-
నామినేషన్ కార్యక్రమంలో కారు నడిపిన ఎంపీ కవిత
-
టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్.. ఆసక్తికర దృశ్యం
సాక్షి నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున గణేష్ గుప్తా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. గణేష్ గుప్తా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ కల్వకుంట్ల కవిత స్వయంగా కారు నడిపి అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యంలో ముచెత్తారు. గులాబీ రంగులో ఉన్న అంబాసిడర్ కారును గణేష్ గుప్తా ఇంటి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ఆమె డ్రైవింగ్ చేశారు. మహిళలు డ్రైవింగ్ చేయటం సాధారణమే. కానీ, ఎంపీగా ఉన్న ఓ మహిళ కారు నడపడం, అందులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పని చేయడం అందరినీ ఆకర్షించింది. అనంతరం కార్యకర్తలు, అభిమానులు, పార్టీ అభ్యర్థులతో కలిసి పాదయాత్రగా ఎంపీ కవిత తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కల్వకుంట్ల కవిత, మాజీ స్పీకర్ సురేష్రెడ్డి సమక్షంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థిగా గణేష్ గుప్తా, ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్లో అసంతృప్తులు.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ టికెట్ను నల్లమడుగు సురేందర్కు కేటాయించడం పట్ల వడ్డేపల్లి సుభాష్రెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమైన సుభాష్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు నిర్ణయించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
శ్రీనివాస్రెడ్డికి కారు బొమ్మలు ఇచ్చిన మనవళ్లు
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని రాజకీయ నాయకులు అన్నింటికీ మంచి, చెడు, ముహుర్తం, సెంటిమెంట్ అంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదే విధంగా మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి కారు బొమ్మలు మనవళ్లు అందరజేశాకే నామినేషన్ వేశారు. -
తొలి రోజు నామినేషన్లు వేసింది వీరే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో తొలిరోజు నామినేషన్ల గడువు ముగిసింది. మొదటి రోజు మొత్తం 48 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి 10 మంది నామినేషన్లు వేశారు. బీజేపీ-9, కాంగ్రెస్-6, టీడీపీ-2, సీపీఐ(ఎం)-2, సీపీఎం-1, బీఎల్ఎప్ -2, బీఎస్పీ-1, ఆప్-2, పీపీఐ-2, స్వతంత్రులు -11 మంది తొలిరోజు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి లక్ష్మణ్( ముషీరాబాద్), రాజాసింగ్( గోషామాల్), రఘునందన్ రావు(దుబ్బాక)లు తొలి రోజు నామినేషన్ వేశారు. ధర్మపురి టీఆర్ఎస్ అభ్యర్తిగా కొప్పుల ఈశ్వర్, మంథని అభ్యర్థిగా పుట్టా మధుకర్ నామినేషన్లు దాఖలు చేశారు. పుట్టమధుకర్ తరపున ఆయన సతీమణి శైలజ నామినేషన్ వేశారు. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు పోటీ చేసేందుకు నామినేషన్లు సమర్పించే కీలక ఘట్టం సోమవారం (నేటి) నుంచి శ్రీకారం చుట్టుకుంటోంది. జిల్లాలో అభ్యర్థుల నుంచి వీటిని స్వీకరించేందుకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో అక్కడ పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతిరోజూ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 19వ తేదీన మ«ధ్యాహ్నంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 20వ తేదీన పరిశీలించి, సరైన పత్రాలు లేని వాటిని తిరస్కరిస్తారు. కాగా డిసెంబర్ 7వ తేదీన శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక పోటీలో నిల్చునే అభ్యర్థులు ముమూర్తాలు చూసుకుని మరీ..నామినేషన్ పత్రాలు సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు. పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 19వ తేదీన మంచి ముహూర్తం ఉందన్న కారణంతో ఆరోజు నామినేషన్ వేయనున్నారు. ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ కూడా అదేరోజు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మహాకూటమి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాక వారు కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మొదటిరోజు నామినేషన్లు పడేనా ? టీఆర్ఎస్ మినహా మిగతా పార్టీలు పూర్తిస్థాయిలో తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో నామినేషన్లు మొద టి రోజు పడే అవకాశం కన్పించట్లేదు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల కూటమి పొత్తులు ఇంకా తేలకపోవడం, అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేవారు ఖరారు కాలేదు. దీంతో తొలిరోజు నామినేషన్లు పడే సూచనలు కన్పించట్లేదు. టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వీరంతా..మొద టి రోజే నామినేషన్ వేసేందుకు ఆసక్తి కనబర్చట్లేదు. జిల్లాకు అబ్జర్వర్లు రాక.. జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను పర్యవేక్షించేందుకు వ్యయ పరిశీలకులు ఇద్దరు జిల్లాకు రానున్నారు. వీరిలో ఒకరు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలను పర్యవేక్షించనుండగా, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలను మరొకరు చూస్తారు. ఈ నెల 17వ తేదీన పోలీస్ అబ్జర్వర్ కూడా వస్తారు. జనరల్ అబ్జర్వర్లు ముగ్గురు ఈ నెల 19వ తేదీన చేరుకుంటారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గానికి ఒకరు, వైరా, మధిర నియోజకవర్గాలకు ఒకరు, సత్తుపల్లి నియోజకవర్గానికి ఒకరి చొప్పున ఉంటారు. డిపాజిట్ ఇలా.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు జనరల్ కేటగిరీకి చెందిన వారైతే రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.5వేలు డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి ఫారం– 26 అఫిడవిట్ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. -
