-
ఏకమవుతున్న రాజ్పుత్లు.. పూర్తిగా బ్యాన్!
జైపూర్ : పద్మావతి చిత్ర వివాదం సమసిపోయిందనుకుంటున్న సమయంలో మరోసారి శ్రీ రాజ్పుత్ కర్ణిసేన కన్నెర్ర చేసింది. సెన్సార్ బోర్డు ప్యానెల్ కమిటీ సూచనలు.. అందుకు మేకర్లు కూడా దాదాపు అంగీకరించారనే వార్తల నేపథ్యంలో ఆందోళనకారులు అప్రమత్తమయ్యారు. చిత్రాన్ని పూర్తిగా నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయంపై దేశంలోని రాజ్పుత్ తెగకు చెందిన వారంతా జనవరి 27న చిత్తోర్ఘడ్లో సమావేశం కాబోతున్నట్లు చెప్పారు. ఆ భేటీలో చిత్ర విడుదలను అడ్డుకునేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘రాణి పద్మావతి త్యాగం వెలకట్టలేనిది.. అలాంటి వ్యక్తిని అభాసుపాలు చేసేలా చిత్రీకరిస్తే చూస్తూ ఊరుకుంటామా?. సినిమా విషయంలో భన్సాలీకే స్పష్టత కొరవడినట్లుంది. ఓసారి చరిత్ర అంటాడు.. మరోసారి కల్పితం అంటాడు. సెన్సార్ బోర్డు నిర్ణయం కూడా సముచితంగా లేదు. ఆరు నూరైనా చిత్రాన్ని అడ్డుకుని తీరతాం. ఈ విషయంలో చట్టాలు కూడా మమల్ని అడ్డుకోలేవు. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం’’ అని ఆయన హెచ్చరించారు. చరిత్రను భ్రష్టు పట్టిస్తుంటే నేతలు చూస్తూ ఊరుకోవటం సరికాదని.. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామని లోకేంద్ర స్పష్టం చేశారు. కాగా, డిసెంబర్ 30న సెన్సార్ బోర్డు పద్మావతి చిత్రం గురించి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి విదితమే. టైటిల్ను పద్మావత్గా మార్చటంతోపాటు పలు సూచనలు పాటిస్తే యూ బై ఏ సర్టిఫికెట్ తో చిత్ర విడుదలకు లైన్ క్లియర్ చేస్తామని సెన్సార్ బోర్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కూడా అంగీకరించారని.. ఫిబ్రవరి 9న చిత్రం విడుదల కాబోతుందని ఓ వార్త కూడా చక్కర్లు కొడుతోంది. -
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుంటే తెలపండి
డీఆర్ఓ మార్కండేయులు నెల్లూరు(పొగతోట): ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాకు సంబంధించి అభ్యంతరాలుంటే ఈ నెల 23వ తేదీలోపు తెలియజేయాలని డీఆర్ఓ మార్కండేయులు రాజకీయపార్టీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం తన చాంబర్లో రెవెన్యూ అధికారులు, వివిధ రాజీకీయపార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో డీఆర్ఓ మాట్లాడారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అభ్యంతరాలు, క్లైమ్స్ స్వీకరించడం జరుగుతుందన్నారు. గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్లు వారికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పోలింగ్ కేంద్రాలల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడతామన్నారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా తెలియజేయాలని తెలిపారు. సమావేశంలో ఆత్మకూరు, నాయుడుపేట ఆర్డీఓలు ఎంవీ రమణ, శ్రీనానాయక్, ప్రొటోకాల్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సెక్షన్ సూపరింటెండెంట్ రాంభూపాల్రెడ్డి పాల్గొన్నారు. -
అభ్యంతరాలు.. ఏర్పాట్లు
అభ్యంతరాల్లో రాష్ట్రంలో జిల్లా నంబర్ 1 నేడు తుది గడువు.. జిల్లానుంచి 23,043 అభ్యంతరాలు కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం.. 16041 సిరిసిల్ల జిల్లా కోరుతూ 2వేలపైగా వినతులు ఉద్రిక్తంగా మారుతున్న ఆందోళనలు పరిపాలన సౌకర్యాల పనులు ముమ్మరం ముకరంపుర : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ముసాయిదా నోటì ఫికేషన్పై అభ్యంతరాలు, సూచనలు, విజ్ఞప్తులలో రాష్ట్రంలోనే జిల్లా నంబర్వన్ స్థానంలో ఉంది. అభ్యంతరాలకు ఒక్క రోజే మిగిలి ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 89,989 అభ్యంతరాలు వచ్చాయి. అందులో జిల్లా నుంచి 23,043 వినతులు వెళ్లాయి. ప్రతిపాదిత జగిత్యాల జిల్లా నుంచి 16,363 అభ్యంతరాలు రాగా.. అందులో కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోరుతూ 16,041 వినతులు రావడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ డివిజన్లు కోరుతూ 20,849 అభ్యంతరాలు, సూచనలు రాగా.. కోరుట్ల నుంచి 16 వేల మందికి పైగా వ్యక్తం చేయడం అక్కడి డిమాండ్ను స్పష్టంచేస్తోంది. సిరిసిల్ల జిల్లా కోరుతూ 2 వేలకు పైగా విజ్ఞప్తులు చేశారు. అతితక్కువగా జగిత్యాల జిల్లాకు సంబంధించినవి నమోదయ్యాయి. మరో వైపు సిరిసిల్ల జిల్లా, కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోరుతూ ఆందోళనలు ఉధృతరూపం దాల్చాయి. హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేటలో కలపకుండా కరీంనగర్లోనే కొనసాగించాలని నిరసనలు మిన్నంటాయి. ఏర్పాట్లలో నిమగ్నం... ఇక దసరా నుంచే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో పాలన ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయంతో పరిపాలన సౌకర్యాల కల్పనలో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతిపాదిత పెద్దపల్లి, జగిత్యాలలో కలెక్టరేట్, ఇతర కార్యాలయాల ఏర్పాటు దాదాపు ఖరారైంది. అద్దె భవనాలను ఒప్పందం చేసుకుంటున్నారు. ఫైళ్ల విభజన, స్కానింగ్, అద్దె కార్యాలయాలు, భవనాల మరమ్మతు, సామగ్రి కొనుగోలు, వసతుల కల్పన, ఫర్నిచర్ పంపకాలు తదితర పనులు తుదిదశకు వచ్చాయి. ఆయా ప్రతిపాదిత జిల్లాల్లో జనాభా, అక్షరాస్యత, ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు తదితర వాటిపై ముఖ్య ప్రణాళిక అధికారులు సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించారు. జిల్లా కేంద్రం నుంచి ఉద్యోగుల విభజన లెక్కను కూడా సిద్ధంచేశారు. జిల్లాస్థాయిలో 5601 పోస్టులుండగా.. 4,365 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని కరీంనగర్కు 2,083, జగిత్యాలకు 1,067, పెద్దపల్లికి 1,215 మందిని కేటాయించారు. పునర్విభజనపై కలెక్టర్ నీతూప్రసాద్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. -
జిల్లాల ఏర్పాటుపై 1282 అప్పీళ్లు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి గురువారం రాత్రి వరకు ఆన్లైన్ ద్వారా మొ త్తం 1282 అప్పీళ్లు అందాయి. వీటిలో కొత్తగా ఏర్పడబోయే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు, మండలాలకు సంబంధించిన అభ్యంతరాలు, సూచనలు ఉన్నాయి. కొత్తజిల్లాలకు సంబంధిం చి అప్పీళ్లను పౌరులు నేరుగా ఆన్లైన్ ద్వారా కూడా ఫైల్ చేయవచ్చు. ఈ విధానం సులభతరంగా ఉండేలా వెబ్సైట్లో సౌకర్యం కల్పించారు. ఇందు కోసం www.newdistricts formation.telangana.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయి వివరాలు అందజేయాలి. చేతిరాతతో రాసిన కాగి తం కానీ, డీటీపీ ద్వారా తయారు చేసి న డాక్యుమెంట్ స్కాన్ చేసి అభిప్రాయం వెబ్సైట్లో ఆటాచ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పీల్ ఫైల్ అయినట్లు దరఖాస్తుదారు సెల్కు సమాచారం వస్తుంది. -
