-
ఆత్రం సుగుణ ఆస్తులు రూ.54.60 లక్షలు
కై లాస్నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్షాధికారే. శుక్రవారం ఆమె తరఫున దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్లో తనకున్న ఆస్తులతో పాటు అప్పుల వివరాలు పేర్కొన్నారు. చరాస్తులు రూ.12లక్షల 10వేలు ఉండగా, తన భర్త భుజంగ్రావు పేరిట రూ.42వేలు ఉన్నట్లుగా తెలిపారు. స్థిరాస్తులు తన పేరిట రూ.42లక్షల 50వేలు ఉన్నాయి. అలాగే తన పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.23లక్షల 49వేల 224 అప్పులు ఉండగా, తన భర్త పేరిట రూ.29లక్షల 76వేల 946 అప్పు ఉన్నట్లుగా వెల్లడించిన ఆమె తనకు సొంత వాహనం లేనట్టుగా పేర్కొన్నారు. కాగా తనపై ఉద్యమ కాలం నాటికి సంబంధించి 50 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. -
‘కేంద్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే’
నిర్మల్చైన్గేట్: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ దిలావర్పూర్ మండల అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, ఎంపీపీ అక్షర అనిల్కుమార్, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ కె.రాజేశ్వర్, వైస్ ఎంపీపీ బాపురావు, కదిలి దేవస్థానం చైర్మన్ వెంకట్రావుతోపాటు పలువురు శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. వారికి డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్గాంధీని ప్రధానిని చేయడానికి ప్రతీ కార్యకర్త కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ దిలావర్పూర్ మండల అధ్యక్షుడు తక్కల సాగర్రెడ్డి, అరుగుల రమణ, నర్సాపూర్ మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్రెడ్డి, మహేందర్, శ్రీహరి, రాంపూర్ తాజా మాజీ సర్పంచ్ గోవింద్రెడ్డి పాల్గొన్నారు. సీఎం పర్యటన విజయవంతం చేయాలి ఈనెల 22న ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్రెడ్డి వస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తెలిపారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ దాఖలు, ర్యాలీ, బహిరంగ సభ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
తొలి ఎంపీ.. సి.మాధవరెడ్డి
● హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ఎన్నికలు ● సోషలిస్టు పార్టీ తరఫున ఆదిలాబాద్ నుంచి పోటీ ● 25 వేల పైచిలుకు అధిక్యంతో విజయం కై లాస్నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. మహారాష్ట్ర, కర్నాటకలోని పలు ప్రాంతాలను కలుపుకుని హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న సమయంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉండేది. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో 21ఎంపీ స్థానాలు ఉండగా అందులో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గానికి 1952 మార్చి 27న తొలిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇందులో సోషలిస్టు పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ తరఫున సి.మాధవరెడ్డి పోటీ చేయగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా జేవీ నర్సింగ్రావు బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 3,51,017 మంది ఓటర్లున్నారు. కాగా తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో సగానికిపైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉన్నారు. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో 1,56,907 (44.7శాతం)ఓట్లు పోలయ్యాయి. 1,94,110 మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాగా ఆ రోజుల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతీ ఓటు చెల్లుబాటు కావడం గమనార్హం. ఆదిలాబాద్ ఎంపీగా.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల్లో చెరుకు మాధవరెడ్డి ఎంపీగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసిన ఆయనకు 90,995 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి నర్సింగ్రావుకు 65,912 ఓట్లు పోలయ్యాయి. దీంతో మాధవరెడ్డి 25,083 ఓట్ల అధిక్యంతో విజయం సాధించి ఆదిలాబాద్ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. కమ్యూనిస్టుగా రాజకీయ జీవి తాన్ని ప్రారంభించిన మాధవరెడ్డి కాంగ్రెస్, టీడీపీల నుంచి కూడా పదవులు దక్కించుకున్నారు. ఆయన రాజకీయ జీవితం మూడు పార్టీల్లో సాగింది. అనంతరం కాంగ్రెస్లో చేరి 1962లో బోథ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ ఆవిర్బావంతో ఆ పార్టీలో చేరిన ఆయన రెండోసారి 1984లో మరోసారి ఎంపీగా విజయంసాధించారు. చెరుకు మాధవరెడ్డి -
అమరం.. స్మరణం
బాధను పంచుకోవాలి విద్యార్థులు అన్ని విషయాలను అధ్యాపకులతో పంచుకోవాలని కార్పొరేట్ ట్రైనర్ తిరుమల్రెడ్డి సూచించారు. వాతావరణం ఆకాశం కొంతమేకు మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది. 8లోu ఇంద్రవెల్లి: 1981 ఏప్రిల్ 20 జల్..జంగల్...జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన పచ్చని వనం ఎరుపెక్కింది. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 43 ఏళ్లు. అయితే ఇప్పటికీ ఆ స్తూపం వద్ద ఏటా ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులు అర్పించలేని పరిస్థితి. నాడు పూర్తిగా పోలీసు నిఘాలోనే స్తూపం ఉండేది. 2015లో తొలిసారిగా ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఆదివాసీలు వచ్చి అమరులకు నివాళులర్పిస్తున్నారు. ఈసారి ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. స్తూపం వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 33 ఏళ్లుగా నివాళులకు దూరం నాటి కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో స్తూపం నిర్మించారు. ఆ రోజు నుంచి ఉమ్మడి రాష్ట్రం పాలన ముగిసే వరకు 33 ఏళ్లుగా అమరులకు నివాళులర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. ఏటా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసే వారు. ఈ క్రమంలో 2004 అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపూరావ్ గిరిజన నాయకులతోపాటు అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డితో కలిసి ఏప్రిల్ 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీ గిరిజనులు అదేరోజున నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ సంఘాల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించి స్తూపం వద్ద ఏప్రిల్ 20న నివాళులు అర్పించేందుకు రెండు గంటల సమయం ఇచ్చింది. దీంతో ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేసి నివాళులర్పిస్తున్నారు. ఎట్టకేలకు స్మృతి వనం, ఇళ్ల స్థలాలు నాడు హక్కుల కోసం పోరాడిన ఆదివాసీలపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు గాయాలపాలయ్యారు. అయితే బాధిత కుటుంబాలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మూడేళ్ల క్రితం అమరుల కుటుంబాలను గుర్తించిన ఎంపీ సోయం బాపూరావు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క స్పందించారు. పోలీస్ శాఖలో ఉన్న రికార్డుల ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబాలకు ఇటీవల మండలంలోని ముత్నూర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. హక్కు పత్రాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. అమరవీరుల స్తూపాన్ని స్మృతి వనంగా తీర్చదిద్దేందుకు రూ.97 లక్షలు కేటాయించారు. రెండోసారి స్మారక స్తూపం నిర్మాణం. ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. ఆ స్తూపాన్ని 1986 మార్చిలో గుర్తుతెలియని వ్యక్తులు డైనమేట్లతో పేల్చారు. గిరిజనుల ఆందోళనలతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో రెండోసారి స్తూపం నిర్మించింది. పోలీసు బందోబస్తు.. సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలతోపాటు 100మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అసలేం జరిగింది. స్వాతంత్య్రం వచ్చి అప్పటికీ మూడున్నర దశాబ్దాలవుతున్నా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 1981లో చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం పిపుల్స్వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడంతో ఉదయం నుంచే ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకే సభప్రాంగణం గిరి పుత్రులతో కిక్కిరిసిపోయింది. సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా మరికొందరు గిరిజనులు ర్యాలీగా అక్కడికి బయలుదేరారు. వారిని అడ్డుకునే క్రమంలో ముందున్న గిరిజన యువతితో ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే పోలీసుపై దాడి చేయగా ఆయన నెలకొరిగాడు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు తూటాల వర్షం కుర్పించారు. రక్తం ఏరులై పారింది. ఈ ఘటనలో 15మంది ఆదివాసీలు మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ రికా ర్డుల్లో ఉంది. కానీ అప్పుడు తూటాల గాయాలతో తమ ఇళ్లకు వెళ్లి పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక 60 మంది వరకు చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. గాయంతో ఏ పని చేయలేను.. నాడు ఇంద్రవెల్లిలో వారసంత ఉండడంతో నా భర్త శంభుతో కలిసి వెళ్లిన. సంత నుంచి మిటింగ్కు వెళ్లినం. అక్కడ పోలీసుల కాల్పుల్లో నా కుడి చేయికి గాయమైంది. నా భర్త శంభు కూడా బుల్లెట్ల గాయంతో ఇంటికొచ్చి కొద్ది రోజుల తరువాత చనిపోయాడు. చేతి గాయం కారణంగా ఇప్పటికీ నేను ఎలాంటి పని చేయలేకపోతున్నా. ఉన్న ఒక్క కొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయిండు. కోడలు వద్ద ఉంటున్న. ఆసరా పింఛన్ కూడా రావట్లేదు. కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – మడావి జంగుబాయి, కన్నాపూర్ నా భర్తను కోల్పోయిన.. నాటి ఘటనలో నా భర్త కొద్దు మరణించాడు. ఆ తరువాత కూలి పనులు చేసుకుంటూ నా కొడుకును పెంచి పెద్ద చేసిన. ఇప్పటి వరకు ఉండేందుకు ఇల్లు కూడా లేదు. ఇటీవల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. అయితే ఇందిరమ్మ నిధులతో ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఐటీడీఏ ద్వారా రుణం అందించి నా కొడుకుకు ఉపాధి చూపాలి. – సేడ్మకి లచ్చుబాయి, తాటిగూడ ఇంద్రవెల్లి ఘటనకు 43 ఏళ్లు ఎట్టకేలకు అమరులను గుర్తించినరాష్ట్ర ప్రభుత్వం నేడు అమరవీరుల సంస్మరణ దినం ఉమ్మడి జిల్లా నుంచి తరలిరానున్న ఆదివాసీలు -
‘మోదీ సారథ్యంలోనే దేశ అభివృద్ధి’
నిర్మల్చైన్గేట్: ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోనే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధి స్తోందని, ప్రగతిపథంలో దైసుకెళ్తోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు అన్నారు. పట్టణంలో శుక్రవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో నిర్వహించారు. 24వ వార్డులో ప్రచారం నిర్వహించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మోదీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. పదేళ్లు దేశానికి అవి నీతి రహిత పాలన అందించారని తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, సీనియర్ నాయకులు ఒడిశెల శ్రీనివాస్, ద్యేవరశెట్టి గణేశ్, అనంతుల అభిలాష్, కిశోర్, శరత్, వంశీ, అన్వేష్, శివకుమార్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంలో బీజేపీ నాయకులు -
నిర్మల్
విద్యార్థులు ఆదర్శంగా నిలవాలి అల్లంపల్లి జీయర్ గురుకులం విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని శ్రీత్రిదండి చినజీయర్స్వామి సూచించారు. శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 20248లోu 22న ఆదిలాబాద్కు సీఎం రేవంత్రెడ్డి ● కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు హాజరు కైలాస్నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ నెల 22న జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. భైంసాటౌన్: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి ఆదరణ విపరీతంగా పెరిగింది. జీరో టికెట్తో మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. దాదాపు అన్ని డిపోల్లోనూ ఓఆర్ (ఆక్యుపెన్సీ రేషియో)శాతం 87–88 వరకు నమోదవుతోంది. దీంతో సంస్థకు గతంతో పోలిస్తే భారీగా ఆదాయం సమకూరుతోంది. ఈ ఆదాయాన్ని మరింత పెంచుకోవడంపై సంస్థ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ప్రతీ డిపో రోజుకు రూ.లక్ష అదనపు ఆదాయం సాధించేలా ‘లక్షే లక్ష్యం’ అనే చాలెంజ్కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భైంసా, నిర్మల్ డిపోల్లో డిప్యూటీ ఆర్ఎం ప్రణీత్ లక్షే లక్ష్యం కార్యక్రమం ఉద్దేశంపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించాలని, ప్రతీ స్టేజీలో ప్రయాణికులను పిలిచి ఎక్కించుకోవాలని సూచించారు. రీజియన్కు రూ.ఆరు లక్షలు టార్గెట్.. ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఆసిఫాబాద్, ఉట్నూర్, మంచిర్యాల డిపోలు ఉన్నాయి. రీజియన్ పరిధిలో ప్రస్తుతం సరాసరి 88 శాతం ఓఆర్(ఆక్యుపెన్సీ రేషియో) నమోదవుతోంది. దీనిని 92 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం అన్ని డిపోలకు కలిపి రోజుకు రూ.135.78 లక్షలు ఆదాయం వస్తుండగా, దీనిని రూ.141.80 లక్షలకు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ లెక్కన ప్రతీ డిపోకు రోజుకు రూ.లక్ష చొప్పున అదనపు ఆదాయం సాధించాలని టార్గెట్ విధించారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఓఆర్, రెవెన్యూపరంగా నిర్మల్ డిపో ముందు నిలుస్తోంది. ప్రస్తుతం 92 శాతం ఓఆర్ వస్తుండగా, రోజుకు రూ.34.92 లక్షల ఆదాయం చేకూరుతోంది. అత్యల్పంగా ఉట్నూర్ డిపో 86 శాతం ఓఆర్ వస్తుండగా, రోజుకు రూ.6.42 లక్షల ఆదాయం వస్తోంది. దీంతో డిపో సామర్థ్యాన్ని బట్టి టార్గెట్ విధించారు. ఆదాయం సరే.. సర్వీసులేవి.. ఇదిలా ఉండగా, మహాలక్ష్మి పథకంతో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారి సంఖ్య దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. దీంతో బస్సులు లేని రూట్లలో మినహా, చాలా రూట్లలో ప్రైవేట్ వాహనాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఈ లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. అయితే, ఆదాయంపై దృష్టి పెట్టిన సంస్థ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సుఖవంతమైన ప్రయాణం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల కోరుతున్నారు. ప్రస్తుతం రీజియన్ పరిధిలో రద్దీ వేళల్లో కొన్ని ట్రిప్పులకు ఓఆర్ శాతం 107 వరకు ఉంటోంది. కొన్ని ట్రిప్పుల్లో 60–80 శాతం ఉంటోంది. దీంతో సరాసరి 88 శాతం ఉంటోంది. గతంతో పోలిస్తే ఓఆర్ శాతం మెరుగుపడింది. రద్దీ సమయాల్లో అదనపు సర్వీసులు నడపడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. న్యూస్రీల్అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలోని 534 సర్వే నంబర్లో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆ ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించేందుకు యత్నించారని దానిని కాపాడామని తెలిపారు. అందరికీ ఉపయోగపడేలా అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంతం గణేశ్, కత్తి నవీన్, దామ భూమేశ్, దేవి రవి, అరుణ్, సప్పల రవి, సేపూరి సిద్ధార్థ, మణికంఠ, నిమ్మ గణేశ్, బి.రాజు ఉన్నారు. అదనపు ఆదాయానికి ప్రణాళిక ఓఆర్ పెంపునకు కసరత్తు ఆర్టీసీలో కొత్త చాలెంజ్కు శ్రీకారంఆదిలాబాద్ రీజియన్లో డిపోలవారీగా లక్ష్యం ఇలా... డిపో ప్రస్తుతం లక్ష్యం ఓఆర్ రోజువారీ ఆదాయం ఓఆర్ రోజువారీ ఆదాయం ఆదిలాబాద్ 87 రూ.28.46 91 రూ.29.76 భైంసా 87 రూ.13.79 89 రూ.14.12 నిర్మల్ 92 రూ.34.92 97 రూ.36.62 ఉట్నూర్ 86 రూ.06.42 90 రూ.06.71 ఆసిఫాబాద్ 88 రూ.18.67 92 రూ.19.50 మంచిర్యాల 88 రూ.33.50 92 రూ.35.07 రీజియన్ 88 రూ.135.78 92 రూ.141.80 ప్రయాణికులకు చేరువయ్యేందుకు... ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు సంస్థ ఆదాయం పెంచుకునే కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రతీ డిపోకు రోజుకు రూ.లక్ష అదనంగా ఆదాయం చేకూరాలనే ఉద్దేశంతో లక్షే లక్ష్యం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంపై డిపోల వారీగా ఉద్యోగులకు అవగాహన కల్పించాం. – ప్రణీత్, డిప్యూటీ ఆర్ఎం, ఆదిలాబాద్ -
ఎన్నికల వ్యయం పకడ్బందీగా నమోదు చేయాలి
● ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద నిర్మల్చైన్గేట్: ఎన్నికల ప్రచారానికి పార్టీ ద్వారా, అభ్యర్థి తరఫున ఖర్చుచేసే ప్రతీ పైసా ఎన్నికల వ్యయం కింద నమోదు చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్గంగ గెస్ట్హౌస్ నుంచి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో చేసే ఖర్చుల వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎస్ఎస్టీ, వీఎస్టీ, ఎస్ఎస్టీ అకౌంటింగ్ టీం సభ్యులు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలన్నారు. ఎంసీఎంసీ ద్వారా ఎన్నికల్లో చేసిన ప్రకటనలకు ఈసీ విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయంగా నమోదు చేయాలన్నారు. అలాగే రోజువారిగా దినపత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్పై దృష్టి సారించాలని, సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు అశిష్ సంగ్వాన్, వెంకటేష్ దోట్రే, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని టీంలు సిద్ధం.. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అన్నిరకాల టీమ్లను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు సీవిజిల్ యాప్లో 5 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిష్కరించామని తెలిపారు. రూ.1.19 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని, 16,089 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, ఈడీఎం నదీం, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
● విద్యుత్శాఖ ఎస్ఈ జేఆర్.చౌహన్ ● అధికారులు, సిబ్బందికి ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్పై శిక్షణ ఖానాపూర్: విద్యుత్ శాఖలో పనిచేసే ప్రతీ ఉద్యోగి, సిబ్బంది నిరంతరం భద్రత గురించి ఆలోచించడంతోపాటు సురక్షితంగా పనిచేయాలని విద్యుత్శాఖ ఎస్ఈ జేఆర్.చౌహన్ సూచించారు. ఉత్తర విద్యుత్ సంస్థ సీఎండీ కె.వరుణ్రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని సత్తనపల్లి రైతువేదికలో ఖానాపూర్ సబ్డివిజన్ పరిధిలోని మండలాలకు చెందిన విద్యుత్ శా ఖ అధికారులు, సిబ్బందికి ఆపరేషన్స్ అండ్ మె యింటనెన్స్పై గురువారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ సబ్స్టేషన్ డ్యూటీలో ఉన్నప్పుడు సేఫ్టీ షూస్తోపాటు సేఫ్టీ హెల్మెట్, సేఫ్టీ గ్లౌజ్ ధరించాలని తెలిపారు. ఫీడర్కు ఎల్సీ ఇచ్చేటప్పుడు ఎర్త్ డిస్టార్ట్ రాడ్ను వాడాలన్నారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలని తెలిపారు. అంతకుముందు పలు విషయాలను ప్రొజెక్టర్ సాయంతో వీడియో ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కన్స్ట్రక్షన్ సీజీఎం కేఎన్.గుట్ట, నిర్మల్ డీఈ నాగరా జు, టెక్నికల్ డీఈ బి.శ్రీనివాస్రావు, జిల్లా గణాంక అధికారి సుదర్శన్, ఏడీఈ కేశెట్టి శ్రీనివాస్, ఏఈలు తిరుపతి, సుమన్, బాలయ్య, శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్, రాజు, తిరుపతి, సబ్ ఇంజనీర్లు వెంకటేశ్, స్వాతి, శ్యాంసుందర్, నాగరాజు, లైన్మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
25 వరకు నామినేషన్ల స్వీకరణ
నిర్మల్చైన్గేట్: ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనందున గురువారం నుంచి నామినేషన్లు వేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వా న్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భైంసా ఏఎస్పీ కాంతిలాల్పాటిల్, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్తో కలిసి గురువారం మాట్లాడారు. ఆది లాబాద్ పార్లమెంట్ ఎన్నికకు నేటి నుంచి ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపా రు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. మే 13 న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటాయని చెప్పా రు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని (కలెక్టర్ ) ఛాంబర్లో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. సెలవు దినాలు మినహాయించి, మిగతా పనిదినాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలు, అవలంబించాల్సిన విధానాల గురించి కలెక్టర్ వివరించారు. జిల్లాలో 7.36 లక్షల ఓటర్లు.. నిర్మల్ జిల్లాలో 7,36,642 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో పురుషులు 3,54,925 మంది, మహిళలు 3,81,667 మంది, ఇతరులు 50 ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను ఈనెల 25 వరకు పరిశీలించి అర్హుల పేర్లు జాబితాలో చేరుస్తామని వివరించారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 667 ప్రాంతాల్లో మొత్తం 925 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 85 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటువేసే అవకాశం ఉందని తెలిపారు. మే 8వ తేదీలోపు ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తామన్నారు. స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్లకు ఓటింగ్పై అవగాహన కల్పించడానికి ఓటింగ్ శాతం పెంచడానికి మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారానికి, ప్రకటనలకు అనుమతులు పొందాలన్నారు. సువిధ పోర్టల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సభలు సమావేశాలకు, ఇతరత్రా అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు.. భైంసా ఏఎస్పీ కాంతిలాల్పాటిల్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీసుశాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్ బలగాలు రూట్ మార్చ్లు ఫ్లాగ్ మార్చ్లు నిర్వహిస్తున్నాయన్నారు. మరో రెండు కంపెనీల కేంద్ర బలగాలు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.1,90,09,610 నగదు సీజ్ చేశామన్నారు. దీనికి సంబంధించి 72 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే 298 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని 127 కేసులు నమోదు చేశామన్నారు. 289 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. సమావేశంలో డీపీఆర్వో విష్ణువర్ధన్, డీఈవో రవీందర్రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, ఈడీఎం నదీమ్, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్చైన్గేట్: పార్లమెంట్ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో ఎన్నికల ని ర్వహణపై గురువారం సమావేశం నిర్వహించా రు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో ర్యాంపులు, వీల్చైర్ ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సి బ్బంది రవాణాకు రూట్ల వారీగా బస్సులను ఏర్పాటు చేయాలని ట్రాన్స్ పోర్ట్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చే యాలని, శిక్షణకు హాజరుకాని సిబ్బందికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఎన్నికల వ్యయాలను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. వంద శాతం ఓటింగ్ నమోదు దిశగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత స్వీప్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఫ్లెక్సీలు, సెల్ఫీపాయింట్, కళాజాత, 2కే రన్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 1950 కాల్ సెంటర్, సి విజిల్ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో నోడల్ అధికారులు భుజంగరావు, గోవింద్, శ్రీనివాస్, రవీందర్రెడ్డి, విజయలక్ష్మి, సందీప్, విష్ణువర్ధన్, ఈడీఎం నదీమ్, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
నిర్మల్
శుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024ఆరోగ్య లక్ష్యాలను సాధించాలి● డీఎంహెచ్వో డాక్టర్ ధనరాజ్ నిర్మల్చైన్గేట్: వైద్యారోగ్య శాఖ పరిధిలో నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలని డీఎంహెచ్వో డాక్టర్ ధనరాజ్ అన్నారు. సమీకృత జిల్లా అధికారుల సముదాయంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. గర్భి ణుల వివరాలు 12 వారాల్లో నమోదు చేయాలని సూచించారు. సమయానుసారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో క్షయ పరీక్షలు పెంచి వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి చికిత్స అందించాలని వివరించారు. కుష్ఠు వ్యాధి బాధితులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నయం చేయవచ్చని తెలిపారు. ఎండల తీవ్రత దష్ట్యా వడదెబ్బ తగలకుండా అవగా హన కల్పించాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు గ్రామపంచాయతీల్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ రాజేందర్, డాక్టర్ ఇధ్రిస్గౌరి, కార్యక్రమా నిర్వాణ అధికారులు డాక్టర్ రవీందర్రెడ్డి, డాక్టర్ రాజారమేశ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ● తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలు కై లాస్నగర్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఉదయం 11గంటలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన రాథోడ్ సుభాష్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆధార్) పార్టీ తరఫున ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామానికి చెందిన మాలోత్ శ్యామ్లాల్నాయక్ నామినేషన్ వేశారు. వీరు సాదాసీదాగా అనుచరులతో వచ్చి కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షిషా కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ● నామినేషన్కు అభ్యర్థులు సిద్ధం ● 22న కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ.. ● 24న బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్.. ● ఇదేరోజూ బీజేపీ రెబెల్గా సోయం? ● ప్రధాన పార్టీల్లో ఆగని అలకలు ● ముఖ్యనేతల రాకతోనైనా వీడేనా?న్యూస్రీల్ -
No Headline
సాక్షి, ఆదిలాబాద్: ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఖరారై రోజులు గడిచాయి. కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశించి దక్కని నేతలు అలక బూనారు. కొందరు పార్టీ కూడా మారారు. నామినేషన్ ప్రక్రియ మొదలైంది. భంగపడ్డ నేతలు పార్టీకి వ్యతిరేకంగా అడుగు వేస్తారా? కలిసి నడుస్తారా? అనేది కొద్దిరో జుల్లోనే తేలనుంది. ఇక టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ‘హస్తం’ నేతలు అలక వీడేదెప్పుడో! ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ము ఖ్యనేతలు కాంగ్రెస్లో చేరారు. దీంతో దాదాపు అ న్ని నియోజకవర్గాల్లో హస్తం నాయకత్వం కనిపిస్తోంది. తాజాగా మాజీ ఎంపీ సముద్రాల వేణుగో పాలాచారి, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురా వు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కాగా, టిక్కెట్ ఆశించిన భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్జాదవ్ ఇంకా ఎక్కడా ప్ర చారంలో పాల్గొనడంలేదు. ఈనెల 22న కాంగ్రెస్ అ భ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేయనున్నారు. ఇదేరోజు సీఎం రేవంత్రెడ్డి కూడా ఆదిలాబాద్ పర్యటనకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ మై దానంలో బహిరంగసభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలతో సీఎం సమావేశం కానుండగా, అప్పటికై నా నేతలు అలక వీడుతారో.. లేదో వేచి చూడాలి. కమలంలో ‘తిరుగుబాటు’ తప్పదా? బీజేపీ గోడం నగేశ్కు టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ లో అసమ్మతి చోటుచేసుకుంది. ఆశావహుల్లో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్లో, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తిరిగి బీఆర్ఎస్లో చే రారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ సైలెంట్గా ఉన్నా రు. కాగా, ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ఈనెల 24న నామినేషన్ వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయి ఆరోజు ఆదిలాబాద్కు రానున్నారు. పార్టీ టి కెట్ ఆశించిన సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు పార్టీలో నిరాశ ఎదురు కాగా బీజేపీ రెబెల్గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 24న ఆయన కూడా నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీ–ఫాం అందుకున్న సక్కు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేరు ఖరారై చాలా రోజులైంది. ఓ దశలో అభ్యర్థిని మార్చుతా రనే ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో కొంత గందరగోళం కనిపించింది. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనగా అభ్యర్థి మార్పు లేదని స్పష్టమైంది. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆత్రం సక్కు బీ–ఫాం అందుకున్నారు. ఈ నెల 23న లేదా 24న ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. పకడ్బందీ బందోబస్తు నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వంద మీటర్ల పరిధి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉండగా కలెక్టరేట్కు వెళ్లే రోడ్డుమార్గాన్ని మూసివేసి ట్రాఫిక్ను మళ్లించారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థుల వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఐదుగురినే లోనికి అనుమతించారు. గడవు ముగిసేవరకూ ముగ్గురు సీఐలు అక్కడే విధులు నిర్వహించారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. మీడియా సెంటర్ను వద్ద వంద మీటర్ల పరిధిలో ఏర్పాటు చేశారు. -
మళ్లీ వయోజన విద్య
● సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం ● ఎన్ఐఎల్పీ పేరుతో నూతన కార్యక్రమం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహణ ● పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి అమలు?వలంటీర్లతో బోధన...న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం ద్వారా 15 నుంచి 50 ఏళ్లలోపు నిరక్షరాస్యులను అక్షరాస్యులు చేయనున్నారు. స్వయంసహాయ సంఘాల సభ్యులకు చదువు నేర్పనున్నారు. గతంలో సాక్షర భారత్ పథకం కింద సమన్వయకర్తలు చదువు చెప్పేవారు. కొత్తగా చేపట్టే ఈ కార్యక్రమంలో వలంటీర్లను నియమిస్తారు. వీరికి శిక్షణ, సామగ్రిని అందించనున్నారు. 2027 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నిర్మల్చైన్గేట్: అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్ల ప్రణాళికతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. జిల్లా పరిషత్, పంచాయతీ, స్వయం సహాయక, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ సమన్వయంతో నిరక్షరాస్యుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ (ఎన్ఐఎల్పీ)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది నుంచే ఈ కార్యక్రమం అమలు కావాల్సి ఉండగా.. ప్ర భుత్వం దృష్టి సారించలేదు. దీంతో ప్రస్తుతం ఈ ప్రోగ్రాం వందశాతం సక్సెస్ అయ్యేలా విద్యాశాఖ అధికారులు దృష్టిసారిస్తున్నారు. ఈకార్యక్రమం ద్వారా బడికి దూరంగా ఉంటున్న బాలబాలికలతో పాటు, పెద్దలు, మహిళల్లో సైతం అక్షర జ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభు త్వ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో 2022 నుంచి 2027 వరకు ఐదేళ్లలో ఏడాదికి కోటి మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా రూపకల్పన చేశారు. ఇందులో 2011 జనాభా లెక్కల ప్ర కారం 60 శాతం కంటే తక్కువ మహిళా అక్షరాస్యత ఉన్న జిల్లాలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడత 20,866 మంది వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. పర్యవేక్షణ.. నిర్వహణ ఎన్ఐఎల్పీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ చైర్మన్గా, డీఈవో కన్వీనర్గా, వయోజన విద్యా అధికారి(కో కన్వీనర్), సభ్యులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెల్ఫేర్ ఆఫీసర్లు, జెడ్పీసీఈవో, ఐసీడీఎస్, డీపీవో, డీఆర్డీవో, లీడ్ బ్యాంకు మేనేజర్, న్యాయ సేవా సమితి పర్యవేక్షణలో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తారు. అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంతోపాటు ఉన్నత చదువులకు సహకారం అందించనున్నారు. కల్చరల్, ఆర్టిస్టు, ఒకేషనల్ కోర్సు, వృత్తి విద్య, ఓపెన్లో పది, ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రతిభ చూపేలా ప్రోత్సహిస్తారు. కార్యక్రమం లక్ష్యం చేరుకునేలా సెల్ఫ్హెల్ప్ గ్రూపు, అంగన్వాడీ, యూత్, సీనియర్ సిటిజన్, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, సర్కారు ఉపాధ్యాయుల సహకారం తీసుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలో సమయానుకూలంగా ఉదయం లేదా సాయంత్రం డిజిటలైజేషన్ ద్వారా వయోజన విద్యాబోధన చేసేలా టైం టేబుల్ ప్రకటిస్తారు. వయోజనులకు నోట్ బుక్స్తోపాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. సమగ్ర అభ్యాస అనుభవాన్ని అందించడానికి అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, డిజిటల్ నైపుణ్యాలు వంటి విద్యలోని వివిధ అంశాలను ఏకీకృతం చేసేలా ప్లాన్ చేసుకుంటారు. డిజిటల్ ప్లాట్ ఫారం, వనరుల వినియోగంతోసహా అభ్యాసాన్ని సైతం ఉపయోగించుకుంటారు. ప్రాథమిక అక్షరాస్యతతోపాటు వారి జీవనోపాధి, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ఆచరణాత్మక నైపుణ్యాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. త్వరలో సర్వే.. జిల్లాలో 1,46,457మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అంచనా. ఎన్ఐఎల్పీ గైడ్లైన్స్ ప్రకారం ప్రత్యేక సర్వే ద్వారా వీరిని గుర్తించాల్సి ఉంటుంది. మొదటగా అత్యధిక నిరక్షరాస్యులు ఉన్న పది గ్రామాలను ఎంచుకుని వందశాతం టార్గెట్ చేరుకునేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. సర్వేలో నిరక్షరాస్యుల గుర్తింపుతోపాటు గైడ్లైన్స్ పాటించేలా పర్యవేక్షణ బృందానికి సలహాలు, సూచనలు ఇస్తారు. 2011 లెక్కల ప్రకారం...2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా అక్షరాస్యత 57.7 శాతం ఉండగా అందులో పురుషులు 69.03 శాతం, సీ్త్రలు 47.14 గా ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,46,457 మంది నిరక్షరాస్యులు ఉండగా, ఇందులో మహిళలు 99,637, పురుషులు 46,820 మంది ఉన్నట్టు అధికారుల అంచనా. మొద టి విడతలో 20,866 (పురుషులు 8,346, మహిళలు 12,520)మందిని అధికారులు సర్వేచేసి అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. -