14 న ముహూర్తం
సాక్షి ప్రతినిధి, వరంగల్: టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ల ముహూర్తం ఖరారైంది. మెజార్టీ అభ్యర్థులు ఈనెల 14వ తేదీన నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. వేద శాస్త్రాల ప్రకారం ఆ రోజున తిథి, నక్షత్రాలు బాగున్నాయని వేద పండితులు తేల్చి చెప్పడంతో అదే రోజున నామినేషన్లు వేసేందుకు వారు మొగ్గు చూపుతున్నారు. జన సమీకరణ కుదరకపోతే ముందు ఒంటరిగా ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించి, మరో రోజు భారీ ఊరేగింపుతో వెళ్లి రెండో సెట్ పత్రాలు సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ వచ్చి బీ–ఫారాలు తీసుకుని వెళ్లాలని ‘గులాబీ’ దళపతి కేసీఆర్ నుంచి అభ్యర్థులకు ఆహ్వానం అందింది. వచ్చేటప్పుడు కచ్చితంగా ఓటరు గుర్తింపు కార్డు, నేరచరిత్ర ఉంటే ఆ వివరాలను వెంట తీసుకుని రావాలని ఆయన ఆదేశించారు. దీంతో అభ్యర్థులందరూ ఆదివారం హైదరాబాద్కు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు.ఈ నెల 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ నెల19తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుండడంతో తిథి, నక్షత్రాలు చూసుకుని నామినేషన్లు వేసేందుకు వీలుగా ముందస్తుగానే బీ–ఫారాలు ఇస్తున్నారు. నేర చరిత్ర ఉంటే.. అభ్యర్థులు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకే ఓటరు గుర్తింపు కార్డుతో తెలంగాణభవన్కు చేరుకోవాలని కేసీఆర్ సూచించారు. నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు ప్రతి సాంకేతిక పరమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించే విధానాన్ని వివరించే అవకాశం ఉంది. ఓటరు గుర్తింపుకార్డులో ఉన్న పేరునే ప్రామాణికంగా తీసుకుంటారని.. అదే పేరును బీ–ఫారంపై రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నేరచరిత్రపై రెండు పత్రికలు, టీవీలలో ప్రచారం చేయాల్సి ఉన్నందున వాటికి సంబంధించిన పత్రాలు తేవాలన్నారు. నేర చరిత్రకు సంబంధించిన పత్రికా ప్రకటనలను టీఆర్ఎస్ అధిష్టానమే అభ్యర్థుల తరఫున ఇవ్వనున్నట్లు తెలిసింది. జాతకం కూడా బయటపెడతారు.. బీ–ఫారాల అందజేతతోపాటు అభ్యర్థులకు ఎన్నికలపై సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. ఎన్నికలకు ముందు అందరు అభ్యర్థులతో కలిసి నిర్వహించే చివరి సమావేశమైనందున.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలను గులాబీ దళపతి వివరించే అవకాశం ఉంది. అలాగే సెప్టెంబర్ 6న అభ్యర్ధులను ప్రకటించారు. అంటే దాదాపు రెండు నెలల కాలం అయింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత కేసీఆర్ సర్వే చేయించారు. ఈ సమావేశంలో తాజాగా వచ్చిన సర్వే నివేదికలను సైతం వారికి అందజేయనున్నట్లు సమాచారం. మెజార్టీ సభ్యులు 14వ తేదీనే.. టీఆర్ఎస్ అభ్యర్థుల్లో మెజార్టీ సభ్యులు ఈనెల 14న నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. జనగామ అభ్యర్ధి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ములుగు అభ్యర్థి అజ్మీరా చందూలాల్, స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థి రాజయ్య, వరంగల్ పశ్చిమ అభ్యర్థి వినయ్ భాస్కర్, నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి, పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి శంకర్నాయక్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు, వర్ధన్నపేట అభ్యర్థి ఆరూరి రమేష్ మాత్రం ఈనెల 19న నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. 14వ తేదీనే ఎందుకు..? వారాధిపతి బుధుడు, సప్తమి తిథి , శ్రవణానక్షత్రం, నక్షత్రాధిపతి చంద్రుడు (కార్తీకమాసం) అన్నీ కలిసి వచ్చిన శుభదినం. శ్రవణా నక్షత్రం అనగా శుభకారకుడైన చంద్రుడు. చంద్రుని ఆశీర్వాదాన్ని కోరుకుని పనులు ప్రారంభించిన వారి మాటలను ఎదుటివారు అంగీకరిస్తారు. ఎదుటివారి నుంచి వచ్చే కోపావేశాలు తగ్గిపోతాయి. ఉదయం 10.43 వరకు వర్జ్యం ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.40 గంటల వరకు ఉన్న మకరలగ్నానికి ఏకాదశస్థానంలో గురు, బుధ గ్రహాలు శుభదృష్టితో ఉంటాయి. కాబట్టి ఇవి శుభ ఘడియలుగా భావిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30గంటల వరకు మీన లగ్నంలో గురు, బుధ గ్రహాలు 9వ స్థానంలో ఉండడంతో పాటు మకర లగ్నంలో చంద్రుడు, కేతువు 11వ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో తలపెట్టిన కార్యాలు అనుకూల విజయానికి దారి తీస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ మేరకు అభ్యర్థులు ఎక్కువ మంది ఇవే ఘడియల్లో నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. 19వ తేదీ ఏకాదశితో పాటు శివప్రీతికరమైన కార్తీక మాస సోమవారం కాబట్టి కలిసివస్తుందని.. ఈ రోజున నామినేషన్లు దాఖలుచేసేందుకు ఎర్రబెల్లి, అరూరి సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
ఆస్కార్.. కొత్త బెస్ట్ యాక్టర్ ఎవరో..?
ఈరోజుకి ఇరవై రోజులు ముందుకెళ్తే లాస్ ఏంజిల్స్లో జరిగే ఓ పెద్ద వేడుకను సినీ అభిమానులంతా చూస్తూ కూర్చుంటారు. ఆ వేడుక పేరే ఆస్కార్స్. హాలీవుడ్ అంతా ఈ వేడుక కోసం ఎదురు చూస్తోంది. ‘‘అండ్ ది అవార్డ్ గోస్ టూ..’’ అన్న లైన్ ఇరవై నాలుగుసార్లు వినిపిస్తుంది ఆ రోజు. అందులో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ అవార్డుల తర్వాత ఆ లైన్లో అందరూ ఎదురు చూసే మూడో విభాగం బెస్ట్ యాక్టర్. ఎప్పట్లానే ఈసారి కూడా బెస్ట్ యాక్టర్ లిస్ట్లో గట్టి పోటీనే ఉంది. ఐదుగురిలో ఇద్దరు ఫస్ట్ టైమ్ నామినేషన్ పొందినవారు కావడం ఇక్కడ విశేషం. అలాగే వాళ్లిద్దరిలోనే ఒకరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సినీ పండితులు లెక్కలేస్తూ ఉండడం మరింత విశేషం. నామినేషన్స్ దక్కించుకున్నది ఎవరెవరో చూద్దాం... తిమోతీ ఛాలమేట్ (‘కాల్ మీ బై యువర్ నేమ్’) ఈ ఏడాది బెస్ట్ యాక్టర్కు నామినేషన్స్ దక్కించుకున్నవారిలో చిన్నవాడు తిమోతీ. 22 ఏళ్లు ఇతనికి. ఇంతకుముందు ఎప్పుడూ నామినేషన్ దక్కించుకోలేదు. అవార్డు గనక ఇతనికే వస్తే అతి చిన్న వయసులో బెస్ట్ యాక్టర్గా ఆస్కార్ అందుకున్నవాడిగా రికార్డులకెక్కుతాడు. ‘కాల్ మీ బై యువర్ నేమ్’ సినిమాలో తిమోతీ ఒక టీనేజ్ బాయ్గా నటించాడు. అందరూ అద్భుతంగా నటించిన సినిమాలో తిమోతీ వాళ్లందరినీ మరిపించేలా నటించాడని విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్కార్ రేసులో అందరికంటే తిమోతీనే ముందున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఆస్కార్ అతన్ని వరిస్తుందా? డేనియ్ డే లూయీజ్ (‘ది ఫాంటమ్ థ్రెడ్’) 1950 కాలంలో నడిచే ‘ది ఫాంటమ్ థ్రెడ్’ అనే సినిమాలో ఓ ఫేమస్ డ్రెస్మేకర్గా లూయిజ్ కనిపించాడు. ఈ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లూయిజ్ ఇప్పటికే మూడుసార్లు బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్నాడు. అతని నటన గురించి ప్రత్యేకించి ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ‘మై లెఫ్ట్ ఫూట్’ (1990)తో 18 ఏళ్ల క్రితమే ఆస్కార్ అందుకొని అప్పట్నుంచీ ఆయన తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నాడు. ‘దేర్ విల్ బి బ్లడ్’ (2003), ‘లింకన్’ (2013) తర్వాత ఇప్పుడు మళ్లీ ఆస్కార్ కొడితే లూయీజ్కి ఇది నాలుగో ఆస్కార్ అవుతుంది. ఇవి కాకుండా లూయిజ్.. ‘నేమ్ ఆఫ్ ది ఫాదర్’ (1994), ‘గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్’ (2003) సినిమాలకు నామినేషన్స్ దక్కించుకున్నాడు. డేనియల్ కలూయా (‘గెట్ ఔట్’) డేనియల్ కలూయా బెస్ట్ యాక్టర్గా నామినేషన్స్ దక్కించుకున్న చిన్నవాళ్ల లిస్ట్లో ఉంటాడు. ఇతనికిప్పుడు 28 ఏళ్లు. ‘గెట్ ఔట్’ సినిమాకు గాను డేనియల్ కలూయా ఈ నామినేషన్ దక్కించుకున్నాడు. ఇది ఇతనికి ఫస్ట్ నామినేషన్. ఒకవేళ ఇతనే గనక అవార్డు దక్కించుకుంటే బెస్ట్ యాక్టర్గా ఆస్కార్ అందుకున్న అతి చిన్నవాడిగా రికార్డులకెక్కుతాడు. తెల్లజాతి అమ్మాయిని ప్రేమించిన నల్లజాతి అబ్బాయి, ఆ అమ్మాయి ఇంటికి వెళ్లడం, వాళ్ల ఫ్యామిలీని కలుసుకోవడం.. ఈ క్రమంలో కథ రకరకాల మలుపులు తిరగడమే సినిమా. డేనియల్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లిస్ట్లో గట్టి పోటీ ఇచ్చేట్టే కనిపిస్తున్నాడు. తిమోతీ, కలూయా.. ఇద్దరిలో ఎవరో ఒకరు ఆస్కార్ దక్కించుకుంటారని ఎక్కువమంది అంచనా. ఎవరు దక్కించుకున్నా ఆస్కార్ అందుకున్న చిన్న వయసు యాక్టర్గా రికార్డు దక్కించుకుంటారు. గ్యారీ ఓల్డ్మన్ (‘డార్కెస్ట్ అవర్’) ‘టింకర్ టైలర్ సోల్జర్ స్పై’ (2012) సినిమాకుగాను గతంలో గ్యారీ ఓల్డ్మన్ ఒకసారి ఆస్కార్కు నామినేట్ అయ్యాడు. కాకపోతే అప్పుడు అవార్డు ఆయనను వరించలేదు. ఈసారి ‘డార్కెస్ట్ అవర్’తో ఓల్డ్మన్ తన రెండో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నాడు. ఈసారి గ్యారీ ఓల్డ్మన్ ఆస్కార్ను అందుకుంటాడా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఈ మధ్యే ఇదే సినిమాకుగాను బెస్ట్ యాక్టర్గా గ్యారీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నాడు. దీంతో ఆస్కార్ కూడా ఈయన్నే వరిస్తుంది అనేవారు కూడా చాలామందే ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. అప్పటి బ్రిటీష్ ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ తీసుకునే ఒక కీలక నిర్ణయం చుట్టూ సినిమా నడుస్తుంది. డెంజెల్ వాషింగ్టన్ (‘రోమన్ జె. ఇజ్రాయెల్ ఎస్క్’) డేనియల్ లూయీజ్ తర్వాత ఈ లిస్ట్లో ఆస్కార్కు దగ్గరి వ్యక్తి అంటే డెంజెల్ వాషింగ్టన్. గతంలో గ్లోరీ (1989), ట్రైనింగ్ డే (2002) సినిమాలకు ఆస్కార్ అందుకున్న డెంజెల్, ఇవి కాకుండా ఎనిమిది నామినేషన్స్ కూడా దక్కించుకున్నాడు. నామినేషన్స్, అవార్డులు కలిపి చూస్తే ఈ లిస్ట్లో ఆస్కార్కు బాగా దగ్గరి వ్యక్తి అంటే డెంజెల్ అనే చెప్పుకోవాలి. తన జీవితాన్నంతా న్యాయం కోసం పోరాడటానికే అంకితం ఇచ్చేసిన న్యాయవాది పాత్రలో డెంజిల్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ఆస్కార్ 2018 ‘బెస్ట్ యాక్టర్ అవార్డు’ ఎవరికి వస్తుందనే దానిపై ఎన్ని చర్చలు జరిగినా, అసలు ఫలితం తేలాలంటే మార్చి 4 వరకూ ఆగాల్సిందే! ఈ ఐదుగురూ ఎవరికి వారే గట్టి పోటీ ఇచ్చేవాళ్లే కావడంతో ‘అండ్ ది అవార్డ్ గోస్ టూ..’ అనే టైమ్కి ఎవరు లేచి నిలబడి, స్టేజ్ వరకూ వెళ్లి అవార్డు అందుకుంటారో వేచి చూడాలి!! డేనియ్ డే లూయీజ్, డెంజెల్ వాషింగ్టన్ -
రివీల్ చేస్తారట!
జనవరి 24. హాలీవుడ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు. విశేషం ఏంటా అనుకుంటున్నారా? మార్చి 4న 90వ ఆస్కార్ వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబందించిన నామినేషన్స్ ఈ బుధవారం అనౌన్స్ చేస్తారట. ఈ అనౌన్స్మెంట్కు సంబంధించిన చిన్న క్లూను ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్’ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ఆ క్లూ ఏంటంటే.. ఆస్కార్ ఫైనల్స్ రౌండ్ వరకూ చేరుకున్న యాక్టర్స్, మూవీస్ నామినేషన్ లిస్ట్ను బాలీవుడ్ నటి, హాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రియాంకా చోప్రా రివీల్ చేస్తారట. ప్రియాంకతో పాటు రెబల్ విల్సన్, రొసారియో డాసన్, మిచెల్ రోడ్రిగేజ్ లాంటి హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇందులో పాల్గొంటారట. దీనికి సంబంధించిన షూటింగ్ లొకేషన్ పిక్స్ను బయటకు వదిలి ఆస్కార్ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మరింత ఆసక్తి రేపింది ‘ఆస్కార్ బృందం’. -
ఆస్కార్లోనూ ఆ రెండు సినిమాలే!?
హాలీవుడ్ సినిమాకు అవార్డులంటే ఆస్కార్ అవార్డులే! ఇక ఆ తర్వాత చెప్పుకునే అవార్డులంటే ‘గోల్డెన్ గ్లోబ్’. చాలాసార్లు ఈ రెండు అవార్డుల ఫలితాలూ ఒకేలా ఉంటాయ్! బెస్ట్ అనుకునే సినిమా రెండు అవార్డులనూ తన్నుకుపోతుంది. ఈ ఏడాదికి కూడా ఆస్కార్ బరిలో మహా మహా దర్శకుల సినిమాలే పోటీపడనున్నాయి. ఆస్కార్ నామినేషన్స్ అనౌన్స్ కావడానికి ఇంకా నెల టైమ్ ఉంది. ఏయే సినిమాలు నామినేషన్స్ దక్కించుకుంటాయి అన్నది ఇంకా సస్పెన్సే! గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ అయితే ఇప్పటికే బయటకొచ్చేశాయ్. ఇందులో ‘ది షేప్ ఆఫ్ వాటర్’ మొత్తం ఏడు నామినేషన్స్ దక్కించుకుంది. స్టీవెన్ స్పీల్బర్గ్ తెరకెక్కించిన ‘ది పోస్ట్’ ఆరు నామినేషన్లు దక్కించుకుంది. ఈ రెండు సినిమాలకు చాలాకాలం నుంచే విపరీతమైన క్రేజ్ ఉంది. గోల్డెన్ గ్లోబ్లో ఈ సినిమాలు నామినేషన్స్ తెచ్చుకోవడంతో ఆస్కార్ నామినేషన్స్లోనూ ఈ రెండు సినిమాలదే జోరు ఉంటుందని హాలీవుడ్ సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 2018 జనవరి 7న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానం జరగనుంది. ది షేప్ ఆఫ్ వాటర్ -
ఆర్టీసీలో ఎన్నికల సందడి
సాక్షి,అమరావతి బ్యూరో : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎన్నికల సందడి మొదలయింది. గుర్తింపు ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ఆర్టీసీలో కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 16న జరిగే ఎన్ని కలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, 9న పరిశీలన, 10 నుంచి 13వ తేదీ వరకు ఉపసంహరణ జరుగు తుంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం యూనియ¯ŒS నేతలు వ్యూహప్రతివ్యూహా లతో ఎన్నికల వేడి పెంచారు. ఐదేâýæ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో ఈయూ, ఎస్డబ్యూఎఫ్ మిత్రపక్షంగా, ఎ¯ŒSఎంయూ యూనియ¯ŒS స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నాయి. టీఎ¯ŒSటీయూసీ అనుబంధ కార్మిక సంఘం కార్మికపరిషత్ మాత్రం అటూ ఈయూతో, ఇటు ఎ¯ŒSఎంయూలతో అవసరమైన ప్రాతిపదికన పొత్తులు పెట్టుకుంటోంది. ఈ ఎన్నికలను ఆ యూనియన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 127 డిపోలు, 5 వర్క్ షాపులు, ఒక అడ్మినిసే్ట్రటివ్ ఆఫీసు పరిధిలోని 245 కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి రీజియన్ల పరిధిలో ఎన్నికల వేడి పుంజుకొంది. 58 మంది డెలిగేట్స్ ఎన్నిక కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి రీజియన్ల పరిధిలో సీసీఎస్ సభ్యులుగా ఉన్న 14,337 మంది ఈ ఎన్నికల్లో పాల్గొని 58మంది డెలిగేట్స్ను ఎన్నుకోవాలి. అమరావతి పరిధిలో ఉన్న కృష్ణా రీజియ¯ŒS పరిధిలో 26 మంది, గుం టూరు రీజియ¯ŒS పరిధిలో 22 మందిని డెలిగేట్స్ను ఎన్నుకోవాలి. విజయవాడ జో¯ŒS పరిధిలో ఉన్న పశ్చిమ గోదావరి రీజియ¯ŒS పరిధిలో 10 మందిని ఎన్నుకోవాలి. ఈ డెలిగేట్స్ అంతా కలిసి 9 మందితో కూడిన పాలకవర్గాన్ని ఈనెల 30వ తేదీన ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఎంప్లాయీస్ యూనియ¯ŒS (ఈయూ) నేతృత్వంలో పాలకమండలి పనిచే స్తోంది. ఆర్టీసీ కార్మికుల కోసం పనిచేసే ఈ సొసైటీ వెయ్యికోట్ల రూపాయల టర్నోవర్తో పనిచేస్తుంది. పూర్తి స్థాయి ఆర్థిక లావాదేవీలు ముడిపడి ఉన్న కో– ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సీసీఎస్) ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు వ్యక్తిగత, విద్య, ఇంటి నిర్మాణం, తదితర అవసరాలకు అవసరమైన రుణాలు అందిస్తారు. ఆ రెండు యూనియన్ల మధ్యే పోటీ ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో ఈయూ, ఎస్డబ్యూఎఫ్, కార్మిక పరిషత్తో కూటమికట్టి బరిలోకి దిగుతున్నాయి. గత గుర్తింపు ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గుర్తింపు తెచ్చుకున్న ఎ¯ŒSఎంయూ స్వతంత్రంగా బరిలోకి దిగుతోంది. అటు కూటమితో ఎలాగైనా సీసీఎస్ను కైవసం చేసుకోవాలని ఈయూ ఉవ్విళ్లూరుతోంది. 31 నామినేషన్లు దాఖలు కృష్ణా రీజయ¯ŒS పరిధిలో 26 మంది డెలిగేట్స్ ఎన్నికకు రెండు రోజులుగా 17 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో ఎ¯ŒSఎంయూ తరుఫున 12, ఎంప్లాయీస్ యూనియ¯ŒS తరుఫున 5 నామినేషన్లు వేశారు. గుంటూరు రీజియ¯ŒS పరిధిలో 22మంది డెలిగేట్స్కు 14 నామినేషన్లు దాఖలుచేశారు. ఎ¯ŒSఎంయూ నుంచి 10, ఎంప్లాయీస్ యూనియ¯ŒS నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
– కొత్తపేట ఎంపీటీసీ ఏకగ్రీవం – మూడు సర్పంచ్లు, 9వార్డు సభ్యులకు ఎన్నికలు – ప్రచారంలోకి అభ్యర్థులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్) : జిల్లాలో మూడు సర్పంచ్, 47వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో పోటీలో ఉండే అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మంగళవారం పరిశీలించారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. బాలనగర్ మండలం నేరెళ్లపల్లి సర్పంచ్ స్థానానికి 6 నామినేషన్లు రాగా ఒక్కరు తన నామినేషన్ను ఉపసంహరించుకోగా మిగిలిన ఐదుగురు బరిలో నిలిచారు. కోయిలకొండ మండలలోని బూర్గుపల్లి సర్పంచ్ స్థానానికి మూడు నామినేషన్లు రాగా ఒక్కరు ఉపసంహరించుకున్నారు. ఇద్దరు బరిలో ఉన్నారు. మద్దూర్ మండలంలోని పల్లెర్ల గ్రామానికి ఐదు నామినేషన్లు రాగా ఇద్దరు ఉపసంహరించుకున్నారు. ముగ్గురు బరిలో నిలిచారు. మొత్తం 47వార్డు సభ్యులకు 65 నామినేషన్లు దాఖలయ్యాయి. 37 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో హన్వాడ మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన 9స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో సీకేపల్లి, వటవర్లపల్లి, చిన్నతాండ్రపాడు, కుమార్లింగంపల్లి, పెద్దనందిగామ, నాచారం, బాలానగర్, శ్రీరంగాపూర్, బొక్కలోనిపల్లి గ్రామాల్లో వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. కాగా కేశంపేట మండలంలోని కొత్తపేట ఎంపీటీసీ ఎన్నిక ఏకగ్రీవమయింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో 8వ తేదీన ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు విడుదల చేస్తారు. -
ఇప్పటివరకు 114 నామినేషన్ల తిరస్కరణ
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరుగుతోందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ 114 నామినేషన్లు తిరస్కరించడం జరిగిందని ఆయన సోమవారమిక్కడ వెల్లడించారు. ఇంకా 23 వార్డులకు సంబంధించి వివరాలు అందలేదని చెప్పారు. ఓటరు జాబితాలో పేరు లేకపోవడం, ముగ్గురు సంతానం ఉన్నవారి నామినేషన్లు తిరస్కరించినట్లు కమిషనర్ తెలిపారు. మరోవైపు 126వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి శేఖర్ యాదవ్ నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉండటంతో అధికారులు నామినేషన్ తిరస్కరించడం జరిగింది. కాగా 1-6-1994 నాటికి ముగ్గురు పిల్లలు ఉంటే వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
ఏపీఎంసీ సభ్యుల స్థానాలకు మద్దతుదారులతో నామినేషన్లు దాఖలు గంగావతి: గంగావతి తాలూకాలో రెండు ఏపీఎంసీ సభ్యు ల స్థానాలకు ఈనెల 18న నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శనివారం ముగిసింది. శనివారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు మద్దతుదారులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నగరంలోని ఏపీఎంసీ కార్యాలయంలో జనసందోహంతో కిక్కిరిసిపోయింది. గంగావతి, కారటగి రెండు ఏపీఎంసీలలో 14 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గంగావతి ఏపీఎంసీకి 13 మంది వ్యవసాయ క్షేత్ర సా ్థనాల పరిధిలో 71,735 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 53,398 మంది పురుష ఓటర్లు, 19,337 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వర్తకుల క్షేత్ర స్థానం పరిధిలో 888 మంది ఓటర్లు కలిగి ఉండగా, ఇందులో 864 మంది పురుష ఓటర్లు, కేవలం 24 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. కారటగి ఏపీఎంసీ పరిధిలో 33,784 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 24,596 మంది పురుష ఓటర్లు, 9,188 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈనెల 18న జరిగే ఎన్నికలకు గంగావతి ఏపీఎంసీకి 145 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. కారటగి ఏపీఎంసీకి 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు ఏపీఎంసీలకు వర్తకుల కోసం కేటాయించిన ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ,జేడీఎస్ నాయకులు ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలకు తమ మద్దతుదారులైన అభ్యర్థులను రంగంలోకి దింపారు. -
ముగిసిన 8వ దశ నామినేషన్ల పర్వం
న్యూఢిల్లీ: వచ్చే నెల 7న జరగనున్న ఎనిమిదవ విడత పోలింగ్కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ దశలో సీమాంధ్రలోని 25 స్థానాలు సహా ఏడు రాష్ట్రాల్లోని 64 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో బీహార్లో 7, హిమాచల్ప్రదేశ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 2, ఉత్తరప్రదేశ్లో 15, ఉత్తరాఖండ్లో 5, పశ్చిమబెంగాల్లోని 6 స్థానాలు ఉన్నాయి. ఈ నెల 21 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 23తో ఆఖరు. హిమాచల్ప్రదేశ్లో చివరి రోజైన శనివారం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటితో కలిపి మొత్తం 52 నామినేషన్లు దాఖలయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా స్థానం నుంచి 18 మంది, లడక్ స్థానం నుంచి 9 మంది పోటీలో ఉన్నారు. పశ్చిమబెంగాల్లోని ఆరు స్థానాలకు 79 మంది నామినేషన్లు వేశారు. వారణాసిలో మోడీపై హిజ్రా పోటీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 12న జరిగే తుది విడత పోలింగ్కు సంబంధించి ఇప్పటి వరకు 46 నామినేషన్లు దాఖలయ్యాయి. యూపీలో మోడీ పోటీ చేయనున్న వారణాసి స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వారణాసి నుంచి హిజ్రా కమల నామినేషన్ వేశారు. ఎస్పీ తరపున కైలాశ్ చౌరాసియా కూడా నామినేషన్ వేశారు. -
బీజేపీ నోట్లో మట్టికొట్టిన బాబు
వారికిచ్చిన సీట్లలో టీడీపీ అధికారిక పోటీ మూడు స్థానాల్లో తమ అభ్యర్థులకు బీ ఫారాలిచ్చిన చంద్రబాబు పలుచోట్ల రెబెల్స్గా టీడీపీ నేతలు పొత్తుల్లో మొదటి నుంచి కోతలే అభ్యర్థుల ఎంపికపైనా పెత్తనం మండిపడుతున్న బీజేపీ అభ్యర్థులు హైదరాబాద్: బీజేపీ నాయకత్వం అనుమానించినట్టే జరిగింది. పొత్తు పేరుతో తెలుగుదేశం పార్టీ బీజేపీ నోట్లో మట్టి కొట్టింది. పొత్తు కుదిరిన రోజు నుంచి రోజుకో డ్రామా నడిపిస్తూ బీజేపీకి కేటాయించిన సీట్లల్లో కోత పెడుతూ చివరికొచ్చేసరికి అసలుకే ఎసరు పెట్టింది. కేవలం మూడు నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాల్లోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్నేహ ధర్మాన్ని పక్కనపెట్టారు. నామినేషన్ల ఘట్టం చివరి రోజు వరకూ మిత్రపక్షానికి సాకులు చెబుతూ పొత్తు సీట్లలో కోత పెట్టిన చంద్రబాబు.. నామినేషన్ల చివరి రోజు శనివారం బీజేపీకి కేటాయించిన మరో మూడు సీట్లలో తమ పార్టీ నేతలకు అధికారిక బీ ఫారాలు అందజేసి అభ్యర్థులను పోటీకి దించారు. పొత్తులో బీజేపీకి ఇవ్వాల్సిన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, వైఎస్ఆర్ జిల్లాలోని కడప, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ అధికారిక బీ ఫారంతోనే పోటీకి పెట్టింది. మిగిలిన చోట్ల కూడా టీడీపీ నేతలు పలువురు బీజేపీకి వ్యతిరేకంగా స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. హైడ్రామా నడుమ ఇరు పక్షాల నేతలు శుక్రవారం పొత్తుపై మరో దఫా చర్చలు జరిపి ఒక అంగీకానికి వచ్చిన దరిమిలా టీడీపీ అధికారికంగా అభ్యర్థులను బరిలోకి దింపడంపై కమల దళం అగ్గిమీదగుగ్గిలమవుతోంది. సంతనూతలపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ కాంగ్రెస్ పార్టీకి స్వస్తి చెప్పి కమలం, సైకిల్ పొత్తు కుదరడానికి కొద్ది రోజుల ముందు టీడీపీలో చేరారు. పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థి దారా సాంబయ్యకు వ్యతిరేకంగా విజయకుమార్ మూడు రోజుల కిందట నామినేషన్ వేయగా.. శనివారం ఆయనకు చంద్రబాబు బీ ఫారం అందజేశారు. కడప అసెంబ్లీ స్థానంలో బీజేపీ ప్రకటించిన కె.హరినాథరెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ నేత ఆర్. శ్రీనివాస్రెడ్డి బీ ఫారంతో శనివారం నామినేషను దాఖలు చేశారు. గుంతకల్లులో జితేంద్రగౌడ్కు బీ ఫారం ఇచ్చి బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ పోటీలో నిలిపింది. వీటితో పాటు బీజేపీకి కేటాయించిన పాడేరు అసెంబ్లీ స్థానంలో ఇద్దరు టీడీపీ నేతలు రెబల్స్గా పోటీలో ఉంటే, తాడేపల్లిగూడెం, విజయవాడ పశ్చిమ, కైకలూరులో ఒక్కొక్కరు, నరసరావుపేట, మదనపల్లిలో ముగ్గురేసి టీడీపీ నాయకులు రెబల్స్గా పోటీలో ఉన్నారు. వీటిలో పలువురు టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. నరసాపురం లోక్సభ స్థానంలో బీజేపీ నేత రఘురామకృష్ణరాజు రెండు రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు సూచన మేరకే ఆయన నామినేషన్ దాఖలు చేశారని ప్రచారం జరిగింది. దీనికి తోడు రాజమండ్రి అర్బన్ స్థానంలో టీడీపీ నేత గోరుంట్ల బుచ్చయ్యచౌదరి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు రాజమండ్రి రూరల్ స్థానం కేటాయించడంతో అర్బన్లో వేసిన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. కోతలపై కోతలు.. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినపుడు సీమాంధ్రలో బీజేపీకి 5 లోక్సభ, 15 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ప్రాంతంలో నామినేషన్లు ప్రారంభమయ్యే నాటికి ముందు అనుకున్న సీట్లలో ఒక్కో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు కోత పెట్టి బలవంతంగా బీజేపీ రాష్ట్ర నేతలను ఒప్పించారు. మిగిలిన నాలుగు లోక్సభ, 14 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా... వారు బలహీనంగా ఉన్నారంటూ టీడీపీ కొత్త నాటకానికి తెరతీసింది. తుది ధపా చర్చల్లో మరో అసెంబ్లీ సీటుకు సైతం చంద్రబాబు కోత పెట్టారు. తీరా ఇప్పుడు మరో మూడు బీజేపీ నియోజకవర్గాలలో టీడీపీ తమ పార్టీ అధికారిక అభ్యర్థులను పోటీలో నిలిపి బీజేపీకి గట్టి షాకిచ్చింది. అగ్రనేతల సీట్లు సేఫ్.. పొత్తులలో పార్టీకి కేటాయించిన దాదాపు అన్ని సీట్లలో టీడీపీ నేతలు అధికారికంగానో, రెబల్స్గానో పోటీలో ఉన్నప్పటికీ బీజేపీ ముఖ్యనేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో మాత్రం కనీసం రెబల్స్ బెడద కూడా లేకపోవడం విశేషం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పోటీ చేస్తున్న విశాఖ, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజంపేట లోక్సభ స్థానాల్లో పోటీ అభ్యర్థులు లేరు. ఇక కోడుమూరులో అయితే బీజేపీ తొలుత ప్రకటించిన అభ్యర్థిని టీడీపీ బలవంతంగా మార్పించింది. ఇక్కడ టీడీపీ నేతలు పోటీలో లేకపోవడం గమనార్హం. -
మాకినేని పెదరత్తయ్య హల్చల్
గుంటూరు : గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నామినేషన్ల సందర్భంగా టీడీపీ నేత మాకినేని పెదరత్తయ్య హల్చల్ చేశారు. ఇతరులను నామినేషన్ కేంద్రంలోకి అనుమతించనందుకు సీఐ శ్రీనివాసరావుపై ఆయన దౌర్జన్యం చేశారు. ఈ సందర్బంగా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో సీఐ ...పెదరత్తయ్యను బయటకు లాక్కొచ్చారు. ఈ చర్యను నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట రత్తయ్య ఆందోళనకు దిగారు. -
బీజేపీ స్థానాల్లో టీడీపీ నేతల నామినేషన్లు
ఏలూరు : ఓవైపు బీజేపీతో పొత్తులపై చర్చలు జరుపుతూనే మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారు. బీజేపీ స్థానాల్లో టీడీపీ నేతలు నామినేషన్లు వేస్తున్నారు. నర్సాపురం లోక్సభ స్థానానికి రఘురామ కృష్ణంరాజు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఒక సెట్ నామినేషన్ బీజేపీ తరపున...మరో సెట్ నామినేషన్ను బీజేపీ తరపున ఆయన సమర్పించారు. ఇక తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానానికి కొట్టు సత్యనారాయణ మూడు సెట్ల నామినేషన్లు వేశారు. ఒక సెట్ ఇండిపెండెంట్గా, రెండో సెట్ బీజేపీ తరపున, మూడో సెట్ టీడీపీ తరపున నామినేషన్ వేశారు. చంద్రబాబు నాయుడు సూచనలతోనే వీరు నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. -
15 నుంచి ఓటర్ స్లిప్పుల జారీ
తనిఖీల్లో దొరికిన మొత్తం రూ. 92.58 కోట్లు 69.50 కిలోల బంగారం, 289.74 కిలోల వెండి స్వాధీనం రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ వెల్లడి హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 17 పార్లమెంట్ స్థానాలకు గాను 267 మంది రంగంలో మిగిలారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1682 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ శనివారం వెల్లడించారు. తెలంగాణ ప్రాంతంలో ఈ నెల 12వ తేదీ వరకు ఓటర్ల సంఖ్య 2,81,66,266గా ఉందని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలో 3.63 కోట్ల మందితో కలిపి రాష్ట్రం మొత్తం మీద 6.45 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. తెలంగాణలో ఈ నెల 30న పోలింగ్ జరుగనున్నందున, 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ప్రచార పర్వానికి తెరపడుతుందన్నారు. 15 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉన్న స్థానాల్లో రెండేసి ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నెల 15 నుంచి ఇంటింటికీ ఓటరు స్లిప్పుల పంపిణీ మొదలవుతుందని, వారంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భన్వర్లాల్ చెప్పారు. ఓటరు స్లిప్పులను ఓటర్కు లేదా వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తామని, అందువల్ల ఈ వారం పాటు ఇళ్లలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్పులను గుర్తింపు కార్డులుగా కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. వాటిలో పోలింగ్ కేంద్రం సంఖ్య, ప్రాంతం, పోలింగ్ సమయం ముద్రించి ఉంటుందని వివరించారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి చీరలు, ఇతర సామగ్రి పంపిణీకి సంబంధించి కలెక్టర్ నుంచి నివేదిక అందిందని, దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని, వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. నోటా గుర్తు విషయంలో హైకోర్టు ఆదేశాలపై ఈసీకి నివేదించామని, వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని భన్వర్లాల్ తెలిపారు. దేశంలోనే అత్యధికంగా నగదు స్వాధీనం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి నగదు తరలిస్తున్న వారి నుంచి రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటి వరకు 92.58 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. అలాగే 69.50 కిలోల బంగారం, 289.74 కిలోల వెండితోపాటు 3.48 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ డబ్బును కోర్టుకు అప్పగించి, ఆదాయపన్ను శాఖకూ సమాచారమిస్తున్నామన్నారు. సరైన ఆధారాలను చూపించి డబ్బును తిరిగి పొందవచ్చని, అలాగే ఆదాయపన్ను శాఖకు సరైన వివరాలు ఇవ్వలేనిపక్షంలో వారు విధించే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రానికి 400 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయని, వాటిని నక్సల్ ప్రభావిత, ఫ్యాక్షన్ ప్రాంతాల్లో వినియోగించనున్నామని చెప్పారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఎంపీకి పోటీ ఎక్కువ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శనివారం 39 మంది ఎంపీ అభ్యర్థులు, 554 మంది అసెంబ్లీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకొన్నారు. దీంతో మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్సభ స్థానాల నుంచి అత్యధికంగా 30 మంది చొప్పున, నాగర్కర్నూలుకు అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు పోటీలో మిగిలారు. నియోజకవర్గాలవారీగా చూస్తే.. ఆదిలాబాద్(8), పెద్దపల్లి(17), కరీంనగర్(17), నిజామాబాద్(16), జహీరాబాద్(10), మెదక్(13), మల్కాజిగిరి(30), సికింద్రాబాద్(30), హైదరాబాద్(16), చేవెళ్ల(16), మహబూబ్నగర్(10), నాగర్కర్నూల్(6), నల్లగొండ(9), భువనగిరి(13), వరంగల్(12), మహబూబాబాద్(17), ఖమ్మం ఎంపీ స్థానానికి 27 మంది రంగంలో ఉన్నారు. ఆందోల్ అసెంబ్లీ స్థానానికి ఐదుగురే..: మెదక్ జిల్లా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదుగురే రంగంలో నిలవగా.. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, ఖమ్మం అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా 25 మంది చొప్పున పోటీలో ఉన్నారు. కాగా జిల్లాల వారీగా చూస్తే... ఆదిలాబాద్లో 10 స్థానాలకు 124 మంది, నిజామాబాద్లో 9 సీట్లకు 101 మంది, కరీంనగర్లోని 13 నియోజకవర్గాలకు 168 మంది, మెదక్లో పది స్థానాలకు 105 మంది, రంగారెడ్డిలో 14 స్థానాలకు 284 మంది, హైదరాబాద్లో 15 స్థానాలకు 298 మంది, మహబూబ్నగర్లో 14 స్థానాలకు 144 మంది, నల్లగొండలోని 12 స్థానాల్లో 161 మంది, వరంగల్లో 12 నియోజకవర్గాలకు 154 మంది, ఖమ్మంలో పది స్థానాలకు 143 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. -
సీమాంధ్రలో మోగిన ఎన్నికల నగారా
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీమాంధ్రలో ఎన్నికల నగారా మోగింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో జరగనున్న 25 ఎంపీ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈనెల 19వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. కాగా ఈనెల 13న ఆదివారం, 14న అంబేద్కర్ జయంతి, అలాగే 18వ తేదీ గుడ్ఫ్రైడేను సెలవు దినాలుగా ప్రకటించారు. దాంతో ఈ మూడు రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23 తుది గడువు. పోలింగ్ మే 7వ తేదీన జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 16న జరుపుతారు. -
సీమాంధ్రలో ఎన్నికలకు నేడే నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ స్థానాలకు శనివారం ఉదయం 11 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుంది. అప్పటినుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే మధ్యలో 3 రోజులు సెలవులు వస్తున్నాయి. ఆ సెలవుల రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ఈ నెల 13వ తేదీన ఆదివారం సెలవు వస్తోంది. అలాగే 14వ తేదీన అంబేద్కర్ జయంతిని, అలాగే 18వ తేదీ గుడ్ఫ్రైడేను నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్ చట్టం కింద సెలవు ప్రకటించారు. దీంతో ఈ మూడు రోజుల్లోను నామినేషన్లు స్వీకరించరు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23 తుదిగడువు. పోలింగ్ మే 7న, ఓట్ల లెక్కింపు 16న జరుగుతాయి -
చివరిరోజు భారీగా నామినేషన్లు
{పముఖుల్లో కేసీఆర్, జైపాల్రెడ్డి, పొన్నాల, కిషన్రెడ్డి, దినేష్రెడ్డి, ఎర్రబెల్లి నేడు నామినేషన్ల పరిశీలన.. 12న ఉపసంహరణకు ఆఖరి రోజు హైదరాబాద్: తెలంగాణలో సాధారణ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు బుధవారం ఆఖరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రధాన అభ్యర్థులంతా చివరిరోజునే నామినేషన్లు దాఖలు చేశారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను దశల వారీగా మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత , బుధవారం ఉదయం కూడా ప్రకటించడంతో ‘బీ’ ఫారాలు తీసుకోవడం, నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ యూవత్తూ హడావుడిగా సాగింది. దశమి మంచిరోజు అనే ఉద్దేశంతో పలువురు ప్రముఖులు బుధవారం వరకు వేచి చూసి నామినేషన్లు దాఖలు చే శారు. మధ్యాహ్నం మూడు గంటల వరకే గడువు కాగా.. కొన్నిచోట్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరుుతే సమయంలోగా క్యూలో నిలబడినవారికి టోకెన్లు ఇచ్చి వారంతా నామినేషన్లు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. చివరిరోజున నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (మెదక్ పార్లమెంటు, గజ్వేల్ అసెంబ్లీ), ఆయన కుమార్తె కవిత (నిజామాబాద్ లోక్సభ), కేంద్ర మంత్రి ఎస్.జైపాల్రెడ్డి (మహబూబ్నగర్ లోక్సభ), టీపీసీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య (జనగామ), పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (నిజామాబాద్ రూరల్), మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (ఆంధోల్), మాజీ మంత్రి కె.జానారెడ్డి (నాగార్జునసాగర్), వైఎస్సార్సీపీ తరఫున మాజీ డీజీపీ దినేష్రెడ్డి (మల్కాజిగిరి లోక్సభ), పీజేఆర్ కుమార్తె విజయూరెడ్డి (ఖైరతాబాద్), ఎం.ఎ.రహమాన్ (మహబూబ్నగర్ లోక్సభ), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి (అంబర్పేట), బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ (సికింద్రాబాద్ లోక్సభ), టీడీపీ సీనియర్లు ఎర్రబెల్లి దయాకర్రావు (పాలకుర్తి), మోత్కుపల్లి నర్సింహులు (మధిర), సీపీఐ నాయకుడు నారాయణ (ఖమ్మం లోక్సభ) తదితరులు ఉన్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఈ నెల 12 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. నిజామాబాద్ లోక్సభ, నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీకి అత్యధిక నామినేషన్లు నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి అత్యధికంగా 68 నామినేషన్లు దాఖలయ్యూరుు. అత్యల్పంగా నాగర్కర్నూల్ లోక్సభ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యూరుు. ఇక అసెంబ్లీకి వస్తే అత్యధికంగా నిజామాబాద్ అర్బన్కు 55 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా ముథోల్కు 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
.ఉత్కంఠ!
సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాలోని రెండు లోక్సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడే 2వ తేదీ నుంచే నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. 9వ తేదీ ఆఖరు తేదీ. ఎన్నికలు ముంగిట్లో నిలిచినా.. ఇప్పటి వరకు ప్రధాన రాజకీయ పార్టీలేవీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఒక్క సీపీఎం మాత్రమే నల్లగొండ, భువనగిరి లోక్సభ, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. ఉగాది రోజునే తొలి జాబితా ప్రకటిస్తామని తొలుత ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం.. పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కిరాని కారణంగా మరో మూడు నాలుగు రోజులు జాబితాల విడుదలను వాయిదా వేసుకుంది. దీంతో కాంగ్రెస్లో ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న పలువురు ఢిల్లీలో మకాం వేసి ఏఐసీసీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆ పార్టీ సీపీఐతో పొత్తులు దాదాపు ఓ కొలిక్కి వచ్చినా, అధికార ప్రకటన వెలువడక పోవడంతో అభ్యర్థులనూ ప్రకటించడం లేదు. పార్టీ వర్గాల సమాచారం మేరకు సీపీఐ మునుగోడు, దేవరకొండలను తీసుకుం టుంది. కాంగ్రెస్ మరో పదిచోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాల్సి ఉంది. మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాలు తీవ్ర ఉత్కంఠను రేపుతుండగా, కోదాడ అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం ఇంకా, తమ అభ్యర్థులను మాత్ర,అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఆ పార్టీ నుంచి టికెట్లు ఖాయం అన్న ధీమాతో ఉన్న నాయకులు కొందరు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒంటరి పోరుకు సిద్ధమంటున్న టీఆర్ఎస్ సైతం తమ అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. అయితే, చివరి నిమిషంలో కాంగ్రెస్తో పొత్తు కుదిరినా కుదరొచ్చన్న కారణంగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హుజూర్నగర్ నుంచి తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను పోటీకి పెడుతున్నట్లు ప్రచారం జరిగినా, పార్టీ అధినేత కేసీఆర్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. సీపీఐతోనూ ఆ పార్టీ పొత్తు ఉంటుందా, ఉండదా అన్న విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. ఈ కారణంగానే జిల్లాలో టీఆర్ఎస్ పోటీ చేసే స్థానాల విషయంపై ఇంకా గందరగోళమే నడుస్తోంది. టీడీపీ-బీజేపీల పరిస్థితి దీనికంటే భిన్నంగా ఏమీలేదు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురిందని, ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయమూ ఖరారైందంటున్నా.. ఇంకా అధికార ప్రకటన రాలేదు. దీంతో ఈ రెండు పార్టీల శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. బీజేపీ మొత్తం అన్ని సీట్లలో పోటీ చేసే పరిస్థితిలో లేకపోవడం, టీడీపీ తరపున బరిలోకి దిగడానికి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉండడం వంటి కారణాలతో ఇరు పార్టీల కార్యకర్తలు టెన్షన్లోనే ఉన్నాయి. లోక్సభ, అసెంబ్లీ స్థానాల పంపకాలు జరిగినా, నాయకత్వాల నుంచి ఎప్పుడు ప్రకటన వెలువడుతుందాని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు ఖరారు చేసుకున్న సీపీఐ మాత్రం తమ సిట్టింగ్ స్థానం మునుగోడు, చానాళ్ల పాటు తమ ప్రాతినిధ్యంలో ఉన్న దేవరకొండ సీట్ల నుంచి పోటీకి సిద్ధమవుతోంది. అయితే, ఆ పార్టీ సైతం తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈసారి మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే యాదగిరిరావును పక్కన పెట్టి వేరొకరికి అవకాశం ఇవ్వాలన్న చర్చ సీపీఐలో జరుగుతోందని చెబుతున్నారు. నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో కూడా మెజారిటీ ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించకుండా రాజకీయ విశ్లేషకులకు పనికల్పించాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
ఇక ‘సార్వత్రికం’
‘పుర’ పోరు ముగిసింది. ‘స్థానిక’ సమరం సాగుతోంది. ఇక జిల్లా యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల రంగానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనికి సంబంధించి నామినేషన్ల పర్వానికి గడువు సమీపిస్తుండడంతో అధికారులు అందుకు రెడీగా ఉన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీలు కూడా తమ అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు తీవ్రస్థాయిలో చేస్తున్నాయి. వివిధ కోణాల్లో అంచనాలు వేసుకుంటూ జాబితాలు రూపొందించే పనిలో పడ్డాయి. సార్వత్రిక సమరభేరికి రాజకీయ పక్షాలు సన్నద్దమయ్యాయి. రేపటి(బుధ వారం)నుంచి అసెంబ్లీ, పార్లమెంటు సాధా రణ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. జిల్లా అధికారయంత్రాంగం అందుకు అనుగుణంగా సర్వసన్నద్దమైంది. జిల్లాలోని రెం డు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలకు సం భందించి నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఈ నెల 2 నుంచి 9వ తేదిల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 10న నామినేషన్ల పరిశీలన, 11, 12 తేదిల్లో నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఎన్నికలు ఈనెల 30న జరుగనున్నాయి. నామినేషన్ దాఖలిలా... మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీచేయనున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ ఎం.గిరిజా శంకర్కు అందజేయాల్సి ఉంటుంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేయనున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల సహాయాధికారి అయిన జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మన్కు దాఖలు చేయవలసి ఉంటుంది. పార్లమెంట్కు పోటీచేయనున్న జనరల్ లేదా బీసీ అభ్యర్థులు నామినేషన్ ధరావత్తు రూ..25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.12,500లు చెల్లించవలసి ఉంటుంది. అసెంబ్లీ స్థానాలకు పోటీచేయనున్న అభ్యర్థులు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ స్థానానికి పోటీచేయనున్న జనరల్, బీసీ అభ్యర్థులు నామినేషన్ ధరావత్తు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఖర్చు... పార్లమెంట్ స్థానానికి పోటీచేయనున్న అభ్యర్థి రూ.70 లక్షలకు మించి ఎన్నికల వ్యయం చేయకూడదు. అసెంబ్లీ స్థానానికి పోటీచేయనున్న అభ్యర్థి రూ.28 లక్షల వరకే ఎన్నికల ఖర్చు పెట్టవలసి ఉంటుంది. పోటీచేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు వేసే ముందురోజు ఎన్నికల ఖర్చుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్లను తెరవాల్సి ఉంటుంది. లావాదేవీలన్ని అదే అకౌంట్ ద్వారా నిర్వహించి ఎన్నికల అధికారులకు ఖర్చు లెక్కలు చూపాల్సి ఉంటుంది. ప్రతి ఖర్చుకు పొందుపర్చవలసిన అవసరం ఉంటుంది. -
ప్రచారానికి పదును
పురపాలక సంఘాలు, నగరపంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఓ క్రతువు ముగిసింది. నామినేషన్ల పరిశీలన ఘట్టం ఇప్పటికే పూర్తయింది. మరో వైపు అభ్యర్థులు ప్రచారానికి పదును పెట్టారు. ఓటరు మహాశయుని కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఐదు రోజులపాటు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల పరిధిలో మొత్తం 3,083 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన ఆదివారం కొలిక్కి వచ్చింది. మొ త్తం 323 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 2,758 నామినేషన్లు అర్హత సా ధించాయి. దేవరకొండలో దాఖలైన నామినేషన్లలో సగానికిపైగా తిరస్కరణకు గురికావడం గమనార్హం. మొత్తం 340 నామినేషన్లకుగాను 190 నామినేషన్లను అధికారులు తి రస్కరించారు. భువనగిరిలో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. అయితే కొన్ని స్థానాలకు ఒక్కో అభ్యర్థి రెండు నామినేషన్లు కూడా సమర్పించారు. ఒకటి కాకపోయినా ఒక టైనా అర్హత సాధిస్తాయన్న ఉద్దేశంతో ఒక్కో అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు అందజేశారు. ఈ క్ర మంలో చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్లు 18వ తేదీన ఉపసంహరించుకునే అవకాశం ఉంది. తద్వారా అంతి మంగా బరిలో నిలి చే అభ్యర్థుల సంఖ్య ఎంతన్నది తేలనుంది. ప్రచారబాట పట్టిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అప్పుడే ప్రచారబాట పట్టా రు. వాడల్లో తిరుగుతూ తమకే ఓటేయాలని అర్థిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోవద్దన్న కృత నిశ్చయంతో ఉన్న అభ్యర్థులు ముందు నుంచే ప్రచారం సాగిస్తున్నారు. పరిశీలన లో అర్హత సాధించిన అభ్యర్థులంతా మున్సిపాలిటీల్లో ప్రచారానికి దిగుతున్నారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ప్రచారంలో తలమునకల య్యా రు. చైర్పర్సన్ అభ్యర్థులదీ ఇదేబాట. ప్రచార ఖర్చు కు ఎన్నికల నిబంధనలు అడ్డు వస్తుండటంతో అభ్యర్థులు కొంత జంకుతున్నారు. ఎలాగైనా గెలవాలనే తపనతో మరికొం దరు ఖర్చుకు వెనకాడటం లేదు. గుట్టుచప్పుడు కాకుండా మద్యం, ఇతర ఖర్చులు పెట్టేస్తున్నారు. -
పాదేశికాలకు రేపటి నుంచి నామినేషన్లు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు నామినేషన్ల స్వీకరణకు జెడ్పీ అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎన్నికల్లో 19.56 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 790 ఎంపీటీసీ స్థానాలు, 56 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జర గనున్నాయి. జిల్లాలో ఓటర్లు 19,56,304 మంది ఉండగా వీరిలో మహిళలు 9,78,920 మంది, పురుషులు 9,77,384 మంది ఉన్నారు. 790 ఎంపీటీసీ స్థానాల్లో 384 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. 56 ఎంపీపీ స్థానాలకుగాను 27 స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. 56 జెడ్పీటీసీ స్థానాల్లో 28 స్థానాలు మహిళలకు కేటాయించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీపరంగా జరుగుతుండడంతో గ్రామస్థాయిలో ఎన్నికల వేడి పుంజుకుంది. దీంతో నామినేషన్ల కోసం పార్టీ నాయకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈనెల 20వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించేందుకుగాను అన్ని మండల కార్యాలయాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని, మరో ఇద్దరు అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించారు. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగాను, మరో ఏడుగురు జిల్లా స్థాయి అధికారులను అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకుగాను జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆరు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కౌంటర్లో పది మండలాల చొప్పున నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన ఈనెల 21న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈనెల 22న తిరస్కరించిన నామినేషన్లకు సంబంధించి అభ్యంతరాలను ఆర్డీవోలకు దాఖలు చేసుకోవచ్చు. వాటిపై తుది నిర్ణయాన్ని 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అధికారులు ప్రకటిస్తారు. 24వ తేదీ సాయంత్రం 3 గంటల్లోగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావాలి. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను, వారికి కేటాయించిన గుర్తులను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. 2587 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగుతాయి. కౌంటింగ్ 8వ తేదీ చేపట్టి పూర్తికాగానే ఫలితాలు ప్రకటిస్తారు.