-
సరికొత్త ‘డేటా పరిరక్షణ’
వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పి ఆరేళ్లవుతుండగా మళ్లీ సరికొత్తగా ముస్తాబై డిజిటల్ పర్సనల్ డేటా పరిరక్షణ బిల్లు పార్లమెంటు ముందుకు రాబోతోంది. పట్టు వదలని విక్రమార్కుడి నుంచి పదే పదే తప్పించుకునే బేతాళుడి మాదిరి ఎప్పటికప్పుడు వెనక్కిపోతున్న బిల్లు ఈసారైనా ఈనెల 20 నుంచి మొదలయ్యే సమావేశాల్లో ఆమోదం పొందుతుందా లేదా అన్నది చూడాలి. అంతకన్నా ముఖ్యం– ముసాయిదా బిల్లుపై నిపుణుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను ఏ మేరకు పరిగణనలోకి తీసుకున్నారో తెలియాల్సివుంది. డేటా పరిరక్షణ ఎంతో సవాలుతో కూడుకున్న వ్యవహారం. దాన్ని రూపొందించేవారికి డిజిటల్ రంగంపైనా, అందులో వస్తున్న, రావడానికి ఆస్కారం ఉన్న మార్పులపై లోతైన అవగాహన ఉండాలి. అప్పుడే నిజమైన పరిరక్షణ సాధ్యమవుతుంది. మన దేశంలో డిజిటల్ యుగం ప్రవేశించి దాదాపు మూడు దశాబ్దాలవుతోంది. పేరుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–2000 చట్టం వచ్చినా అది పౌరుల గోప్యతకు సంబంధించి కొరగాని చట్టంగా మిగిలిపోయింది. వేలిముద్రలతో సహా పౌరుల సమస్త వివరాలూ సేకరించే ఆధార్ను ఆదరాబాదరాగా తీసుకొచ్చిన ఆనాటి యూపీఏ సర్కారు ఆ డేటా పరిరక్షణకు అనువైన చట్టం అవసరమన్న సంగతి మరిచింది. దానిపై నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాక 2012లో జస్టిస్ ఏపీ షా నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఒక సమగ్ర నివేదిక కూడా ఇచ్చింది. ఈలోగా యూపీఏ ఏలుబడి ముగిసిపోయింది. తగిన చట్టాలు లేకుండా ఆధార్ కోసం వ్యక్తిగత వివరాలు సేకరించడాన్ని సవాలు చేస్తూ 2017లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పుట్టస్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టాక కేంద్రంలో కదలిక మొదలైంది. వ్యక్తిగత గోప్యత హక్కు పౌరుల జీవించే హక్కులో అంతర్భాగమని, అందుకు అనుగుణంగా చట్టం ఉండితీరాలని సర్వోన్నత న్యాయస్థానం ఆ కేసులో తీర్పునిచ్చాక జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నాయకత్వాన కమిటీ ఏర్పాటయింది. అన్ని వర్గాల ప్రజలతోనూ, నిపుణులతోనూ మాట్లాడి మరుసటేడాది జస్టిస్ శ్రీకృష్ణకమిటీ ముసాయిదా బిల్లు సమర్పించింది. మార్పులు, చేర్పులతో ఆ బిల్లు 2019లో పార్లమెంటు ముందుకు వచ్చింది. ఆ తర్వాత దానిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ఏర్పాటైంది. మరో రెండేళ్లకు జేపీసీ నివేదిక సమర్పించగా, దాని ఆధారంగా 2021లో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దానిపైనా అనేక అభ్యంతరాలు వ్యక్తం కావటంతో నిరుడు ఆగస్టులో ఆ బిల్లును ఉపసంహరించుకున్నారు. తర్వాత రూపొందిన మరో ముసాయిదా బిల్లును నిరుడు నవంబర్లో ప్రజల పరిశీలనకు విడుదల చేశారు. అందులో వ్యక్తమైన అభిప్రాయాలేమిటో, వేటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోబోతున్నదో చెప్పలేదు. మొత్తానికి ఆరేళ్లుగా సాగుతున్న కసరత్తు పర్యవసానంగా కొత్త బిల్లు రాబోతోంది. ఐరాస సభ్యదేశాల్లో ఇప్పటికే 137 దేశాలు డేటా పరిరక్షణ చట్టాలు తీసుకొచ్చాయి. చెప్పాలంటే ఆ విషయంలో మనం వెనకబడేవున్నాం. దేశ పౌరుల డేటా బజారునపడుతున్న వైనం అప్పుడప్పుడు వెల్లడవుతూనే ఉంటోంది. ఎక్కడెక్కడో డేటా సంపాదించి పౌరుల బ్యాంకు ఖాతాలను దుండగులు ఖాళీ చేస్తున్న ఉదంతాలు పెరిగాయి. అయినా డేటా పరిరక్షణ బిల్లు తీసుకురావటంలో అలవిమాలిన జాప్యం జరిగింది. ఏమైతేనేం... బిల్లు రాబోతున్నది. సంస్థల అజాగ్రత్త వల్ల లేదా ఉద్దేశపూర్వక చర్య వల్ల డేటా లీకైనపక్షంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు, చర్యలు తీసుకునేందుకు డేటా పరిరక్షణ ప్రాధికార సంస్థ(డీపీఏ) ఏర్పాటు చేయాలన్న బిల్లులోని ప్రతిపాదన మెచ్చదగిందే. ప్రతి సంస్థా తమ ఖాతాదార్ల గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు డేటా పరిరక్షణ ప్రత్యేక అధికారిని నియమించుకోవటం, నిఘా పెట్టడం ఇక తప్పనిసరవుతుంది. ఉద్దేశిత ప్రయోజనం నెరవేరగానే సేకరించిన డేటాను పూర్తిగా తొలగిస్తామన్న హామీ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా చట్టంలో ఉంటుందంటున్నారు. అది మంచి ప్రతిపాదనే. డేటా లీక్ అరికట్టడంలో విఫలమయ్యే సంస్థకు రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధించాలని ప్రతిపాదించారు. అవసరాన్నిబట్టి కేబినెట్ ఆమోదంతో ఈ జరిమానాను రూ. 500 కోట్ల వరకూ పెంచడానికి బిల్లులో ఏర్పాటుందని చెబుతున్నారు. ప్రతిపాదన కూడా అవసరమైనదే. అయితే పౌరుల డేటా లీక్కు సంబంధించినంతవరకూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను సమంగా చూడాలి. పౌరుల అనుమతి లేకుండా వారి డేటాను సేకరించే ప్రభుత్వ సంస్థలకు కూడా వర్తించేలా చర్యలుండాలని, వాటికి కూడా కళ్లెం వేయాలని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ వంటి సంస్థల డిమాండ్. అమెరికా, యూరోప్ దేశాల్లో ప్రైవేటు సంస్థలకైనా, ప్రభుత్వ సంస్థలకైనా సమానంగా వర్తించేలా చట్టాలున్నాయి. దేశ భద్రత తదితర అంశాల్లో తన ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలకు కేంద్రం మినహాయింపు ఇవ్వొచ్చని తాజా బిల్లులో ఉన్నదంటున్నారు. కొన్ని సందర్భాల్లో అది అవసరమే కావొచ్చు కూడా. కానీ ఆ క్రమం పారదర్శకంగా ఉండాలి. మినహాయింపులిస్తే సరిపోదు. చట్టవిరుద్ధత చోటుచేసుకున్న పక్షంలో చర్యలేమిటో ప్రతిపాదించాలి. తప్పుడు ఫిర్యాదులని తేలితే రూ. 10,000 వరకూ జరిమానా విధించవచ్చన్న పాత ముసాయిదా నిబంధన కూడా మార్చలేదంటున్నారు. సాధారణ పౌరులు ఫిర్యాదు చేయాలంటేనే సవాలక్ష అడ్డంకులుంటాయి. ఈమాదిరి జరిమానాలు తోడైతే ఇక చెప్పేదేముంది? పౌరులను బెదరగొట్టే ఈ నిబంధనను పరిహరిస్తేనే మంచిది. డీపీఏ ఒక స్వతంత్ర సంస్థగా మనగలిగితేనే దాని పని తీరు ప్రభావవంతంగా ఉంటుందని పాలకులు గుర్తిస్తే అది దేశానికెంతో మేలు చేస్తుంది. -
సాక్షులతో మాట్లాడొద్దు
వాషింగ్టన్: అమెరికాలో ప్రభుత్వ రహస్య పత్రాలను తన నివాసంలో దాచిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మంగళవారం ఉదయం మయామీ కోర్టులో దాదాపుగా 45 నిముషాల సేపు విచారణ కొనసాగింది. ఈ కేసులో తన తప్పేమీ లేదని ట్రంప్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. న్యాయ విచారణ ప్రారంభం కావడానికి 15 నిముషాల ముందే కోర్టుకు హాజరయ్యారు. ట్రంప్కు తోడుగా ఆయన వెంట కుమారుడు ఎరిక్ ట్రంప్ కూడా న్యాయస్థానానికి వచ్చారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం శ్రమిస్తున్న ట్రంప్కు ఈ కేసు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. కోర్టులో కేసు విచారణ సాగినంత సేపు ట్రంప్ మౌనంగా తలవంచుకొని చూస్తూ కూర్చున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు రాసింది. దేశ భద్రతకు సంబంధించిన రహస్య పత్రాలను ట్రంప్ తనతో పాటు ఫ్లోరిడాలోని తన ఎస్టేట్కు తీసుకువెళ్లి ఉంచారని, దేశానికి చెందిన అణు రహస్యాలు ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారంటూ ఆయనపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. గూఢచర్యం చట్టం కింద 31 నిబంధనల్ని అతిక్రమించారంటూ ట్రంప్పై 37 అభియోగాలు నమోదయ్యాయి. దేశానికి చెందిన ఒక మాజీ అధ్యక్షుడు క్రిమినల్ కేసులో ఈ స్థాయిలో అభియోగాలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. కోర్టులో విచారణ సమయంలో ట్రంప్ అమాయకుడని, ఆయనకే పాపం తెలీదని ఆయన తరఫు లాయర్ టాన్ బ్లాంచ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేసుని విచారించిన న్యాయమూర్తి జోనథాన్ గూడ్మ్యాన్ ట్రంప్ ఈ కేసుకు సంబంధించిన సాక్షులు, ఇతరులెవరితోనూ నేరుగా మాట్లాడవద్దని షరతు విధించారు. అధ్యక్ష పదవిలో అవినీతి పరుడు: ట్రంప్ కోర్టులో విచారణ ముగిసిన అనంతరం ట్రంప్ నిధుల సమీకరణ కోసం న్యూజెర్సీలోని గోల్ఫ్ కోర్టుకు మంగళవారం రాత్రి వెళ్లారు. ఆయనకు అక్కడ ఘనంగా స్వాగతం లభించింది. జూన్ 14 బుధవారం ట్రంప్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ తన అభిమానులతో మాట్లాడుతూ తనపై మోపిన ఈ కేసు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆరోపించారు. అధ్యక్ష పీఠంపై ఒక అవినీతి పరుడు కూర్చొని , తన రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. -
రక్షణ వలయంలో శ్రీనగర్
శ్రీనగర్: శ్రీనగర్లో నేటి నుంచి జీ–20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశాలు మొదలవుతున్న విషయం తెలిసిందే. ఉగ్ర బెడద నేపథ్యంలో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తత ప్రకటించాయి. నేషనల్ సెక్యూరిటీ గ్రూప్(ఎన్ఎస్జీ) కౌంటర్ డ్రోన్ బృందాలు గగనతలంపై కన్నేసి ఉంచాయి. సుందర దాల్ సరస్సుపై నేవీ మెరైన్ కమాండోలు గస్తీ చేపట్టారు. పలు కీలక ప్రాంతాల్లో భారీగా మోహరింపులు, తనిఖీలు ముమ్మరమయ్యాయి. వివిధ దేశాల నుంచి హాజరయ్యే 60 మంది ప్రతినిధులు, 20 మంది జర్నలిస్టుల కోసం సమావేశాల వేదికైన షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ) వద్ద యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశమిది. దీంతో, సమావేశ వేదికతోపాటు, వారు బస చేసే ప్రాంతం, ఆ పక్కనే ఉన్న జబర్వాన్ పర్వతశ్రేణిపై ఆర్మీ బలగాలను రంగంలోకి దించారు. ఉగ్రమూకలు ఐఈడీలతో విధ్వంసానికి పాల్పడే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో సోదాలు ముమ్మరం చేశారు. పాక్ కేంద్రంగా పనిచేసే జైషేమొహ్మద్కు చెందిన ఓ వ్యక్తిని ఆదివారం కుప్వారా జిల్లాలో సోదాల సమయంలో బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సైన్యం కదలికల సమాచారాన్ని అతడు పాక్కు చేరవేస్తున్నట్లు గుర్తించారు. పూంఛ్లో సరిహద్దులకు సమీపంలో మెంధార్ సెక్టార్ వద్ద అనుమానాస్పద కదలికలతో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం. ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టాయి. సోదాలు పూర్తయ్యేదాకా ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావద్దని ప్రజలను అధికారులు కోరారు. -
చరిత్రాత్మకమైన తీర్పు
న్యాయం చేయటం మాత్రమే కాదు, అలా చేస్తున్నట్టు కనబడటం కూడా ముఖ్యం అంటారు. ‘మీడియా వన్’ కేసులో సుప్రీంకోర్టు బుధవారం వెలువరించిన తీర్పు ఈ సహజ న్యాయసూత్ర ప్రాధాన్యతనూ, దాపరికం లేని న్యాయవ్యవస్థ ఆవకశ్యతనూ నిర్మొహమాటంగా తెలియజేసింది. అంతేకాదు, ఈమధ్యకాలంలో ‘జాతీయ భద్రత’ను అడ్డం పెట్టుకునే పోకడలను నిశితంగా విమ ర్శించింది. ‘మీడియా వన్’ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే ఆ కేసు నిజానికి ఇంత దూరం రావా ల్సిన అవసరం లేదని సులభంగానే అర్థమవుతుంది. దేశ భద్రతకు ముప్పు కలుగుతుందన్న ఆరోపణతో కేరళలోని ‘మీడియా వన్’ చానెల్ ప్రసారాల కొనసాగింపునకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. దేశభద్రతకు ముప్పు తెచ్చే ఎలాంటి చర్యలనైనా అడ్డుకోవటానికీ, ప్రజల ప్రాణాలు కాపాడటానికీ ప్రభుత్వాలకు సర్వాధికారాలూ ఉంటాయి. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. కానీ అందుకు సహేతుక కారణాలను చూపటం ముఖ్యం. అలా కారణాలు చూపటంవల్ల వ్యక్తులు లేదా సంస్థలు లబ్ధి పొందుతాయా లేదా అన్నది ప్రధానం కాదు. ప్రజా స్వామ్యం నాలుగు కాలాలపాటు మనుగడ సాగించాలంటే ఇది ముఖ్యం. ఇలా చేయటంవల్ల దేశ ప్రజల్లో చట్టబద్ధ పాలనపై విశ్వసనీయత ఏర్పడుతుంది. పాలన పారదర్శకంగా సాగుతున్నదనీ, జవాబుదారీతనం అమల్లో ఉన్నదనీ భరోసా కలుగుతుంది. కారణాలేమైనా గానీ ఇటీవలి కాలంలో కొన్ని కేసుల విషయంలో తన వాదనలకు మద్దతుగాకేంద్రం కొన్ని పత్రాలను సీల్డ్ కవర్లో అందజేయటం, న్యాయస్థానాలు ఆ ధోరణిని అంగీకరించటం కనబడుతుంది. ఇందుకు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు తదితరాలు మొదలుకొని భీమా కోరెగావ్ కేసు వరకూ ఎన్నిటినో ఉదహరించవచ్చు. ఆఖరికి ఇదెంత వరకూ వచ్చిందంటే సీల్డ్ కవర్ అందజేయటం న్యాయవ్యవస్థలో ఒక సాధారణ విషయంగా మారింది. ఇందువల్ల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులకూ, సంస్థలకూ నష్టం జరుగుతుంది. తమపై ఉన్న ఆరోపణలేమిటో, వాటికిగల ఆధారాలేమిటో తెలియకపోతే ఏ ప్రాతిపదికన వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించాలి? ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా? నేరం రుజువయ్యేవరకూ ఎవరినైనా నిరపరాధులుగా పరిగణించాలన్నది అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలూ అనుసరించే విధానం. దానికి సీల్డ్ కవర్ పద్ధతి గండికొడుతోంది. అంతేకాదు, నిందితులకు అన్యాయం జరుగుతున్నదన్న భావన కలిగి ప్రజల్లో వారిపట్ల సానుభూతి ఏర్పడుతోంది. ‘మీడియా వన్’ కేసు విషయానికొస్తే ఆ సంస్థ ప్రసారాలను ఎందుకు నిలిపేయాల్సివచ్చిందో కేంద్రం చెప్పదు. హైకోర్టుకు పోతే అక్కడ ధర్మాసనం తనకు సమర్పించిన సీల్డ్ కవర్లో ఆ ఆరోపణలేమిటో చూస్తుంది. వీటిపై మీ వాదనేమిటని కక్షిదారును ప్రశ్నించదు. పైగా ఆ సీల్డ్ కవర్ సమాచారం ఆధారంగా తీర్పు వెలువడుతుంది. సింగిల్ బెంచ్ ముందూ, డివిజన్ బెంచ్ ముందూ కూడా ‘మీడియా వన్’కు ఇదే అనుభవం ఎదురైంది. అయితే అసలు న్యాయస్థానాలు సీల్డ్ కవర్ను అంగీకరించే ధోరణి గతంలో లేనేలేదని చెప్పలేం. ప్రభుత్వోద్యోగుల సర్వీసు, పదోన్నతుల వ్యవహారాల్లో సంబంధిత అధికారుల ప్రతిష్ట కాపాడేందుకు... లైంగిక దాడుల కేసుల్లో బాధితుల గుర్తింపు రహస్యంగా ఉంచటానికి సీల్డ్ కవర్లో వివరాలు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఆఖరికి రాఫెల్ యుద్ధ విమానాల కేసులో సాంకేతిక అంశాలు వెల్లడిస్తే శత్రు దేశాలకు ఉప్పందించినట్టవుతుందని చెప్పటం వరకూ అంగీకరించవచ్చు. కానీ బీసీసీఐ విషయంలో తానే నియమించిన కమిటీ నివేదికనూ, గుజరాత్కు సంబంధించిన నకిలీ ఎన్కౌంటర్ కేసు, అయోధ్య స్థల దస్తావేజు కేసువంటి అంశాల్లో సైతం గోప్యత పాటించాలని ప్రభుత్వం చేసిన వినతిని న్యాయస్థానాలు అంగీకరించటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2013లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా ఈ స్థితి ఏర్పడింది. అయితే తాజా తీర్పులో సుప్రీంకోర్టు ప్రస్తావించినట్టు బ్రిటన్, కెనడా సుప్రీంకోర్టులు ఈ విషయంలో ఎన్నదగిన తీర్పులు వెలువరించాయి. కేసులకు సంబంధించిన సమాచారాన్ని దాచివుంచటం వల్ల ఆ కేసుల గురించి చర్చించుకోవటం, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించటం ప్రజలకు నిరాకరించినట్టే అవుతుందని అక్కడి న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. ‘మీడియా వన్’ కేసులో జాతీయ భద్రతను సాకుగా చూపిన కేంద్రం దాన్ని సమర్థించుకునేందుకు సీల్డ్ కవర్లో ప్రస్తావించిన కారణాలు పేలవంగా ఉన్నాయి. అందుకే గాల్లోంచి ఆరోపణలు సృష్టిస్తే అంగీకరించబోమని ధర్మాసనం వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ఇకపై ఇలాంటి కేసుల విష యంలో న్యాయస్థానాలు అనుసరించాల్సిన రెండు గీటురాళ్లను కూడా ప్రకటించింది. కేసులోని అంశాలు వెల్లడిస్తే జాతీయ భద్రతకు ముప్పు కలుగుతుందని భావించటానికి అవసరమైన సమా చారం ప్రభుత్వం అందించిందా లేదా అన్నది అందులో మొదటిది. వివేకవంతులైన వ్యక్తులు సైతం ఆ సమాచారం ఆధారంగా అలాగే భావించే అవకాశం ఉన్నదా లేదా అన్నది రెండోది. భావప్రకటనా స్వేచ్ఛకు పూచీపడే రాజ్యాంగంలోని 19వ అధికరణలోనే ఏయే అంశాల్లో నియంత్రణలు అమలు చేయవచ్చో వివరంగా ఉంది. వాటిని బేఖాతరు చేసి నచ్చని అభిప్రాయాలు ప్రకటించారన్న ఏకైక కారణంతో ఆ స్వేచ్ఛకు గండికొట్టడం రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీస్తుంది. అందుకే ‘మీడియా వన్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. -
భద్రతపై రాజీ లేదు: రాజ్నాథ్
తిరువనంతపురం: ‘‘భారతదేశం పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటుంది. అదే సమయంలో జాతీయ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోదు’’ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శివగిరి మఠం 90వ వార్షిక తీర్థయాత్రప్రారంభం సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఆయన మాట్లాడారు. సంఘ సంస్కర్త నారాయణ గురు బోధనల స్ఫూర్తితోనే కేంద్రం ఆత్మ నిర్భర్ పథకాన్ని తెచ్చిందన్నారు. దేశాన్ని, సరిహద్దులను రక్షించేందుకు ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో తాను కృషి చేస్తుండగా, దేశ ఆత్మను పరిరక్షించేందుకు శివగిరి మఠం సాధువులు కృషి చేస్తున్నారన్నారు. -
ఒలింపిక్ మాజీ స్విమ్మర్కు 12 ఏళ్ల జైలుశిక్ష
బెలారస్కు చెందిన మాజీ ఒలింపిక్ స్విమ్మర్ అలియాక్సాండ్రా హెరాసిమేనియాకు 12 ఏళ్ళ జైలుశిక్ష పడింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఆమె చర్యలు ఉన్నాయని.. ఆమె వల్ల దేశానికి హాని పొంచి ఉందన్న కారణంతో ఈ శిక్ష విధిస్తున్నట్లు మింక్స్ కోర్టు తెలిపింది. అలియాక్సాండ్రాతో పాటు ఆమె స్నేహితుడు పొలిటికల్ యాక్టివిస్ట్ అలెగ్జాండర్ ఒపేకిన్కు కూడా 12 ఏళ్ల జైలుశిక్ష విధించినట్లు పేర్కొంది. అలెగ్జాండర్ లుకాషెంకో యొక్క నిరంకుశ పాలనను నిరసించడంలో హెరాసిమేనియా, ఒపేకిన్ ముందు వరుసలో నిలిచి అపఖ్యాతిని సంపాదించుకున్నారని.. అందుకే వారి వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించి జైలుశిక్ష విధించారని న్యూస్ బీటీ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అలియాక్సాండ్రా మూడుసార్లు ఒలింపిక్ మెడల్స్ సొంతం చేసుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగం, 100 మీటర్ల ఫ్రీసైల్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచిన ఆమె.. 2016 రియో ఒలింపిక్స్లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. -