అభ్యంతరాలు లక్షల్లో పంపాలి
జనగామ జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి జనగామ : యాదాద్రి జిల్లా వద్దు.. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి లక్షల్లో అభ్యంతరాలు పంపాలని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేద్కర్, పూలే అధ్యయన కేంద్రంలో శుక్రవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరిస్తుండటంతో ప్రతి ఒక్కరూ పంపాలని కోరారు. ఈ విషయంపై మండలాలు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా బాధ్యులను నియమించినట్లు చెప్పారు. ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా ఉచితంగా విజ్ఞప్తులు పంపేందుకు జేఏ సీ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. జనగామను జిల్లా చేయాలని లక్షలాది మంది ఉద్యమిస్తుంటే, హన్మకొండను జిల్లా చేయడం ప్రభుత్వ వివక్షకు నిదర్శనమన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటును విరమించుకోవాలని అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పడి జనగామకు సంపూర్ణ మద్దతు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. జనగామ జిల్లా ఉద్యమానికి మరింత ఊతమిచ్చేందుకు సీపీఎం ప్రత్యక్ష ఉద్యమంలోకి కలిసి రావడం శుభ పరిణామమన్నారు. లింగాలఘనపురానికి చెందిన సర్పంచ్, ఎంపీపీ ఏకగ్రీవ తీర్మాణాలతో ఎంపీపీ భర్త రాజు, చిట్ల ఉపేందర్రెడ్డి, సర్పంచ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్కు బయల్దేరే క్రమంలో జేఏసీ నేతలు కలిశారు. అభ్యతంరా ల స్వీకరణపై ఆయా గ్రామాల ఇంచార్జిలు మేడ శ్రీను (రఘునాథపల్లి), బాలలక్ష్మి (మద్దూరు), ధర్మపురి శ్రీను, ఆలేటి సిద్దిరాములు (బచ్చన్నపేట), రెడ్డి రత్నాకర్రెడ్డి (నర్మెట), జనగామ అర్బన్ (ఆకుల వేణుగోపాల్రావు, పిటట్ల సత్యం,జక్కుల వేణుమాధవ్, బూడిద గోపి), కళాశాలలు, విద్యాసంస్థలకు ఎండీ.మాజీద్, పిట్టల సురేష్, నరేందర్, కిరణ్ను నియమి స్తూ, సమన్వయకర్తగా మంగళ్లపల్లి రాజుకు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు జనగామ జిల్లా కోసం బచ్చన్నపేటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కొన్నె బాల్రాజుకు నివాళులర్పించారు. ఆమరణ దీక్ష చేసిన 12 మంది జేఏసీ నాయకులకు అభినందనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజిరెడ్డి, డాక్టర్ రాజమౌళి, లక్ష్మినారాయణనాయక్, పెద్దోజు జగదీష్, మాశెట్టి వెంకన్న, మోర్తాల ప్రభాకర్, బర్ల శ్రీరాములు, సత్యపాల్రెడ్డి, క్రిష్ణ ఉన్నారు. -
అటూ.. ఇటూ..!
ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ముక్కలు హుస్నాబాద్ మూడు జిల్లాల్లోకి.. మిగిలినవి రెండు జిల్లాలోకి.. మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే మిగిలిన ఎమ్మెల్యేలు రెండేసి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం నాలుగు జిల్లాలకు కరీంనగర్ ఎంపీ, మూడు జిల్లాలకు పెద్దపల్లి 6 నుంచి 11 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్న ఎమ్మెల్సీలు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాల పునర్విభజనతో ఎంపీలు, ఎమ్మెల్యేలకు కొత్త చిక్కు వచ్చింది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా ప్రకారం వీటిలో ఏడు సెగ్మంట్ల పరిధిలో గల కొన్ని మండలాలు ఇతర జిల్లాలోకి వెళ్తున్నాయి. దీంతో ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇకనుంచి రెండు మూడు జిల్లాల్లో ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగేంత వరకు ప్రజాప్రతినిధులకు ఈ పరిస్థితి తప్పదు. పునర్విభజనలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం మూడు ముక్కలవుతుండగా, సిరిసిల్ల, చొప్పదండి, వేములవాడ, ధర్మపురి, మంథని, మానకొండూరు, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు రెండేసి జిల్లాల్లోకి వెళుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ మండలాలు సిద్దిపేటలోకి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండలోకి వెళ్తుండగా.. సైదాపూర్, చిగురుమామిడి మండలాలు మాత్రమే కరీంనగర్లో మిగులుతాయి. దీంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్కుమార్ మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వీణవంక మినహా మిగిలిన మూడు మండలాలు హన్మకొండ జిల్లాలోకి వెళుతున్నాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందర్ రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలం సిద్దిపేటకు, సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాలను కరీంనగర్ జిల్లాకు కేటాయించారు. ముసాయిదా యథాతథంగా ఆమోదం పొందితే సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ సైతం కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సిందే. వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలు జగిత్యాల జిల్లాకు, వేములవాడ, కోనరావుపేట, చందుర్తి మండలాలు కరీంనగర్ జిల్లాకుSకేటాయించారు. ధర్మపురి నియోజకవర్గాన్ని తొలుత జగిత్యాల జిల్లాకే కేటాయించినప్పటికీ చివరి నిమిషంలో ధర్మారం మండలాన్ని పెద్దపల్లి జిల్లాకు మార్చారు. చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల, మల్యాల మండలాలు జగిత్యాల జిల్లాలోకి వెళ్తుండగా, చొప్పదండి, గంగాధర, బోయినపల్లి, రామడుగు మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉంటాయి. మంథని నియోజకవర్గంలోని మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం మండలాలు భూపాలపల్లి జిల్లాలోకి, మంథని, ముత్తారం, కమాన్పూర్ మండలాలు పెద్దపల్లి జిల్లాలోకి వెళ్తున్నాయి. మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం సిద్దిపేట జిల్లాకు మార్చగా, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, బెజ్జంకి మండలాలు కరీంనగర్కు కేటాయించారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాలు పెద్దపల్లి జిల్లాలో, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు జగిత్యాల జిల్లాలో, కరీంనగర్ నియోజకవర్గం పూర్తిగా కరీంనగర్ జిల్లాలోనే కొనసాగుతుండటంతో సదరు ఎమ్మెల్యేలు ఒకే జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. – ఎంపీల విషయానికొస్తే... కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ ఇకపై కరీంనగర్, హన్మకొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కొత్త జిల్లాల విభజన నేపథ్యంలో పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు, నిజామాబాద్ ఎంపీ కవిత ఇకపై నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సిందే. – ఇక ఒక్కో ఎమ్మెల్సీ ఏకంగా 6 నుంచి 11 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు ఇకపై కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. శాసనమండలి చైర్మన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీచర్స్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి ప్రస్తుతం కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో వీరు ఏకంగా 11 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలు మూడేసి జిల్లాలుగా.. నిజామాబాద్ రెండు జిల్లాలుగా ఏర్పడుతున్నందున మొత్తం 11 జిల్లాలకు ఈ ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహించాల్సి రావడం విశేషం. – జిల్లా పరిషత్ చైర్పర్సన్, డీసీసీబీ, డీసీఎంస్ చైర్మన్లు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లోని మండలాలు ఆరు జిల్లాల్లోకి వెళుతున్నప్పటికీ ఆయా పదవులు గడువు ముగిసే వరకు వారి పరిధిలోనే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో వారంతా ఒకే జిల్లాకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు సమావేశాలు నిర్వహించిన సమయంలో ఆయా స్థానిక, సహకార సంఘాల ప్రతినిధులు కరీంనగర్ జిల్లాకే రావాల్సి ఉంటుంది. జిల్లా నుంచి 742 అభ్యంతరాలు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి బుధవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 2564 అభ్యంతరాలు ప్రభుత్వ వెబ్సైట్లో నమోదవగా, అందులో ప్రస్తుత కరీంనగర్ జిల్లా నుంచి ఏకంగా 759 ఉండటం గమనార్హం. వీటిలోనూ అత్యధికంగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన కొత్త రెవెన్యూ డివిజన్కు సంబంధించి ఏకంగా 514 అభ్యంతరాలు వెల్లడించడం గమనార్హం. అందులో మెజారిటీ అభిప్రాయాలు కోరుట్లను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని రావడం విశేషం. మిగిలిన విషయానికొస్తే జిల్లాల ఏర్పాటుపై 195, మండలాల ఏర్పాటుపై 50 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. -
కొత్త జిల్లాలపై భారీగా అభ్యంతరాలు
తెలంగాణలో కొత్త జిల్లాల ముసాయిదాపై వివిధ వర్గాల ప్రజల నుంచి భారీగా అభ్యంతరాలు సూచనలు వచ్చాయి. ఒక్కరోజులోనే తెలంగాణ ప్రభుత్వానికి సుమారు 555 విజ్ఞప్తులు అందాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాల ఏర్పాటుపై 333, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై 113, మండలాల ఏర్పాటుపై 109 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. జిల్లాల వారీగా అందిన సూచనలు ఇలా ఉన్నాయి... -
అటవీశాఖ కొర్రీలు..!
నుంచి కాచరాజుపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి అవాంతరాలు –మట్టి రోడ్డును బీటీగా మార్చొద్దంటున్న ఫారెస్ట్ అధికారులు –తలలు పట్టుకుంటున్న అధికారులు, కాంట్రాక్టర్లు దేవరకొండ / చందంపేట : కాచరాజుపల్లి పుష్కర ఘాట్కు మొదటి నుంచి అన్నీ ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. డిండి – దేవరకొండ ప్రధాన రోడ్డు నుంచి కాచరాజుపల్లి వరకు సుమారు 31 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాచరాజుపల్లి ఘాట్కు వెళ్లాలంటే బుగ్గతండా నుంచి 1.8 కిలో మీటర్ల దూరం అటవీ ప్రాంతంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న శాఖ కావడంతో మొదటి నుంచి అనుమతులకు అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. పుష్కరాల కోసం 1.8 కిలో మీటర్ మేర రోడ్డు మంజూరు కాగా కోటి రూపాయల వ్యయంతో బుగ్గతండా నుంచి కాచరాజుపల్లి వరకు రహదారి వేయాల్సి ఉంది. అయితే కొన్ని రోజులుగా ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ విషయంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోయింది. జిల్లా ఫారెస్ట్ అధికారులు ఇప్పటికీ ఒకటి రెండుసార్లు కాంట్రాక్టర్లను హెచ్చరించడంతో పాటు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా .. తాజాగా ఈనెల 25న బుగ్గతండా నుంచి కాచరాజుపల్లి ఘాట్ వరకు 1.8 కిలోమీటర్ల దూరం రోడ్డు వేయడానికి అనుమతిస్తూ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నుంచి ఆర్అండ్బీ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అందులోనూ రోడ్డుకు కొర్రీలు తప్పలేదు. వాస్తవంగా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పుష్కర ప్రాంతాలకు వెళ్లే అన్ని రోడ్లను డబుల్గా మారుస్తున్నారు. అందులో కాచరాజుపల్లి రోడ్డును కొద్ది దూరం( 5 మీటర్లు) కూడా బీటీగా మార్చే అవకాశం లేదని ఫారెస్ట్ శాఖ పేర్కొంది. అంతేకాకుండా ఫారెస్ట్ పరిధిలో ఉన్న ఏరియా నుంచి మట్టి తీయరాదంటూ నిబంధన విధించింది. దీంతో ఇటు కాంట్రాక్టర్లు, అటు అధికారులుతల పట్టుకుంటున్నారు. రహదారి సాగేదెలా ? పుష్కరాలకు చిన్న వాహనాలతో పాటు భారీ వెహికిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ, ఫారెస్ట్ శాఖ పెడుతున్న కొర్రీల వల్ల ఆ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే పుష్కర భక్తులకు ప్రయాసగానే మారనుంది. అధికారులు మాత్రం కాచరాజుపల్లి పుష్కర ఘాట్ నిర్మాణానికి లక్షలో వెచ్చిస్తున్నారు. అంతే కాకుండా బుగ్గతండా నుంచి కాచరాజుపల్లి ఘాట్కు వెళ్లాలంటే 70 మీటర్ల ఎత్తులో ఉన్న గుట్టను ఎక్కి దిగాల్సి ఉంటుంది. దీనిపై ప్రయాణమంటే ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి. కాచరాజుపల్లి మార్గాన్ని తప్పని పరిస్థితుల్లో కొంచెం పెంచినా మట్టి రోడ్డును మాత్రం బీటీ చేసే అవకాశం లేదు. ఇక రెండు కిలోమీటర్ల నుంచి మట్టి తీసుకురావాలంటే కాంట్రాక్టర్కు కూడా అదనపు ఖర్చే అవుతుంది. ఈ నేపథ్యంలో రోడ్డు వైశాల్యం పెంచుతారా ? కాంట్రాక్టర్ రెండు కిలోమీటర్ల నుంచి మట్టి తీసుకొచ్చి అనుకున్న సమయానికి రోడ్డు పని పూర్తి చేయగలుగుతాడా ? ఫారెస్ట్ శాఖ దీనిపై తమ నిర్ణయాన్ని మార్చుకుంటుందా అనేది ఇప్పటికీ ప్రశార్థకంగా మారింది. -
అమరావతిపై ప్రధాని మోదీకి కేవీపీ లేఖ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని అమరావతి వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాలను అంచనా వేయకుండా పర్యావరణ అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధమని రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రారావు విమర్శించారు. పర్యావరణ మదింపు కమిటీ పరిశీలన లేకుండానే ఎస్ఐఇఇఎఎ అనుమతులు ఇవ్వడం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడమేనని చెప్పారు. ఆదివారం ఆయన ఏపీ రాజధాని అమరావతిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రధాని నరేందర్ మోదీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా తాత్కాలిక రాజధాని నిర్మిస్తున్నారని కేవీపీ ఆరోపించారు. హడావుడిగా చేసే తాత్కాలిక రాజధాని నిర్మాణం వల్ల భారీగా ప్రజాధనం వృధా అవుతుందని ప్రధానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, నిర్మాణాల విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కేవీపీ లేఖలో తెలిపారు. -
అభ్యంతరాలకు 24వరకు గడువు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల వైద్యుల విభజన తీవ్ర వివాదానికి దారితీసిన నేపథ్యంలో వైద్యుల నుంచి వచ్చే అభ్యంతరాలకు కమల్నాథన్ కమిటీ ఈ నెల 24 వరకూ గడువిచ్చింది. గత నెల 29న రాష్ట్ర కేడర్ పోస్టులైన వైద్యులను ఆయా రాష్ట్రాలకు విభజించి.. వివరాలను జనవరి 30న రీఆర్గనైజేషన్ వెబ్సైట్లో పెట్టిన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన 218 మంది, మరో 118 మంది స్థానికేతర వైద్యులను తెలంగాణకు కేటాయించడంపై తెలంగాణ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. వైద్య సంఘాలు సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డినీ కలిశాయి. మొత్తం 2,928 మంది వైద్యుల విభజన జరిగితే తెలంగాణకు 1,184 మందిని, ఏపీకి 1,744 మందిని కేటాయించారు. అయితే 18ఎఫ్ క్లాజ్(అవసరాల మేరకు ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం) ప్రకారం చాలామంది తెలంగాణకు ఆప్షన్ ఇచ్చారని, ఇది సరికాదని ఆరోపించారు. ఏపీలో 1,536 మంది వైద్యుల ఖాళీలు ఉండగా, 218 మందిని తెలంగాణకు కేటాయించడంపై కూడా వివాదం నెలకొంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ వైద్యశాఖ మంత్రితో పాటు, ముఖ్య కార్యదర్శి నుంచి కమల్నాథన్ కమిటీకి వినతులు వెళ్లాయి. వీటిని పరిశీలించిన కమిటీ...గురువారం వైద్యుల అభ్యంతరాలకు ఈనెల 24 వరకూ గడువిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో వైద్యుల అవసరం గుర్తించలేదు ఆంధ్రప్రదేశ్లో 1,500కు పైగా వైద్యుల ఖాళీలు ఉన్నాయి. అక్కడి డాక్టర్లను ఇక్కడ కేటాయించడం ఏమిటి? అంటే చాలామంది వైద్యులు ఉన్నతాధికారులను మేనేజ్ చేసుకున్నారు. న్యాయబద్ధంగా స్పౌజ్ కేసులను తాము కాదనలేం. కానీ వందలాది మంది వైద్యులు ఇక్కడకు రావడమేంటి? -తెలంగాణ రీఆర్గనైజేషన్ జేఏసీ అధ్యక్షుడు డా.ఉమాశంకర్, కో చైర్మన్ డా.రమేష్రెడ్డి -
ముచ్చెమటలు
⇒మాస్టర్ప్లాన్పై ముక్తకంఠం ⇒ప్రతి అంశానికీ చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ ⇒గ్రామాల్లో ముగిసిన అవగాహన సదస్సులు ⇒ఎక్స్ప్రెస్ వే నిర్మాణంపై తీవ్ర వ్యతిరేకత ⇒జరీబు భూములు, కోర్ కేపిటల్ గ్రామాలపై స్పష్టత కరువు రైతుల సందేహాలతో అధికారులు సతమతం మాస్టర్ప్లాన్పై రాజధాని గ్రామాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయా చోట్ల నిర్వహించిన అవగాహన సదస్సులు అధిక భాగం రచ్చ రచ్చగా మారాయి. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు ముఖం చాటేయడంతో రైతుల సందేహాలునివృత్తి చేయలేక అధికారులు సైతం తలలు పట్టుకున్నారు. రాజధాని భూ సమీకరణకు తొలిగా ముందుకు వచ్చిన తుళ్లూరు గ్రామంలో సైతం రైతులు సదస్సును బహిష్కరించడం మాస్టర్ప్లాన్పై ఉన్న వ్యతిరేకతకు అద్దంపట్టింది. గుంటూరు : సింగపూర్ సంస్థలు రూపొందించిన రాజధాని మాస్టర్ప్లాన్పై నిర్వహించిన అవగాహన సదస్సులు గురువారంతో ముగిశాయి. వివాదాల కారణంగా నిలిచిపోయిన సదస్సులను శుక్రవారం నుంచి ఆయా గ్రామాల్లో తిరిగి ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మాస్టర్ప్లాన్ విడుదల చేసిన రోజు నుంచి నెల రోజుల వరకు గడువు ఉండడంతో ఈ నెల 26 వరకు సీఆర్డీఏ కార్యాలయాల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. గత నెల 25న ప్రభుత్వం మాస్టర్ప్లాన్ను విడుదల చేసింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 6న గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో జిల్లా కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్, ఇతర అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. అయితే సదస్సులు గ్రామాల్లో నిర్వహించాలని రైతులు డిమాండ్ చేయడంతో షెడ్యూల్ ప్రకటించి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. భూ సమీకరణకుమద్దతు పలికిన తుళ్లూరు గ్రామ రైతులు కూడా గురువారం సదస్సును బహిష్కరించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు ప్రతి సదస్సులో రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగులు, గ్రామ కంఠాల పరిధిలోని ప్రజలు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని గ్రామాల మధ్య నుంచి ఆరు వరుసల రహదారులు, కోర్ కేపిటల్ నిర్మాణం జరగనున్న మూడు గ్రామాల గురించి, జరీబు రైతుల నష్టపరిహారం, గ్రామ కంఠాలు తదితర అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వక పోవడంతో వారంతా అభ్యంతర పత్రాలను ఇచ్చారు. యర్రబాలెం, నవులూరు, ఉండవల్లి, నిడమర్రు గ్రామాల మధ్యలో ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణానికి గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దానివల్ల గ్రామాలు రెండుగా విడిపోవడమే కాకుండా నివాసాలు కూడా కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నివాసాల నిర్మాణానికి రెట్టింపు సొమ్ము ఇస్తామని అధికారులు ముందుకు వచ్చినా, సొంతూరిపై మమకారాన్ని వదులుకునే ఉద్దేశం లేక రైతులు ఆరులైన్ల రహదారి నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అభ్యంతర పత్రాలు ఇచ్చారు. సాలీనా మూడు పంటలు పండుతున్న భూములు కలిగిన జరీబు రైతులు తమకు ఇచ్చే నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు. భూ సమీకరణ సమయంలో ఇంటింటికీ తిరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఇప్పుడు ఈ సదస్సులకు హాజరుకావడం లేదని, భవిష్యత్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయోనని, అందుకనే మాస్టర్ప్లాన్కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెల్లించనున్న నష్టపరిహారం, ఇవ్వనున్న నివేశన స్థలాలు, భవన నిర్మాణాలకు ఇచ్చే అనుమతులు వంటి ముఖ్య అంశాలకు చట్టబద్ధత కల్పించి ప్రతి రైతుకు అందించాలని కోరారు. రాజధానిలో 29 గ్రామాలకు అనుబంధంగా ఉన్న గ్రామ కంఠాల విషయంలో మంత్రులు, అధికారులు ఎంతో హైడ్రామా నడిపారని, గ్రామ కంఠాలు ప్రకటించలేదని, దీని వల్ల స్థలాలను అమ్ముకునే అవకాశాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్ కేపిటల్ నిర్మాణం జరగనున్న ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామాల పరిధిలో అధికారులు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ మూడు గ్రామాల్లో పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేట్ ఇతర భవనాల నిర్మాణాలు చేపట్టేందుకు మాస్టర్ప్లాన్ రూపొందించారు. దీనిని అమలులోకి తీసుకువస్తే, ఆ గ్రామాలు పూర్తిగా గల్లంతవుతాయి. దీంతో ఆ గ్రామాల ప్రజలంతా ఐక్యంగా మాస్టర్ ప్లాన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరాలకు సమీపంలోని వ్యవసాయ భూములను గ్రీన్బెల్ట్ పరిధిలోకి తీసుకురావడంతో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. ముఖ్యంగా జిల్లాలోని పోరంకి, ఈడుపుగల్లు, గన్నవరం మండలాలు, గుంటూరు జిల్లాలోని పెదకాకాని, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, కొల్లిపర మండలాలు తదితర ప్రాంతాలను గ్రీన్బెల్ట్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే అపార్టుమెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. గ్రీన్బెల్టును అమలు లోకి తీసుకువస్తే ఈ గ్రామాల్లో ఇక నిర్మాణాలు పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుంది. ఈ గ్రామాలను గ్రీన్బెల్టు పరిధిలోకి తీసుకురావడంతో ఇప్పటికే అక్కడి భూముల ధరలు అనూహ్యంగా పడిపోయాయి. మున్ముందు ఇంకా పడిపోయే అవకాశం ఉండడంతో ఆ గ్రామాల రైతులు మాస్టర్ప్లాన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులు బహిష్కరణ ... తుళ్ళూరులో గురువారం జరిగిన అవగాహన సదస్సులో రైతులు రెండు వర్గాలుగా విడిపోయి, కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా, మరి కొందరు వ్యతిరేకంగా వివాదానికి దిగి కార్యక్రమాన్ని బహిష్కరించారు. మరి కొన్ని గ్రామాల్లో పోలీస్ బందోబస్త్ నడుమ అవగాహన సదస్సులు నిర్వహించినా, అభ్యంతర పత్రాలే ఎక్కువ ఇచ్చారు. -
అభ్యంతరమే!
మాస్టర్ప్లాన్పై రాజధాని గ్రామాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయా గ్రామాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులు అధిక భాగం రచ్చ రచ్చగా మారాయి. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు ముఖం చాటేయడంతో రైతుల సందేహాలు నివృత్తి చేయలేక అధికారులు తలలు పట్టుకున్నారు. రాజధాని భూ సమీకరణకు తొలిగా ముందుకు వచ్చిన తుళ్లూరులో సైతం రైతులు సదస్సును బహిష్కరించడం మాస్టర్ప్లాన్పై ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టింది. గుంటూరు : సింగపూర్ సంస్థలు రూపొందించిన రాజధాని మాస్టర్ప్లాన్పై నిర్వహించిన అవగాహన సదస్సులు గురువారంతో ముగిశాయి. వివాదాల కారణంగా నిలిచిపోయిన సదస్సులను శుక్రవారం నుంచి ఆయా గ్రామాల్లో తిరిగి ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మాస్టర్ప్లాన్ విడుదల చేసిన రోజు నుంచి నెల రోజుల వరకు గడువు ఉండడంతో ఈ నెల 26 వరకు సీఆర్డీఏ కార్యాలయాల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. గత నెల 25న ప్రభుత్వం మాస్టర్ప్లాన్ను విడుదల చేసింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 6న గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్, ఇతర అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. అయితే సదస్సులు గ్రామాల్లో నిర్వహించాలని రైతులు డిమాండ్ చేయడంతో షెడ్యూల్ ప్రకటించి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. భూ సమీకరణకుమద్దతు పలికిన తుళ్ళూరు గ్రామ రైతులు కూడా గురువారం సదస్సును బహిష్కరించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు ప్రతీ సదస్సులో రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగులు, గ్రామ కంఠాల పరిధిలోని ప్రజలు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని గ్రామాల మధ్య నుంచి ఆరు వరుసల రహదారులు, కోర్ కేపిటల్ నిర్మాణం జరగనున్న మూడు గ్రామాల గురించి, జరీబు రైతుల నష్టపరిహారం, గ్రామ కంఠాలు తదితర అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వక పోవడంతో వారంతా అభ్యంతర పత్రాలను ఇచ్చారు. యర్రబాలెం, నవులూరు, ఉండవల్లి, నిడమర్రు గ్రామాల మధ్యలో ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణానికి గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దానివల్ల గ్రామాలు రెండుగా విడిపోవడమే కాకుండా నివాసాలు కూడా కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నివాసాల నిర్మాణానికి రెట్టింపు మొత్తం ఇస్తామని అధికారులు ముందుకు వచ్చినా, సొంత ఊరుపై ఉన్న మమకారాన్ని వదులుకునే ఉద్దేశం లేక రైతులు ఆరులైన్ల రహదారి నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అభ్యంతర పత్రాలు ఇచ్చారు. సాలీనా మూడు పంటలు పండుతున్న భూములు కలిగిన జరీబు రైతులు తమకు ఇచ్చే నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు. భూ సమీకరణ సమయంలో ఇంటింటికీ తిరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఇప్పుడు ఈ సదస్సులకు హాజరుకావడం లేదని, భవిష్యత్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయోనని, అందుకనే మాస్టర్ప్లాన్కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెల్లించనున్న నష్టపరిహారం, ఇవ్వనున్న నివేశన స్థలాలు, భవన నిర్మాణాలకు ఇచ్చే అనుమతులు వంటి ముఖ్య అంశాలకు చట్టబద్ధత కల్పించి ప్రతీ రైతుకు అందించాలని కోరారు. రాజధానిలో 29 గ్రామాలకు అనుబంధంగా ఉన్న గ్రామ కంఠాల విషయంలో మంత్రులు, అధికాారులు ఎంతో హైడ్రామా నడిపారని, గ్రామ కంఠాలు ప్రకటించలేదని, దీని వల్ల స్థలాలను అమ్ముకునే అవకాశాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.కోర్ కాపిటల్ నిర్మాణం జరగనున్న ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామాల పరిధిలో అధికారులు ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ మూడు గ్రామాల్లో పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేట్ ఇతర భవనాల నిర్మాణాలు చేపట్టేందుకు మాస్టర్ప్లాన్ రూపొందించారు. దీనిని అమలులోకి తీసుకువస్తే, ఆ గ్రామాలు పూర్తిగా గల్లంత వుతాయి. దీంతో ఆ గ్రామాల ప్రజలంతా ఐక్యంగా మాస్టర్ ప్లాన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరాలకు సమీపంలోని వ్యవసాయ భూములను గ్రీన్బెల్ట్ పరిధిలోకి తీసుకురావడంతో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. ముఖ్యంగా కృష్ణాజిల్లాలో పోరంకి, ఈడుపుగల్లు, గన్నవరం మండలాలు, గుంటూరు జిల్లాలోని పెదకాకాని, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, కొల్లిపర మండలాలు తదితర ప్రాంతాలను గ్రీన్బెల్ట్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే అపార్టుమెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. గ్రీన్బెల్టును అమలు లోకి తీసుకువస్తే ఈ గ్రామాల్లో ఇక నిర్మాణాలు పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుంది. ఈ గ్రామాలను గ్రీన్బెల్టు పరిధిలోకి తీసుకురావడంతో ఇప్పటికే అక్కడి భూముల ధరలు అనూహ్యంగా పడిపోయాయి. మున్ముందు ఇంకా పడిపోయే అవకాశం ఉండడంతో ఆ గ్రామాల రైతులు మాస్టర్ప్లాన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటా ఆందోళనలు రాజధాని మాస్టర్ప్లాన్పై తొలుత మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో అవగాహనా సదస్సు నిర్వహించగా గ్రామకంఠాలను నిర్ధారించిన తరువాతే కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు ఆందోళన చేశారు.కురగల్లులో గ్రామకంఠంతో పాటు అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించాలని, భూమిలేని రైతులు, రైతు కూలీల పింఛన్లలో అర్హులకు అన్యాయం జరిగిందంటూ అధికారులను నిలదీశారు. నవులూరులో ఎక్స్ప్రెస్ వేల పేరుతో నివాస గృహాలు తొలగించవద్దంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. నిడమర్రులో తమ గ్రామాన్ని రాజధాని నిర్మాణం నుంచి మినహాయించాలని పంచాయతీలో తీర్మానం చేసి అధికారులకు పంపినా పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదస్సును బహిష్కరించారు. యర్రబాలెం గ్రామంలో ఎక్స్ప్రెస్ వేల పేరుతో నివాసాలు తొలగించవద్దని, గ్రామ కంఠాలు నిర్ధారించకుండా మాస్టర్ ప్లాన్ ఎలా తయారు చేశారంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. బేతపూడిలో గ్రామకంఠాలు నిర్ధారించిన తరువాతే సదస్సులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కృష్ణాయపాలెంలో మెట్ట, జరీబు భూములకు ఒకే విధమైన ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి మండలం పెనుమాకలో భూ సమీకరణకు భూములు ఇవ్వకపోయినా మాస్టర్ప్లాన్లో ఎలా భూములు చూపించారని ప్రశ్నించారు. ఉండవల్లిలో రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా తమ గ్రామం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం వుందని, రోడ్లు డిజైన్ మార్చాలని డిమాండ్ చేశారు. -
ఇక్కడ కాదు.. అక్కడ
భీమవరం అర్బన్ :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలను స్వీకరించే విషయంలో గందరగోళం నెలకొంది. ఫారం-19 ఇస్తే తీసుకుంటామని, ఫారం-7 తీసుకునే అర్హత తమకు లేదని భీమవరం మునిసిపల్ కమిషనర్ బీఆర్ సత్యనారాయణ, తహసిల్దార్ గంధం చెన్నుశేషు చెప్పడం, తనకు సంబంధం లేదని కమిషనర్ పేర్కొన డం గందరగోళానికి దారి తీశాయి. దీనిని నిరసిస్తూ యూటీఎఫ్ నాయకులు మంగళవారం రాత్రి మునిసిపల్ కమిషనర్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ విషయమై యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి.గోపిమూర్తి మాట్లాడుతూ భీమవరం పరిధిలో మొత్తం 700 ఉపాధ్యాయ ఓట్లు ఉన్నట్టు పేర్కొంటూ జాబితా విడుదల చేశారని చెప్పారు. అందులో 167 ఓట్లు బోగస్ అని తేలిందన్నారు. వాటిపై అభ్యంతరాలు తెలియజేస్తూ 167 బోగస్ ఓట్లకు సంబంధించి ఫారం నంబర్-7ను తహసిల్దార్కు ఇచ్చామన్నారు. తనకు ఫారం-7 తీసుకునే అధికారం లేదని, మునిసిపల్ కమిషనర్ వద్దకు వెళ్లాలని తహసిల్దార్ చెప్పారన్నారు. కమిషనర్ను కలసి అభ్యంతరాల జాబితా ఇచ్చామన్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ తనకు ఫారం-19 మాత్రమే తీసుకునేందుకు అర్హత ఉం దని, ఫారం నంబర్-7 తీసుకునే అర్హత లేదని చెప్పారన్నారు. అభ్యంతరాల స్వీకరణకు మంగళవారం ఆఖరు తేదీ అని, అధికారులు ఎవరికి వారు ఈవిధంగా తప్పించుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాసేందుకే బోగస్ ఓట్లపై అభ్యంతరాలను స్వీకరించడం లేదని గోపిమూర్తి ఆరోపించారు. అభ్యంతరాలను స్వీకరించాలని ధర్నా చేస్తుంటే మునిసిపల్ కమిషనర్ బాధ్యతారాహిత్యంగా వెళ్లిపోయారని అన్నారు. ఇందుకు నిరసనగా రాష్ట్రస్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం 4 గంటలకు మొదలైన ధర్నా రాత్రయినా కొనసాగటంతో సీఐ జి.కెనడీ రాత్రి 9 గంటల సమయంలో అక్కడకు చేరుకున్నారు. మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావుతో కలసి యూటీఎఫ్ నాయకులతో చర్చలు జరిపారు. రాత్రి సమయంలో ఇక్కడ ఆందోళన చేయ డం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. దీనిపై యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్లను భారీగా చేర్చారని, దీనిపై గడువులోపు తాము అభ్యంతరాలను తెలి పేందుకు వస్తే అధికారులు తమకు సంబంధం లేదంటున్నారని విరుచుకుపడ్డారు. మునిసిపల్ చైర్మన్, సీఐ బదులిస్తూ బుధవారం ఉదయం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఇందుకు తాము కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు. శాంతిం చిన యూటీఎఫ్ నాయకులు ధర్నాను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ప్రకటించారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.జోసఫ్గాంధీ, యూటీఎఫ్ జిల్లా శాఖ కార్యదర్శి పి.సీతారామరాజు, జిల్లా ఆడిట్ కన్వీనర్ పి.శ్రీనివాసరాజు, యూటీఎఫ్ రూరల్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ పట్టాభిరామయ్య, నాయకులు ఎంఐ విజయకుమార్, పాలకోడేరు మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎస్ విజయరామరాజు, జి.సుధాకర్, కాళ్ల మండల శాఖ ప్రధాన కార్యదర్శి కేఎస్ఆర్సీహెచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల పంపిణీ మరింత జాప్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య ఉద్యోగుల పంపిణీ మరింత జాప్యం కానుంది. ఇప్పటికే కమలనాధన్ కమిటీ 44 శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి పోస్టులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి పది రోజుల సమయం ఇచ్చింది. ఇందులో అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి 32 శాఖలకు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. కమలనాధన్ కమిటీ ఈ పోస్టుల తుది పంపిణీతోపాటు రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీని కూడా తాత్కాలికంగా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అంగీకరించారు. దీంతో కమలనాధన్ కమిటీ ఇరు రాష్ట్రాలకు చెందిన శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై అభ్యంతరాలు లేని శాఖలకు చెందిన పోస్టులతోపాటు ఉద్యోగులను కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర వ్యక్తిగత సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం అభ్యం తరం వ్యక్తం చేసింది. ఈ మేరకు అధికారులు కమలనాధన్కు బుధవారం తెలియజేశారు. పోస్టులతోపాటు ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ అంశానికి చెందిన ఫైలును ప్రధాని ఆమోదానికి పంపుతామని, అప్పటివరకు పంపిణీ చేయరాదని తెలిపారు. దీంతో ఉద్యోగుల తాత్కాలిక పంపిణీకి ప్రధానమంత్రి నుంచి ఆమోదం లభించిన తరువాతనే పోస్టుల తుది పంపిణీని ఉద్యోగుల తాత్కాలిక పంపిణీని ఒకేసారి చేయాలని కమలనాధన్ కమిటీ నిర్ణయించింది. దీంతో పోస్టుల పంపిణీ, ఉద్యోగుల పంపిణీ మరింత జాప్యం కానుందని అధికార వర్గాలు తెలిపాయి. -
నిధుల రాజకీయం షురూ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పార్టీలకతీతంగా, పల్లెల అభివృద్ధే ధ్యేయంగా విధులు నిర్వహించాల్సిన కర్నూలు జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న చందంగా నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపుతున్నారని విమర్శలున్నాయి. దీంతో ప్రతిపక్ష జెడ్పీటీసీ సభ్యుల నుంచే కాక అధికారపక్ష సభ్యుల నుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో కాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్న పల్లెల్లో ప్రగతి కాంతులు వస్తాయని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పాటైన పాలకవర్గంపై ఉంది. దీనికి అవసరమైన నిధులను కేటాయించాల్సిన బాధ్యత జెడ్పీ చైర్మన్పై ఉంది. నిధులను సమకూర్చకపోయినా ఉన్న నిధులైనా సక్రమంగా పంపిణీ చేయాల్సి ఉంది. అలా కాకుండా చైర్మన్ ఇష్టానుసారంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పలువురు సభ్యులు ఆభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీలో అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు దండిగా ఉన్నాయి. ఆ నిధుల కేటాయింపునకు చైర్మన్ శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులకు ఓ రకంగా.. టీడీపీ జెడ్పీటీసీ సభ్యులకు మరో రకంగా.. తన అనుచరులకు ఇంకో రకంగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జిల్లాలో 53 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. వీరిలో 30 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచినవారే ఉన్నారు. అయితే టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి బలవంతంగా చైర్మన్ పీఠం లాక్కున్న విషయం తెలిసిందే. అనుచరులపై అంతులేని అభిమానం.. పల్లెల్లో పలు అభివృద్ధి పనుల కోసం అంచనాలతో నివేదికలు తయారుచేసుకొని తీసుకురావాలని జెడ్పీ చైర్మన్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులను రూ.20 లక్షలు విలువచేసే పనులకు మాత్రమే అంచనాలు తీసుకురావాలని తెలిపారు. టీడీపీ సభ్యులకు మాత్రం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల విలువైన పనులకు నివేదికలు సిద్ధం చేసుకురమ్మని చెప్పినట్లు సమాచారం. తన అనుచరులు, టీడీపీ ముఖ్య నాయకులు చెప్పిన వారికి మాత్రం రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు పనులకు అంచనాలు తీసుకురమ్మని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇవన్నీ గుట్టుగా జరిగిపోవాలని ఆయా జెడ్పీటీసీ సభ్యులకు సమాచారం అందించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులను వైఎస్సార్సీపీ సభ్యులకు, జనరల్ ఫండ్స్తో పాటు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రెండింటినీ టీడీపీ సభ్యులకు పంచిపెడుతున్నట్లు తెలిసింది. ఇందులో ఎన్నికల తరువాత టీడీపీలో చేరిన ఓ నాయకుడు చెప్పిన జెడ్పీటీసీ సభ్యుల పట్ల చైర్మన్ గురుభక్తి ప్రదర్శించినట్లు విశ్వసనీయ సమాచారం. వారికి నిధుల కేటాయింపు విషయాన్ని ఉపముఖ్యమంత్రికి గానీ, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్కు తెలియకుండా ఉంచాలని సంబంధిత జెడ్పీటీసీ సభ్యులను కోరినట్లు తెలిసిం ది. నిబంధలనకు విరుద్ధంగా నిధుల కేటాయింపులపై పలువురు సభ్యులు గురువారం జరగబోయే సర్వసభ్య సమావేశంలో నిలదీయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. -
'హైదరాబాద్ ఉండగా.. విజయవాడ ఎందుకు?'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ తాత్కాలిక రాజధాని ఉండగా, విజయవాడను ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటని రాయలసీమ రాజధానిసాధనకమిటీ కన్వీనర్ జస్టిస్ లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. తాత్కాలిక రాజధాని మార్చాలనుకుంటే అన్ని వసతులున్న కర్నూలులో ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్లో ఉండటానికి పదేళ్ల గడువు ఉన్నా, తాత్కాలిక రాజధానిని మారిస్తే హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రుల్లో అభద్రతాభావం పెరుగుతుందని జస్టిస్ లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా తాత్కాలిక రాజధాని ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపారు. టీడీపీలోని కొందరు వ్యక్తులకు ఆర్ధిక లాభం చేకూర్చడానికే తాత్కాలిక రాజధానిని మారుస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తాత్కాలిక రాజధానిగా ఉండగా, మరో తాత్కాలిక రాజధాని ఎందుకంటూ బొత్స ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా, ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని, తాత్కాలిక రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తూ లేఖ రాస్తామని బొత్స అన్నారు. -
మురళీమోహన్ను వివరణ కోరిన రిటర్నింగ్ అధికారి
రాజమండ్రి: రాజమండ్రి లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్పై వైఎస్ఆర్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన భార్య ఆస్తుల వివరాలు మురళీమోహన్ తప్పుగా చూపించారని ఆ పార్టీ ఆరోపించింది. వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన ఫిర్యాదుపై అఫిడవిట్ను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి మురళీమోహన్ను వివరణ కోరుతున్నారు. -
పలువురి నామినేషన్లపై అభ్యంతరాలు!
హైదరాబాద్: సీమాంధ్రలో లోక్సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు ఈరోజు పరిశీలించారు. అయితే వివిధ రాజీకీయ పార్టీలకు చెందిన పలువురినామినేషన్లకు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది అభ్యర్థుల నామినేషన్లపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, మరికొంతమంది నామినేషన్లపై ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా భీమిలి టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై రిటర్నింగ్ అధికారికి సీపీఎం ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ కాంట్రాక్ట్లున్న గంటా శ్రీనివాసరావు పోటీకి అనర్హుడంటూ ఆర్వో సుబ్బరాజుకు సీపీఎం నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే నియోజకవర్గంలో జైసమైక్యాంధ్ర అభ్యర్థి వినోద్కుమార్ నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. అతని వయసు కనీసం ఉండవలసిన దానికంటే రెండు రోజులు తక్కువగా ఉండడంతో ఆర్వో సుబ్బరాజు అతనిని పోటీకి అనర్హుడుగా ప్రకటించారు. ఇదే జిల్లా పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిత కుల ద్రువీకరణ పత్రంపై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్వో చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్పై వైఎస్ఆర్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన భార్య ఆస్తుల వివరాలు మురళీమోహన్ తప్పుగా చూపించారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ విషయమై రిటర్నింగ్ అధికారి మురళీమోహన్ను వివరణ కోరుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి నామినేషన్పై టీడీపీ నేత రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ ఆధారంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని నిలదీయడంతో రాంబాబు పలాయనం చిత్తగించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి నామినేషన్పై మాజీ కౌన్సిలర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్వోకు ఫిర్యాదు చేశారు. జయనాగేశ్వర్ రెడ్డి అఫిడవిట్లో అవకతవకలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ అభ్యర్థి యామిని బాల నామినేషన్పై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేశారని ఆరోపించారు. అయినప్పటికీ ఆమె నామినేషన్ను ఆర్వో రామ్మోహన్ ఆమోదించారు. దాంతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లా గుంతకల్లు టీడీపీ అభ్యర్థి జితేందర్గౌడ్ నామినేషన్పై వైఎస్ఆర్ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐటీ రిటర్న్ వివరాలు పొందుపరచలేదని ఫిర్యాదు చేశారు. దాంతో జితేందర్గౌడ్ నామినేషన్ నామినేషన్ను ఆర్వో పెండింగ్లో పెట్టారు. అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ అభ్యర్థి ఈరన్న నామినేషన్పై వైఎస్ఆర్ సిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈరన్నపై కర్ణాటకలో పలు కేసులు ఉన్నాయని తెలిపింది. నామినేషన్ పత్రంలో ఆ విషయాలు ప్రస్తావించలేదని పేర్కొంది. ఎన్నికల అధికారులు ఈ ఫిర్యాదునుఎ పరిశీలిస్తున్నారు. -
‘బిల్లు’లో అభ్యంతరకర అంశాలు
జోగిపేట, న్యూస్లైన్: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన విభజన బిల్లులో తెలంగాణకు అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన జోగిపేటలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షను, జలాలు, ఆస్తులు, అప్పులు, ఉన్నత విద్యకు సంబంధించిన అం శాల్లో తెలంగాణకు నష్టం జరిగే విధంగా ముసాయిదాలో పొందుపరచారన్నారు. ఆరు సూత్రాల పథకానికి విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 83వేల మంది తెలంగాణ వారికి చెందిన ఉద్యోగాల్లో అక్రమంగా చేరారన్నారు. 1969లో జీఓ 36 ప్రకారం 24వేల మంది అక్రమంగా నియమితులయ్యారని, 1985లో జీఓ 610 ప్రకారం 59 వేల మంది అక్రమంగా నియమితులయ్యారని, వీరిని వెంటనే వారి వారి స్వస్థలాలలకు పంపించాలని జీఓ జారీ చేసినా నేటి వరకు అమలుకాలేదన్నారు. ఆరు సూత్రాల పథకానికి విరుద్ధంగా ఆంధ్ర ఉద్యోగులు 1.62 లక్షల మంది తెలంగాణలో పనిచేస్తున్నారన్నారు. వీరందరిని ఆంధ్ర ప్రాంతానికి పంపిస్తే తెలంగాణకు సంవత్సరానికి రూ.5 వేల కోట్లు మిగులుతాయన్నారు. కృష్ణా, గోదావరి జలాలను ప్రాం తాల వారీగా పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో రూ.1.70 వేల కోట్ల అప్పులున్నాయని, వీటిని ఏ ప్రాంతానికి ఎక్కువ ఖర్చుపెట్టారో ఆ విధంగానే పంపకాలుండాల న్నారు. సింగరేణి, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల నుంచి ఎలాంటి సూచనలు ముసాయిదాలో చేయలేదన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ శాంతి భద్రతలను రాష్ట్ర గవర్నర్కు అప్పగించారని విమర్శించారు. సమావేశంలో అందోల్ నియోజకవర్గ ఇన్చార్జి పి.కిష్టయ్య, జిల్లా నాయకులు డీబీ నాగభూషణం, ఏ.శంకరయ్య, మండల నాయకులు సిహెచ్.వెంకటేశం, జి.ఎల్లయ్య, ఎండి.ఖాజా పాల్గొన్నారు.