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్సారంగపూర్: ప్రతీరోజు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రధాన కూడళ్లలో చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ ఆ దేశించారు. మండలంలోని చించోలి(బి), ఆలూరు, ధని గ్రామాల్లో గురువారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రధాన రహదారులు, సీసీరోడ్ల నిర్మాణాలు, మురికి కాలువలు, పల్లె ప్రకృతివనం, నర్సరీ, పాఠశాలలను పరిశీలించారు. గ్రామాల్లోని ప్రధాన రహదారుల వెంట, కూడళ్లలో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీవో తిరుపతిరెడ్డిని ఆదేశించారు. వ్యాపారులు, దుకాణా ల నిర్వాహకులు బయట చెత్త వేయకుండా చూడాలన్నారు. ఎవరైనా చెత్తను బయట వేస్తే చర్య తీసుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేయించి గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన.. అనంతరం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సి బ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 40 కేజీ ల బస్తాలో 40.580 గ్రాముల ధాన్యం మాత్రమే తూకం వేయాలని సూచించారు. ఎండల తీవ్రత అ ధికంగా ఉన్న నేపథ్యంలో కేంద్రాల ఆవరణలో టెంట్లు వేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆలూరు పీఏసీఎస్ సీఈవో మల్లేశ్కు సూచించారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, ఫోన్ నంబర్ తీసుకురావాలని తెలిపారు. నిబంధనల మేరకు ధాన్యం తేవాలని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో వేగం పెంచాలి.. ధని గ్రామంలోని పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కేటాయించిన నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతులు పూర్తి చేయించాలని హెచ్ఎంను ఆదేశించారు. విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించి పనుల్లో వేగం పెంచాలని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి గోవింద్, డీఈవో రవీందర్రెడ్డి, తహశీల్దార్ శ్రీదేవి, అధికారులు ఉన్నారు. -
నిలిచిన కుస్తీ పోటీలు
భైంసారూరల్: మండలంలోని కామోల్ గ్రామంలో గురువారం నిర్వహించిన కుస్తీ పోటీలు నిలిచిపోయాయి. ఏటా శ్రీరామ నవమి సందర్భంగా కుస్తీపోటీలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు మల్లయోధులను పిలిపించి శ్రీరామ నవమి మరుసటి రోజు పోటీలు నిర్వహిస్తారు. గురువారం కూడా పోటీలకు ఏర్పాట్లు చేశారు. పోటీలు జరుగుతున్న సమయంలో కొంత మంది అక్కడి వచ్చి పెద్దలకు దూషించారు. గొడవ జరిగే వాతావరణం కనిపించడంతో కుస్తీపోటీలను నిలిపివేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మల్లయోధులు వారిని చూసేందుకు వచ్చిన ఉత్సాహికులు నిరాశపడ్డారు. -
బీజేపీకే ఎమ్మార్పీఎస్ మధ్దతు
● జిల్లా కోఆర్డినేటర్ రవి సోన్: లోక్సభ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ బీజేపీకి మద్దతు ఇస్తుందని జిల్లా కోఆర్డినేటర్ శనిగారపు రవి తెలిపారు. మండలంలోని జా ఫ్రపూర్లో కాంగ్రెస్ గో బ్యాక్ నినాదంతో గు రువారం ప్రచారం నిర్వహించారు. ఆదిలా బాద్ బీజేపీ అభ్యర్థి గోడం నగేష్కు మాదిగలు ఓటు వేయాలని కోరారు. మాదిగలను చిన్నచూపు చూస్తున్న సీఎం రేంత్రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళ నాయకురాలు మరకుంట సునీత, భాగ్యలక్ష్మి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తొండకూరి సాయన్న, నా యకులు నాటకారి రాజ్యలక్ష్మి, సాయన్న, గంగన్న, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
జిన్నింగ్ మిల్లులో ఫైర్ విన్యాసాలు
నిర్మల్టౌన్: అగ్నిమాపక వారోత్సవాల్లో భా గంగా జిల్లా కేంద్రంలోని ఓ జిన్నింగ్ మిల్లులో ఫైర్ సిబ్బంది గురువారం విన్యాసాలు ప్రదర్శించారు. అంతకుముందు జిల్లా ఫైర్ కార్యాలయంలో ఫైర్సేఫ్టీపై అవగాహన కల్పించారు. ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్షంగా చూపించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి జయత్రామ్ మాట్లాడుతూ... ప్రజలు ప్రమాదాలబారిన పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈనెల 20వ తేదీ వరకు ప్రధాన కూ డళ్లు, గ్రామాల్లో ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. -
అదనపు ఆదాయమే లక్ష్యంగా పనిచేయాలి
భైంసాటౌన్/నిర్మల్టౌన్: ఆర్టీసీకి అదనపు ఆదా యం తీసుకురావడమే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్ ప్రణీత్, నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి అన్నారు. భైంసా, నిర్మ ల్ డిపోల్లో ‘లక్షే లక్ష్యం’ కార్యక్రమాన్ని గురువారం వేర్వేరుగా ప్రారంభించారు. అంతకుముందు జెండా ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడు తూ.. 2024 ఉగాది నుంచి 2025 ఉగాది వరకు ప్ర తీరోజు డిపోకు రూ.లక్ష అదనపు ఆదాయం తె చ్చేలా కృషి చేయడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. ప్ర తీ ఉద్యోగి ట్రిప్పులో రెండు నుంచి ఐదుగురు ప్ర యాణికులు అదనంగా ప్రయాణించేలా చూడాలని సూచించారు. తద్వారా లక్ష్యం చేరుకోవచ్చన్నారు. అనంతరం ఉద్యోగులతో ‘మా లక్ష్యం లక్ష’ అని ప్రతిజ్ఞ చేశారు. తర్వాత స్వీట్లు పంచారు. కార్యక్రమాల్లో ఏఎంఎఫ్ఎల్ చందు, నిర్మల్ డిపో అసిస్టెంట్ మేనేజర్ ఐ.రాజశేఖర్, అసిస్టెంట్ ఇంజినీర్ నవీన్ కుమార్, డిపోల ఉద్యోగులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
భైంసాటౌన్: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ తెలంగాణ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని సంఘం జిల్లా అధ్యక్షుడు యాటకా రి సాయన్న పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర అసో సియేట్ అధ్యక్షుడిగా సొప్పర్వార్ శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బీ చంద్రకాంత్ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ని యామకపత్రాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం వద్ద వారికి నియామక పత్రాలు ఇచ్చారు. నూతన పీఆర్సీ అమలు, భాషాపండితులకు ప్రమోషన్లు, 317 జీవోతో సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సంఘ విస్తరణకు కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన నాయకులకు సూచించారు. గౌరవాధ్యక్షుడు సరికొండ శ్రీనివాస్, సభ్యులు సత్యనారాయణ, సాయన్న, శ్రీనివాస్ తదితరులున్నారు. -
ఆకట్టుకున్న కవి సమ్మేళనం
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా కలంస్నేహం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీమాన్ గోపాల్ ఆచార్య ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం కవి సమ్మేళనం నిర్వహించారు. శ్రీరాముడు ఆదర్శ పురుషుడిగా ధర్మ గుణాలు ఆచరించాడని తెలియజెప్పే కవితాగానం చేశారు. కలం స్నేహం అధ్యక్షులు దేవిప్రియ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కడారి దశరథ్, కొండూరు పోతన్న, ఉపాధ్యక్షులు బట్టు శోభారాణి, కార్యదర్శి బీ శంకర్, కవులు నేరెళ్ల హనుమంతు, తొడిశెట్టి రవికాంత్, శ్యామల, రాజేశ్వరి, దేవిక, శివరాణి, గాయత్రి, శోభ, నర్మద, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. -
అమృత్ @ రూ.28.18 కోట్లు!
కేంద్ర నిధులతో ఊరటమున్సిపాలిటీకి ఆస్తిపన్ను, నల్లా పన్ను, ట్రేడ్ లైసెన్స్, ఇతర పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతున్నా.. సిబ్బంది వేతనాలు, పారిశుధ్య నిర్వహణ, డీజిల్, కరెంట్ బిల్లులకే అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. దీంతో నిధుల లేమితో తాగునీటి అవసరాలు తీర్చలేకపోతున్నారు. ముఖ్యంగా వేసవిలో సమస్య తీవ్రంగా ఉంటోంది. కాగా, అమృత్ పథకం 2.0 కింద నిధులు కేటాయించడంతో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఆర్థికంగా ఊరట లభించనుంది. ఈ నిధులతో పట్టణంలో 1,100 కిలో లీటర్ల సామర్థ్యంతో నీటి ట్యాంకు ఒకటి, అలాగే 700 కిలో లీటర్ల నిల్వ సామర్థ్యంతో మరో రెండు నీటి ట్యాంకులు, 500 కిలో లీటర్ల సామర్థ్యంతో మరో టాంక్ నిర్మించనున్నారు. 39 కిలో మీటర్ల పైపులైన్ వ్యవస్థ, 2,320 ఇళ్లకు నల్లా కనెక్షన్లు, అవసరమైన చోట్ల ప్రహరీ నిర్మాణం, సిబ్బందికి ప్రత్యేక క్వార్టర్లు, సర్వీస్ రిజర్వాయర్ల వద్ద ట్యాంకర్ ఫిల్లింగ్ పాయింట్లు తదితర పనులు చేపట్టనున్నారు.భైంసాటౌన్: భైంసా మున్సిపాలిటీలో తాగునీటి స మస్యకు పరిష్కారం లభించనుంది. కేంద్రం అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువేషన్ అండ్ అర్బన్ ట్రా న్స్ఫరేషన్) 2.0 పథకం కింద ఎంపిక చేసిన పట్ట ణాల్లో తాగునీటి పథకాలను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారీగా నిధులు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలో 11 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా, నిర్మల్ జిల్లా నుంచి భైంసా మున్సిపాలిటీకి అవకాశం దక్కింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి రుణ రూపంలో రూ.28.18 కోట్లు సమకూరనుండగా, ఈ నిధులతో ఓవర్హెడ్ ట్యాంకులు, నూతన పైపులైన్ల నిర్మాణం, నల్లా కనెక్షన్లు చేపట్టనున్నారు. పట్టణంలో ప్రస్తుతం మిషన్ భగీరథ కింద తాగునీటి వ్యవస్థ ఉన్నా.. అమృత్ పథకం కింద వచ్చే నిధులతో మరింత మెరుగుపడనుంది. మిషన్ భగీరథ ఉన్నా.. పట్టణంలో ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే, 2018 జనాభాకు అనుగుణంగా అప్పటి అవసరాల నిమిత్తం పనులు చేపట్టారు. దీంతో వివిధ కారణాలతో ఇప్పటికీ అన్ని కాలనీలకు పూర్తిస్థాయిలో నీరు చేరడం లేదు. కొన్నిచోట్ల పైపులైన్ పనులు, నల్లా కనెక్షన్ పనులు పూర్తయినా నీటి సరఫరా జరగడం లేదు. కొన్నిచోట్ల ఇప్పటికీ బోరుమోటర్లు, చేతిపంపుల ద్వారా నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన జనాభా, వాడల ఆధారంగా తాగునీటి వ్యవస్థ మెరుగుపర్చేందుకు అమృత్ 2.0 పథకం కింద నిధులు కేటాయించడంతో మరిన్ని ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించి, పైపులైన్లను విస్తరించి తాగునీటి వసతి కల్పించనున్నారు.మార్గదర్శకాలు రాలేదుపట్టణంలో తాగునీటి వసతి కల్పించేందుకు వివిధ పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం ఆ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. అమృత్ 2.0 కింద రూ.28.16 కోట్లు మంజూరు చేయనుంది. ఇందుకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు రాలేదు. – వెంకటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్, భైంసా భైంసా పట్టణంలో తాగునీటి వ్యవస్థ విస్తరణకు మార్గం సుగమం నిధులిచ్చేందుకు కేంద్రం ఆమోదం మెరుగుపడనున్న తాగునీటి కష్టాలు -
నిర్మల్
గురువారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024అలరించిన కుస్తీ పోటీలులోకేశ్వరం: మండలంలోని బిలోలి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీలు అలరించాయి. లోకేశ్వరంతోపాటు తానూర్, ము థోల్ మండలాలు, మహారాష్ట్ర నుంచి మల్ల యోధులు వచ్చి పోటీల్లో పాల్గొన్నారు. దార్కుభీర్ గ్రామానికి చెందిన నాగేశ్ అనే మల్లయోధుడు ప్రథమ స్థానంలో నిలువగా రెండున్నర తులాల వెండి, రూ.5,001 నగదు అందజేశారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ హాజరై ఇక్కడి రామాలయంలో పూజలు చేశారు. ఏఎస్సై దిగంబర్ బందోబస్తు నిర్వహించారు. పోటీలను మండల కేంద్రంతోపాటు హవర్గ, సాత్గాం, హథ్గాం గ్రామా ల ప్రజలు తిలకించారు. నాయకులు కాంతా రావు, నర్సింగ్రావు, ప్రభాకర్రావు, సతీశ్రా వు, రాజశేఖర్రావు, లింగారావు, సుకుమార్రావు, రవీందర్రావు, ముత్యం, నాగారావు, భూమారావు, శ్రీనివాస్రావు, రాజు, రాజన్న, ఈరన్న, మనోహర్రావు పాల్గొన్నారు.న్యూస్రీల్ -
కాంగ్రెస్లో పలువురి చేరిక
నిర్మల్చైన్గేట్: బీఆర్ఎస్కు చెందిన మేడిపల్లి మాజీ ఉపసర్పంచ్, ఆత్మ డైరెక్టర్ రాజుల నారాయణ, నాయకులు గణిమిల సయేందర్, పడిగెల గంగయ్య బుధవారం జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. శ్రీహరిరావు వీరికి పార్టీ కండువాలు వేసి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ.. ప దేళ్ల కుటుంబపాలనతో విసిగిపోయిన బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి ప్రజాప్రభు త్వ పాలనకు ఆకర్షితులై అధికసంఖ్యలో కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి సుగుణను భారీ మెజార్టీతో గెలి పించాలని పిలుపునిచ్చారు. -
‘భైంసాలో రామమందిరం నిర్మించుకుందాం’
భైంసాటౌన్: భైంసాలో త్వరలోనే రామమందిరం నిర్మించుకుందామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక రాంలీలా మైదానంలో నిర్వహించిన శోభాయాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో హిందువుల చిరకాల కోరిక అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసుకోవడం మనందరి భాగ్యమని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ వాహిని కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, హిందూ ధర్మ రక్షకులు విశేష కృషి చేస్తున్నారని, తన గెలుపు కోసం కూడా సైనికుల్లా పనిచేశారని గుర్తు చేశారు. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. హిందువులంతా సంఘటితం కావాలని ఆయన ఆకాంక్షించారు. -
నేటి నుంచి నామినేషన్లు
● ఈ నెల 25 వరకు స్వీకరణ ● ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.. ● ఆదిలాబాద్ కలెక్టరేట్లో పకడ్బందీ ఏర్పాట్లునామినేషన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. నామినేషన్ల స్వీకరణ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆది లాబాద్ కలెక్టరేట్ వద్ద 100 మీటర్ల వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధి కారి కార్యాలయాన్ని తెలిపేలా ప్రత్యేక సూచి క బోర్డులను ఏర్పాటు చేశారు. వంద మీటర్ల తర్వాత మీడియా సెంటర్ ఉంటుంది. ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి పర్యవేక్షించారు.కై లాస్నగర్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి షురూ కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ చాంబర్లో ఉద యం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నా మినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ వివరాలు వెల్లడించారు. ఈనె ల 26న నామినేషన్ల పరిశీలన, 29వరకు ఉపసంహరణ గడువు ఉన్నట్లు తెలిపారు. మే 13న పోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. సిర్పూర్, ఆసిఫాబాద్ ని యోజకవర్గాల్లో ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథో ల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఏఆర్వోగా ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్కుమార్ను నియమించినట్లు తెలిపారు. ప్రత్యేక సహాయ కేంద్రం.. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా కలెక్టరేట్లో ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. నామినేషన్ కోసం వచ్చే అభ్యర్థులకు సంబంధించి వంద మీటర్ల వరకు మూడు వాహనాలను అనుమతిస్తారు. అభ్యర్థితో పాటు మరో నలుగురిని లోనికి అనుమతించనున్నారు. అభ్యర్థి డిపాజిట్ కింద రూ.12,500 నగదు లేదా ప్రభుత్వ బ్యాంకులు, కార్యాలయాల్లో తీసిన డీడీ రూపంలో చెల్లించవచ్చు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఒక ప్రపోజర్ సరిపోతుంది. గుర్తింపులేని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులైతే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు కలిగిన పది మంది ప్రతిపాదకులను తీసుకురావాల్సి ఉంటుంది. హెల్ప్ డెస్క్లో ప్రత్యేక కంప్యూటర్లతో పాటు ఆపరేటర్లను నియమించారు. దీనికి ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. వెయిటింగ్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ డిపాజిట్ పరిశీలనకు భీంపూర్ తహసీల్దార్ను ఇన్చార్జిగా నియమించారు. నామినేషన్లకు సంబంధించిన పత్రాల పరిశీలన, ఓటరు లిస్ట్, సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ వంటి వాటి పరిశీలన కోసం ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ ఎస్.శ్రీనివాస్ను ఇన్చార్జిగా నియమించారు. అభ్యర్థులకు ప్రత్యేక హ్యాండ్ బుక్.. ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులకు హ్యాండ్ బుక్తో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చే సేలా పత్రాలను అందజేయనున్నారు. అభ్యర్థులు నామినేషన్కు ముందే ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థి సంతకం చేస్తే ముందు చేయవచ్చు.. వేలిముద్ర వేసేవారైతే రిటర్నింగ్ అధికారి ముందే వేయాల్సి ఉంటుంది. అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో మూడుసార్లు తప్పనిసరిగా ప్ర కటించాల్సి ఉంటుంది. అభ్యర్థులు, వారి ఏజెంట్లకు సంబంధించి స్పెస్మెన్ సిగ్నిచర్లకు సంబంధించి హార్డ్, సాఫ్ట్ కాపీలను ఫారం–7ఏలో అందజేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు రూ.95లక్షల వరకు ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేయవచ్చు. రూ. 10వేలకు మించితే ఆన్లైన్ పద్ధతిలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ అందజేత.. పార్లమెంట్ ఎన్నికల్లో 5,940 మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. ఇందులో పీవో, ఏపీవో, ఓపీవోలు 4,122 మంది ఉండగా, పోలీసు బెటాలియన్కు సంబంధించి 635, ఇతర సిబ్బంది 183 మంది ఉన్నారు. వీరందరికీ ఇదివరకే శిక్షణ ఇవ్వగా, ఆ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఫారం–12 అందజేశారు. సదరు ఉద్యోగులు తమ సొంత నియోజకవర్గం లేదా శిక్షణ కేంద్రంలో ఓటు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. సొంత నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఒకరోజు క్యాజువల్ సెలవు ఇవ్వనున్నారు. వీరికి మే 3 నుంచి 8వరకు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం ఓటర్లు 16లక్షల 44వేల 715 మంది ఉండగా.. ఇందులో 2,150 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. హోం ఓటింగ్..85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం గల దివ్యాంగులు హోం ఓటింగ్ వినియోగించుకోవచ్చు. ఇప్పటికే జిల్లాలో ఇలాంటి వారందరికీ ఫారం–12డీ అందజేశారు. ఈనెల 25వ తేదీ వరకు వాటిని స్వీకరించనున్నారు. ఇలా అందిన వివరాల ఆధారంగా హోం ఓటింగ్కు చర్యలు చేపడుతారు. వీరితో పాటు అత్యవసర సర్వీసుల్లో పనిచేసే బీఎస్ఎన్ఎల్, సివిల్ సప్లయ్, రైల్వే, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, వైద్యారోగ్య శాఖ వంటి శాఖల ఉద్యోగాలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించారు.