-
Nalgonda: బీఆర్ఎస్కు మరో షాక్
సాక్షి, నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. డీసీసీబీ ఛైర్మన్పై గొంగడి మహేందరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన పదవి కోల్పోగా.. కాంగ్రెస్ తరఫున వ్యక్తి నూతన ఛైర్మన్గా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరిగింది. ప్రస్తుత చైర్మన్పై 10 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టారు. వారికి మరో ఐదుగురు బీఆర్ఎస్ డైరెక్టర్లు మద్దతు ఇచ్చారు. దీంతో డీసీసీబీలో ప్రస్తుత డైరెక్టర్ల సంఖ్య 19కు చేరింది. బీఆర్ఎస్ గొంగడి మహేందర్రెడ్డి పదవి కోల్పోవడంతో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కుంభం శ్రీనివాస్ రెడ్డి అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. -
నా ఇంటిలో గెట్టు పెడుతున్నారు
ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాం. నా తండ్రి కాలం చేయడంతో ఆ ఇల్లు వారసత్వంగా నాకు వచ్చింది. ఇరవై ఏళ్లుగా ఇంటి పన్ను కడుతూనే ఉన్నా. కానీ, ఇప్పుడు పెద్ద మనుషులు వచ్చి ఆ స్థలం నీకు ఇవ్వాలంటే రూ.70 వేలు ఇవ్వు అని బెదిరిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టిన చర్యలు తీసుకోవాలి. – తిప్పన క్రిష్ణారెడ్డి (లక్ష్మీపురం) ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఉపేక్షించం ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన విషయం నా దృష్టికి రాలేదు. లక్ష్మీపురం గ్రామంలో సర్వే నంబర్ 437లో ఉన్న 4.24 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని 20 మంది లబ్ధిదారులకు కేటాయించగా మిగిలిన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రభుత్వం ద్వారానే ఆ భూమిని పంపిణీ చేస్తాం. కబ్జాలకు పాల్పడితే రెవెన్యూ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రావు, ఆర్డీఓ, మిర్యాలగూడ -
కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూర్యాపేట : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హ్యాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి సూర్యాపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవదని.. ఆ పార్టీ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 20 నుంచి 25 మంది త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారని ఉత్తమ్ జోస్యం చెప్పారు. 10 ఏళ్లు తెలంగాణను బీఆర్ఎస్ మోసం చేస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కనీస న్యాయం జరగలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలిచి రాహుల్గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు 15 ఎంపీ స్థానాలు దక్కుతాయని, నల్లగొండ అభ్యర్థి రఘువీర్రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పడం అభినందనీయమన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మాట్లాడుతూ పేటలో కాంగ్రెస్ బలంగా ఉందని, అనుబంధ సంఘాలు, కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. సమావేశంలో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కె.రఘువీర్రెడ్డి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, సూర్యాపేట, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్, శంకర్నాయక్, ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, తండు శ్రీనివాస్యాదవ్, చకిలం రాజేశ్వర్రావు, కొప్పుల వేణారెడ్డి, పెద్దిరెడ్డి రాజా, కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజూ స్వల్పమే..
