-
సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?
గతేడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో అలరించిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ అతనికి జంటగా నటించింది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పీరియాడిక్ హై యాక్షన్ మూవీతో అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. వర్కింగ్ టైటిల్ 'ఎస్డీటీ 18' పేరుతో పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్.సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ను నిర్మాతలు విడుదల చేశారు.ల్యాండ్ మైన్లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ యూనివర్శల్ కాన్సెప్ట్తో ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఈ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నాం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పాత్ర చాలా శక్తివంతంగా వుంటుంది. ప్రస్తుతం ఓ భారీ సెట్లో ఈ చిత్రం తొలిషెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అన్నారు. కాగా.. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.MY NEXT #SDT18 ✊This one will be more than special.Need all your love & blessings 🙏🏼All the best to us @rohithkp_dir 🤗 Glad to be associating with @niran_reddy @chaitanyaniran & @Primeshowtweets pic.twitter.com/wFhvFAELZb— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 21, 2024 -
యూత్ ఫుల్ మూవీస్ తో సీనియర్ డైరెక్టర్స్..
-
'ధమాకా' కాంబో రిపీట్.. రవితేజ 75వ సినిమా ప్రారంభం (ఫోటోలు)
-
'నేను-కీర్తన' సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి: డైరెక్టర్ సాయి రాజేశ్
చిమటా రమేష్ బాబు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'నేను కీర్తన'. ఈ మూవీలోని 'సీతాకోకై ఎగిరింది మనసే' పాట్ లిరికల్ వీడియోని 'బేబి' దర్శకుడు సాయి రాజేశ్ రిలీజ్ చేశారు. అలానే ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఈ మూవీలో రిషిత, మేఘన హీరోయిన్లుగా నటించారు. చిమటా లక్ష్మికుమారి నిర్మాతగా వ్యవహరించారు.(ఇదీ చదవండి: ప్రముఖ నటుడిపై పోక్సో కేసు.. నాలుగేళ్ల పాపతో దారుణంగా!)"ఎంతో బిజీ షెడ్యూల్లోనూ సమయాన్ని కేటాయించిన సాయి రాజేష్కు కృతజ్ఞతలు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని హీరో కమ్ డైరెక్టర్ చిమటా రమేష్ బాబు చెప్పారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?) -
సిమ్రాన్, అవినాష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా ప్రారంభమైంది. కార్తి దర్శకుడు కాగా... శాంత నూపతి, ఆలపాటి రాజా, అవినాష్ బుయాని, అంకిత్రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ సినిమాస్ ఎల్ఎల్పీ ప్రొడక్షన్ నెం.1గా తీస్తున్న ఈ మూవీ.. హైదరాబాద్లోని సారధి స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు బాబీ ఫస్ట్ షాట్కు దర్శకత్వం వహించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ శ్రీనివాసరెడ్డి క్లాప్ కొట్టారు.(ఇదీ చదవండి: నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం)మంచి సినిమా తీయాలనే కోరికతో అమెరికా నుంచి వచ్చాము. దాదాపు 4 సంవత్సరాలకుపైగా ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో కరోనా వల్ల చాలా టైం వేస్ట్ అయ్యింది. దాదాపు 30 కథలు దాకా విన్నాము. మా రైటర్ విశ్వజిత్ చెప్పిన ఈ లైన్ బాగా నచ్చింది. దీనికి తోడు సాయిమాధవ్ బుర్రాగారు మా సినిమాకు డైలాగ్స్ రాయడం మరింత ప్లస్ అవుతుంది. మంచి హిట్ సినిమాకు కావాల్సినవి అన్నీ ఇందులో ఉన్నాయి. మంచి టెక్నీషియన్స్ కుదిరారు అన్నారు.(ఇదీ చదవండి: కోట్ల రూపాయల కారు గిఫ్ట్.. ఎలుకల వల్ల నష్టపోయానన్న హీరో!) -
మకాం మారుస్తున్న శ్రీలీల..
-
మహేష్ బాబును మార్చేస్తున్న రాజమౌళి..
-
సౌత్ సినిమాలో సల్మాన్ !.. ఏ హీరో సినిమాలో అంటే ?
-
భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?
-
ఆ జానర్ వదిలేసిన గుణశేఖర్.. అలాంటి కథతో కొత్త మూవీ
గుణశేఖర్ పేరు చెప్పగానే పెద్ద సెట్స్తో తీసే భారీ సినిమాలే గుర్తొస్తాయి. ఈయన గత రెండు సినిమాలు ఇలాంటివే. వాటితో ఘోరమైన నష్టాల్ని చవిచూసిన ఈయన ఇప్పుడు రూట్ మార్చాడు. యూత్ఫుల్ సోషల్ డ్రామా కథతో కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. దీనికి 'యుఫోరియా' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్)'ఒక్కడు' లాంటి మూవీతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు గుణశేఖర్.. ఆ తర్వాత ట్రెండ్కి తగ్గ సినిమాలు తీయడంలో పూర్తిగా తడబడ్డాడు. మహేశ్, అల్లు అర్జున్, రవితేజ లాంటి హీరోలు అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సరిగా వినియోగించుకోలేకపోయాడు. 2015లో 'రుద్రమదేవి' అనే పీరియాడికల్ మూవీతో పాస్ మార్కులు వేయించుకున్నారు. ఇదొచ్చిన ఏడేళ్ల తర్వాత అంటే గతేడాది 'శాకుంతలం'తో వచ్చారు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫలితం అందుకుంది.మధ్యలో రానాతో చేయాల్సిన 'హిరణ్యకశ్యప' వివాదంలో చిక్కుకుంది. ఇలా పలు సమస్యలు ఎదుర్కొన్న గుణశేఖర్.. ఇప్పుడు తనకు అలవాటైన భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా సింపుల్గా ఉండే యూత్ఫుల్ డ్రామా తీయాలని ఫిక్సయ్యారు. ఇందులో భాగంగానే 'యుఫోరియా' మూవీని ప్రకటించారు. త్వరలో షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఇందులో ఎవరెవరు నటిస్తారనేది మాత్రం ఇంకా చెప్పలేదు. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే ప్రముఖ నటి విడాకులు? అసలు విషయం ఇది) View this post on Instagram A post shared by Guna Handmade Films (@gunahandmadefilms) -
ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా?
గతేడాది 'బేబి' సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు రూట్ మార్చాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'గం గం గణేశా'తో ఎంటర్టైన్ చేసేయడానికి వచ్చేస్తున్నాడు. మే 31న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్)హీరో ఓ దొంగ. ఫ్రెండ్తో కలిసి జాలీగా బతికేస్తుంటాడు. ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఓ ఊరికి వెళ్తాడు. అక్కడ వినాయకుడి విగ్రహాం దొంగతనం జరుగుతుంది. హీరో కూడా ఊహించని విధంగా ఆ దొంగతనంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే కథలా అనిపిస్తుంది. ఇప్పటివరకు కూల్గా ఉంటే క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ఆనంద్.. ఈ చిత్రం కామెడీ కూడా చేశాడు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?) -
థ్రిల్లర్ మూవీలో హాట్ బ్యూటీ పాయల్.. ఫస్ట్ లుక్ చూశారా?
ఆర్ఎక్స్100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్.. సరికొత్తగా అలరించేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పోలీస్గా సందడి చేయనుంది. ఈ మేరకు పాయల్ నటిస్తున్న కొత్త మూవీకి 'రక్షణ' టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ సినిమాలో పాయల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు. త్వరలో విడుదల తేదీతో పాటు ఇతర వివరాల్ని వెల్లడించబోతున్నారు.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్) -
రౌడీ హీరో బర్త్ డే అప్డేట్.. కొత్త మూవీకి డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ను ట్విటర్లో షేర్ చేశారు. ప్రముఖ నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈ బ్యానర్లో వస్తోన్న 59న చిత్రం ఇది నిలవనుంది.ఈ సినిమాను భారీస్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'రాజా వారు.. రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా కనిపిస్తోంది. 'కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..' అనే క్యాప్షన్ చూస్తేనే సినిమా కథంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు. “The blood on my hands is not of their death.. but of my own rebirth..“Ravi Kiran Kola X Vijay Deverakonda@SVC_official pic.twitter.com/xGXXiNbVQu— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024 -
రామ్ చరణ్ కు తాతయ్యగా అమితాబ్ ?
-
Director Sukumar: ఈ చిత్రకథ గొప్పగా ఉంది
‘‘జగడం’ సినిమా ద్వారా గణేశ్ని కొరియోగ్రాఫర్గా పరిచయం చేశాను. ఇప్పుడు ‘గౌడ్ సాబ్’తో తను దర్శకుడిగా మారడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రకథ గొప్పగా ఉంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. దివంగత నటుడు రెబల్స్టార్ కృష్ణంరాజు బంధువు విరాట్ రాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గౌడ్ సాబ్’. కొరియోగ్రాఫర్ గణేశ్ దర్శకత్వంలో మల్లీశ్వరి సమర్పణలో రాజు, కల్వకోట వెంకటరమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్ నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్లో ఆరంభమైంది. ‘గౌడ్ సాబ్’ లోగోను సుకుమార్ లాంచ్ చేశారు. తొలి సీన్కి నృత్య దర్శకులు యాని, భాను, జానీ కెమెరా స్విచ్చాన్ చేయగా, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ క్లాప్ కొట్టారు. ‘‘మా విరాట్ లాంచ్ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి. ‘‘ఇది నా కెరీర్లో ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది’’ అన్నారు విరాట్ రాజ్. ‘‘లవ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది’’ అన్నారు గణేశ్. ‘‘మంచి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ’’ అన్నారు నిర్మాతలు. -
MM Keeravani: డ్యాన్స్ చేశాం
‘‘లవ్ మీ’ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అని ఓ టైటిల్ సాంగ్ రాశారు చంద్రబోస్గారు. ఈ సినిమాకు పని చేయడానికి మేం స్టూడియోలో డ్యాన్స్ చేశాం. చంద్రబోస్గారితో ఫైట్ కూడా చేశాం (నవ్వుతూ). ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మీ’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్ ఈవెంట్స్ని మర్చి΄ోయి చాలా రోజులైంది. ‘లవ్ మీ’తో మళ్లీ ఆ సంస్కృతిని తీసుకొస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆడియో లాంచ్ ఈవెంట్ చూస్తుంటే సక్సెస్ మీట్లా అనిపిస్తోంది’’ అన్నారు అరుణ్ భీమవరపు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఆశిష్. ఈ కార్యక్రమంలో వైష్ణవీ చైతన్య, హన్షిత, శిరీష్, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, కెమెరామేన్ పీసీ శ్రీరామ్ తదితరులు ΄ాల్గొన్నారు. -
రజనీకాంత్ కళుగు?
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ను ఈ నెల 22న అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ‘కళుగు’ (తెలుగులో ‘గద్ద’ అని అర్థం) అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. మరి... ఇదే టైటిల్ ఖరారు అవుతుందా? లేక మరో టైటిల్ ఫిక్స్ అవుతుందా అనేది తెలియాలంటే ఈ నెల 22 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం షూటింగ్ జూన్ చివర్లో లేదా జూలై మొదటి వారంలో ్ర΄ారంభం కానుందని తెలిసింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
25 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్
-
డైరెక్షన్ పై లేడీ సూపర్ స్టార్ ఇంటరెస్ట్..?
-
Ashwatthama: The Saga Continues: బాలీవుడ్ అశ్వత్థామ
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’ టైటిల్ ఖరారైంది. కన్నడ దర్శకుడు సచిన్ రవి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వసు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్ముఖ్ నిర్మిస్తున్న ఈ సినిమా అధికారిక ప్రకటన వెల్లడైంది. సచిన్ రవి మాట్లాడుతూ– ‘‘మహా భారతంలోని అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉంటారని కొందరి నమ్మకం. మహాభారత కాలంనాటి ఓ అమరుడు ఇప్పటి ఆధునిక కాలానికి వస్తే ఏం జరుగుతుంది? అనే అంశాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో లెజెండ్స్ యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు జాకీ భగ్నాని. -
రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కాంబినేషన్..మెంటలెక్కిపోద్ది
-
ఆ దూరాన్ని వెయ్ దరువెయ్ తగ్గిస్తుంది
‘‘పూర్తి స్థాయి వినోదం, ఫ్యామిలీ డ్రామా, ఓ చిన్న సందేశం.. ఇలా అన్ని వాణిజ్య అంశాలతో ‘వెయ్ దరువెయ్’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పగలను. నా కెరీర్లో ఈ మధ్య గ్యాప్ వచ్చింది. ఆ దూరాన్ని ‘వెయ్ దరువెయ్’ తగ్గిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో సాయిరామ్ శంకర్ అన్నారు. నవీన్ రెడ్డి దర్శకత్వంలో సాయిరామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నటించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. లక్ష్మీనారాయణ ΄పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్పై దేవరాజు ΄పొత్తూరు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘నవీన్ ‘వెయ్ దరువెయ్’ కథ చెప్పగానే నచ్చింది. ఇందులో నా పాత్ర చాలా సరదాగా ఉంటుంది. నాకు తప్పకుండా మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందనిపించింది. ఈ సినిమాని 35 రోజుల్లోనే పూర్తి చేశామంటే ఆ క్రెడిట్ నిర్మాత, డైరెక్టర్, కెమెరామేన్లదే. పైగా నటీనటులందరూ అనుభవం ఉన్నవాళ్లు కావడం కూడా మరో కారణం. ఈ మూవీకి భీమ్స్గారి సంగీతం, నేపథ్య సంగీతం ప్లస్ అయింది. నా 20 ఏళ్ల సినీ ప్రయాణంలో విజయాలు, పరాజయాలూ ఉన్నాయి. ప్రస్తుతం ఆచితూచి మంచి కథలు ఎంచుకుంటున్నా. మా అన్నయ్య (పూరి జగన్నాథ్) దర్శకత్వంలో హీరోగా చేసే స్థాయికి నేనింకా చేరుకోలేదు. ఆ స్థాయి, ఆ స్టార్డమ్, నా మార్కెట్ పరిధి పెరిగినప్పుడు చేస్తాను. ప్రస్తుతం నేను నటించిన ‘ఒక పథకం ప్రకారం, రీ సౌండ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు. -
స్పీడ్ పెంచిన తారక్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..
-
Bhool Bhulaiyaa 3: ఆమె కళ్లు వేటాడతాయి!
బాలీవుడ్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో ‘భూల్ భూలయ్యా’ ఒకటి. 2007లో విడుదలైన ‘భూల్ భూలయ్యా’, 2022లో విడుదలైన ‘భూల్ భూలయ్యా 2’ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ‘భూల్ భూలయ్యా 3’ చిత్రీకరణ జరుగుతోంది. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ‘భూల్ భూలయ్యా’ ఫ్యామిలీలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ చేరారు. ‘‘ఆమె నవ్వు భయం పుట్టిస్తుంది. ఆమె కళ్లు వేటాడతాయి... అలాగే !భయపెడతాయి. మిస్టరీ గాళ్’’ అంటూ ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ పాత్రను వివరించారు మేకర్స్. -
శరవేగంగా రణబీర్ కపూర్ రామాయణం..