-
తగ్గేదేలే! ఆఫీస్ స్పేస్లో హైదరాబాద్ అదుర్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్యాలయాల కోసం లీజుకు తీసుకున్న స్థలం జనవరి–మార్చిలో 25 శాతం పెరిగి 1.08 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. 2021 జనవరి–మార్చితో పోలిస్తే దేశవ్యాప్తంగా ఎనమిది ప్రధాన నగరాల్లో ఆఫీసుల కోసం నూతనంగా తోడైన స్థలం 13 శాతం వృద్ధి చెంది 1.19 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం.. 2022 మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో హైదరాబాద్లో ఆఫీస్ లీజింగ్ 72 శాతం అధికమై 16 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. చెన్నైలో రెండింతలకుపైగా పెరిగి 10 లక్షల చదరపు అడుగులు, బెంగళూరు 5 శాతం దూసుకెళ్లి 35 లక్షలు, ఢిల్లీ–ఎన్సీఆర్ 37 శాతం అధికమై 23 లక్షలు, పుణే 15 శాతం వృద్ధి చెంది 9 లక్షలు, అహ్మదాబాద్ 2 లక్షల నుంచి 5 లక్షల చదరపు అడుగులకు ఎగసింది. ముంబై 24 శాతం తిరోగమనం చెంది 9 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతో కొన్ని త్రైమాసికాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంటుంది. -
ఆఫీస్ స్పేస్.. పక్కాప్లాన్
-
పాత రికార్డు బద్దలు.. 80 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాలలో కంటే హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరిగిపోతుంది. ఈ ఏడాది నగరంలో 80 లక్షల చ.అ. కార్యాలయాల స్థల లావాదేవీలు జరుగుతాయని సావిల్స్ ఇండియా అంచనా వేసింది. ఇప్పటికే 10 లక్షల చ.అ. విస్తీర్ణంలో భవనాలు పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపింది. గతేడాది నగరంలో 57 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. ఇందులో లక్ష చ.అ. కంటే ఎక్కువ స్పేస్ లావాదేవీలే 70 శాతం ఉన్నాయి. అలాగే 2021లో 86 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ నిర్మాణాలు పూర్తయ్యాయి. డిమాండ్ కార్యాలయాలు పునఃప్రారంభం కావటం, వ్యాపార సెంటిమెంట్ బలపడటం, లీజు కార్యకలాపాలు పెరగడం వంటి కారణంగా ఈ ఏడాది నగరంలో కొత్తగా కోటి నుంచి 1.2 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ సప్లయి అవుతుందని సావిల్స్ ఇండియా హైదరాబాద్ ఎండీ శేష సాయి అంచనా వేశారు. ఈ ఏడాది ముగింపు నాటికి భాగ్యనగరంలో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ 8.5 కోట్ల చ.అ.లకు చేరుకుంటుందని చెప్పారు. ప్రధానంగా మణికొండ, గచ్చిబౌలి, నానక్రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లలో ఎక్కువ సప్లయి జరుగుతుందని తెలిపారు. ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్య లభ్యత, అందుబాటు ధరలు వంటివి నగరంలో ఆఫీస్ స్పేస్ వృద్ధికి చోదకాలుగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ బ్యాంకింగ్లదే 2021 మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బ్యాకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), కో–వర్కింగ్ స్పేస్కు డిమాండ్ ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ కంపెనీల రాకతో హైదరాబాద్లో ప్రీమియం కార్యాలయాల భవనాల మద్యవర్తిత్వం పెరిగిందని, అయితే ఇదే సమయంలో ఇతర నగరాల్లోని ప్రీమియం భవనాలతో పోలిస్తే నగరంలో అద్దెలు స్థిరంగా ఉండే అవకాశాలున్నాయని వివరించారు. చదవండి: 47 అంతస్తుల కో లీవింగ్ ప్రాజెక్ట్.. ఇండియాలోనే అతి పెద్దది.. ఎక్కడంటే? -
హైదరాబాద్కి షాకిచ్చిన జేఎల్ఎల్ ఇండియా వార్షిక ఫలితాలు
న్యూఢిల్లీ: దేశంలోని ఏడు ప్రముఖ పట్టణాల్లో కార్యాలయ స్థలాల లీజు (ఆఫీస్ స్పేస్) 2021లో నామమాత్రంగా 2 శాతం పురోగతే చూపించింది. 2019తో పోలిస్తే 45 శాతం తక్కువగా ఉండడం ఈ మార్కెట్ కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదని తెలియజేస్తోంది. కరోనా తర్వాత చాలా కంపెనీలు వర్క్ఫ్రమ్ హోమ్ పని విధానాన్ని అమలు చేస్తుండడం తెలిసిందే. 2021లో 26.17 చదరపు అడుగుల స్థలం నికరంగా లీజుకు ఇచ్చినట్టు జేఎల్ఎల్ ఇండియా విడుదల చేసిన నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2019లో నికర ఆఫీస్ స్పేస్ లీజు 47.8 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే 45 శాతం తక్కువ. 2020లో 25.66 మిలియన్ చదరపు అడుగుల మేర ఉండడం గమనార్హం. భారత కార్యాలయ మార్కెట్పై జేఎల్ఎల్ ఇండియా త్రైమాసికం, ఏడాదికోసారి నివేదికలను విడుదల చేస్తుంటుంది. నికర వినియోగ లీజు స్థలాన్ని, మొత్తం వినియోగానికి అందుబాటులో ఉన్న కార్యాలయం స్థలం నుంచి ఖాళీగా ఉన్న దానిని మినహాయించి చెప్తారు. అక్టోబర్–డిసెంబర్లో మెరుగు 2021 అక్టోబర్–నవంబర్ కాలంలో లీజు కింద నికర కార్యాలయ స్థలం వినియోగం 37 శాతం పెరిగి 11.56 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. గడిచిన ఎనిమిది త్రైమాసికాల్లోనే ఇది అధికమని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. పూర్తి సంవత్సరానికి ఐటీ/ఐటీఈఎస్ రంగం అత్యధిక స్థలాన్ని వినియోగించుకుంది. 38.9 శాతం ఆఫీసు స్థలం ఈ రంగానికి చెందిన కంపెనీలే లీజుకు తీసుకున్నాయి. ఆ తర్వాత తయారీ/ఇండస్ట్రియల్ రంగం 15.4 శాతం కార్యాలయ స్థలాన్ని వినియోగించుకుంది. హైదరాబాద్లో క్షీణత హైదరాబాద్ మార్కెట్లో కార్యాలయ స్థలాల వినియోగం 2021లో 36 శాతం తగ్గి 4.14 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. అంతకుముందు సంవత్సరంలో ఇది 6.48 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. బెంగళూరులో 14 శాతం వృద్ధితో నికర లీజు 7.82 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో నికర లీజు 44 శాతం పెరిగి 4.72 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. కోల్కతాలో మూడు రెట్లు పెరిగి 0.57 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. పుణె నగరంలోనూ 26 శాతం పెరిగి 3.18 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలం నికర లీజు కింద వినియోగమైంది. చెన్నై నగరంలో నికర లీజు స్థలం 10 శాతం తగ్గి 2.03 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. ముంబైలోనూ 10 శాతం తగ్గి 3.7 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజు కింద వినియోగమైంది. మూడు నెలలు గడిస్తే.. ‘‘నూతన సంవత్సరంలోకి ప్రవేశించాం. కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో తిరిగి కార్యాలయానికి వచ్చి ఉద్యోగులు పనిచేయాలనే ప్రణాళికలు వాయిదా పడొచ్చు. మొదటి త్రైమాసికంలో పరిస్థితుల ఆధారంగా స్పష్టత వస్తుంది’’ అని జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. చదవండి: రియల్టీ పెట్టుబడులు డౌన్ -
రియల్టీలో హైదరాబాద్ హవా! ఈ ఏడాది దేశంలోనే రెండో పెద్ద లీజ్ అగ్రిమెంట్
కరోనా కష్టాలు ఇబ్బంది పెడుతున్న రియల్టీలో హైదరాబాద్ దూసుకుపోతుంది. దేశంలో ఉన్న మెట్రో సిటీస్లో దూకుడు కనబరుస్తోంది. రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్, డీల్స్లో రికార్డులు సృష్టిస్తోంది. కమర్షియల్ స్పేస్ విభాగానికి సంబంధించి దేశంలోనే పెద్ద డీల్స్లో ఒకటి ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగింది. మైండ్స్పేస్ దగ్గర నగరంలోని ఆఫీస్ స్పేస్కి ఫుల్ డిమాండ్ ఉన్న మైండ్స్పేస్ ఐటీపార్క్ దగ్గర 4,50,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అగ్రిమెంట్ చేసినట్టు స్మార్ట్వర్క్ సంస్థ పేర్కొంది. లీజు అగ్రిమెంట్ పదేళ్లు ఉండగా ఇందులో ఐదేళ్ల కాలం లాక్ ఇన్ పీరియడ్గా ఉందని ఎకనామిక్టైమ్స్లో కథనం ప్రచురితమైంది. ఈ అగ్రిమెంట్ డీల్లో కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ భాగస్వామిగా వ్యవహరించినట్టు సమాచారం. 4,000 మంది ఉద్యోగులు ఆఫీస్ స్పేస్ అగ్రిమెంట్ డీల్ 2021 చివరి క్వార్టర్లో పూర్తవగా ఇక్కడ కార్యకలాపాలు 2022 మొదటి కార్వర్ట్లో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఈ ఆఫీస్ స్పేస్లో ఒకేసారి 4,000ల మంది ఉద్యోగులు సౌకర్యవంతంగా పని చేసుకునే వీలుంది. రెండో స్థానం స్మార్ట్వర్క్స్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్కి సంబంధించి అతి పెద్ద లీజ్ అగ్రిమెంట్ పూనేలో చోటు చేసుకుంది. ఆ నగరంలోని బనేర్ లొకాలిటీలో 5,60,00 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ డీల్ జరిగింది. దాని తర్వాత రెండో అతి పెద్ద డీల్ భాగ్యనగరంలో చోటు చేసుకుంది. ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ విభాగంలో స్మార్ట్వర్క్స్ సంస్థ దేశంలోని 9 పెద్ద నగరాల్లో 32 లొకేషన్లలో సేవలు అందిస్తోంది. ఫార్చున్ 500 జాబితాలోని 400ల సంస్థలకు స్మార్క్వర్క్ సేవలు అందిస్తోంది. ఈ ఏడాది మెట్రో సిటీల్లో ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ డిమాండ్ 40 మిలియన్ల చదరపు అడుగులకు చేరినట్టు స్మార్ట్వర్క్స్ పేర్కొంది. చదవండి: హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు, వరల్డ్ వైడ్గా.. -
జోరు తగ్గని ఆఫీస్ స్పేస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో కార్యాలయ స్థలాల లావాదేవీల జోరు తగ్గడం లేదు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (జులై– సెప్టెంబర్) నగరంలో 25 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లీజు కార్యకలాపాలు జరిగాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ఇదే సమయంలో నగర మార్కె ట్లోకి కొత్తగా 32 లక్షల చ.అ. స్పేస్ సరఫరా జరిగింది. ఆఫీస్ స్పేస్ లీజులలో బ్యాంకింగ్, ఫైనా న్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఫ్లెక్సిబుల్ వర్క్ప్లేస్ వాటా 66 శాతంగా ఉన్నాయి. రాయదుర్గలో అత్యధికంగా 53 శాతం, హైటెక్ సిటీలో 40% లీజు కార్యకలాపాలు జరిగాయి. ఈ ఏడాది క్యూ3లో దేశవ్యాప్తంగా 1.03 కోట్ల చ.అ. ఆఫీస్ లావాదేవీలు జరిగాయి. క్రితం త్రైమా సికంతో పోలిస్తే ఇది 89 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని మొత్తం లావాదేవీలలో ఐటీ హబ్లైన హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాల వాటా 62 శాతంగా ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య పెరగడం, కంపెనీలు వర్క్ ఫ్రం ఆఫీస్ పునఃప్రారంభిస్తుండటం, రవాణా పరిమితులు తొలగిపోవటం వంటి కారణాలతో దేశీయ కార్యాలయాల మార్కెట్కు డిమాండ్ పెరుగు తుందని కొల్లియర్స్ ఇండియా ఎండీ, సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. -
గార్డెన్ సిటీ కిందికి నిజాం నగరం పైకి!
సాక్షి, హైదరాబాద్: తొలిసారిగా దేశీయ కార్యాలయాల స్థలాల లావాదేవీలలో బెంగళూరు కంటే హైదరాబాద్లో ఎక్కువగా జరిగాయి. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ విభాగం శరవేగంగా కోలుకుంటోంది. ఈ ఏడాది జూలై– సెప్టెంబర్ మూడో త్రైమాసికం (క్యూ3)లో హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరగగా.. బెంగళూరులో 21 లక్షల చ.అ. లీజు కార్యకలాపాలు జరిగాయి. ఇదే సమయంలో భాగ్యనగరంలో 32 లక్షల చ.అ. స్పేస్ సరఫరాలోకి రాగా.. బెంగళూరులో కేవలం 9 లక్షల చ.అ. స్పేస్ అందుబాటులోకి వచ్చింది. 2021 క్యూ3లో దేశవ్యాప్తంగా 1.03 కోట్ల చ.అ. ఆఫీస్ లావాదేవీలు జరిగాయని కొల్లియర్స్ మార్కెట్ రీసెర్చ్ తెలిపింది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది 89 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని మొత్తం లావాదేవీలలో ఐటీ హబ్లైన హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాల వాటా 62 శాతంగా ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య పెరగడం, కంపెనీలు వర్క్ ఫ్రం ఆఫీస్ పునఃప్రారంభిస్తుండటం వంటి కారణాలతో దేశీయ కార్యాలయాల మార్కెట్కు డిమాండ్ పెరుగుతుందని కొల్లియర్స్ ఇండియా ఎండీ, సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. రాయదుర్గం, హైటెక్ సిటీల్లోనే.. కరోనా సెకండ్ వేవ్ నిర్మాణ రంగంపై పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పటికే ఉన్న ఆఫీస్ స్పేస్ స్టాక్ను లీజుకు ఇవ్వడంపై డెవలపర్లు దృష్టి పెట్టారు. హైదరాబాద్లోని మొత్తం లావాదేవీలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఫ్లెక్సిబుల్ వర్క్ప్లేస్ వాటా 66 శాతంగా ఉన్నాయి. రాయదుర్గంలో అత్యధికంగా 53 శాతం లీజు కార్యకలాపాలు జరిగాయి. హైటెక్సిటీలో 40 శాతం లీజు కార్యకలాపాలు జరిగాయి. సరఫరాలోనూ మనమే టాప్.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కొత్తగా 1.08 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ సరఫరా జరిగింది. అత్యధికంగా హైదరాబాద్లో 29 శాతం, పుణేలో 25 శాతం సప్లయి జరిగింది. ఈ ఏడాది క్యూ3లోని మొత్తం లీజులలో ఫ్లెక్సిబుల్ వర్క్ప్లేస్ వాటా 26 శాతంగా ఉంది. ఈ విభాగంలో లావాదేవీలు పుణే తర్వాత హైదరాబాద్లో ఎక్కువగా జరిగాయి. -
బెంగళూరుని వెనక్కి నెట్టి.. నంబర్ వన్ స్థానంలో హైదరాబాద్!
ఐటీ సెక్టార్ ఇండియన్ క్యాపిటల్గా పేర్కొందిన బెంగళూరుకి హైదరాబాద్ ఝలక్ ఇచ్చింది. ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో గత కొన్నేళ్లుగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న సిటీ ఆఫ్ గార్డెన్స్ని వెనక్కి నెట్టింది ముత్యాల నగరం. కరోనా పూర్వపు స్థితి కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశవ్యాప్తంగా ఆర్తిక కార్యకలాపాలు వేగంగా ఊపందుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం జోరుగా సాగుతుండటంతో ఉద్యోగులు తిరిగి ఆఫీసుల బాట పడుతున్నారు. దీంతో ఆఫీసు స్పేస్కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దాదాపుగా కరోనాకు ముందున్న స్థితికి ఆఫీస్ స్పేస్ డిమాండ్ చేరుకుంది. ప్లేస్ మారింది జులై, ఆగస్టు, సెప్టెంబరులకు సంబంధించి మూడో త్రైమాసికంలో దేశవ్యాప్తగా దాదాపు 1.3 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. అయితే ప్రతీసారి ఆఫీస్ స్పేస్ విషయంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండేంది. మిగిలిన ఐదు మెట్రో నగరాలు ఆ తర్వాతే అన్నట్టుగా పరిస్థితి ఉండేంది. అయితే ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. నంబర్ వన్ ఈ ఏడాది మూడో త్రైమాసికం ఆఫీస్ స్పేస్ లీజుకి సంబంధించి హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా 25 లక్షల చదరపు అడుగుల స్థలానికి సంబంధించిన లీజు అగ్రిమెంట్లు పూర్తి అయ్యాయి. అంతకు ముందు ఏప్రిల్, మే, జూన్తో పోల్చితే ఈసారి అగ్రిమెంట్లు వేగంగా పూర్తి కావడంతో హైదరాబాద్ ముందుకు దూసుకుపోయింది. మన తర్వాతే మూడో త్రైమాసికానికి సంబంధించి ఆఫీసు లీజు విషయంలో 29 శాతం వాటాతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా 25 శాతం వాటాతో పూనే రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు నగరాల తర్వాతే మిగిలిన మెట్రో సిటీలైన బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నైలు ఉన్నాయి. ఇక్కడే ఎక్కువ భాగ్యనగరంలో ఆఫీసు ప్లేస్కి సంబంధించి రాయదుర్గం ఏరియాలో డిమాండ్ ఎక్కువగా ఉంది. నగరంలో బుక్కయిన 25 లక్షల చదరపు అడుగుల స్థలంలో సగం ఇక్కడున్న భవనాల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో హైటెక్ సిటీ ఉంది. లుక్ ఈస్ట్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలను కోరుతున్నా.. ఇంకా ఆశించిన స్థాయి ఫలితాలు రావడం లేదు. చదవండి:మనీ గురించి ఆలోచించకు.. లగ్జరీగా ఉంటే చూడు -
పారిశ్రామిక స్థలాలకు డిమాండ్.. సీబీఆర్ఈ నివేదిక
న్యూఢిల్లీ: పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాల ఆఫీస్ స్థలాల లీజింగ్ కార్యకలాపాలు ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి–జూన్) మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ధోరణి కనిపించింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది ద్వితీయార్థంతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో లీజింగ్ కార్యకలాపాలు 13 శాతం పెరిగి 14 మిలియన్ చ.అ.లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. 2020 ద్వితీయార్థంలో ఇది 11 మిలియన్ చ.అ.లుగా నమోదైంది. సరఫరాలో అంతరాయాలను అధిగమించే దిశగా తమ వినియోగదారులకు చేరువలో ఉండే ప్రాంతాలను ఎంచుకునేందుకే లాజిస్టిక్స్ సంస్థలు మొగ్గు చూపుతున్నాయని నివేదిక వివరించింది. కొన్ని సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలను కూడా ఎంచుకుంటున్నాయని పేర్కొంది. ఢిల్లీ–దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), బెంగళూరులో అత్యధికంగా (50 శాతం) లీజింగ్ కార్యకలాపాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో అర్ధ సంవత్సర ప్రాతిపదికన అద్దెలు 2 శాతం నుంచి 14 శాతం దాకా పెరిగాయి. -
ఆఫీస్ స్పేస్కు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కార్యాలయాల స్థలాల లావాదేవీలలో దక్షిణాది రాష్ట్రాల హవా కొనసాగుతోంది. సప్లయి, లావాదేవీలు, అద్దెలు అన్నింట్లోనూ సౌత్ స్టేట్స్లోనే వృద్ధి నమోదవుతుంది. గత ఆర్థిక సంవత్సరం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2.13 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 66 శాతంగా ఉంది. పశి్చమాది రాష్ట్రాల వాటా 21 శాతం, నార్త్ స్టేట్స్ వాటా 11 శాతంగా ఉందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. ► 2020–21 ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల్లోని 66 శాతం ఆఫీస్ స్పేస్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో 1.4 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగాయి. వెస్ట్ రాష్ట్రాల్లోని ట్రాన్సాక్షన్స్లో ముంబై, పుణే నగరాల్లో 45.6 లక్షల చ.అ. నార్త్లోని లావాదేవీల్లో ఎన్సీఆర్ నగరంలో 23 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి. దేశంలోని టాప్–7 నగరాల్లో 2017–18 ఆర్థిక సంవత్సరంలో 3.11 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా దక్షిణాది రాష్ట్రాల వాటా 47 శాతం కాగా, పశి్చమంలో 33 శాతం, ఉత్తరంలో 17 శాతం వాటా కలిగి ఉన్నాయి. అలాగే 2018–19 ఆర్థికంలో 3.58 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. దక్షిణంలో 57 శాతం, వెస్ట్లో 25 శాతం, నార్త్లో 15 శాతం, 2019–20 ఆర్థిక సంవత్సరంలో 4.3 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. సౌత్లో 55 శాతం, వెస్ట్లో 22 శాతం, నార్త్లో 20 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. సప్లయి కూడా సౌత్లోనే.. కొత్త ఆఫీస్ స్పేస్ సప్లయి కూడా దక్షిణాది రాష్ట్రాలనే ఎక్కువగా ఉంది. గత ఆర్థికంలో 4.02 కోట్ల చ.అ. సప్లయి జరగగా ఇందులో సౌత్ వాటా 63 శాతంగా ఉంది. పశ్చిమాది రాష్ట్రాల వాటా 19 శాతం, నార్త్ వాటా 18 శాతంగా ఉన్నాయి. 2019–20 ఆర్థికంలోనూ అంతే. మొత్తం 4.36 కోట్ల చ.అ. లావాదేవీలు జరగగా.. 59 శాతం దక్షిణాదిలో, 16 శాతం వెస్ట్లో, 24 శాతం ఉత్తరాది రాష్ట్రాలలో జరిగాయి. డిమాండ్ ఎందుకంటే.. గత రెండు మూడేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలలో స్టార్టప్స్ విపరీతంగా పెరగడం, తయారీ, పారిశ్రామిక రంగాలు వృద్ధి బాటలో కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాలలో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ ఏర్పడుతుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. హైదరాబాద్లో అద్దెల వృద్ధి హైదరాబాద్లో నెలవారీ ఆఫీస్ స్పేస్ అద్దెలు పెరుగుతున్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో చ.అ. రెంట్ నెలకు రూ.51 ఉండగా.. 2018–19 నాటికి రూ.53కు, 2019–20లో రూ.56కు, 2020–21 ఆర్థికం నాటికి రూ.57కి వృద్ధి చెందింది. గత ఆర్థికంలో నగరంలో గచ్చిబౌలిలో రెండు ప్రధాన ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. దివ్యశ్రీ ఓరియన్లో వెల్స్ఫార్గో 13 లక్షల చ.అ., సాలార్పూరియా సత్వా నాలెడ్జ్ క్యాపిటల్లో గూగుల్ 10 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ను అద్దెకు తీసుకుంది. బెంగళూరులో గత ఆర్థికంలో చ.అ. అద్దె నెలకు రూ.77గా ఉంది. చెన్నై లో రూ.60, ఎంఎంఆర్లో రూ. 125, పుణేలో రూ.68, ఎన్సీఆర్లో రూ.78గా ఉంది. -
మూడు నగరాల్లో డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ మార్కెట్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల హవా నడుస్తోంది. 2020–21లో దేశవ్యాప్తంగా మొత్తం ఆఫీస్ స్పేస్ డిమాండ్లో ఈ మూడు నగరాల వాటా ఏకంగా 66 శాతముందని అనరాక్ నివేదిక వెల్లడించింది. అలాగే ఆఫీస్ అద్దె పెరుగుదలలో రెండంకెల వృద్ధి నమోదైందని తెలిపింది. ‘ఆఫీస్ స్పేస్ సరఫరా, నికరంగా కంపెనీలు స్థలం తీసుకోవడం, అద్దె పెరుగుదలలో ఈ దక్షిణాది నగరాలు ఇతర ప్రాంతాలను దాటాయి. పశ్చిమ, ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదికి చెందిన ఈ మూడు నగరాల్లో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల నుంచి భారీ డిమాండ్, అందుబాటు ధరలో అద్దెలు, స్టార్టప్స్తోపాటు తయారీ, పారిశ్రామిక రంగాలు ఆఫీస్ స్పేస్ పెరగడానికి కారణం. టాప్–7 నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల వాటా 2019–20లో 47 శాతం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు కొత్తగా 2.13 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఇందులో మూడు నగరాల వాటా 1.4 కోట్ల చదరపు అడుగులు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణే 45.6 లక్షల చదరపు అడుగులతో 21 శాతం, జాతీయ రాజధాని ప్రాంతం 23 లక్షల చదరపు అడుగులతో 11 శాతం వాటా కైవసం చేసుకుంది. కార్యాలయాలకు చెల్లించే అద్దె హైదరాబాద్లో చదరపు అడుగుకు 2017–18లో రూ.51 ఉంటే, గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.57కు చేరింది’ అని అనరాక్ నివేదిక వివరించింది. చదవండి: ఆఫీస్ స్పేస్.. హాట్ కేకుల్లా హైటెక్ సిటీ, మాదాపూర్ -
రాజపుష్ప సమ్మిట్లో కో–వర్కింగ్ స్పేస్
సాక్షి, హైదరాబాద్: కో–వర్కింగ్ స్పేస్ కంపెనీ అవ్ఫిస్ ప్రీమియం వర్క్స్పేస్ సేవలను ప్రారంభించింది. అవ్ఫిస్ గోల్డ్ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద కంపెనీలకు గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్లను అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నాలుగు నెలల్లో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా నగరాలలో 8 గోల్డ్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి 2 లక్షలకు పైగా చ.అ. విస్తీర్ణంలో 5 వేలకు పైగా సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని రాజపుష్ప సమ్మిట్, బెం గళూరులోని శాంతినికేతన్–1 రెండు సెంటర్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం అవ్ఫిస్కు 12 నగరాలలో 90 సెంటర్లు, 51 వేల సీట్లున్నాయి. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక ప్రకారం.. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, కోల్కతా, చెన్నై, పుణే, బెంగళూరులో ఈ ఏడాది జూలై–సెప్టెంబరు కాలంలో కొత్తగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ 54 లక్షల చదరపు అడుగులకు పరిమితమైంది. గతేడాది ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 50% తక్కువ. కరోనా నేపథ్యంలో కార్పొరేట్స్, కో–వర్కింగ్ కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికల వాయిదాతోపాటు వర్క్ ఫ్రమ్ హోం విధానమూ ఇందుకు కారణం. ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 64% వృద్ధి సాధించింది. ఈ 7 నగరాల్లో 2019 జనవరి–సెప్టెంబరులో పలు కంపెనీలు కార్యాలయాల కోసం కొత్తగా అద్దెకు తీసుకున్న స్థలం 3.27 కోట్ల చదరపు అడుగులు. ఈ ఏడాది ఇది 47% తగ్గి 1.73 కోట్ల చదరపు అడుగులకు చేరింది. నగరాల వారీగా ఇలా..: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్లో కార్యాలయాల కోసం కొత్తగా అద్దెకు తీసుకున్న స్థలం విషయంలో బెంగళూరు టాప్లో నిలిచింది. ఈ నగరంలో 27.2 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ పోటీపడుతోంది. ఇక్కడ 15.4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను కంపెనీలు దక్కించుకున్నాయి. పుణేలో 4.6 లక్షలు, ముంబై 2.8 లక్షలు, చెన్నై 2.1 లక్షలు, ఢిల్లీ–ఎన్సీఆర్ 2 లక్షలు, కోల్కతాలో 20 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైంది. క్యూ2తో పోలిస్తే క్యూ3లో కార్యాలయాల అద్దెలు బెంగళూరులో స్వల్పంగా పెరగగా, మిగిలిన 6 నగరాల్లో స్థిరంగా ఉన్నట్టు జేఎల్ఎల్ వెల్లడించింది. -
హైదరాబాద్లో 37 శాతం తగ్గిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్
న్యూఢిల్లీ: కార్పొరేట్ నిర్ణయాల జాప్యం వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ 37 శాతం తగ్గిందని ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మాన్ అండ్ వాక్ఫీల్డ్ (సీ అండ్ డబ్ల్యూ) తెలిపింది. అలాగే ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ ఢిల్లీ-ఎన్సీఆర్లో 57 శాతం, అహ్మదాబాద్లో 75 శాతం క్షీణించిందని పేర్కొంది. రానున్న త్రైమాసికాలలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ తిరిగి పుంజుకోనుందని తెలిపింది. జనవరి-మార్చి మధ్య కాలంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ 14.61 లక్షల చదరపు అడుగుల నుంచి 6.26 లక్షల చదరపు అడుగులకు తగ్గిందని పేర్కొంది. దేశంలోని టాప్-8 నగరాలలో మొత్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ 59 లక్షల చదరపు అడుగుల నుంచి 79 లక్షల చదరపు అడుగులకు పెరిగినట్లు తెలిపింది. ఐటీ-ఐటీఈఎస్ కంపెనీల నుంచి ఆఫీస్ స్పేస్ లీజింగ్కు మంచి డిమాండ్ ఉందని పేర్కొంది. బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ అత్యధికంగా 6 రె ట్లు పెరిగి, 5.31 లక్షల చదరపు అడుగుల నుంచి 32 లక్షల చదరపు అడుగులకు పెరిగినట్లు తెలిపింది. ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ లీజింగ్ వృద్ధి 15 శాతంగా ఉంటుందని సీ అండ్ డబ్ల్యూ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డెరైక్టర్ సంజయ్ దత్ అన్నారు.