దేశ భద్రతపై మౌనమా? కేంద్రాన్ని నిలదీసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దు అంశంపై పార్లమెంట్లో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ మండిపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారంపై ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏమిటని నిలదీశారు. బుధవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తమ ఎంపీలను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. మన దేశ భూభాగాన్ని చైనా దురాక్రమిస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం నోరుమెదపడం లేదని ఆరోపించారు. పార్లమెంట్లో చర్చిద్దామని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దేశ రక్షణ, సరిహద్దు పరిస్థితిపై దేశ ప్రజలకు నిజాలు చెప్పాలిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. తన చర్యలు, విధానాలు ఏమిటో కూడా చెప్పాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? దేశ సరిహద్దును చైనా సైన్యం ఉల్లంఘిస్తుండడం అత్యంత ఆందోళనకరమైన అంశమని సోనియా గాంధీ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ చైనా సైన్యం దాడులను సమర్థంగా తిప్పికొడుతున్న మన జవాన్లకు మన దేశం యావత్తూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశ భద్రతకు సవాలు ఎదురైనప్పుడు పార్లమెంట్ను విశ్వాసంలోకి తీసుకోవడం ఒక ఆనవాయితీ అని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదని ఆక్షేపించారు. పార్లమెంట్లో చర్చ జరగకపోవడం వల్ల రాజకీయ పార్టీలకు, ప్రజలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో తెలియడం లేదన్నారు. దేశంలో విభజన రాజకీయాలు, సమాజంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటివి కొనసాగుతున్నాయని, దీనివల్ల విదేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదిరించడం మన దేశానికి కష్టతరం అవుతుందని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను చట్టం పరిధి నుంచి తప్పించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. జ్యుడీషియరీని పలుచన చేయొద్దని సూచించారు. ‘చైనా’పై చర్చ జరగాల్సిందే పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా మీ హయాంలో చర్చించారా?: కేంద్రం న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని విపక్షాలన్నీ మరోసారి డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ నేత సోనియాగాంధీ సారథ్యంలో బుధవారం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలు, డీఎంకే, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ(యూ), వామపక్షాలతో సహా 12 విపక్షాల ఎంపీలు పాల్గొన్నారు. ‘‘ప్రధాని మోదీ మౌనం వీడాల్సిందే. చైనా దురాక్రమణ యత్నాలపై మా ప్రశ్నలకు సభలో బదులిచ్చి తీరాల్సిందే’’ అని వారంతా నినదించారు. అయితే ఆ డిమాండ్ను కేంద్రం మరోసారి తోసిపుచ్చింది. యూపీఏ హయాంలో ఇలాంటి అంశాలను సభలో చర్చకు తాము డిమాండ్ చేస్తే ఇవ్వలేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. -
బలవంతపు మతమార్పిళ్లు... దేశభద్రతకే పెనుసవాలు!
న్యూఢిల్లీ: బలవంతపు మతమార్పిడులను అత్యంత తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. మోసగించి, ప్రలోభపెట్టి, భయపెట్టి మతాంతరీకరణ చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేసింది. ‘‘మత స్వేచ్ఛ ఉండొచ్చు. కానీ బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ ఎవరికీ లేదు! ఈ తరహా మార్పిడులను అడ్డుకోని పక్షంలో చాలా సమస్యాత్మక పరిస్థితులు తలెత్తుతాయి. ఈ పోకడలు నిజమే అయితే గనక అంతిమంగా ఇది దేశభద్రతకే పెను సవాలు విసరగలిగినంతటి తీవ్రమైన సమస్య! అంతేగాక పౌరులు తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను కూడా ప్రమాదంలో పడేస్తుంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తక్షణం జోక్యం చేసుకోండి. బలవంతపు మతమార్పిళ్లకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోండి. ఆ వివరాలతో 22లోగా అఫిడవిట్ దాఖలు చేయండి’’ అని ఆదేశించింది. బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ అడ్వకేట్ అశ్వనీకుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. బలవంతపు మతమార్పిడులను అడ్డుకునేందుకు కేంద్రం ఏం చేయనుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. ఈ అంశాన్ని రాజ్యాంగ పరిషత్తులో చర్చించినట్టు ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘డబ్బు తదితర ప్రలోభాలు చూపి, భయపెట్టి, మోసగించి మతం మార్చడాన్ని అడ్డుకునేందుకు ఒడిశా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తెచ్చిన రెండు చట్టాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ అంశం గతంలో సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినప్పుడు ఆ చట్టాల చెల్లుబాటును సమర్థించింది కూడా’’ అని ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల్లో ఈ బలవంతపు మతమార్పిళ్లు అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయన్నారు. ‘‘తాము క్రిమినల్ నేరాల్లో భాగస్వాములుగా మారుతున్నామన్న వాస్తవం కూడా ఇలాంటి బాధితులకు చాలాసార్లు తెలియదు. పైగా మతం మారుస్తున్న వాళ్లు తమకు సాయం చేస్తున్నారని భ్రమిస్తుంటారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. విచారణను నవంబర్ 28కి ధర్మాసనం వాయిదా వేసింది. -
సోషల్గా జర జాగ్రత్త! ఉద్యోగాలకే ఎసరు
మీరు ఉద్యోగులా? లేక కొలుకు కోసం వెదుకులాటలో ఉన్నారా? అయితే సోషల్ మీడియా వాడకంలో కాస్త జాగ్రత్త. అవి ఉన్నదే అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు కదా అంటారా? అలాంటి మాటలు వాదనకే బాగుంటాయి. సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లు చాలామంది కొలువులకు ఎసరు పెడుతున్నాయి. పనిష్మెంట్ బదిలీలకు, ప్రమోషన్ల నిలిపివేతకు కారణమవుతున్నాయి. వివాదాస్పద కామెంట్లు పెట్టేవారికి ఉద్యోగాలిచ్చేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు కూడా... ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో విమర్శించినందుకు గత అక్టోబర్లో ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయాడు. కేంద్ర మంత్రిపై విమర్శలు చేసినందుకు కర్ణాటకలో తాజాగా ఓ టీచర్పై సస్పెన్షన్ వేటు పడింది. సోషల్ మీడియాలో పెట్టే కామెంట్ల ప్రకంపనలు చాలా దూరం ప్రయాణిస్తున్నాయి. ఉద్యోగులు, ఉద్యోగార్థుల ‘సోషల్’ లైఫ్ మీద యాజమాన్యాలు, కంపెనీల నిఘా కొన్నేళ్లుగా బాగా పెరిగింది. అభ్యంతరకర, వివాదాస్పద కామెంట్లు చేస్తే ఉపాధికే ఎసరొస్తోంది. మరీ ముఖ్యంగా జాతి వివక్ష, జాతీయ భద్రత, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటివాటిపై సోషల్ మీడియాలో అస్సలు మాట్లాడకూడదని ఓ అంతర్జాతీయ అధ్యయనంలో తేలింది. ఈ మధ్య కాలంలో 28 శాతం మంది ఇలాంటి వాటిపై వ్యాఖ్యల వల్లే వీధిన పడ్డారట. వ్యక్తుల ఇష్టాయిష్టాలపై అనుచిత వ్యాఖ్యలు, మహిళలను ద్వేషించడం వల్ల 12 శాతం మంది ఉద్యోగాలకు ఎసరొచ్చిందట. ఆఫీసుల్లో గొడవలు పడి 17 శాతం, సోషల్ మీడియాలో కుళ్లుజోకులు, కనీస మానవత్వం లేని ప్రవర్తనతో 16 శాతం, బూతులు, హింసకు దిగుతామనే బెదిరింపులతో 8 శాతం, రాజకీయ విమర్శలతో 5 శాతం మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు!! సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలతో ఉద్యోగాలు కోల్పోయిన ఉదంతాలపై వచ్చిన వందలాది వార్తా కథనాల ఆధారంగా జరిగిన అధ్యయనంలో తేలిన విషయాలివి. మన దేశంలోనూ రాజకీయ విమర్శలు చేసినందుకు సామాజిక కార్యకర్తలు జైలుపాలవడం, కొందరిపై భౌతికదాడులు జరగడం తెలిసిందే. ఉద్యోగార్థులపై సోషల్ నిఘా గత పదేళ్లలో ఆధారంగా ఉద్యోగుల ఎంపికలో సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలను లోతుగా గమనించే ధోరణి పెరిగిందని వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్ వంటి దిగ్గజాలు జాతి వివక్ష, వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేస్తే ఎంత టాలెంటున్నా ఉద్యోగాలివ్వడం లేదు. ‘సోషల్’ హిస్టరీ బాగా లేకపోవడం వల్ల కంపెనీకి ఎంతో ఉపయోగపడతారనుకున్న ప్రతిభావంతులను కూడా వదులుకోవాల్సి వస్తోంది. ఇది బాధాకరమే అయినా తప్పడం లేదు. పని చేసే చోట ఇబ్బందులు రాకూడదు కదా! అందుకే నాయకత్వ స్థానాల్లో ఉండేవారికి ఎలాంటి బలహీనతలూ ఉండొద్దన్న నియమాన్ని కచ్చితంగా పాటిస్తున్నాం’’ అని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వర్ణవివక్షపై జరిగిన ఓ సదస్సులో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ‘సేజ్ పబ్’ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కంపెనీల మానవ వనరుల విభాగాలు ఏయే అంశాలను గమనిస్తున్నాయంటే... ► ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాంలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు? ► ఏ అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్నారు? ► సొంతగా ఏమైనా బ్లాగులు రన్ చేస్తున్నారా? ► వీటితో పాటు పలు ఇతర అంశాలపైనా నిఘా పెడుతున్నారు. ► పోలీసు (20%), టీచర్లు (24%), ప్రభుత్వోద్యోగులు (14%), ఆతిథ్య, రిటైల్ రంగాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉందట. ► వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులతో ఉద్యోగాలు పోతాయని మన దేశంలో 40 శాతం మందికి భయమున్నట్టు గతేడాది ఓ అధ్యయనంలో తేలింది.నే పలు సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేసినట్లు చాలామంది అంగీకరించారు. ► పని చేస్తున్న కంపెనీ, సంస్థపై సోషల్ మీడియాలో చెడుగా రాశామని 25.7 శాతం మంది ఒప్పుకున్నారు. ► సోషల్ మీడియా పోస్టుల వల్ల తమకేమీ కాదని 46.9 శాతం మంది నమ్ముతున్నారు. భిన్నాభిప్రాయాలు సోషల్ మీడియా పోస్టులకు కెరీర్తో ముడి పెట్టడం సబబా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. బికినీతో ఫొటో దిగి ఇన్స్టాలో పెట్టినందుకు ఒకరి ఉద్యోగం పోయింది. ఇది వ్యక్తిగత జీవితంలోకి అనుచితంగా చొరబడటమేనన్న వాదన ఉంది. సున్నిత అంశాలపై వివాదాస్పదంగా పోస్టులు పెట్టకపోవడమే మేలన్నది 2021 గ్రహీత సాహిత్య నోబెల్ గ్రహీత అబ్దుల్ రజాక్ గుర్మా వంటివారి అభిప్రాయం. ఇది యువతలో అభద్రతా భావం పెంచుతున్న వాదనతో గూగుల్ హెచ్ఆర్ విభాగం హెడ్ ప్రీతి నారాయణ్ అంగీకరించారు. కానీ విశృంఖలతకు ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పడాల్సిందేనని అభిప్రాయపడ్డారు. :::కంచర్ల యాదగిరిరెడ్డి -
బలమైన, ఐక్య ఆసియాన్
న్యూఢిల్లీ: అర్ధవంతమైన, దృఢమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా కృషి చేయాలని ఆసియాన్, భారత్ నిర్ణయించాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వాణిజ్యం, ప్రాంతీయ భద్రతకు సంబంధించి తలెత్తిన ఇబ్బందుల పరిష్కారానికి అన్వేషించాలని అంగీకరించాయి. గురువారం ఢిల్లీలో జరిగిన ఆసియాన్ విదేశాంగ మంత్రుల భేటీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రారంభోపన్యాసం చేశారు. యుద్ధం ప్రభావం ఆహారం, ఇంధన భద్రత, వినియోగవస్తువులు, ఎరువుల ధరల పెరుగుదలతోపాటు రవాణా, సరఫరా గొలుసుపై పడిందన్నారు. వాణిజ్యం, అనుసంధానత, రక్షణ, టీకా ఉత్పత్తి, ఇంధనం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భారత్– ఆసియాన్ తీర్మానించాయి. ఆసియాన్–భారత్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ (ఏఐటీఐజీఏ)పై సమీక్ష జరపాలని నిర్ణయించాయి. 10 దేశాలతో కూడిన ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్)తో సంబంధాలకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ సమావేశానికి సింగపూర్, బ్రూనై, ఇండోనేసియా, కాంబోడియా, మలేసియా, వియత్నాం దేశాల విదేశాంగ మంత్రులు వారు ప్రధాని మోదీతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. ఏడీపీని విస్తరించాలి: మోదీ న్యూఢిల్లీ: ఆకాంక్ష జిల్లాల పథకం(ఏడీపీ)ను బ్లాకులు, నగరాల్లో కూడా అమలు చేయాలని ప్రధాని మోదీ కోరారు. అవి స్ఫూర్తిదాయ జిల్లాలుగా మారాలని ఆకాంక్షించారు. ‘‘దేశ వ్యాప్తంగా 112 వెనకబడ్డ జిల్లాల్లో కేంద్రం 2018 నుంచి అమలు చేస్తున్న ఈ పథకం ఎంతో విజయవంతమైంది’’ అన్నారు. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో జరుగుతున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల భేటీలో ప్రధాని గురువారం మాట్లాడారు. టీచర్లు డిజిటల్ టెక్నాలజీ, మొబైల్ యాప్లతో విద్యాబోధనను బలోపేతం చేయాలన్నారు. రిటైర్డ్ టీచర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ శిక్షణ కోసం ప్రత్యేకంగా టీవీ చానల్ అవసరం ఉందని చెప్పారు. -
సహకరిస్తే భారీగా నగదు ఇస్తాం.. ప్రజలకు చైనా బంపరాఫర్
National Security' Tip-Offs: చైనా సంచలన ప్రకటన చేసింది. తన పౌరులను జాతీయ భద్రతకు సహకరించాల్సిందిగా అభ్యర్థించింది. ఇలా చేస్తే పౌరులకు సుమారు రూ. 11 లక్షల రివార్డును, సర్టిఫికేట్లను అందజేస్తానని చెప్పింది. జాతీయ భద్రతకు మద్దతిచ్చేలా.. భద్రతా ఉల్లంఘనలకు పాల్పడే వారి గురించి సమాచారం ఇస్తే పౌరులకు మంచి రివార్డులు అందిస్తామని ప్రకటించింది. అంతేకాదు నేరాలను నివారించడం లేదా ఏదైనా కేసు పరిష్కరించడంలో సహకరించి మంచి తెగువ చూపించనవారికి పెద్ద మొత్తంలో నగదు, సర్టిఫికేట్లు ఇస్తామని తెలిపింది. ఇది ఒక రకంగా జాతీయ భద్రతకు సహకరించేలా పౌరుల్లోని ధ్యైర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని సమీకరించే చర్యగా పేర్కొనవచ్చు. చైనా గత కొన్ని సంవత్సరాలుగా భద్రతా ఉల్లంఘనల గురించి సమాచారం అందించినవారికి మంచి నగదు బహుమతులను అందిస్తోంది. అయితే.. ఇప్పుడు చైనా భద్రతా మంత్రిత్వ శాఖ పౌరులందరూ ఆచరించేలా జాతీయ భద్రతకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జాతీయ భద్రతా ఉల్లంఘనలకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండమని బీజింగ్ తమ దేశా ప్రజలకు సూచించింది. చైనా మీడియా సంస్థలు కూడా ప్రజలను మన మధ్య ఉండే గూఢచారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. మన మధ్యే గూఢచారులుగా తిరిగే వాళ్లు ఎలా ఉంటారో కూడా సూచనలిచ్చింది. ఈ మేరకు చైనా ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ చెంగ్ లీ జాతీయ భద్రతా ఉల్లంఘనల అనుమానంతో 2020లో నిర్బంధించింది ఐతే ఆమెను నిర్బంధించిన సమయంలో వచ్చిన ఆరోపణల గురించి స్పష్టత లేకపోవడంతో ఈ కేసు రాజకీయంగా ప్రేరేపించబడిందా లేక ప్రతికారం తీర్చుకుంటుందా అనే ఊహాగానాలకు తెరలేపింది. అలాగే ఆస్ట్రేలియాలో జన్మించిన చైనీస్ రచయిత యాంగ్ జున్ గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్నారు. హాంకాంగ్ నగరంలో చెలరేగిన హిసాత్మక ప్రజాస్వామ్య అనుకూల నిరసనల అసమ్మతిని తొలగించడానికి చైనా 2020లో విధించిన జాతీయ భద్రతా చట్టం ఉపయోగపడింది. అప్పటి నుంచి చైనా జాతీయ భద్రతను మరింత పటిష్టంగా ఉంచుకునే దిశగా గట్టి చర్యలు తీసుకుంటోంది. (చదవండి: మంటల్లో వేసినా కాలిపోని పుస్తకం...వేలంలో ఎంత పలికిందంటే..?) -
ఎలన్ మస్క్ కొంప ముంచే పనిలో చైనా!
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు చైనాతో ఉన్న సత్సంబంధాల గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ ఆయనకు పెద్ద షాకే ఇచ్చింది. ఆయన సారథ్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్లింక్ను నాశనం చేసేందుకు ప్లాన్ గీసుకుంది. ఈ మేరకు చైనా నుంచే అధికారిక సంకేతాలు వెలువడడం గమనార్హం. ఇప్పటికే రష్యా స్పేస్ ఏజెన్సీ.. ఉక్రెయిన్ సాయం విషయంలో ఎలన్ మస్క్ స్టార్లింక్ సేవలపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే స్టార్లింక్ శాటిలైట్లను కూల్చేయాలని చైనా భావిస్తోంది. ప్రపంచంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో అత్యంత చౌకైన సర్వీస్లు అందిస్తోంది ఎలన్ మస్క్ స్టార్లింక్. ఒకవేళ తమ జాతీయ భద్రతకు గనుక హాని కలిగించేవిగా పరిణమిస్తే.. స్టార్లింక్ శాటిలైట్లను ముందువెనకా ఆలోచించకుండా కూల్చేస్తామని చైనా మిలిటరీ ప్రకటించింది. ఈ మేరకు అధ్యయనంతో కూడిన ఓ ప్రకటన వెలువడింది. అంతేకాదు స్టార్లింక్ శాటిలైట్పై నిఘా ఉంచాలని, నిరంతరం పర్యవేక్షణ అవసరం ఉందని చైనా సైంటిస్టుల అభిప్రాయాలను సైతం ప్రచురించింది. ఈ అధ్యయనానికి బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాకింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రీసెర్చర్ రెన్ యువాన్జెన్ నేతృత్వం వహించారు. స్టార్లింక్ సేవలు.. అమెరికా డ్రోన్స్, ఫైటర్ జెట్స్ డేటా ట్రాన్స్మిషన్ను వేగాన్ని(దాదాపు వంద రెట్ల వేగం) పెంచుతోందన్న ప్రచారం నేపథ్యంలో.. చైనా మిలిటరీ రీసెర్చర్లు ఈ అధ్యయనం చేపట్టారు. ఎలన్ మస్క్ స్టార్లింక్ను చాలా ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్నాడు. లో-ఎర్త్ ఆర్బిట్లో చిన్న చిన్న శాటిలైట్లను ప్రవేశపెట్టడం ద్వారా.. ఈ భూమ్మీద బ్రాడ్బాండ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది స్టార్లింక్. స్టార్లింక్ వేలాది చిన్న ఉపగ్రహాలతో కూడి ఉంది. ఒకవేళ ముప్పు పొంచి ఉందని భావిస్తే.. వాటన్నింటినీ నాశనం చేయాలనేది చైనా ప్రణాళిక. క్షిపణులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావు. కాబట్టి, చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి లేజర్లు, మైక్రోవేవ్ టెక్నాలజీ లేదంటే చిన్న ఉపగ్రహాలను, స్టార్లింక్ శాటిలైట్ కట్టడికి కూడా ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. దీనిపై మస్క్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి!. చదవండి: మస్క్ నాతో నీచంగా ప్రవర్తించాడు! -
టెక్ ఫాగ్ యాప్ కలకలం.. గూఢచర్యం ఆరోపణలు!
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరోసారి గూఢచర్యం ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. టెక్ ఫాగ్ యాప్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఐటీ సెల్పై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. పౌరుల గోప్యతకు టెక్ ఫాగ్ యాప్తో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై చర్చ జరపాలని టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్కు లేఖ రాశారు. టెక్ ఫాగ్ యాప్ వల్ల జాతీయ భద్రత, దేశ పౌరుల గోప్యతకు ముప్పు వాటిల్లనుందని తెలిపారు. చదవండి: గోవా బీజేపీకి షాక్ ఈ అంశంపై చర్చించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం భేటీ ఏర్పాటు చేయాలని కమిటీ ఛైర్మన్ ఆనందర్ శర్మను డిమాండ్ చేశారు. బీజేపీ ఐటీ సెల్తో సంబంధాలు ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ యాప్ను ఉపయోగించి ఇన్యాక్టివ్గా ఉన్న వాట్సాప్ ఖాతాల నియంత్రణ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రెడింగ్లో ఉన్న విషయాలను హైజాక్ చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ ఓ పత్రిక కథనంతో ‘టెక్ ఫాగ్’ యాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
బెజవాడ అడ్రస్తో బురిడీ.. గమ్యస్థానం ఢిల్లీయే..
సాక్షి, అమరావతి: ఇటీవల గుజరాత్లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ నిల్వలతో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు స్పష్టం చేశాయి. అఫ్గానిస్తాన్ నుంచి ఇరాక్ మీదుగా గుజరాత్కు దిగుమతైన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ గమ్యస్థానం దేశ రాజధాని ఢిల్లీయేనని ప్రాథమికంగా నిర్ధారించింది. డీఆర్ఐ, ఇతర నిఘా సంస్థలను బురిడీ కొట్టించేందుకే స్మగ్లర్లు విజయవాడ చిరునామాను వాడుకున్నట్లు తుది అంచనాకు వచ్చింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో ముడిపడిన డ్రగ్స్ అక్రమ తరలింపు కేసులో దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. హెరాయిన్ దిగుమతితో ఏపీకి సంబంధం లేదని ఈ కేసుకు సంబంధించిన నివేదికలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. విజయవాడకు సంబంధమే లేదు... ఈ కేసులో చెన్నైకు చెందిన మాచవరం సుధాకర్, ఆయన భార్య గోవిందరాజు దుర్గాపూర్ణిమ వైశాలితోపాటు ఆరుగురు అఫ్గాన్వాసులు, ఉజ్బెకిస్తాన్కు చెందిన ఓ మహిళను డీఆర్ఐ ఇప్పటికే అరెస్టు చేసింది. అఫ్గానిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా హెరాయిన్ దిగుమతి దందాలో సుధాకర్ దంపతులను కమీషన్ ప్రాతిపదికన వాడుకుందని డీఆర్ఐ ప్రాథమికంగా గుర్తించింది. ఈ క్రమంలోనే నిందితులు విజయవాడ చిరునామాతో రిజిస్టర్ చేసిన అషీ ట్రేడింగ్ కంపెనీ పేరును వాడుకునేందుకు సమ్మతించారు. అఫ్గానిస్తాన్కు చెందిన ముఠా సభ్యులే మన దేశంలోనూ తిష్టవేసి డ్రగ్స్ రాకెట్ నడిపించారు. సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో దాదాపు రూ.21 వేల కోట్ల విలువైన రెండు కంటైనర్ల హెరాయిన్ను డీఆర్ఐ జప్తు చేసిన విషయం విదితమే. అషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో జూన్లో కూడా అఫ్గానిస్తాన్ నుంచి రెండు కంటైనర్ల హెరాయిన్ను ముంద్రా పోర్టులో దిగుమతి చేసి గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీకి తరలించినట్లు విచారణలో వెల్లడి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ రెండు కంటైనర్ల హెరాయిన్ను గుజరాత్ నుంచి నేరుగా ఢిల్లీకి తరలించారని, విజయవాడకుగానీ ఆంధ్ర ప్రదేశ్లోని ఇతర చోట్లకుగానీ తరలించలేదన్నది కీలక అంశమని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. అంటే కేవలం తమ కళ్లు గప్పేందుకే విజయవాడ చిరునామాను వినియోగించుకున్నారని, హెరాయిన్ స్మగ్లింగ్తో ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి సంబంధం లేదన్నది స్పష్టమైందని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. ప్రాధాన్యం సంతరించుకున్న న్యాయమూర్తి వ్యాఖ్యలు గుజరాత్లో హెరాయిన్ జప్తు కేసులో అరెస్టైన నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విజయవాడకు చెందిన సంస్థ హెరాయిన్ను దిగుమతి చేసుకుంటే పశ్చిమ తీరాన గుజరాత్లో ఉన్న ముంద్రా పోర్టుకు ఎందుకు తెస్తారు? విజయవాడకు సమీపంలో తూర్పు తీరంలోనే పలు పోర్టులు ఉన్నాయి కదా? అని పేర్కొన్నారు. హెరాయిన్ను ఢిల్లీకి తరలించాలన్నదే స్మగ్లర్ల ఉద్దేశమని డీఆర్ఐ కూడా న్యాయస్థానానికి తెలిపింది. విజయవాడకు చేర్చడం అసలు స్మగ్లర్ల లక్ష్యమే కాదని పేర్కొంది. స్మగ్లింగ్ ముఠా అంతా అఫ్గానిస్తాన్, ఇరాన్, ఢిల్లీల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. చెన్నై నుంచి అఫ్గానిస్తాన్లోని ముఠా సభ్యులతో ఫోన్లో మాట్లాడి హెరాయిన్ను గుజరాత్ తీరానికి తెప్పించి ఢిల్లీకి తరలిస్తున్నారని తెలిపింది. అఫ్గానిస్తాన్, ఇరాన్లోని ముఠాలు నడుపుతున్న ఈ దందాలో ఉగ్రవాద, దేశ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉన్నట్లు కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ స్మగ్లింగ్ కేసులు విచారించే డీఆర్ఐ కాకుండా ఉగ్రవాద నేరాలను దర్యాప్తు చేసే ‘ఎన్ఐఏ’కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. -
భద్రతా సవాళ్లు మరింత సంక్లిష్టం
న్యూఢిల్లీ: మతచాంధస, ఉగ్రమూలాలున్న తాలిబన్లు అఫ్గాన్ను హస్తగతం చేసుకోవడంతో ప్రపంచ ‘రాజకీయ’ స్వరూపం మారుతోందని, దీంతో దేశ భద్రతా సవాళ్లు మరింత సంక్షిష్టమవుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. సవాళ్లకు ధీటుగా నిలబడాలంటే సొంత రక్షణ రంగ వ్యవస్థను మరింత పటిష్టంచేయాల్సిన సమయం ఆసన్నమైందని రాజ్నాథ్ పునరుద్ఘాటించారు. రక్షణరంగంలో వినూత్న ఆవిష్కరణలకు ఉద్దేశించిన ‘డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్ 5.0’ను గురువారం ఢిల్లీలో ప్రారంభించిన సందర్భంగా రాజ్నాథ్ ఉపన్యసించారు. రక్షణరంగానికి సంబంధించిన నూతన సాంకేతికతను ప్రోత్సహించడానికి ‘ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్లెన్స్(ఐడెక్స్) పేరిట ఒక కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘ ప్రపంచవ్యాప్తంగా దేశ భద్రతపరంగా మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. వాటికి అనుగుణంగా మారడంతోపాటు, సాయుధదళాల పూర్తి అవసరాలు తీర్చే స్థాయిలో, వేరే దేశాలపై ఆధారపడకుండా, రక్షణ రంగంలో ఆయుధాలు, తదితర సైనిక ఉపకరణాల ఉత్పత్తిలో భారత్ మరింత స్వావలంభన సాధించాలి’ అని రాజ్నాథ్ అభిలషించారు. భారత రక్షణ ఉత్పత్తి రంగాన్ని మరింతగా పరిపుష్టంచేయడంలో ప్రైవేట్ రంగం సైతం తమ వంత భాగస్వామ్యపాత్ర తప్పక పోషించాలని ఆయన సూచించారు. ‘భారత్లో ప్రతిభావంతులకు కొదవ లేదు. అలాగే ప్రతిభావంతులకు మంచి డిమాండ్ ఉంది. అయితే, ఈ ప్రతిభావంతులను, ‘డిమాండ్’ను ఒకే తాటి మీదకు తెచ్చే సరైన వేదికే లేదు. ఐడెక్స్ ఇందుకు చక్కని పరిష్కారం’ అని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. మారుతున్న రక్షణ విధానం రక్షణ ఉత్పత్తుల హబ్గా భారత్ను తీర్చిదిద్దేందుకు గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టింది. దేశీయ రక్షణ ఉత్పత్తి రంగంలో అవకాశాలు పెంచేందుకు పలు ఉత్పత్తుల దిగుమతుల విధానానికి వచ్చే మూడేళ్లలోగా స్వస్తిపలకాలని గట్టి నిర్ణయం తీసుకుంది. రవాణా విమానం, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు, సోనార్ వ్యవస్థ ఇలా 101 రకాల ఉత్పత్తులను 2024 ఏడాది తర్వాత భారత్ దిగుమతి చేసుకోబోదు. ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలు, చిన్న యుద్ధనౌకలు, వాయుమార్గంలో హెచ్చరిక వ్యవస్థలు, ట్యాంక్ ఇంజన్లు, రాడార్లు తదితర 108 రకాల ఉత్పత్తుల దిగుమతులపై నిషేధాన్ని అమల్లోకి తేనుంది. -
జాతీయ భద్రతపై ప్రధాని మోదీ సమీక్ష
-
టిక్టాక్, వీచాట్ల బ్యాన్.. చైనా స్పందన
బీజింగ్: జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సోషల్మీడియా యాప్లు టిక్టాక్, వీ చాట్లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై చైనా శనివారం స్పందించింది. అమెరికా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంతత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘బెదిరింపులను మానుకోవాలని, (దాని) తప్పుడు చర్యలను నిలిపివేయాలని.. న్యాయమైన, పారదర్శక అంతర్జాతీయ నియమాలను, ఆర్డర్లను ఖచ్చితంగా పాటించాలని చైనా అమెరికాను కోరుతోంది అని తెలిపింది. అంతేకాక అమెరికా తనదైన మార్గంలో వెళ్లాలని పట్టుబడుతుంటే, చైనా కంపెనీల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా తెలిపింది. అమెరికా జారీ చేసిన ఆర్డర్ ప్రకారం, టెన్సెంట్ యాజమాన్యంలోని వీచాట్ యాప్ ఆదివారం నుంచి అగ్రరాజ్యంలో తన కార్యాచరణను కోల్పోతుంది. ఇక టిక్టాక్పై ప్రసస్తుతం అప్డేట్ ఇన్స్టాల్ చేయకుండా నిషేధం విదించారు. కాకపోతే నవంబర్ 12 వరకు టిక్టాక్ను యాక్సెస్ చేయవచ్చు. (చదవండి: అందుకే ఆ యాప్స్పై నిషేధం) సెప్టెంబర్ 15లోపు, టిక్టాక్, వీ చాట్ యాప్ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు యూఎస్ కామర్స్ సెక్రటరీ విల్బుర్ రాస్ చెప్పారు. -
టిక్టాక్, వీ చాట్లపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్లు టిక్ టాక్, వీ చాట్ లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా ఆదేశాలు జారీచేసింది. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్, ఇదివరకే మొత్తం 224 చైనా యాప్లపై నిషే«ధించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15లోపు, టిక్ టాక్, వీ చాట్ యాప్ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు యూఎస్ కామర్స్ సెక్రటరీ విల్బుర్ రాస్ చెప్పారు. టిక్ టాక్, వీ చాట్లాగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే, ఇదే గతి పడుతుందని, మిగతా సామాజిక మాధ్యమాల యాప్లను హెచ్చరించారు. సెప్టెంబర్ 20 నుంచి, ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. -
టిక్టాక్.. అమెరికా ఆస్తులను అమ్ముకోండి
వాషింగ్టన్: అమెరికాలో టిక్టాక్కు సంబంధించి ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని 90 రోజుల్లోగా అమ్ముకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థకు హెచ్చరిక జారీ చేశారు. చైనాకు చెందిన టిక్టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ అమెరికాకు చెందిన సమాచారాన్ని సేకరిస్తోందని, అది జాతీయ భద్రతకు ప్రమాదకరమంటూ టిక్టాక్ను ఇటీవల నిషేధించిన సంగతి తెలిసిందే. అమెరికా యూజర్ల నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా తమకు అప్పగించాలని, ఆస్తులను 90 రోజుల్లోగా అమ్ముకోవాలంటూ జారీ చేసిన ఆదేశాలపై తాజాగా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. -
పబ్జీ, లూడో గేమ్స్కూ చెక్!
న్యూఢిల్లీ: భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించిన కేంద్ర ప్రభుత్వం మరో 47 చైనా మొబైల్ యాప్స్పై నిషేధం విధించింది. జూన్ 29న కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్లను నిషేధించింది. దీంతో ఇప్పటి వరకు నిషేధం విధించిన మొబైల్ యాప్ల సంఖ్య 106 కి చేరింది. ఈ 47 యాప్లు సైతం, యిప్పటికే నిషేధించిన యాప్లకు సంబంధించినవే. శుక్రవారం ఈ యాప్లను నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీ మొబైల్, ఈ–కామర్స్ విభాగానికి చెందిన ఆలీఎక్స్ప్రెస్, మరో ప్రముఖ గేమింగ్ ‘లూడో వరల్డ్’, జిలీ, మ్యూజిక్ యాప్ రెస్సో యాప్స్లనూ నిషేధించాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇవన్నీ చైనాలోని షావోమీ, టెన్సెంట్, అలీబాబా, బైట్డాన్స్ లాంటి అతిపెద్ద కంపెనీలకు చెందిన యాప్లు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని మొత్తం 275 చైనా యాప్లపై కేంద్రం నిఘాపెట్టింది. చైనా నుంచి పనిచేసే అన్ని టెక్ కంపెనీలనూ, చైనా యాజమాన్యంలోని కంపెనీలనూ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ లా ఆఫ్ 2017’నియంత్రిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఈ యాప్లు సేకరించే సమాచారం మొత్తం చైనా ప్రభుత్వానికి చేరుతుంది. ఇది అన్ని ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. -
చైనా పార్లమెంట్ కీలక నిర్ణయం
బీజింగ్ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్తో పోరాడుతున్న క్లిష్ట సమయంలోనూ చైనా తన సామ్రాజాన్ని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తోంది. హాంకాంగ్పై ఆధిపత్యానికి వడివడిగా అడుగులు వేస్తున్న డ్రాగన్ దేశం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్ వాసుల స్వేచ్ఛకు సంకెళ్లు వేసే జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలతో జాతీయ భద్రతా చట్టంపై చర్చించేందుకు గురువారం ప్రత్యేకంగా సమావేశమైన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. మొత్తం 2800 మంది ఎన్పీసీ సభ్యులు నూతన చట్టానికి అనుకూలంగా ఓట్లు వేశారని సమాచారం. తాజా నిర్ణయంతో చైనా ఇంటెలిజెన్స్ సంస్థలు హాంకాంగ్లో తిష్ట వేసే అవకాశం ఉంది. హాంకాంగ్లో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అణిచేయడానికి, విదేశీ జోక్యాన్ని నిరోధించడానికి ఈ చట్టం ఎంతో అవసరమని చైనా ప్రభుత్వం చెబుతోంది. ఒక దేశం రెండు వ్యవస్థల విధానాన్ని మరింత మెరుగుపరచి.. దానిని పటిష్టం చేయాలని భావిస్తోంది. కాగా చైనా చట్టాలను, జాతీయ గీతాన్ని అవమానిస్తే నేరంగా పరిగణించే బిల్లుకు గత నెలలోనే ముసాయిదాను తయారు చేసిన విషయం తెలిసిందే. (ఆమెను విడుదల చేయండి : చైనా వార్నింగ్!) -
5 జీ నెట్వర్క్ : అమెరికా కీలక ముందడుగు
వాషింగ్టన్: జాతీయ భద్రత, 5 జీ నెట్వర్క్ సమగ్రత రక్షణ అంశంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసింది. తద్వారా చైనీస్ టెలికం దిగ్గజం వావే టెక్నాలజీస్ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయాలని నిర్ణయించింది. అమెరికా పౌరుల గోప్యత, ప్రపంచ వ్యాప్తంగా 5జీ నెట్వర్క్ వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేసేందుకు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ ఆ చర్యలను తామెంతమాత్రం సహించబోమని హెచ్చరించింది ఆ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఓ ప్రకటన విడుదల చేశారు. (2022 నాటికి భారత్లో 5జీ సేవలు). ఇక వావేను విశ్వసనీయత లేని వ్యాపార సంస్థగా అమెరికా అభివర్ణించింది. చైనా అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆ సంస్థ పనిచేస్తుందని ఆరోపణలు గుప్పించింది. అమెరికాలో వావే గూఢచర్యం చేస్తోందని ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆ సంస్థపై నేరారోపణలు చేసింది. అదే విధంగా ఇరాన్తో అనుమానాస్పద ఒప్పందాలు కుదర్చుకుని, ఆ దేశానికి సహకరిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో వావే నమ్మదగిన వ్యాపార సంస్థ కాదని పేర్కొంది. ఏదైనా దేశానికి చెందిన 5జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు గనుక వావే సంస్థ వద్ద ఉన్నట్లయితే, ఆ దేశంపై గూఢచర్యం చేసే అవకాశాలు ఉంటాయన్న సమాచారాన్ని తన మిత్ర దేశాలతో పంచుకుంది. కాబట్టి వావేపై ఆంక్షలు విధించాలని సూచించింది. (5జీ టెక్నాలజీతో కొత్త తరం కార్లు) ఇక తాజా నిబంధనల నేపథ్యంలో అమెరికా సాంకేతికతను వావే దుర్వినియోగం చేసే వీలు లేకుండా పోతుందని, తద్వారా తమ జాతీయ భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లబోదని అమెరికా పేర్కొంది. అంతేగాక అమెరికా టెక్నాలజీ లేదా సాఫ్ట్వేర్ను ఉపయోగించి వావే సంస్థ కోసం సెమీకండక్టర్లను తయారు చేసే దేశాలపై సాంకేతికపరంగా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఇక నుంచి తమ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్ చేసే వస్తువులను వావేకు అమ్మాలనుకుంటే లైసెన్స్ తీసుకోవాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. జాతీయ భద్రత, అంతర్జాతీయ సుస్థిరతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు హువావేకు ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు పేర్కొంది.(ఎవరెస్ట్ పర్వతంపైనా 5జీ సిగ్నల్) కాగా, మొబైల్ ఫోన్ల నెట్వర్క్లో నూతన విప్లవంగా భావిస్తున్న 5జీ నెట్వర్క్ టెక్నాలజీని అందించేందుకు వావే సంస్థ వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వావే టెక్నాలజీ కారణంగా దేశ భద్రత పరంగా ముప్పు కలిగించేలా ఉందంటూ వావేపై అమెరికా ఆంక్షలు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో 5 జీ సేవలను అభివృద్ధి చేసేందుకు ఆ దేశ టెలికాం సంస్థ ఎంటీఎస్తో గతేడాది జూన్లో వావే ఒప్పందం కుదుర్చుకుంది. -
ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు కాదు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సౌకర్యం ప్రాథమిక హక్కు అనే అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలిపింది. ఇంటర్నెట్ హక్కుతోపాటు దేశ భద్రతా చాలా ముఖ్యమైన విషయమేనని గుర్తించాలంది. కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, న్యాయశాఖల మంత్రి రవిశంకర్ గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. ‘ఇంటర్నెట్ ద్వారా భావాలు, అభిప్రాయాలను తెలుసుకోవడం భావవ్యక్తీకరణ హక్కులో ఒక భాగం. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కశ్మీర్లో హింస, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు పాక్ ఇంటర్నెట్ను దుర్వినియోగం చేస్తోందంటూ ఆయన.. ఇంటర్నెట్తోపాటు దేశ భద్రత ముఖ్యమైందేనని అందరూ గుర్తించాలన్నారు. దీనిపై రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నేత గులామ్ నబీ ఆజాద్ అనుబంధ ప్రశ్నకు సమాధానంగా మంత్రి..‘కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన మీరు ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ దుర్వినియోగం అవుతోందని మీకూ తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్పై విధించిన ఆంక్షలను సమీక్షించి సడలించేందుకు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కమిటీలు పనిచేస్తున్నాయని వివరించారు. కశ్మీర్లో, లడాఖ్ల్లో ప్రభుత్వం, బ్యాంకింగ్, పర్యాటకం, ఈ కామర్స్, రవాణా, విద్య తదితర రంగాలకు సంబంధించిన 783 వెబ్సైట్లపై ఎటువంటి నియంత్రణలు లేవన్నారు. ‘నెట్’దుర్వినియోగానికి ఆయా సంస్థలదే బాధ్యత ఇతరుల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా అశ్లీల వీడియాలు, చిత్రాలను ఉంచడం, పుకార్లు వ్యాపింప జేయడం, హింసను ప్రేరేపించడం వంటి వాటికి యూట్యూబ్, గూగుల్, వాట్సాప్ తదితర సామాజిక వేదికలను వాడుకోవడం ఆందోళన కలిగిస్తోందని రవిశంకర్ అన్నారు. ఇందుకు గాను ఆయా సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వాట్సాప్కు సంబంధించి.. అందులోని సమాచారం మూలాలను తెలుసుకోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. యూట్యూట్లో ఇతరులపై కక్ష తీర్చుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ఉంచే అశ్లీల చిత్రాలు, వీడియోలకు సంబంధించి ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. -
మాటల కోటల్లో.. రక్షణకు అరకొరే..
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో దేశ భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రక్షణ రంగానికి రూ. 3.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. పొరుగు దేశాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రక్షణ రంగం అధిక ఆర్థిక కేటాయింపుల కోసం ఎదురుచూస్తుండగా గత యేడాదికంటే రక్షణ బడ్జెట్ కేటాయింపులను కేంద్రం ఆరుశాతం కూడా పెంచకపోవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం రక్షణ రంగానికి రూ.3.18 లక్షలకోట్లు కేటాయించింది. కొత్త ఆయుధాల కొనుగోలు, యుద్ధ విమానాలూ, యుద్ధనౌకలు, ఇతర సైనిక పరికరాలు కొనుగోలు చేయడానికి మూలధన వ్యయం కోసం రూ. 1.13 లక్షల కోట్లు కేటాయించారు. 2019–20 సవరించిన రూ. 3.31 లక్షల కోట్ల అంచనా ప్రకారం అయితే ఈ పెంపుదల కేవలం 1.8 శాతం మాత్రమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చైనా–భారత్ యుద్ధం1962 తరువాత రక్షణ రంగానికి జరిపిన అతితక్కువ బడ్జెట్ కేటాయింపులు. ఉద్యోగుల వేతనాలూ, నిర్వహణకు రూ.2.09 లక్షల కోట్లు అవుతుంది. రక్షణ రంగ ఉద్యోగులకు పెన్షన్లకు కేటాయించిన రూ.1.33 కోట్లు కలుపుకుంటే ఈ మొత్తం కేటాయింపులు 4.71 లక్షల కోట్ల రూపాయలకు చేరతాయి. చైనా తన రక్షణ వ్యవస్థని మరింత పటిష్టం చేసుకుంటున్న నేపథ్యంలోనూ, మారుతున్న దేశభద్రత రీత్యా, సుదీర్ఘకాలంగా పెండింగ్లో రక్షణ రంగ ఆధునికీకరణకు ఇంకా ఎక్కువ నిధులు అవసరమవుతాయి. గత ఏడాది బాలకోట్ దాడుల అనంతరం బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం అయ్యింది. అయితే ఊహించిన దానికంటే భిన్నంగా తక్కువ నిధులే కేటాయించారు.అవసరాలను అనుగుణంగా కేటాయింపులు లేకపోయినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే ఈ కేటాయింపులు సంతృప్తికరంగానే ఉన్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ‘‘రక్షణ రంగానికి కేటాయించిన ని«ధులు సరిపోక పోయినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థని పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలసిస్ కి చెందిన డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గత ఏడాది పెట్టుబడి వ్యయం రూ.1,03,394 కోట్లను రూ.1,13,734 కోట్లకు పెంచారు. ఇది గతం కంటే 10,340 కోట్ల రూపాయలు అధికం. ఇక ఉద్యోగుల వేతనాలూ, నిర్వహణ విభాగాలను కలిపితే రూ.2,09,319 కోట్ల రూపాయలవుతుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం 2019–20లో వేతనాలూ, తదితరాలకు 2,01,901 కోట్ల రూపాయలు కేటాయించారు. గత పదేళ్లలో రక్షణ రంగ కేటాయింపులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రతియేటా సుమారు రక్షణ రంగం నుంచి దాదాపు 60,000 మంది పదవీ విరమణ చేస్తున్నందున ఈ రంగంలో పెన్షన్లకు కేటాయించే నిధుల శాతం పెరుగుతున్నట్టు 2019లో స్టాండింగ్ కమిటీ పేర్కొన్నది. దీంతో సాయుధ దళాల ఆధునీకరణకు నిధులు తగ్గుతున్నాయి. గత పదేళ్ళలో రక్షణరంగంలోని ఉద్యోగుల పెన్షన్లకు ఖర్చు చేస్తున్న మొత్తం 12 శాతానికి పెరిగింది. ప్రభుత్వం పెన్షన్ బిల్లును, కొన్ని ఇతర పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా లేదా ముందస్తు పదవీ విరమణ ద్వారా ప్రభుత్వం పెన్షన్ బిల్లుని తగ్గిస్తుందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. -
విభజన వ్యూహాలు ప్రమాదకరం
ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత, పాకిస్తాన్ అవలక్షణాలుగా చెబుతున్న అంశాల నుంచి తనను తాను వేరుచేసుకోవడానికి భారత్కు 25 ఏళ్లు పట్టింది. కానీ ఇన్నేళ్లుగా దేశం సాధించిన ప్రయోజనాలన్నింటినీ దేశీయ ప్రయోజనాల పేరిట మోదీ, అమిత్ షాలు వృథా చేసేశారు. భారత్ గురించి పాకిస్తాన్లో పెంచిపోషిస్తూ వచ్చిన అభద్రతా భావం, వైరభావం, ఉన్మాద ప్రచారం వంటివి మన దేశంలో ప్రస్తుతం కొన్ని చర్చల్లో కనిపించడం ఆశ్చర్యకరం. దేశీయ రాజకీయాల్లో తనకు ఉపయోగపడే సాధనంగా పాకిస్తాన్ను భారత్ ఇప్పుడు కొత్తగా కనుగొంటోంది. మత ప్రాధాన్యమైన, జాతీయ భద్రతా రాజ్యాన్ని నిర్మించుకోవడంలో పాక్ చేసిన ప్రయోగాలను భారత్ ఇప్పుడు చేపట్టాలనుకోవడం వేర్పాటువాదంలోకి మనకు మనం కూరుకుపోయేలా చేస్తుంది. నిజానికి ఈ విభజన తత్వం మనం అధిగమించాల్సిన విషాదం మాత్రమే. జాతీయ భద్రత కలిగిన దేశాన్ని మనం ఎలా నిర్వచించాలి? మన పొరుగునే ఉంటున్న పాకిస్తాన్ నుంచి దీనికి ఉదాహరణలను చూద్దాం. జాతీయ భద్రత లేక అభద్రత అనే భావం చుట్టూతానే పాకిస్తాన్కి సంబంధించిన ప్రతి విషయం నిర్మాణమవుతూ వచ్చింది. అందుకే పాక్ సైన్యం దేశ అధికార చట్రంలో శాశ్వతమైన, ప్రత్యేక హోదాను కలిగి ఉంది. దాని నిఘా సంస్థ అయిన ఐఎస్ఐకి ఎవరికీ లేనంత సంస్థాగత స్వయం ప్రతిపత్తిని కట్టబెట్టారు. పాకిస్తాన్లోని 21 కోట్ల మందికి పైగా ప్రజలను ఎవరైనా ఎలా భ్రమల్లో పెట్టగలరు? అంటే ఒక ప్రమాదకరమైన దెయ్యాన్ని చూపించడం ద్వారా ఇన్ని కోట్ల మందిని భయపెడుతూ పాక్ తన పబ్బం గడుపుకుంటూ వచ్చింది. జాతీయ భద్రత కలిగిన దేశ నిర్మాణం అంటూ సమర్థించుకోవాలంటే ముందుగా మీరు ప్రజల్లో భయాన్ని పాదుకొల్పాలి. పాక్ ప్రజల పాలిట భయంకరమైన రాక్షసిగా భారత్ని పాక్ విజయవంతంగా చిత్రిస్తూ వచ్చింది. భారత్ బూచిని చూపించడం ద్వారానే పాక్ ప్రభుత్వాలు సైన్యంపై అంత ఖర్చు పెట్టగలిగాయి. పాక్ గురించి నేను సందర్భానుసారం రాస్తూవచ్చిన అనేక కథనాల్లో ఒక దాంట్లో ఇలా పేర్కొన్నాను. ‘వాఘా బోర్డర్ వద్ద మీ పాస్పోర్టులో స్టాంప్ వేస్తున్న ఇమిగ్రేషన్ అధికారి తలపై ఒక నోటీసు వేలాడుతూ ఉంటుంది. ఆ నోటీసులో ఇలా రాసి ఉంటుంది. మేం అందరినీ గౌరవిస్తాం. అందరినీ అనుమానిస్తాం’. దీనర్థం ఏమిటంటే జాతీయ భద్రతా ప్రభుత్వం అంటేనే అనుమానాస్పదమైన ప్రభుత్వం అనే. పైగా, ఈ కారణం వల్లే పాక్ అంత అస్తవ్యస్తతలో ఉంటోంది. దివాలా తీసిన, రుణాల కోసం సాగిలబడుతున్న ఆర్థిక వ్యవస్థ, విచ్ఛిన్నమైపోయిన సమాజం, పతనమవుతున్న సామాజిక సూచికలు, జాతీయ సంపదలను టోకున అమ్మిపడేయడం, పొరుగునున్న ‘అంకుల్ చైనా’కు రక్షణ ఫీజుల కింద దేశ భూభాగాన్నే అప్పగించేయడం, జిహాద్ యూనివర్సిటీ, ప్రపంచ వలస సరఫరా కేంద్రం వంటి వాటికి పేరొందడం ఇవీ పాక్ లక్షణాలు. ప్రత్యేకించి పొరుగుదేశాలు పాక్ నుంచి నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం ఏమిటంటే.. ‘నాలాగా ఎవరూ ఉండవద్దు’ అనే. ప్రస్తుత భారతదేశం సరిగ్గా దీనికి సాక్ష్యాధారంగా నిలబడుతోంది. ఎందుకంటే పాక్ ఇస్తున్న పై సందేశరూపంలోని హెచ్చరికను సీరియస్గా తీసుకోవద్దని మనం నిర్ణయించుకున్నాం. మరోవైపున, 2015 తదుపరి పాకిస్తాన్ చిక్కుకున్న స్వీయ భావావరోధంలో మనం ఇప్పుడు ఇరుక్కుపోయాం. 2014 నాటికి పాకిస్తాన్ మన బహిరంగ ప్రసంగాలు, చర్చల్లో కనిపించకుండా పోయింది. పరుగుపందెంలో భారత్, పాక్ కంటే ఎంతో ముందుకెళ్లింది. పాక్ చికాకు కలిగించే రాజ్యంగా దిగజారిపోయింది. తాజాగా పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ, జార్ఖండ్ ఎన్నికల ప్రచార సందర్భంగా పాక్ గురించి గత వారం పాకిస్తాన్ పేరును పదే పదే చర్చిస్తూ వచ్చారు. సర్జికల్ దాడులు, బాలాకోట్ వైమానిక దాడి సమయంలో కాంగ్రెస్ వైఖరి సరిగ్గా పాకిస్తాన్ వైఖరితో ఎలా సరిపోలిందంటూ హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో ఇదే వైఖరిని ప్రతిబింబించారు. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఇప్పుడు పాక్ పేరును తరచుగా ప్రస్తావిస్తూ వస్తోందన్న విషయం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పుల్వామా ఘటన నేపథ్యంలో మీరు మా వైపు ఉంటారా లేక పాక్ వైపు ఉంటారా అనే అంశం చుట్టూనే 2019 లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమం నడిచింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర వంటి నాలుగు రాష్ట్రాల్లో జరిపిన బహిరంగ సభల్లో మోదీ పాక్ పేరును 90 సార్లు ప్రస్తావించారు. తర్వాత హరియాణా, మహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఇది కొనసాగింది. చాలా కాలం తర్వాత మన బహిరంగ చర్చల్లో, మన రోజువారీ జీవి తంలో కూడా పాకిస్తాన్ పేరును ప్రస్తావిస్తున్నాము. ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చ మొత్తంగా పాకిస్తాన్, దేశ విభజన ప్రాతిపదికపైనే నడిచింది. పాకిస్తాన్లో మైనారిటీలతో వ్యవహరిస్తున్న తీరు మనకు చర్చనీయాంశమైంది. అందుచేత పాకిస్తాన్లోని ముస్లిమేతర మైనారిటీల క్షేమాన్ని పట్టించుకోవలసిన ప్రత్యేక బాధ్యత భారత్పై పడినట్లుగా ఉంది. పాకిస్తాన్ని సహజంగానే ముస్లింల నివాస స్థలంగా ఎలా పరిగణిస్తూ వస్తున్నారో భారత్ కూడా ఇప్పుడు హిందువుల నివాసస్థలంగా ఉండాలనే వాతావరణం దేశంలో బలపడుతోంది. భారత్ గురించి పాకిస్తాన్లో పెంచిపోషిస్తూ వచ్చిన అభద్రతా భావం, వైరభావం, ఉన్మాద ప్రచారం వంటివి మన దేశంలో ప్రస్తుతం కొన్ని చర్చల్లో కనిపించడం ఆశ్చర్యకరం. రాజకీయ చర్చలను దేశ విభజన వద్దకు తీసుకుపోవడం, విభజన నాటి తప్పులను సరిదిద్దుతామని హామీ ఇవ్వడం, అతిపెద్ద శత్రువును అప్పట్లో ఊరికే వదిలేశామని విమర్శలు చేయడం.. వంటి పరిణామాలను చూస్తుంటే పాకిస్తాన్ను భారత్ కొత్తగా కనిపెడుతున్నట్లు కనిపిస్తోంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య అంతరం ఎంత దూరం పోయిందంటే ప్రపంచంలో ఏ ఒక్కరూ చివరకు చైనాతో సహా మన రెండు దేశాలను ఒకే వైఖరితో చూడడం లేదు. భారత్–పాక్ మధ్య ఉన్న హైపనేషన్ ఇప్పుడు పూర్తిగా చెరిగిపోయింది. అంటే భారత్, పాక్లను కలిపి చూసే పరిస్థితి మాయమైపోయిందని అర్థం. ఒకప్పుడు పాక్ అవలంబించిన వైఖరిని ఇప్పుడు మనం తవ్వి తలకెత్తుకుంటున్నామా అనిపిస్తోంది. ఎందుకంటే మొదట అభద్రతా భావాన్ని పెంచిపోషించకుంటే మీరు జాతీయ భద్రతా రాజ్యాన్ని ఎలా నిర్మించగలరు? అందుకే ఈ అవసరం కోసం మీకు భయపెట్టే శత్రువు అవసరం. అది పాకిస్తానే మరి. ఇప్పటికి అది అంత భయపెట్టకపోవచ్చు కానీ పాన్ ఇస్లామిజం అనే పెద్ద ప్రమాదాన్ని చూసినప్పుడు అది భయంకర రాక్షసిగా మారక తప్పదు. అదే ఇప్పుడు అనుమానాన్ని కలిగిస్తుండగా, భారత్లోని 20 కోట్ల మంది ముస్లింలకేసి చూస్తే అతిపెద్ద ఉపద్రవంలాగే కనిపిస్తారు మరి. 1947లో రెండు దేశాలు కొత్త చరిత్ర దిశగా అడుగులేయడం ప్రారంభించిన నాటి పరిస్థితిని సమీక్షిద్దాం. మన రెండు దేశాలూ విభిన్నమైన మార్గాలను ఎంచుకున్నాయి. ఒకటి ఉదారవాద రాజ్యాంగ గణతంత్ర రాజ్యంగా మారగా, మరొకటి మెజారిటీవాద, మతతత్వ, సైనిక రాజ్యంగా మారింది. ఒకటి అలీన రాజ్యంగా మారగా, మరొకటి ఆయా కాలాల్లో ప్రాబల్యంలోకి వచ్చిన సైనిక కూటములలో చేరింది. కేవలం 25 సంవత్సరాలలోపే, మతప్రాధాన్య రాజ్యంగా తనను తాను పేర్కొన్న పాకిస్తాన్ తన భూభాగంలో సగానికి పైగా జారవిడుచుకుంది, మరో కొత్త దేశం బంగ్లాదేశ్ రూపంలో ఉనికిలోకి వచ్చింది. చివరకు ఆ కొత్త దేశం కూడా తన మాతృదేశం నమూనాలోకే వెళ్లిపోయి, ఇస్లాంని తన మెజారిటీ వాద భావజాలంగా ఎంచుకునేసింది. దానికి తోడుగా మిలిటరీ పాలకులూ పుట్టుకొచ్చారు. రెండు దశాబ్దాలకుపైగా అప్పులను యాచిం చడం, దారిద్య్రంలో కూరుకుపోవడం జరిగాక, అనేక మూడో ప్రపంచ దేశాల చెడు లక్షణాలకు బంగ్లాదేశ్ ఒక నమూనాగా నిలిచిపోయింది. అధిక జనాభా, దారిద్య్రం అనే సాంక్రమిక వ్యాధుల దేశంగా దానికి పేరుపడిపోయింది. ‘ఆల్ ది ట్రబుల్ ఇన్ ది వరల్డ్’ అనే తన సంకలనంలో అమెరికన్ ప్రముఖ రచయిత పీజే ఓ రూర్కే అధిక జనాభాతో వచ్చే సమస్యలకు బంగ్లాదేశ్నే ఉదాహరణగా పేర్కొనడం భావోద్వేగాలను రెచ్చగొట్టింది. పైగా అది ఒక అసందర్భ వ్యాఖ్య కూడా. కానీ అంత దూకుడు రచనలో కూడా రూర్కే ఒక వాస్తవాన్ని పదునైన వాక్యంలో చెప్పాడు. ‘తినడానికి తగినంత ఆహారం లేని దేశం, పండకముందే పంటను వాసన చూస్తున్న దేశం ఎలా మనగలుగుతుంది?‘ కానీ, చాలా త్వరలోనే ఆ కొత్త దేశం భారత్ వంటి దేశాన్ని పోలిన లౌకిక, ఆధునిక ఆదర్శ రాజ్య నమూనావైపు నడక మార్చుకుంది. మరో రెండు దశాబ్దాలలోపే, బంగ్లాదేశ్ ప్రతి సామాజిక, ఆర్థిక సూచికలోనూ పాక్కంటే ఎంతో ముందుకు సాగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 48 ఏళ్లక్రితం పాక్ పీడన నుంచి తన విముక్తిలో సహాయం చేసిన భారత్నే అది ఇప్పుడు వెనుకకు నెడుతోంది. ఆకలిదప్పులకు, బహిరంగ మలవిసర్జనకు నమూనాగా రూర్కే వ్యాఖ్యానించిన ఆ బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ రెండు శాపాలను భూస్థాపితం చేసిపడేసింది. బంగ్లాదేశ్ ఇప్పుడు బహిరంగ మల విసర్జన నుంచి దాదాపుగా బయటపడింది. దాని జనాభా వృద్ధి రేటు గణనీయంగా అంటే భారత వృద్ధి రేటు స్థాయికి.. ఒక్కశాతానికి పడిపోయింది. పాకిస్తాన్ నుంచి కొని తెచ్చుకున్న భావజాల వైరస్ను తుంగలో తొక్కి బయటపడిన దాని ఫలితమే ఇదంతా మరి. 1985లో పాకిస్తాన్కు మొట్టమొదటి సారిగా సందర్శించినప్పుడు అదెంత మెరుగైన స్థితిలో ఉండేదో చూసి ఆశ్చర్యపోయాను. ఆనాటికి దాని తలసరి ఆదాయం భారత్ కంటే 65 శాతం ఎక్కువగా నమోదయ్యింది. కానీ 2019లో భారత్ తలసరి ఆదాయం పాక్ కంటే 60 శాతం ఎక్కువగా నమోదైంది. ఇదెలా జరిగింది? పాకిస్తాన్ సామాజిక–ఆర్థిక వృద్ధి సూచికలు ఎంతగా కుప్పగూలిపోయాయంటే ఐఎమ్ఎఫ్ నుంచి ఆ దేశం 13వసారి ఉద్దీపన ప్యాకేజీని అందుకోవాల్సి వచ్చింది. ఇక పాక్ జనాభా వృద్ది రేటు భారత్, బంగ్లాదేశ్ల కంటే రెట్టింపు పెరిగింది. కాని ఇప్పటికీ అది జాతీయ భద్రతా రాజ్యంగా సైనికాధిపత్యంతోనే ఉంటోంది. ఎంతలా అంటే పాక్ ప్రధాని తన ఆర్మీ చీఫ్కు సలామ్ చేసేంతగా. భారత్ కంటే ఏ రంగంలో అయినా పాక్ ముందుందంటే బహుశా అణ్వాయుధాల సంఖ్యలోనే కావచ్చు. కానీ భారతీయ వ్యూహాత్మక అధ్యయనాల నిపుణుడు దివంగత కె. సుబ్రహ్మణ్యం తరచుగా ఒక మాట చెప్పేవారు, నీ దేశ రక్షణకు తక్కువ ఆయుధాలు అవసరమైనప్పుడు ఎందుకు ఎక్కువ ఆయుధాలకోసం వెంపర్లాడతావు? కాగా, దేశీయ రాజకీయాల్లో తనకు ఉపయోగపడే సాధనంగా పాక్ను భారత్ ఇప్పుడు కొత్తగా కనుగొంటోంది. నిజానికి ఇది పేలవమైన ఎంపిక. ఇప్పుడు పాక్తో మనల్ని మనం పోల్చుకోవాలంటే భారత్ తన కాళ్లు నెప్పి పెట్టేలా ముందుకు వంగాల్సి ఉంటుంది. మరోమాటలో చెప్పాలంటే.. మత ప్రాధాన్యమైన, జాతీయ భద్రతా రాజ్యాన్ని నిర్మించుకోవడంలో పాక్ చేసిన ప్రయోగాలను భారత్ ఇప్పుడు చేపట్టాలనుకోవడం వేర్పాటువాదంలోకి మనకు మనం కూరుకుపోయేలా చేస్తుంది. నిజానికి ఇది మనం అధిగమించాల్సిన విషాదం మాత్రమే. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta