రతీ సారీ నా పై ఒత్తిడి ఉంటుంది. కానీ అనుభవజ్ఞుడైన ఆటగాడిగా, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. అదేవిధంగా జట్టు మేనేజ్మెంట్ కూడా నాకు చాలా సార్లు మద్దతుగా నిలిచింది. ఏ టోర్నమెంట్కైనా నా దృష్టి, సన్నద్దత ఒకే విధంగా ఉంటుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్పైనే ఉంది. అందుకోసం టీమిండియా తరపున వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలనుకుంటున్నాను. రాబోయే మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేయాలి అనుకుంటున్నాను. వన్డే ప్రపంచకప్కు ముందు ఐపీఎల్ టోర్నీ కూడా జరగనుంది. అదే విధంగా దేశీవాళీ టోర్నీలో కూడా ఆడి, పూర్తి ఫిట్గా ఉండాలని అనుకుంటున్నాను" అతడు పేర్కొన్నాడు. ధావన్ ఇటీవల ముగిసిన విండీస్తో వన్డే సిరీస్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అదే విధంగా త్వరలో జింబాబ్వేతో జరగునున్న వన్డే సిరీస్కు ధావన్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ధావన్ తొలుత కెప్టెన్గా ఎంపికైనప్పటికీ.. రాహుల్ ఫిట్నెస్ సాధించడంతో తిరిగి అతడిని సారధిగా బీసీసీఐ నియమించింది. చదవండి: Shikhar Dhawan: టీ20లకు పక్కనపెట్టారు కదా! సెలక్టర్లు ఏం ఆలోచిస్తారో మనకు తెలియదు! -
WC 2023: అందుకే కెప్టెన్ అయ్యాడు! కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో ఉంటాడు!
ICC ODI World Cup 2023: టీమిండియాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు శిఖర్ ధావన్. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో ఓపెనర్గా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. రోహిత్ శర్మకు జోడీగా బరిలోకి అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. గత రెండేళ్లలో వన్డేల్లో ధావన్ నమోదు చేసిన అర్ధ శతకాల సంఖ్య తొమ్మిది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఫార్మాట్లో గబ్బర్ నిలకడ ఏమిటో! శ్రీలంక పర్యటన తర్వాత జట్టుకు దూరమైన శిఖర్ ధావన్.. ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపికైన సంగతి తెలిసిందే. బట్లర్ బృందంతో మొదటి వన్డేలో 31 పరుగులు చేసిన ధావన్.. రెండు(9), మూడో వన్డే(1)ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. అయినప్పటికీ వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో వన్డే జట్టుకు సారథిగా గబ్బర్ అవకాశం దక్కించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2023 సన్నాహకాల్లో భాగంగానే ధావన్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని యాజమాన్యం భావిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే అతడు కెప్టెన్ అయ్యాడు! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ జట్టులో ఉంటే ఉపయుక్తంగా ఉంటుందని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఓజా మాట్లాడుతూ.. ‘‘ఒక సీనియర్ ప్లేయర్ను ఎలా ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకుంటున్నారు. ఇది సరైన విధానమే! ముఖ్యంగా మెగా టోర్నీకి ముందు బెంచ్ను మరింత స్ట్రాంగ్ చేసుకోవడం ముఖ్యం. నిజానికి ధావన్ జట్టులో సీనియర్. వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. అందుకే ద్వితీయ శ్రేణి జట్టుకు అతడు కెప్టెన్గా ఎంపికవుతున్నాడు. రోహిత్ కోరుకుంటున్నది అదే! అతడిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. బ్యాటర్గా కూడా రాణించగల సత్తా ఉంది. ఇంగ్లండ్లో కాస్త నిరాశపరిచినా.. మళ్లీ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. శిఖర్ ధావన్ తనకు జోడీగా ఉండాలని రోహిత్ శర్మ బలంగా కోరుకుంటున్నాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి వీరిద్దరి భాగస్వామ్యం జట్టుకు ఎన్నో విజయాలు అందించింది కూడా!’’ అని చెప్పుకొచ్చాడు. శిఖర్ ధావన్ కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో ఉంటాడని ప్రజ్ఞాన్ ఓజా విశ్వాసం వ్యక్తం చేశాడు. తన ఆటతో తానేమిటో ఇప్పటికే నిరూపించుకున్నాడని 36 ఏళ్ల గబ్బర్కు మద్దతుగా నిలిచాడు. కాగా ఇటీవల అజయ్ జడేజా మాట్లాడుతూ.. రోహిత్ శర్మ కోరుకున్నట్లుగా ధావన్ దూకుడైన ఆట కనబరచలేడంటూ పెదవి విరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజ్ఞాన్ ఓజా.. గబ్బర్కు అండగా నిలవడం విశేషం. ఇక విండీస్ పర్యటనలో భాగంగా ధావన్ సారథ్యంలోని టీమిండియ ఇప్పటికే సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం(జూలై 27) జరుగనుంది. ఈ సిరీస్లో ధావన్ ఇప్పటి వరకు వరుసగా 97, 13 పరుగులు సాధించాడు. చదవండి: Ajay Jadeja-ODI: మూడు గంటల్లోనే ఫలితం.. ఏడు గంటలు ఎవరు ఆడుతారు? -
'ప్రపంచకప్ తర్వాత వన్డేలకు హార్దిక్ గుడ్ బై చెప్పడం ఖాయం’
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత పాండ్యా వన్డేల నుంచి తప్పుకునే అవకాశం ఉందని రవిశాస్త్రి తెలిపాడు. భవిష్యత్తులో ఆటగాళ్ళు వన్డే ఫార్మాట్ కంటే టీ20 ఫార్మాట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్స్టోక్స్ అనూహ్యంగా వన్డేల నుంచి తప్పుకుని అందరనీ షాక్కు గురి చేసిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో ఆడటం తనకు చాలా కష్టంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టోక్స్ తెలిపాడు. ఈ క్రమంలో ఆటగాళ్లు బిజీ బీజీ షెడ్యూల్స్ వల్ల తీవ్రమైన ఒత్తిడి ఎదర్కొంటున్నారని, ఐసీసీ తమ షెడ్యూల్ను సవరించాలని మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే విషయంపై రవిశాస్త్రి మాట్లాడుతూ.. "‘వన్డేలు, టీ20లు కంటే టెస్టు క్రికెట్ చాలా ప్రత్యేకమైనది. కానీ టెస్టు క్రికెట్ రోజు రోజుకి ఆదరణ కోల్పోతోంది. ఇక ఇప్పటికే ఆటగాళ్లు వారు ఏ ఫార్మాట్లలో ఆడాలో నిర్ణయించుకున్నారు. హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే.. అతడు ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడాలను క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు. అతడు ఇదే విషయాన్ని చాలా సార్లు స్పష్టంగా చెప్పాడు. వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఆ తర్వాత అతడు వన్డే క్రికెట్కు గుడ్బై చెప్పవచ్చు. జట్టులో మరి కొంత మంది ఆటగాళ్లు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆటగాళ్లు టీ20 క్రికెట్పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆదరణ పెరుగుతోంది. ఫ్రాంచైజీ క్రికెట్పై ఆటగాళ్లు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. వారిని ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడకుండా మనం ఆపలేం. కాబట్టి ద్వైపాక్షిక సిరీస్లను తగ్గించి, ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించేలా ప్రయత్నం చేయాలి" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Scott Styris On Shreyas Iyer: టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే! ఆ ఒక్క బలహీనత అధిగమిస్తే.. -
WC 2023: దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి అవుట్?!
ICC ODI World Cup 2023: దేశవాళీ టీ20 క్రికెట్ లీగ్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రొటిస్ ప్రపంచకప్-2023 టోర్నీ అర్హత అవకాశాలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను రద్దు చేసుకునే పరిస్థితులు తలెత్తిన తరుణంలో వరల్డ్కప్ ఈవెంట్లో నేరుగా అడుగుపెట్టే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కాగా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17 వరకు ప్రొటిస్ జట్టు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే, తమ దేశంలో కొత్తగా టీ20 దేశవాళీ క్రికెట్ లీగ్ నేపథ్యంలో షెడ్యూల్ను మార్చాల్సిందిగా దక్షిణాఫ్రికా బోర్డు.. ఆసీస్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. అస్సలు కుదరదు! కానీ, ఇప్పటికే కంగారూల క్యాలెండర్ వివిధ అంతర్జాతీయ మ్యాచ్లతో బిజీగా ఉన్న కారణంగా రీషెడ్యూల్ చేసేందుకు వీలుపడదని ఆసీస్ బోర్డు స్పష్టం చేసింది. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రొటిస్ బోర్డు ఆసీస్తో వన్డే సిరీస్ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ వన్డే వరల్డ్కప్ సూపర్లీగ్ పాయింట్ల పట్టికలో పదకొండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు మెగా ఈవెంట్ ఎంట్రీ సంక్లిష్టతరం కానుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్ రేసు నుంచి ప్రొటిస్ జట్టు అవుట్?! సూపర్లీగ్లో టాప్-8లో నిలిచిన జట్లు ఈ ఈవెంట్కు నేరుగా అర్హత సాధిస్తాయి. దక్షిణాఫ్రికా పరిస్థితి ఇలా ఉంటే ఆస్ట్రేలియా ఇప్పటికే 70 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. జింబాబ్వేతో టూర్ నేపథ్యంలో మరో మూడు వన్డేలు ఆడనుంది కూడా! దీంతో దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు చేసుకున్న కారణంగా కంగారూలకు పెద్దగా నష్టమేమీ లేదు! ఈ విషయంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ మాట్లాడుతూ.. ‘‘జనవరిలో జరగాల్సిన వన్డే సిరీస్ నుంచి దక్షిణాఫ్రికా తప్పుకోవడం నిరాశ కలిగించింది.అయితే, మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ మాత్రం యథావిథిగా జరుగుతుంది. మా షెడ్యూల్ బిజీగా ఉన్న కారణంగానే వన్డే సిరీస్ను రీషెడ్యూల్ చేసే పరిస్థితి కనిపించడం లేదు’’ అని పేర్కొన్నారు. పూర్తిగా తప్పుకొన్నట్లేనా? కాదు! మొత్తం 13 దేశాలు పాల్గొనే ఈ సూపర్ లీగ్లో 12 ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన దేశాలతో పాటు నెదర్లాండ్స్ పోటీ పడనుంది. ఈ క్వాలిఫికేషన్ రౌండ్కు నెదర్గాండ్స్ గతంలోనే అర్హత సాధించింది. 2015-17లో నిర్వహించిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ సూపర్ లీగ్లో విజేతగా నిలవడం ద్వారా నెదర్లాండ్స్ వరల్డ్కప్- 2023 క్వాలిఫికేషన్ రేసులో నిలిచింది. మరో రెండు దేశాల కోసం క్వాలిఫికేషన్ రౌండ్ నిర్వహిస్తున్నారు. ఇక ఆతిథ్య దేశం భారత్ ప్రపంచకప్-2023కి నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో టాప్-8 స్థానాల్లో ఉన్న మరో ఏడు పూర్తిస్థాయి సభ్య దేశాలు కూడా పోటీకి నేరుగా క్వాలిఫై అవుతాయి. కాబట్టి దక్షిణాఫ్రికా గనుక టాప్-8లో స్థానం దక్కించుకోలేకపోతే నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోతుంది. ఇందుకోసం అసోసియేట్ దేశాలతో క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ రౌండ్లో విజయం సాధించిన రెండు జట్లు రేసులో నిలుస్తాయి. చదవండి: IND VS ENG 1st ODI: రోహిత్ శర్మ భారీ సిక్సర్.. బంతి తగిలి చిన్నారికి గాయం Jasprit Bumrah: ఇంగ్లండ్ బ్యాటర్లను ఉతికి ‘ఆరే’సిన బుమ్రా.. అద్భుతం అంటూ వారిని ట్రోల్ చేసిన భార్య సంజనా! -
Ind Vs Eng: దేశవాళీ వన్డే, టీ20 క్రికెట్ ఆడతా.. నా టార్గెట్ వరల్డ్కప్!
ODI World Cup 2023- Shikhar Dhawan: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించిన గబ్బర్.. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. తాజాగా టీమిండియా ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో వన్డే సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో రోహిత్ శర్మతో కలిసి ధావన్ ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖాయమైంది. ఓవల్ వేదికగా మంగళవారం(జూలై 12) జరిగే మొదటి వన్డేతో గబ్బర్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక వెస్టిండీస్తో వన్డే సిరీస్కు రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో శిఖర్ ధావన్ సారథిగా పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ది టెలిగ్రాఫ్నకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన గబ్బర్.. తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పుకొచ్చాడు. నా టార్గెట్ అదే! వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ జరుగనున్న తరుణంలో.. ‘‘ప్రస్తుతం నా దృష్టి మొత్తం వన్డే ప్రపంచకప్ టోర్నీ మీదే ఉంది. ఈ గ్యాప్లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలని అనుకుంటున్నాను. అప్పుడే ప్రపంచకప్ జట్టులో చోటు.. నన్ను నేను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. ఇక అంతకంటే ముందు ఐపీఎల్లో మరింత గొప్పగా రాణించాలని భావిస్తున్నాను. అంతేకాకుండా దేశవాళీ వన్డే క్రికెట్, టీ20 మ్యాచ్లలో ఆడాలని భావిస్తున్నా. ఇంగ్లండ్ పర్యటనకు ముందు నేను పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను. నెట్స్లో ప్రాక్టీసు చేశాను. ఈ సిరీస్తో పూర్తి స్థాయిలో ఫామ్లోకి వస్తాననుకుంటున్నాను. ఓపెనర్గా నాకు చాలా అనుభవం ఉంది. నా టెక్నిక్ను మరింతగా మెరుగుపరచుకుంటున్నాను. ఏదేమైనా.. సంయమనంతో పరిస్థితులకు తగ్గట్లుగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. చిన్న చిన్న స్కోర్లను సైతం భారీ స్కోర్లుగా మలచడంపై దృష్టి సారించాలి. అప్పుడే అనుకున్న ఫలితాలను పొందగలం’’ అని 36 ఏళ్ల శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన గబ్బర్.. 14 ఇన్నింగ్స్లో కలిపి 460 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపిక కాలేదు. కానీ వన్డే ఫార్మాట్లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు. చదవండి: Surya Kumar Yadav: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్ ప్రపంచంలోనే ఎవరూ లేరు! Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్ను కాదని అర్ష్దీప్ సింగ్కు ఛాన్స్! ఇంకా.. -
ODI WC 1975: జగజ్జేత.. నాడు విండీస్ను గెలిపించింది ఎవరో తెలుసా?
ICC ODI World Cup 1975 AUS Vs WI- Winner West Indies: క్రికెట్కు పుట్టినిల్లు ఇంగ్లండ్ అయినా.. మొట్టమొదటి వన్డే వరల్డ్కప్ సాధించి తన పేరును సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించుకున్న ఘనత మాత్రం వెస్టిండీస్కే దక్కింది. జగజ్జేత... ఈ మాట వింటుంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదా! మరి తొలిసారిగా సరిగ్గా ఇదే రోజు విండీస్ జట్టు క్రీడా ప్రపంచం చేత చాంపియన్గా నీరాజనాలు అందుకుంది. లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాను ఓడించి విశ్వ విజేతగా అవతరించింది. మొట్టమొదటి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి తమ దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసేలా చేసింది. ట్రోఫీతో విండీస్ కెప్టెన్ లాయిడ్ (PC: ICC) టోర్నీ సాగింది ఇలా! అది 1975.. పరిమిత ఓవర్ల ప్రపంచకప్ రేసులో ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, ఈస్ట్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తదితర 8 జట్లు పోటీ పడ్డాయి. జూన్ 7న ఇంగ్లండ్- ఇండియా మ్యాచ్తో లార్డ్స్ మైదానంలో ఆరంభమైన ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఏకంగా టీమిండియాపై 202 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ తూర్పు ఆఫ్రికాను 181 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆ తదుపరి మ్యాచ్లలో ఆస్ట్రేలియా పాకిస్తాన్ను 73 పరుగుల తేడాతో ఓడించగా.. వెస్టిండీస్ శ్రీలంకపై 9 వికెట్ల తేడా(236 బంతులు మిగిలి ఉండగా)తో గెలుపొందింది. అదే విధంగా.. జూన్ 11 నాటి మ్యాచ్లలో ఇంగ్లండ్ న్యూజిలాండ్ మీద 80 పరుగులతో, ఆస్ట్రేలియా శ్రీలంకపై 52 పరుగులతో, వెస్టిండీస్ పాకిస్తాన్ మీద ఒక వికెట్(రెండు బంతులు మిగిలి ఉండగా) తేడాతో, ఇండియా- తూర్పు ఆఫ్రికా మీద 10 వికెట్ల తేడాతో(181 బంతులు మిగిలి ఉండగా) జయభేరి మోగించాయి. ఆ తర్వాత జూన్ 14న జరిగిన మ్యాచ్లలో పాకిస్తాన్ శ్రీలంక మీద 192 పరుగులు, వెస్టిండీస్ ఆస్ట్రేలియా మీద 7 వికెట్లు(84 బంతులు మిగిలి ఉండగా), న్యూజిలాండ్ ఇండియా మీద 4 వికెట్లు, ఇంగ్లండ్ తూర్పు ఆఫ్రికా మీద 196 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటాయి. సెమీస్కు చేరిన జట్లు ఈ క్రమంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. మొదటి సెమీస్ మ్యాచ్లో భాగంగా ఇంగ్లండ్- ఆస్ట్రేలియా తలపడగా.. 188 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం ఆసీస్ను వరించింది. ఇక రెండో సెమీ ఫైనల్లో వెస్టిండీస్ 119 బంతులు మిగిలి ఉండగానే కివీస్ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ జట్లు ఫైనల్కు అర్హత సాధించాయి. ఫైనల్లో టాస్ గెలిచి జూన్ 21న లార్డ్స్ మైదానంలో అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కంగారూ జట్టు కెప్టెన్ ఇయాన్ చాపెల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఆసీస్ బౌలర్లు చెలగరేగడంతో విండీస్ ఓపెనర్లు రాయ్ ఫ్రెడెరిక్స్, సర్ గోర్డాన్ గ్రీనిడ్జ్ వరుసగా 7, 13 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్డౌన్లో వచ్చిన అల్విన్ కల్లిచర్రాన్ 12 పరుగులు చేసి నిష్క్రమించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రోహన్ కన్హాయ్ 105 బంతుల్లో 55 పరుగులతో రాణించాడు. ఇతడికి జతకలిసిన కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్ 85 బంతుల్లో 102 పరుగులు సాధించి విండీస్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. సర్ వివియన్ రిచర్డ్స్ 5 పరుగులకే అవుట్ కావడంతో మరోసారి నిరాశ ఆవహించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కీత్ బోయ్సే 34 పరుగులు చేయగా.. బెర్నార్డ్ జూలియన్ 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. డెరిక్ ముర్రే 14, వాన్బర్న్ హోల్డర్ 6(నాటౌట్) పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 60 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. చాపెల్ రనౌట్ కావడంతో ఇక లక్ష్య ఛేదనకు దిగిన చాపెల్ బృందానికి ఓపెనర్ అలన్ టర్నర్ 40 పరుగులు చేసి శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ రిక్ మెకాస్కర్(7) విఫలం కాగా.. అర్ధ శతకం సాధించి ప్రమాదకరంగా మారుతున్న కెప్టెన్ ఇయాన్ చాపెల్ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. రిచర్డ్స్, లాయిడ్ కలిసి రనౌట్ చేశారు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ పతనం ఆరంభమైంది. గ్రెగ్ చాపెల్ 15 పరుగులు చేసి రనౌట్ కాగా.. వాలర్డ్స్ , రోడ్ మార్ష్, రాస్ ఎడ్వర్డ్స్, గ్యారీ గిల్మోర్, మాక్స్ వాకర్, జెఫ్ థామ్సన్, డెనిస్ లిలీ వరుసగా 35,11,28,14,7,21,16 పరుగులు చేశారు. విండీస్ బౌలర్ల ధాటికి నిలకవలేక 58.4 ఓవర్లలో 274 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. తొలి చాంపియన్గా లాయిడ్ బృందం తద్వారా 17 పరుగుల తేడాతో ఆసీస్పై విజయం సాధించి వెస్టిండీస్ తొట్టతొలి చాంపియన్గా నిలిచింది. శతక వీరుడు విండీస్ కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తన జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించి మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు. ఆ తర్వాత 1979 వరకు వెస్టిండీస్ చాంపియన్గా కొనసాగడం విశేషం. ఇక వన్డే వరల్డ్కప్ను ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదుసార్లు, భారత్, వెస్టిండీస్ చెరో రెండుసార్లు, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్ ఒక్కోసారి గెలవగా.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాకు మాత్రం ఈ ఐసీసీ ట్రోఫీ ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. చదవండి: Ranji Trophy 2022: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్ సర్తో పాటు నా పేరు కూడా: యశస్వి -
World Cup 2022: ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఇంగ్లండ్పై విండీస్ విజయం
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్ను ఓడించింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్ వేదికగా బుధవారం ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డియాండ్రా డాటిన్(31 పరుగులు), హేలే మాథ్యూస్(45 పరుగులు) శుభారంభం అందించినప్పటికీ.. వీరిద్దరు అవుటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ కాంప్బెల్ 80 బంతుల్లో 66 సాధించగా.. చెడియన్ నేషన్ 49 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. వెరసి నిర్ణీత 50 ఓవర్లలో విండీస్ 6 పరుగుల నష్టానికి 225 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేధనకు దిగిన ఇంగ్లండ్ మహిళా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ లారెన్ విన్ఫీల్డ్ హిల్ 12 పరుగులకే పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ టామీ బీమౌంట్ మాత్రం 46 పరుగులతో ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అయితే, చివర్లో సోఫీ, కేట్ క్రాస్ హిట్టింగ్ ఆడటంతో ఇంగ్లండ్ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి. కానీ, విండీస్ బౌలర్లు వారి ఆశలపై నీళ్లు చల్లుతూ 218 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజయం వెస్టిండీస్ను వరించింది. గెలుపులో కీలక పాత్ర పోషించిన షిమేన్ కాంప్బెల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ స్కోర్లు: విండీస్- 225/6 (50 ఓవర్లు) ఇంగ్లండ్- 218 (47.4 ఓవర్లు) చదవండి: IPL 2022- CSK: సీఎస్కే అభిమానులకు గుడ్న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
టీమిండియా కెప్టెన్గా యశ్ దుల్, ఆంధ్రా కుర్రాడికి వైస్ కెప్టెన్సీ
ముంబై: వెస్టిండీస్ వేదికగా వచ్చే ఏడాది(2022) జనవరి 14 నుంచి ప్రారంభంకానున్న అండర్ 19 వన్డే ప్రపంచ కప్ టోర్నీకి టీమిండియా కెప్టెన్గా ఢిల్లీ కుర్రాడు యశ్ దుల్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్గా ఆంధ్రా ప్లేయర్, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్కి అవకాశం దక్కింది. 17 మంది ప్లేయర్లు, ఐదుగురు స్టాండ్ బై ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. మెగా టోర్నీలో భాగంగా జరిగే ప్రాధమిక మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా(జనవరి 15), ఐర్లాండ్(జనవరి 19), ఉగాండా(జనవరి 22) జట్లతో యంగ్ ఇండియా తలపడనుంది. ఇదిలా ఉంటే, భారత అండర్-19 జట్టు నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచి.. అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే. భారత యువ జట్టు చివరిసారిగా 2020లో జరిగిన టోర్నీలో ఫైనల్కు చేరి.. బంగ్లాదేశ్ చేతిలో ఓడింది. భారత జట్టు అండర్-19 జట్టు: యశ్ దుల్ (కెప్టెన్), షేక్ రషీద్ (వైస్ కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, నిశాంత్ సింధు, సిద్థార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేశ్ బనా (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజ్ అంగద్ బవా, మానవ్ పరాక్, కుశాల్ తంబే, ఆర్ఎస్ హంగర్కేర్, వసు వాత్స్, విక్కీ ఉత్సవల్, రవి కుమార్, గర్వ్ సంగ్వాన్ స్టాండ్ బై ప్లేయర్లు: రిషిత్ రెడ్డి(హైదరాబాద్), ఉదయ్ శరవణ్, అన్ష్ ఘోసాయ్, అమిత్ రాజ్ ఉపాధ్యాయ్, పీఎం సింగ్ రాథోర్ చదవండి: BWF World Championships 2021: మహిళల సింగిల్స్ ఛాంపియన్గా యమగుచి -
ODI World Cup 2022: న్యూజిలాండ్ పర్యటనకు భారత మహిళా జట్టు
Indian Women Cricket Team To Tour New Zealand T20 5 ODI Ahead WC 2022: వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. న్యూజిలాండ్ వేదికగా వరల్డ్కప్ జరగనుండటంతో దానికి నెల రోజుల ముందుగా న్యూజిలాండ్తో సన్నాహక సిరీస్ను ఆడనుంది. భారత జట్టు సభ్యులు అక్కడి పిచ్లకు అలవాటు పడేందుకు బీసీసీఐ ఈ సన్నాహక సిరీస్ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను న్యూజిలాండ్ క్రికెట్ శుక్రవారం విడుదల చేసింది. భారత్, న్యూజిలాండ్లు ఒక టి20తో పాటు ఐదు వన్డేలు ఆడతాయి. న్యూజిలాండ్తో ఫిబ్రవరి 9న జరిగే ఏకైక టి20 మ్యాచ్తో పర్యటన ఆరంభం కానుంది. అనంతరం ఫిబ్రవరి 11, 14, 16, 22, 24వ తేదీల్లో ఐదు వన్డేలు జరుగుతాయి. అనంతరం మార్చి–ఏప్రిల్ మధ్య మహిళల వన్డే ప్రపంచ కప్ ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Nz Test Series: విహారిపై ఎందుకింత వివక్ష.. దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. ట్వీట్తో.. కానీ.. Ind Vs Nz Test Series: న్యూజిలాండ్తో సిరీస్కు ఎంపికైన శ్రీకర్ భరత్ గురించి ఈ విషయాలు తెలుసా? -
క్రికెట్ను ఆటగా కాకుండా మతంలా మార్చిన ఆ ఇన్నింగ్స్కు 38 ఏళ్లు..
న్యూఢిల్లీ: సరిగ్గా 38 ఏళ్ల కిత్రం ఇదే రోజు( జూన్ 18, 1983) భారత క్రికెట్ రూపురేఖలు మారేందుకు బీజం పడింది. భారత్లో క్రికెట్ ఓ ఆటగా కాకుండా మతంలా మారడానికి ఆ ఇన్నింగ్సే నాంది పలికింది. 1983 వన్డే ప్రపంచ కప్లో భాగంగా భారత్-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో నాటి జట్టు కెప్టెన్ కపిల్ దేశ్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులతో అజేయంగా నిలిచి చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున వన్డేల్లో తొలి సెంచరీ చేసిన కపిల్.. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ప్రపంచకప్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 17 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. గవాస్కర్, శ్రీకాంత్, అమర్నాథ్ లాంటి స్టార్లు సింగల్ డిజిట్కే పెవిలియన్కు చేరారు. దీంతో ప్రపంచ కప్లో భారత్ కథ ముగిసిందని అంతా అనుకున్నారు. ఆర్గనైజర్స్ అయితే మరో మ్యాచ్ నిర్వహించవచ్చని టాస్ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. అప్పుడే వచ్చాడు టార్చ్ బేరర్ కపిల్ దేవ్. తన సారథ్యంలో భారత్ను ఎలాగైనా విశ్వవిజేతగా నిలపాలనుకున్న ధృడ సంకల్పంతో బరిలోకి దిగిన ఆయన.. ఓవైపు వికెట్లు పడుతున్నా, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పోరాడాడు. ఇతర బ్యాట్స్మెన్లు బంతిని బ్యాట్కు తగిలించడానికే ఇబ్బంది పడ్డ పిచ్లో అలవోకగా షాట్లు కొడుతూ చెలరేగిపోయాడు. కపిల్ విధ్వంసంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. అనంతరం 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను.. ఆల్రౌండర్ కెవిన్ కర్రన్ (73) ఆదుకునేందుకు విఫలయత్నం చేశాడు. 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 235 పరుగలకు ఆలౌట్ కావడంతో, భారత్ ఓడాల్సిన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. కపిల్ బంతితో కూడా రాణించి 11 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. భారత బౌలర్లలో మదన్లాల్ 3, రోజర్ బిన్నీ 2, సంధూ, అమర్నాథ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపు ఇచ్చిన స్పూర్తితో భారత్ ఆ ప్రపంచ కప్లో వెనక్కి తిరగి చూడలేదు. ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్ను 118 పరుగులతో గెలిచిన కపిల్ డెవిల్స్ సగర్వంగా సెమీస్లోకి అడుగుపెట్టింది. అనంతరం ఇంగ్లండ్పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత నాటి ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. చదవండి: 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్ర.. కుంబ్లే ఫీట్కు దక్కని చోటు