నల్లగొండ: నల్లగొండ లోక్సభ స్థానానికి రెండో రోజైన శుక్రవారం మరో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు నలుగురు అభ్యర్థులు ఆరుసెట్ల నామినేషన్లు దాఖలు చేయగా రెండో రోజు మాత్రం నలుగురు అభ్యర్థులు ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతో రెండురోజుల్లో ఎనిమిది మంది అభ్యర్థులు పది సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు నామినేషన్లను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన స్వీకరించారు. నామినేషన్లు సమర్పించింది వీరే.. రెండో రోజు స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అందులో బండారు నాగరాజు, కిన్నెర యాదయ్య ఉన్నారు. అలాగే ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా తలారి రాంబాబు నామినేషన్ సమర్పించారు. మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) అభ్యర్ధిగా వసుకుల మట్టయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి తరఫున ఒక నామినేషన్ సెట్ దాఖలు కాగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు ఒకటి, ఇద్దరు రెండు సెట్ల చొప్పున, ప్రజావాణి పార్టీ, సోషలిస్టు పార్టీ, ధర్మసమాజ్ పార్టీ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ తరఫున ఒక్కొక్కరు ఒక్కో సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి ఎంపీ స్థానానికీ అంతంతే.. సాక్షి, యాదాద్రి: లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భువనగిరి స్థానానికి రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్, బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్, సోషలిస్ట్ పార్టీ (ఇండియా) అభ్యర్థిగా రచ్చ సుభద్రారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా మెగావత్ చందునాయక్, రేకల సైదులు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు. మొదటి, రెండో రోజు కలిపి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు తొమ్మిది సెట్ల నామినేషన్లు వేశారు. అట్టహాసంగా సీపీఎం అభ్యర్థి నామినేషన్ సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జహంగీర్ వెంట సీపీఎం పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండమడుగు నర్సింహ ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే జన సమీకరణ చేయకుండా సాదాసీదాగా వచ్చి నామినేషన్ వేశారు. నల్లగొండ లోక్సభ స్థానానికి ఎనిమిది నామినేషన్లు రెండు రోజులు నలుగురు అభ్యర్థుల చొప్పున దాఖలు మొత్త పది సెట్ల నామినేషన్లు -
రైలు పట్టాల సమీపంలో మంటలు
● పలు రైళ్ల రాకపోకలకు అంతరాయంమిర్యాలగూడ అర్బన్: రైలు పట్టాల సమీపంలో మంటలు వ్యాపించడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని కుక్కడం వద్ద చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కడం వద్ద రైలు పట్టాల సమీపంలో రైతులు ఎండిపోయిన వరి కొయ్యలకు నిప్పుపెట్టడంతో మంటలు క్రమంగా వ్యాపిస్తూ రైలు పట్టాల వద్దకు వచ్చాయి. దీంతో విషయాన్ని తెలుసుకున్న రైల్వే సిబ్బంది గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలును మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. మంటలను ఆర్పిన అనంతరం రైలు బయలుదేరి వెళ్లింది. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు రైల్వే ఎస్ఐ పేర్కొన్నారు. నీటి ఎద్దడి రాకుండా చూడాలి కేతేపల్లి: ప్రస్తుత వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ టి.నాగిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కేతేపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కేతేపల్లి, శాలిగౌరారం మండలాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై అధికారులు, సిబ్బందితో సంయుక్తంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. తాగునీటి ట్యాంకులను నెలలో మూడు సార్లు శుభ్రం చేయించటంతో పాటు, లీకేజీ అయిన పైప్లైన్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ పనులు లేనందున అన్ని గ్రామాల్లో కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, డీఎల్పీఓ వెంకటేశ్వర్లు, ఆయా మండలాల ఎంపీడీఓలు బి.శ్రీనివాసరావు, లక్ష్మినారాయణ, ఎంఈఓ నాగయ్య, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు శ్రీనివాస్, మౌనిక, ఐకేపీ ఏపీఎం యాదమ్మ, ఈజీఎస్ ఏపీఓ సురేందర్, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట : ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సహస్రనామ పఠనాలతో అర్చకులు, వేద పండితులు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేశారు. ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, అభిషేకం, ఆలయ ముఖ మండపం, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజ వాహనసేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవంతో పాటు శ్రీస్వామి, అమ్మవారి సేవలను ఊరేగించారు. వైభవంగా ఊంజలి సేవోత్సవం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజలి సేవ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవోత్సవం చేపట్టారు. ఆ తర్వాత ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాధ స్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. -
అమ్మకానికి ప్రభుత్వ భూమి!
ఫ పేదల భూమిపై పెద్దల కన్ను ఫ అనధికారిక కమిటీతో భూ పంపిణీకి కసరత్తు ఫ 73 గజాల ప్లాట్కు రూ.70 వేలు ఇవ్వాలని హుకుం జారీ ఫ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ ఫ మిర్యాలగూడ మండలం లక్ష్మీపురంలో కొందరి నిర్వాకం మిర్యాలగూడ: పేదల ఇళ్ల స్థలాల కోసం ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను అమ్మకానికి పెట్టారు కొందరు పెద్దలు. గతంలో ఇల్లు కట్టుకోలేకపోయిన వారి స్థలాలతోపాటు ఇల్లు నిర్మించుకొని నివాసముంటున్న వారు కూడా కొంత డబ్బు చెల్లిస్తేనే ఆ స్థలాలు, ఇళ్లు మీకు దక్కుతాయని, లేదంటే వేరే వాళ్లకు కేటాయిస్తామని బెదిరిస్తున్నారు. ఈ తతంగం మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. గ్రామంలోని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇరవై ఏళ్ల క్రితం స్థానికంగా సర్వేనంబర్ 437లో 4.24 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 20 మందికి వంద గజాల చొప్పున పంపిణీ చేసింది. ఇందులో ఐదారుగురు మాత్రమే ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు కట్టుకోగా కొందరు బేస్మెంట్ లెవల్, కొందరు కంచె వేసుకొని ఇంటి స్థలాన్ని ఆపుకున్నారు. ఇందులో ఇంకా 3 ఎకరాల భూమి మిగిలి ఉంది. దీనిపై స్థానిక నాయకుల కన్ను పడింది. ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని పథకం పన్నారు. దీంతో అనధికారికంగా 14 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి గతంలో ప్రభుత్వం పంపణీ చేయగా మిగిలిన భూమిని పేదలకు పంచుతామని ప్రకటించారు. ఈ నెల 23న లబ్ధిదారుల ఎంపిక చేస్తామని, అర్హుల పేర్లు సేకరిస్తూ ఒక్కొక్కరి నుంచి ఎంట్రీ ఫీజుగా రూ.1,500 వసూలు చేశారు. మొత్తం 190 మందికి 73 గజాల చొప్పున ఇస్తామని నిర్ణయించారు. ఇందుకు గ్రామ కమిటీకి గుండుగుత్తగా మొత్తం రూ.70 వేలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో గతంలో వంద గజాలు కేటాయించిన 20 మంది లబ్ధిదారుల నుంచి 73గజాలు పోను మిగతా వాటికి డబ్బులు అయినా కట్టండి లేదా భూమినైనా వదిలి పెట్టండని ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఇదీకాక వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులను సైతం డైబ్బెవేల రూపాయలు కట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అప్పటి లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి మిగిలి ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని గ్రామానికి చెందిన పేదలు కోరుతున్నారు. డబ్బులు ఇస్తేనే ఇల్లు కట్టుకోవాలట.. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో నాకు ప్రభుత్వం ఇంటి స్థలం వచ్చింది. అప్పట్లో ఇల్లు కట్టుకోవాలని బేస్మెట్ నిర్మాణం చేశాను. కానీ, ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేక అలానే వదిలేశాను. అదే బేస్మెట్పై నీవు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే రూ.70 వేలు ఇవ్వమని పెద్దమనుషులు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఎదుకు డబ్బులివ్వాలో అర్థంకావట్లేదు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – ఆడోతు రవి, లక్ష్మీపురం -
సెక్టోరియల్ అధికారుల పాత్ర కీలకం
నల్లగొండ: ఎన్నికల విధుల నిర్వహణలో సెక్టోరియల్ అధికారుల పాత్ర కీలకమని, వారు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం ఆమె జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సెక్టోరియల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పీఓలు ఏపీఓలు, ఇతర సిబ్బంది కేటాయించిన విధులను సెక్టోరియల్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలను కల్పించాలన్నారు. సెక్టోరియల్ అధికారులకు ఇచ్చిన హ్యాండ్ బుక్ను పూర్తిస్థాయిలో చదవాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ రాలేదని ఫిర్యాదులు రావొద్దు ఏ ఉద్యోగి తనకు పోస్టల్ బ్యాలెట్ రాలేదని ఫిర్యాదు చేయకూడదని, ఒకవేళ అలాంటి ఫిర్యాదులు వస్తే సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిచందన హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలెట్ విషయమై జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు ఫారం–12 అందినట్లు సంబంధిత శాఖల అధికారులు ధ్రువీకరణ ఇవ్వాలన్నారు. ఎన్నికల విధులు కేటాయించి శిక్షణ తరగతులకు హాజరుకాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ సమావేశాల్లో కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి డి.రాజ్యలక్ష్మి, వివిధ శాఖల తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హరిచందన -
కాంగ్రెస్ నాయకుడి కిడ్నాప్ కలకలం !
సూర్యాపేట : బ్లాక్ కాంగ్రెస్ సూర్యాపేట మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య కిడ్నాప్ కలకలం రేపుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి ఎల్లయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేటకు చెందిన అపర్ణ అనే మహిళ గురువారం తమ భార్యాభర్తల పంచాయితీ పరిష్కరించాలని చెప్పి సూర్యాపేటకు వచ్చి వడ్డే ఎల్లయ్యను తీసుకొని ఆయన కారులోనే జగ్గయ్యపేటకు బయలుదేరారు. ఎల్లయ్య స్నేహితుడు కోదాడ పట్టణానికి చెందిన మొగిలిచర్ల అంజయ్య అతడితోపాటు ఇంకో వ్యక్తికూడా కలిసి జగ్గయ్యపేటకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ఎల్లయ్య స్నేహితులు ఇద్దరు కోదాడలో దిగిపోయారు. జగ్గయ్యపేట బస్టాండ్ సమీపంలోకి రాగానే శ్రీనివాస్ అనే వ్యక్తికి అపర్ణ ఫోన్ చేసి ఎల్లయ్యను తీసుకొచ్చానని, ఇక్కడికి రమ్మని చెప్పింది. బస్టాండ్ దగ్గరకు వచ్చిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి మాట్లాడుకుందామని, అక్కడే పెద్ద మనుషులు కూడా ఉన్నారని చెప్పి కారులో శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికి ఎల్లయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతోపాటు అపర్ణ, శ్రీనివాస్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన వడ్డె ఎల్లయ్య చిన్నమ్మ కొడుకు మారెపల్లి సతీష్ శుక్రవారం జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వడ్డే ఎల్లయ్య రెండు రోజులుగా కనిపించకపోవడంతో కిడ్నాప్ అయినట్లు భావిస్తున్నారు. -
సీపీఎం అభ్యర్థి ఆస్తులు స్వల్పమే
సాక్షి, యాదాద్రి: భువనగిరి లోక్సభ నియోజకవర్గం సీపీఎం తరఫున పోటీ చేస్తున్న ఎం.డి.జహంగీర్ శుక్రవారం నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలతో పాటు రిటర్నింగ్ అధికారికి అందజేసిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. జహంగీర్ భార్యపేర నగదు చేతిలో : రూ.35,000 రూ. 5,000 బ్యాంకు అకౌట్లో : రూ.2,03,067 రూ. 2,500 మోటర్బైక్ విలువ : రూ. 55,000 రూ. 55,000 బంగారు అభరణలు విలువ రూ.7,00,000 స్వాగ్రామంలో వ్యవసాయ భూమి 11 గుంటలు. దాని విలువ రూ.6,00,000 మునిపంపులలో సొంత ఇల్లు విలువ : రూ.25,00,000 -
నామినేషన్ పత్రాలతో పూజలు
భువనగిరి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా భువనగిరి పట్టణంలోని నల్లగొండ చౌరస్తా సమీపంలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో పూజలు చేశారు. అనంతరం సమీపంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల శ్రీనివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం పాల్గొన్నారు. -
సైబర్ నేరాలను అరికట్టాలి
నల్లగొండ రూరల్: సైబర్ నేరాలను అరికట్టే శక్తి సామర్థ్యాలు యువత పెంపొందించుకోవాలని హైదరాబాద్కు చెందిన హంట్ మెట్రిక్స్ సంస్థ డైరెక్టర్ కృష్ణ అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో హంట్ మెట్రిక్స్, ఎంజీయూ సంయుక్తంగా సైబర్ నేరాలు–సవాళ్లు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 10.5 ట్రిలియన్ డాలర్లను ప్రజలు సైబర్ నేరాల కారణంగా నష్టపోతున్నట్లు తెలిపారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏటా రూ.600 కోట్లు నేరగాళ్ల వల్ల నష్టపోతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరచడం వల్ల నేరగాళ్ల వలలో పడుతున్నట్లు తెలిపారు. ఉచితాలు, తక్కువ ధరల ముసుగులో నేరగాళ్లు పంపే లింక్ మెసేజ్లు ఓపెన్ చేసి అమాయకులు నష్టపోతున్నారన్నారు. అన్ని రంగాల్లో సైబర్ నేరాలకు అవకాశం ఉందని, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే మానవ వనరులు పెంచుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఇతరులను చైతన్యం చేయాలన్నారు. సైబర్ నేరాలు అరికట్టడంలో నైపుణ్యం ఉంటే భవిష్యత్లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అవగాహ న ఒప్పందాలు చేసుకుని స్వల్ప కాలిక కోర్సులను హంట్ మెట్రిక్ సంస్థ ద్వారా అందిస్తున్నట్లు తెలి పారు. కృత్రిమ మేధాయుగంలో ప్రజలు మరింత అప్రమత్తంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, ఓఎస్డీ కొప్పుల అంజిరెడ్డి, హంటు మెట్రిక్స్ సంస్థ ఎండీ.అయూబ్, రామచందర్, ప్రశాంతి, ప్రేమ్సాగర్, రేఖ, మద్దిలేటి, పాండరయ్య పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ జెండా పట్టే నాయకుడే ఉండడు
మునుగోడు: రానున్న రోజుల్లో గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా పట్టే నాయకుడే ఉండడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. సింగారం, చొల్లేడు, మునుగోడు మాజీ సర్పంచ్లు గుర్రాల పరమేష్, జనిగల మహేశ్వరి, మిర్యాల వెంకన్నలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం రాజగోపాల్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలతో పాటుఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు బయటపడుతుండడంతో ఆ పార్టీలో కొనసాగేందుకు నాయకులు ఇష్టపడడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధువులు తప్ప ఆ పార్టీలోని ఇతర నాయకులంతా ఎప్పుడు కాంగ్రెస్లో చేరుదామని ఎదురుచూస్తున్నారన్నారు. త్వరలో మునుగోడు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా చేరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు. ఫ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి -
కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలి
హుజూర్నగర్ : ఈ నెల 21న హుజూర్నగర్లోని రాజీవ్ ప్రాంగణంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుజూర్నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సభకు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హాజరవుతారని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సభ సవ్యంగా జరిగేలా చూడాలని స్థానిక నేతలకు సూచించారు. నల్లగొండ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు ఆదర్శ వివాహం చేసుకున్న హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఎడ్ల విజయ్–శిరీష దంపతులను మంత్రి ఆశీర్వదించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తన్నీరు మల్లికార్జునరావు, దొంగరి వెంకటేశ్వర్లు, గెల్లి రవి, సుంకరి శివరాం యాదవ్, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, మంజూనాయక్, మజీద్ పాల్గొన్నారు. ఫ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి -
ఎన్నికల వ్యయ పరిశీలకుడికి కలెక్టర్ స్వాగతం
నల్లగొండ: లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నల్లగొండ జిల్లాకు నియమితులైన కళ్యాణ్కుమార్దాస్ శుక్రవారం నల్లగొండలోని పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వారు లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, వివిధ రకాల ఫారాలు, డిపాజిట్ తదితర అంశాలపై చర్చించారు. వారివెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్ పార్టీ భువనగిరి అభ్యర్థిపై భూ కబ్జా కేసు
ఇబ్రహీంపట్నం రూరల్: కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పేర్వాల గ్రామానికి చెందిన కంచర్ల రాధిక, ఆమె భర్త యాదగిరిరెడ్డి తుర్కయంజాల్ పరిధిలోని రాగన్నగూడ సర్వే నంబర్ 500, 501లోని ప్లాట్ నంబర్ 65లో 200 గజాల స్థలాన్ని 2015లో కొనుగోలు చేశారు. అప్పట్లోనే స్థలం హద్దుల మేరకు కడీలు పాతి వదిలేశారు. అయితే, ఫిబ్రవరి 17న కిరణ్కుమార్రెడ్డి, చామర్తి మారుతి రవిశంకర్ అనే ఇద్దరు వ్యక్తులు.. రాధిక దంపతుల ప్లాట్తో పాటు దక్షిణం వైపున్న రోడ్డును ఆక్రమించి కాంపౌండ్ నిర్మించారు. తమకు రాజకీయ అండదండలు ఉన్నాయని బెదిరించారు. దీంతో సదరు మహిళ ఇబ్రహీంపట్నం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఈ నెల 13న చామల కిరణ్కుమార్రెడ్డి, చామర్తి మారుతి రవిశంకర్పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంల తరలింపు
తుంగతుర్తి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు జిల్లా కేంద్రం నుంచి తుంగతుర్తి మండల కేంద్రానికి వచ్చాయి. వాటిని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ జీఎస్ లత, ఎన్నికల అధికారులు శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జీఎస్ లత మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గానికి 407 కంట్రోల్ యూనిట్లు, 407 బ్యాలెట్లు యూనిట్లు, 456 వీవీప్యాట్లు వచ్చాయని తెలిపారు. వాటిని వివిధ పార్టీల నాయకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమణారెడ్డి, సీఐ శ్రీను, ఎస్ఐ ఏడుకొండలు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
మోత్కుపల్లి నిరసన గళం
సాక్షి, యాదాద్రి : మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సొంత పార్టీపై నిరసన గళం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎంపీ టికెట్ల కేటాయింపులో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమ జాతికి జరిగిన అన్యాయాన్ని ఆయన మీడియా, సోషల్మీడియా వేదికల ద్వారా అధిష్టానం దృష్టికితీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మాదిగ సామాజికవర్గానికి టికెట్ లభించలేదని అంటున్నారు. తాను పార్టీలోనే ఉంటూ తమ జాతికి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేస్తానంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన మోత్కుపల్లి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నది వేచిచూడాలి. రేవంత్ పునరాలోచించాలి రాష్ట్రంలో కాంగ్రెస్ అధిష్టానంగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి మాదిగలకు టికెట్లు ఇచ్చే విషయంలో పునరాలోచించాలని మోత్కుపల్లి కోరుతున్నారు. ప్రధానంగా కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని మోత్కుపల్లి తప్పుపడుతున్నారు. తమ జాతికి టికెట్ల కోసం కాంగ్రెస్లో ఉంటూ ప్రయత్నిస్తానంటున్నారు. సామాజిక న్యాయం పాటించడంలో ముందుండే కాంగ్రెస్ పార్టీ.. నామినేషన్లు పూర్తయ్యేలోపు మాదిగలకు టికెట్లు ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నానని మోత్కుపల్లి ‘సాక్షి’తో చెప్పారు. ఉమ్మడి జిల్లాలో మోత్కుపల్లి ప్రభావం మాదిగ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతగా మోత్కుపల్లి నర్సింహులు ప్రభావం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలు మెజార్టీగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ మాదిగలకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిందన్న ప్రచారం ఆ వర్గం నుంచి ఇప్పటికే జోరందుకుంది. అగ్గికి వాయువు తోడైనట్లు మాదిగ సామాజికవర్గ నేతలకు మోత్కుపల్లి అండ లభిస్తోంది. దీంతో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ సీట్ల పరిధిలో జరిగే నష్టం ఎంత అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఫ మాదిగలకు ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్తో అంతర్గత పోరు ఫ రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలని డిమాండ్ ఫ పార్టీ మారేది లేదంటూనే.. అసమ్మతి రాగం ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభావం చూపనున్న మోత్కుపల్లి నర్సింహులు -
పాలీసెట్ ప్రవేశ పరీక్ష తేదీ మార్పు
రామగిరి(నల్లగొండ): పాలీసెట్–2024 ప్రవేశ పరీక్ష తేదీ షెడ్యూల్లో మార్పు జరిగినట్లు నల్లగొండ పాలి టెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి.జానకీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 17న జరగాల్సిన పరీక్ష 24వ తేదీకి మార్చినట్లు చెప్పారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. కళాశాలలో సివిల్ మెకానిక్, ఎలక్కికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మూడేళ్ల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. polycet.sbtet. telan gana.gov.in వెబ్సైట్ నందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, ఏప్రిల్ 22 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు అపరాద రుసుము లేకుండా, 24వ తేదీ వరకు రూ.100, 26వ తేదీ వరకు రూ.300 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చునని పేర్కొన్నారు. ఉచిత పాలీసెట్ కోచింగ్ పాలీసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు నల్లగొండ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలో మే 1 నుంచి 20వ తేదీ వరకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.జానకీదేవి తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటవ రకు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. పాలీసెట్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కోచింగ్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. . -
ఎమర్జెన్సీ మోటార్ల ట్రయల్ రన్ కొనసాగింపు
పెద్దఅడిశర్లపల్లి: నాగార్జునసాగర్ జలాశయంలో నీరు అడుగంటడంతో జంట నగరాలకు తాగునీటి సరఫరా చేసేందుకు ఏర్పాటు చేస్తున్న ఎమర్జెన్సీ మోటార్ల ట్రయల్ రన్ను హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు కొనసాగిస్తున్నారు. గురువారం 60 క్యూసెక్కుల సామర్థ్యమున్న నాలుగు మోటార్లకు, 120 క్యూసెక్కుల సామర్థ్యమున్న రెండు మోటార్ల ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు శుక్రవారం 120 క్యూసెక్కుల సామర్థ్యమున్న మరో మోటార్ ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో మొత్తం ఏడు మోటార్ల ద్వారా 600 క్యూసెక్కుల నీటిని సాగర్ వెనుక జలాల నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా పుట్టంగండి మోటార్లకు సరఫరా చేస్తున్నట్లు హెచ్ఎండబ్ల్యూఎస్ డీఈలు వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. సీరియల్ ప్రకారం ధాన్యం కాంటాలు పెట్టాలి నకిరేకల్: కొనుగోలు కేంద్రాల్లో సీరియల్ ప్రకారం రైతుల ధాన్యం కాంటాలు పెట్టాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. నకిరేకల్ మండలం నెల్లిబండ శివారులో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తాకు 40 కేజీలు మాత్రమే కాంటా వేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసి రైతుల వివరాలు వెంటనే ట్యాబ్లో ఎంట్రీ చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. ఆయన వెంట డీఎం నాగేశ్వర్రావు, డీటీసీఎస్ జ్యోతి, ఆర్ఐ లింగస్వామి, కేంద్రం ఇన్చార్జి సైదులు ఉన్నారు. -
ఎన్నికల ప్రచార రథాలు ప్రారంభం
యాదగిరిగుట్ట : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపు కోరుతూ ఆలేరు నియోజకవర్గంలో తిరిగే ఎన్నికల ప్రచార రథాలకు శుక్రవారం యాదాద్రీశుడి వైకుంఠద్వారం వద్ద మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీ తామహేందర్రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, పట్టణ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి, కౌన్సిలర్ బూడిద సురేందర్, నాయకులు ఆరె యాదగిరిగౌడ్, మిట్ట వెంకటయ్యగౌడ్, సాయియాదవ్, భాస్కర్గౌడ్, ముక్కెర్ల సతీష్, యాకూబ్, కల్వకొలను సతీష్రాజ్, బండి వాసు, అంకం నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
నల్లగొండ క్రైం : తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.16లక్షల 24వేల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్రాజు విలేకరుల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విజయవాడలోని బొంబాయి కాలనీ, సీబ్లాక్ ఎఫ్ఎఫ్6లో నివాసం ఉండే దేవరకొండ రాంబాబు పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. రాంబాబు జలస్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఒంటరిగానే చోరీలకు పాల్పడడం ప్రారంభించారు. విజయవాడలో పలు చోరీ కేసుల్లో, గుంటూరులో పలు చోరీలో పట్టుబడి గుంటూరు జైలులో ఏడాది పాటు శిక్ష అనుభవించి 2024 జనవరిలో జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా అతడు తీరు మార్చుకోకపోగా మళ్లీ చోరీలకు పాల్పడడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఈనెల 10న మిర్యాలగూడ వన్టౌన్ పరిధిలో మౌర చంద్రశేఖర్ తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. గమనించిన రాంబాబు రాత్రి సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.50వేలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలిస్తుండగా మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రాంబాబు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని పట్టుకుని విచారించగా దొంగతనాలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. ఈ ఏడాది జనవరి 30న మిర్యాలగూడలోని కృష్ణాకాలనీలో, ఫిబ్రవరి 9న కృష్ణా జిల్లా గుడివాడలోని సత్యనారాయణపురం సాయిరాం అపార్ట్మెంట్లో, ఫిబ్రవరి18న ఏపీలోని బాపులపాడు, ఫిబ్రవరి 26న మిర్యాలగూడ రూరల్ పరిధిలోని తుంగపాడ్లో, మార్చి 26న మహబూబ్నగర్లోని కల్వకుర్తిలో, మార్చి 29న మిర్యాలగూడలోని తాళ్లగడ్డలో, ఈనెల 10న మిర్యాలగూడలో హౌజింగ్ బోర్డు కాలనీలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు ఒప్పుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన సీ ఐ సుధాకర్, ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, శ్రీను, నాగరాజు, ఐటీకోర్ మధు, ఫింగర్ ప్రింట్ ఏఎస్ఐ శివను డీఎస్పీ అభినందించారు. దొంగతనాల నివారణపై పటిష్ట నిఘా.. జిల్లాలో దొంగతనాలు నివారించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరింత నిఘా పెట్టినట్లు ఎస్పీ చందనా దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు దొంగతనాల పట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలు, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. జైళ్ల నుంచి విడుదలైన వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఫ రూ.16లక్షల 24వేల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం -
పాత ఇనుప సామగ్రి గోదాములో అగ్నిప్రమాదం
చౌటుప్పల్ : ఓ పాత ఇనుప సామగ్రి గోదాములో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చౌటుప్పల్ పట్టణానికి చెందిన సురేష్తో పాటు మరికొంత మంది కలిసి పట్టణ శివారులోని శ్రీని ఫార్మా పరిశ్రమ పక్కన ఎకరం స్థలం అద్దెకు తీసుకొని ఓం సాయిరాం స్క్రాఫ్ పేరిట పాత ఇనుప సామగ్రి గోదాం ఏర్పాటు చేసుకున్నారు. మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వివిధ పరిశ్రమల ను ంచి పాత సామగ్రిని కొనుగోలు చేసి నిల్వ చే స్తుంటారు. ఈ క్రమంలో గోదాం వెనుక భాగంలో ఉన్న పత్తిచేనులో ఉన్న చెత్తను రైతులు తగులబెట్టారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో అందులోని నిప్పురవ్వలు ఎగిసివచ్చి పాత ఇనుప సా మగ్రి గోదాంలో పడి మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపట్లోనే మంటలు నలుమూలలుగా వ్యాపించి ప్లాస్టిక్ సామగ్రి కావడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. గమనించిన నిర్వాహకులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్లాస్టిక్ సామగ్రి కావడంతో మంటలు తీవ్రం.. ప్లాస్టిక్ సామగ్రి కావడంతో మంటలు తీవ్రస్థాయిలో వ్యాపించాయి. దీంతో స్థానికంగా ఉన్న ఫైర్ఇంజన్ సరిపోకపోవడంతో పరిసర మండలాల నుంచి మరో రెండు ఫైర్ఇంజన్లను రప్పించారు. వాటితో పాటు స్థానిక దివీస్ పరిశ్రమ నుంచి సైతం అత్యాధునికమైన ఫైర్ఇంజన్ను రప్పించారు. అదే విధంగా స్థానికంగా ఉన్న ట్రాక్టర్లతో నీటిని తెప్పించి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సుమారుగా రూ.20లక్షల వరకు నష్టం జరిగిందని యజమాని సురేష్ తెలిపారు. విషయం తెలియగానే ఏసీపీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, సీఐ అశోక్రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భువనగిరి బీజేపీ అభ్యర్థి ఆస్తుల వివరాలు ఇవీ..
సాక్షి, యాదాద్రి: భువనగిరి లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తన నామినేషన్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. ● చేతిలోనగదు, బ్యాంకుడిపాజిట్ కలిపి : రూ.7,74,90,802.26 ● భార్య పేరుపై రూ.1,45,60147.82 ● స్థిరాస్తులు విలువ రూ.19,85,07,500 (భవనాలు, భూములు, ప్లాట్లు) ● భార్య పేరుపై రూ.10,23,76,250 ● స్వయంగా కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ : రూ 7,43,20,516 ● భార్య పేరుపై ఉన్న ఆస్తుల రూ.27,27,196 ● బ్యాంకు, ఆర్థిక సంస్థల నుంచి, ఇతరుల నుంచి తీసుకున్న రుణాలు రూ.1,28,17,844 భార్య పేరుపై రూ.1,93,83,212 ● బూర నర్సయ్యగౌడ్పై జనగామ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నడుస్తోంది. ఎఫ్ఐఆర్నెంబర్59/ 2004 ప్రకారం బచ్చన్నపేట పోలీస్స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా గుమికూడారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నారసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరచిన ఆచార్యులు.. స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం అర్చన, అభిషేకం చేశారు. ఇక ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు గావించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. -
జీజీహెచ్లో వైద్య సేవల పరిశీలన
నల్లగొండ టౌన్ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం ఉదయం నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)ను పరిశీలించారు. ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఎంసీహెచ్ వార్డుకు చేరుకున్న ఆయన రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రిలో సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల హాజరు పట్టిక, వైద్యం తీసుకుంటున్న రోగుల వివరాలు పరిశీలించారు. ఆసుపత్రిలో లిఫ్టు పని చేయకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించగా మరమ్మతులో ఉందని, మరమ్మతు చేయడానికి పది రోజుల సమయం పడుతుందని సిబ్బంది సమాధానం చెప్పడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల భవన నిర్మాణం నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అందరికీ అనువుగా ఉండేలా భవనం నిర్మాణం చేయాలని ఆయా శాఖల అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. రెండు రోజులకోసారి భవన నిర్మాణ స్థితిగతులను తాను పరిశీలిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, సూపరింటెండెంట్ డాకట్ర్ నిత్యానందం, ఆర్ఎంవో డాక్టర్ ప్రశాంత్, ఈఈ అజీజ్, డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు.