-
గోవా వీడియో లీక్ తర్వాత తొలిసారి కనిపించిన తమన్నా- విజయ్
హీరోయిన్ తమన్నా ప్రేమ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచింది. ఇన్నేళ్ల సినీ కెరీర్లో ఇంతవరకు తమన్నాపై ఎలాంటి రూమర్స్ లేవు. అలాంటిది నటుడు విజయ్ వర్మను ముద్దుపెట్టుకుంటున్న వీడియో బయటకు రావడంతో అది టాక్ ఆఫ్ టౌన్గా మారింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా గోవాలో ముద్దు పెట్టుకుంటూ కెమెరాలకు చిక్కారు. దీంతో ఆ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇప్పటివరకు ఈ పుకార్లపై విజయ్, తమన్నాలు స్పందించలేదు. ఇదిలా ఉంటే న్యూఇయర్ సెలబ్రేషన్స అనంతరం వీరిద్దరూ ముంబైకి చేరుకున్నారు. మొదటగా ఎయిర్పోర్టుకు తమన్నా రాగా, ఆ వెంటనే విజయ్ కూడా కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చాయ్, సమోసా రూ.490.. షాకవుతున్న నెటిజన్లు..!
వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఉదయం లేవగానే టీ తాగాల్సిందే లేదంటే ఏం తోచదు. ఇంట్లో అయినా, బయట అయినా రోజుకు నాలుగు కప్పుల టీ అయినా లాగించేస్తుంటారు. ఇక చాయ్, సమోసా ఆ కాంబినేషనే వేరు. చాలా మంది టీ తాగిన తర్వాత స్నాక్స్లా సమోసా తింటుంటారు. సాధారణంగా వీటి ధర కూడా ఎంతనుకున్న రూ. 50కు మించదు. అయితే ముంబై ఎయిర్పోర్ట్లో మాత్రం ధరలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముంబై ఎయిర్పోర్టులో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేసినందుకు రూ. 499 బిల్ వేశారు.. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు ఫరా ఖాన్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. డిసెంబర్ 28న రెండు ఫోటోలను షేర్ చేస్తూ.. ముంబై చత్రపతి శివాజి మహారాజ్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టులో రెండు సమోసాలు, ఒక కప్ టీ, ఒక వాటర్ బాటిల్ ధర 490’ గా పేర్కొంది. దీనికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే 2014 లోక్సభ ఎన్నికల సమయంలో 'అచ్ఛే దిన్ ఆనే వాలే హై' (మంచి రోజులు రాబోతున్నాయి' అని మోదీ చేసిన నినాదాన్ని గుర్తు చూస్తూ వ్యంగ్యంగా జర్నలిస్ట్ ఈ విధంగా క్యాప్షన్ జోడించింది. Two samosas, one chai and one water bottle for 490 Rs at Mumbai airport!! Kafi ache din aa gae hain. #Vikas pic.twitter.com/aaEkAD9pmb — Farah khan (@farah17khan) December 28, 2022 ఇందులో ఇందులో సాధారణ సైజ్ కలిగిన రెండు సమోసాలు ఒక చాయ్ కప్పు కనిపిస్తోంది. చాయ్ సమోసాపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా వేలల్లో లైక్లు వచ్చి చేరుతున్నాయి. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్లు ‘ముంబై కండివాలీ రైల్వే స్టేషన్లో 52 రూపాయలకు రెండు సమోసాలు, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ దొరుకుతుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకొందరు ‘ఏంటి విమానశ్రయంలో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ రూ.490నా’ అంటూ షాక్ అవుతున్నారు. చదవండి: ‘ముంబై మహారాష్ట్రదే.. ఎవడబ్బ సొత్తు కాదు’ -
హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం..
ముంబై: శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తటంతో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండింగ్ చేశారు అధికారులు. విమానంలోని యెల్లో హైడ్రాలిక్ సిస్టమ్ పని చేయకపోవడంతో ముంబైకి మళ్లించినట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్(డీజీసీఏ) అంధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి దుబాయికి శనివారం సాయంత్రం 143 మంది ప్రయాణికులతో బయలుదేరింది ఎయిరిండియా ఏ320 వీటీ-ఈఎక్స్వీ విమానం. సాంకేతిక సమస్యను గుర్తించి ముంబైకి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో సుపరక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలో ఏర్పడిన సమస్యను సంబంధిత సిబ్బంది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా విమానాలు దారి మళ్లించడం కొత్తేమీ కాదు. డిసెంబర్ 2వ తేదీన కన్నూర్ నుంచి దోహా వెళ్తున్న ఇండో విమానం 6ఈ-1715ని ముంబైకి మళ్లించారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యం చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
Mumbai: సర్వర్ క్రాష్.. చుక్కలు చూసిన ప్రయాణికులు
ముంబై: విమానాశ్రయంలో సర్వర్ క్రాష్.. ప్రయాణికులకు చుక్కలు చూపించింది. కంప్యూటర్లు పని చేయకపోవడంతో.. మ్యానువల్గా చెక్ఇన్లను చేయడంతో భారీగా ప్రయాణికులు క్యూ కట్టారు. దీంతో.. ఫ్లైట్ టేకాఫ్ షెడ్యూల్లో మార్పులు కనిపించాయి. బుధవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని రెండవ టెర్మినల్స్ నుంచి విదేశీ విమానాలు ఆలస్యం అయ్యాయి. కంప్యూటర్ సిస్టమ్ క్రాష్ కావడంతో.. చెక్ఇన్ ప్రాసెస్ మ్యానువల్గా జరిగింది. దీంతో 40 నిమిషాలపాటు ఈ అంతరాయం నెలకొన్నట్లు తెలుస్తోంది. క్యూలో నిలబడిన కొందరు.. సోషల్ మీడియాలో అక్కడి పరిస్థితులను అప్డేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ టెర్మినల్ నుంచి విదేశీ విమానాలే కాదు.. స్వదేశీ విమానాలు కూడా సర్వీసులు నడిపిస్తుంటాయి. System crash at #MumbaiAirport @airindiain #allairlines Crazy crowd and long queues. Expect delayed flights and more… pic.twitter.com/3ImGgmjUYy — Kiwi (@kiwitwees) December 1, 2022 The sheer timing of you placing your bag for check in and all systems going down at that exact moment at Mumbai Airport @CSMIA_Official! 😶 Complete standstill and this is how we begin the weekend! — Ritu Mittal Mukherjee (@ritu__mukherjee) December 1, 2022 ఇదిలా ఉంటే.. ఎయిర్ ఇండియా ఈ పరిస్థితిపై ట్వీట్ చేసింది. అంతరాయాన్ని తగ్గించేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందంటూ పేర్కొంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ తర్వాత ముంబై విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయం. ప్రస్తుతం అక్కడ సేవలు పునరుద్ధరణ అయినట్లు తెలుస్తోంది. We understand that delays are certainly uncomfortable. Our team is working diligently to minimize the inconvenience. They'll be in touch with you for further updates. — Air India (@airindiain) December 1, 2022 #UPDATE | Normal services have resumed at Mumbai International Airport. The operations were disturbed for about 40 minutes due to server failure. — ANI (@ANI) December 1, 2022 ఇదీ చదవండి: ఒక్క ఓటర్ కోసం.. 8 మంది సిబ్బంది -
ముంబై ఎయిర్పోర్ట్లో 61కిలోల గోల్డ్ సీజ్.. కస్టమ్స్ చరిత్రలోనే రికార్డ్
ముంబై: విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాల గుట్టురట్టు చేశారు ముంబై కస్టమ్స్ అధికారులు. ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్థాయిలో బంగారం పట్టుకున్నారు. రెండు వేరు వేరు సంఘటనల్లో మొత్తం 61 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. దాని విలువ సుమారు రూ.32 కోట్లు ఉంటుందని తెలిపారు. ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ విభాగం చరిత్రలో ఒక్కరోజులో సీజ్ చేసిన విలువలో ఇదే అత్యధికమని తెలిపారు. ఈ సంఘటన గత శుక్రవారం జరిగినట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మొదటి ఆపరేషన్లో టాంజానియా నుంచి వచ్చిన నలుగురు భారతీయులను తనిఖీ చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన బెల్టుల్లో 1 కేజీ బంగారం బిస్కెట్లను దాచి తీసుకొచ్చారు. మొత్తం రూ.28.17 కోట్లు విలువైన యూఏఈ తయారీ గోల్డ్ బార్స్ 53 లభ్యమయ్యాయి. నలుగురిని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. మరో ఆపరేషన్లో 8 కిలోలు సుమారు రూ.3.28 కోట్ల విలువైన బంగారం సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద తనిఖీలు చేయగా ఈ బంగారం బయటపడింది. ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి కలిసి బంగారాన్ని మైనం రూపంలో చేసి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. దానిని జీన్స్లో పెట్టి తీసుకొస్తున్నారని తెలిపారు. ఇదీ చదవండి: Prashant Kishor: ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్ కిషోర్ క్లారిటీ.. ఏమన్నారంటే? -
ఎయిర్పోర్ట్లో షారూక్ను అడ్డుకున్న అధికారులు.. ఆ తర్వాతే బయటకు..!
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై విమానాశ్రయంలో బాలీవుడ్ స్టార్ను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అయన వద్ద నుంచి అత్యంత ఖరీదైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా భద్రతా సిబ్బంది షారూక్ను నిలువరించారు. రూ.18 లక్షల లగ్జరీ వాచీలు షారూక్ ఖాన్ బ్యాగ్లో ఉండగా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆరా తీశారు. అయితే ఆ తర్వాత వాటిపై కస్టమ్ డ్యూటీ మొత్తం రూ.6.83 లక్షలను బాలీవుడ్ హీరో చెల్లించారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించాక షారూక్ ఖాన్ విమానాశ్రయం నుంచి పంపించివేశారు. అయితే షారూక్ను ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2011లో విదేశీ వస్తువులను తీసుకురావడంతో కస్టమ్స్ అధికారులు రూ1.5 కోట్ల జరిమానా విధించారు. ప్రస్తుతం ఎస్ఆర్కే స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్లో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, జాన్ అబ్రహం నటిస్తున్న ఈ చిత్రం జనవరి 25, 2023న విడుదల కానుంది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో అతిథి పాత్రతో పాటు 'జవాన్', 'డుంకీ' కూడా కనిపించనున్నారు. దుబాయ్లోని షార్జాలో జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్- 2022లో పాల్గొన్న షారూక్ తిరిగి ముంబై చేరుకున్నారు. -
బూట్లు, పట్టు చీరల్లో నోట్ల కట్టలు.. పోలీసులు షాక్
ముంబై: అక్రమంగా విదేశీ కరెన్సీ రవాణా చేస్తున్న ఓ కుటుంబం.. ముంబై పోలీసులను షాక్కి గురి చేసింది. ఏకంగా దాదాపు ఐదు లక్షల డాలర్ల నగదును గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసే ప్రయత్నం చేసింది. అయితే.. ముందుగా సమాచారం అందుకున్న పోలీసులు అనుమానంతో వెతకగా.. ఆ కుటుంబం నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. విదేశీ కరెన్సీ అక్రమ రవాణా గురించి ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(AIU)కు ముందుగానే సమాచారం అందింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచే ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు, ఏఐయూ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. గురువారం ఉదయం ముంబై ఛత్రపది శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ కుటుంబం కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది. ఇద్దరు వృద్ధులతో సహా ముగ్గురు ఉన్న ఆ కుటుంబం లగేజీని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాళ్ల సూట్కేసులో ఉన్న షూస్ లోపల, పట్టుచీరల మధ్య అమెరికన్ డాలర్లు ప్రత్యక్షం కావడంతో కంగుతిన్నారు. మొత్తం అమెరికన్ డాలర్ కరెన్సీ విలువ 4,97,000 డాలర్లుకాగా, మన కరెన్సీలో దాని విలువ రూ.4.10 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించారు జడ్జి. ఇంత డబ్బు ఎక్కడిది? ఎలా చేతులు మారింది? అనే విషయాన్ని తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. #WATCH | In a targeted op by AIU, Mumbai Airport Customs, a family of 3 Indian pax going to Dubai were intercepted. The baggage examination of the 3 led to seizure of foreign currency worth 4,97,000 USD (approx Rs 4.1 Cr). All 3 passengers were arrested: Customs (Source:Customs) pic.twitter.com/TdQVZd4wox — ANI (@ANI) November 3, 2022 -
ముంబై ఎయిర్పోర్ట్లో భారీగా హెరాయిన్ పట్టివేత..రూ.100 కోట్లకు పైగా
ముంబై: ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి నిషేధిత మత్తుపదార్థం హెరాయిన్ను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మహిళతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆఫ్రికా దేశమైన మలాయ్ నుంచి వయా ఖత్తర్ దేశం మీదుగా ముంబైకి వస్తున్న ఓ ప్రయాణికుడు భారీ ఎత్తున హెరాయిన్ను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో డీఆర్ఐ అధికారులు మంగళవారం విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ప్రయాణికుడి లగేజీలో సుమారు 16 కేజీల హెరాయిన్ బయటపడింది. అధికారులు దానిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా విచారణ నిమిత్తం అతడిని డీఆర్ఐ కస్టడీకి అనుమతినిచ్చింది. కాగా, తనిఖీల్లో పట్టుబడ్డ హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మాదకద్రవ్యాన్ని డెలివరీ తీసుకునేందుకు ఢిల్లీలోని హోటల్ నుంచి వచ్చిన ఓ మహిళను కూడా అధికారులు అరెస్టు చేశారు. కాగా, ఈమెను ఘనాకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరో వ్యక్తిని కూడా డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే.. -
మాల్దీవులకు చెక్కేసిన విజయ్, రష్మిక? ఫోటోలు వైరల్
విజయ్ దేవరకొండ-రష్మిల డేటింగ్లో ఉన్నట్లు చాలకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఇప్పటికే ఈ జంట క్లారిటీ ఇచ్చినా డేటింగ్ రూమర్స్ ఆగడం లేదు. తాజాగా విజయ్, రష్మిక ఒకేసారి ఎయిర్పోర్టులో దర్శనం ఇవ్వడంతో మరోసారి ఈ జంట లవ్టాపిక్ హాట్టాపిక్గా మారింది. అంతేకాకుండా ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్లో కనిపించడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్పోర్టుకు విజయ్ వచ్చిన కాసేపటికే రష్మిక కూడా నవ్వుతూ లోపలికి వెళ్లింది. దీంతో ఇద్దరూ కలిసే వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లినట్లు టాక్ వినిపిస్తుంది. కాగా గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్-రష్మికల కెమిస్ట్రీకి ఎంతో మంది అభిమానులున్న సంగతి తెలిసిందే. #VijayDevarakonda and #RashmikaMandanna keep it cool and casual as they jet off to Maldives for vacation 🛫✈️#pair ❤️ #virosh 😘🔥 @TheDeverakonda @iamRashmika VC: @pinkvilla pic.twitter.com/dpYSk9mOYj — Revanth (@AtmakuriRevanth) October 7, 2022 -
KRK Arrest: నటుడు, క్రిటిక్ కేఆర్కే అరెస్ట్.. ఆ ట్వీట్తో వివాదం
బాలీవుడ్ సినీ విమర్శకుడిగా పొరేందిన కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై ఎయిర్పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు(మంగళవారం) కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. కాగా కేఆర్కే హిందీ బిగ్బాస్-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో కేఆర్కే వెలుగులోకి వచ్చారు. తనను తాను సినీ క్రిటిక్గా చెప్పుకునే రషీద్ ఖాన్.. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ సమా టాప్ హీరోల మీద ఎప్పుడూ విమర్శలు చేస్తూ పాపులారిటీ దక్కించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లోఆయన చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. 'కొంతమంది ప్రముఖులను తీసుకెళ్లకుండా కరోనా వెళ్లదు. ఆ సమయంలో నేను పేర్లు చెప్పలేదు. కానీ నాకు తెలుసు.. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి వాళ్లు చనిపోతారని. అంతేకాకుండా తర్వాత పైకి పోయేది ఎవరో కూడా నాకు తెలుసు' అంటే కేఆర్కే చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిపై కేసు నమోదవగా తాజాగా కేఆర్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. KRK arrested for below tweets done in 2020 pic.twitter.com/WklfVN8Lzi — Gabbbar (@GabbbarSingh) August 30, 2022 -
ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత
ముంబై: ఆఫ్రికా దేశం సియర్రాలియోన్కు చెందిన ఓ మహిళ నుంచి ముంబై విమానాశ్రయం అధికారులు రూ.5 కోట్ల విలువ చేసే 500 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. సియర్రాలియోన్కు చెందిన ఈ మహిళ ఆడిస్అబాబా నుంచి ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానంలో శుక్రవారం ముంబైకి చేరుకుంది. తనిఖీల్లో ఆమె పర్సులో దాచిన కొకైన్ బయటపడటంతో అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నట్లు కస్టమ్స్ విభాగం అధికారులు చెప్పారు. చదవండి: యువతిపై గ్యాంగ్ రేప్.. ఆపై వ్యభిచార ముఠాకు విక్రయం -
విజయ్కి షాకింగ్ ఇన్సిడెంట్, ‘చీజ్’ అంటూ కామెంట్.. ‘రౌడీ’ రియాక్షన్ చూశారా?
ప్రస్తుతం నార్త్లో లైగర్ హవా మామూలుగా లేదు. లైగర్ ఎక్కడికి వెళ్లిన ఆ ప్రాంతం జనసంద్రంలా మారిపోతుంది. దీంతో విజయ్ క్రేజ్ చూస్తుంటే సౌత్ ఆడియన్స్కి మతిపోతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందించిన ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం ప్రమోషన్స్ జోరు పెంచేసింది. ఈ క్రమంలో లైగర్ టీం ఇటీవల ముంబై, పుణే, పాట్నాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బాలీవుడ్ ప్రముఖ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోతో లైగర్ ప్రమోషన్ షూరు చేశారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు ఈ షోలో పాల్గొని పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హోస్ట్ కరణ్ జోహార్ నీకు చీజ్ ఇష్టమా? అని విజయ్ని ఆటపట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయమై విజయ్కి ఎయిర్పోర్ట్లో ఆసక్తికర సంఘటన ఎదురైంది. ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించిన ఈ ‘లైగర్’ మీడియా పర్సన్ విజయ్ అన్న విజయ్ అన్న పిలుస్తూ ‘ఇతనికి కూడా చీజ్ కావాలంటా?’ అంటూ కామెంట్ చేశాడు. అది విన్న విజయ్ అతని వంక కాస్తా అసహనంగా చూశాడు. ఇక మనసులోనే ఏదో అనుకుంటూ ముందుకు కదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. విజయ్ రియాక్షన్ చూసిన నెటిజన్లు ‘ఇకపై చీజ్ పేరు వింటే విజయ్ కోపంతో రగిలిపోతాడేమో’, ‘కాఫీ విత్ కరణ్ షో ఎంతపని చేసింది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ టాక్ షో తొలి ఎపిసోడ్లో పాల్గొన్న సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్లను డేటింగ్ చేయాలంటే ఏ హీరోను ఎంచుకుంటారని అడగ్గా ఇద్దరు విజయ్ దేవరకొండ అని సమాధానం చెప్పారు. ఈ ఆన్సర్పై జాన్వీని అంటే నువ్వు విజయ్ని ఇష్టపడుతున్నావా? అని సారా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వారి సమాధానం విన్న కరణ్ జోహార్ ఇద్దరు ఒక వ్యక్తితోనే డేటింగ్ చేస్తారా! అంటూ విజయ్ని చిజ్తో పోల్చాడు. View this post on Instagram A post shared by Sneh Zala (@snehzala) -
సమంత ఇంకా డిప్రెషన్లోనే ఉందా? చేతిలో ఆ బుక్
స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తుంది. వీరు విడిపోయి దాదాపు పది నెలలు కావొస్తున్నా ఇంకా వీరి బ్రేకప్ న్యూస్ నెట్టింట హాట్టాపిక్గానే ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారన్నదానిపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇద్దరూ తమ తమ కెరీర్ పరంగానూ దూసుకెళ్తున్నారు. లాల్ సింగ్ చద్దా సినిమాతో చై బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, సమంత సైతం హిందీలో వరుస సినిమాలకు సైన్ చేస్తుంది. తాజాగా ముంబై ఎయిర్పోర్టులో కనిపించిన సమంత ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. లూయిస్ హే రాసిన 'యూ కెన్ హీల్ యువర్ లైఫ్'అనే బుక్ సామ్ చేతిలో కనిపించేసరికి సామ్ డిప్రెషన్లో ఉందని, చై జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు ఇలాంటి పుస్తకాలు చదువుతుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం సామ్ ఖుషీ, యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తుంది. -
ఇండియాకు వచ్చిన విల్స్మిత్.. అతని కోసమేనా ? ఫొటోలు వైరల్..
Will Smith In India And Spotted At Mumbai Airport After Slap Controversy: హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ అంటే సినీ ప్రియులకు తప్ప ఇంకేవరికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఇటీవల నిర్వహించిన ఆస్కార్ వేడుకల్లో హోస్ట్, కమెడియన్ క్రిస్రాక్పై విల్ స్మిత్ చేయి చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ సంఘటన తర్వాత విల్ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మోషన్ పిక్చర్ అకాడమీ విల్స్మిత్పై 10 ఏళ్ల నిషేధం కూడా విధించింది. ఇదిలా ఉంటే విల్ స్మిత్ తాజాగా ఇండియా బాట పట్టాడు. శనివారం (ఏప్రిల్ 23) ముంబై విమానాశ్రయం వద్ద విల్ స్మిత్ దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. చెంపదెబ్బ ఘటన తర్వాత విల్ కెమెరాలకు చిక్కడం ఇదే తొలిసారి. విల్ స్మిత్ జుహులోని జెడబ్ల్యూ మారియట్హోటల్లో బస చేస్తున్నట్లు సమాచారం. అయితే విల్ స్మిత్ ఇండియాకు రావడానికి కారణం ఏంటని తీవ్రంగా చర్చ నడుస్తోంది. అందులోనూ ఇలాంటి సమయంలో రావడం హాట్ టాపిక్గా మారింది. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ను కలిసేందుకే విల్ స్మిత్ వచ్చినట్లు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. చెంపదెబ్బ ఘటనతో విల్ కొద్ది రోజులుగా విచారంగా ఉన్నాడట. దీంతో సద్గురు వద్ద కొంత సమయం గడిపేందుకు వచ్చాడని సమాచారం. ఈ విషయంపై ఎలాంటి అదికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు వెలువడలేదు. గతంలో విల్ స్మిత్ సద్గురుకు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. 2019లో కూడా విల్ స్మిత్ భారతదేశాన్ని సందర్శించాడు. అప్పుడు పలువురు బాలీవుడ్ ప్రముఖులను కలిసి ముచ్చటించాడు. మరీ ఈసారి ఎవర్నైనా కలుస్తాడా ? లేదో ? చూడాలి. చదవండి: విల్ స్మిత్పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో చెంపదెబ్బ ఎఫెక్ట్.. ఆగిపోయిన విల్ స్మిత్ సినిమాలు ! -
దీపిక డ్రెస్సింగ్పై ట్రోల్స్.. 'రణ్వీర్ డిజైన్ చేసాడేమో'..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె డ్రెస్సింగ్పై ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ ఎక్కువవుతుంది. తాజాగా తన తర్వాతి సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన దీపిక బిగుతైన రెడ్ కలర్ డ్రెస్లో కనిపించింది. క్యాప్, హ్యాండ్బ్యాగ్ కూడా ఎరుపు రంగులో ఉన్నాయి. దీనికి తోడు హై హీల్స్ వేసుకుంది. అవి కూడా రెడ్ కలర్లోనే ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు దీపికాను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అచ్చం జొమాటో డెలివరీ గర్ల్లా ఉందని, ఎప్పటిలాగే ఆమె డ్రెస్సింగ్ స్టైల్లో విఫలమైందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో రణ్వీర్ సింగ్ వింత ఫ్యాషన్ దీపిక పాటిస్తుందని, ఈ డ్రెస్ కూడా రణ్వీర్ డిజైన్ చేసి ఉండొచ్చని ట్రోల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్గా గెహ్రియాన్తో హిట్ అందుకున్న దీపిక ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన 'ప్రాజెక్ట్ కే' లో నటిస్తుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
జాన్వీ తీరుకు ఫ్యాన్స్ ఫిదా, హంబుల్, స్వీట్ అంటూ ప్రశంసలు
Janhvi Kapoor Cuts Birthday Cake At Mumbai Airport: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన తీరుతో ఒక్కసారిగా అందరి ఆకట్టుకుంటోంది. ఆమె నిరాండబరత చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకి జాన్వి ఇలా అందరి మన్ననలు పొందడానికి కారణం ముంబై ఎయిర్పోర్టు మీడియా పట్ల ఆమె చూపించిన వినయం. ఇంతకి ఏం జరిగిందంటే.. రేపు(ఫిబ్రవరి 6) జాన్వి బర్త్డే. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఆమె ముంబై ఎయిర్పోర్టులో కనిపించింది. దీంతో అక్కడ ఆమె చూసిన మీడియా జర్నలిస్టులు జాన్వికి అడ్వాన్స్గా బర్త్డే విషెస్ తెలిపారు. అంతేకాదు ఆమె కోసం బర్త్డే కేక్ కూడా తీసుకువచ్చారు. చదవండి: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్, నాకింకా గుర్తుంది.. అది 2012: సమంత వారు అభిమానాన్ని తిరస్కరించకుండా జాన్వి కేక్ కట్ చేసింది. ఇలా అడ్వాన్స్గా మీడియాతో కలిసి ఆము పుట్టిన రోజును జరుపుకోవడం చూసి నెటిజనట్లు ఆమె వినయం, విధేయతకు మెచ్చుకోకుండ ఉండలేకపోతున్నారు. ‘హంబుల్, స్వీట్’ అంటూ జాన్వీని ప్రశంసిస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా దివంగత నటి శ్రీదేవి తనయగా పరిశ్రమలో అడుగు పెట్టింది. తన తొలి చిత్రం థడక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి తన నటన, ప్రతిభ, డ్యాన్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె గుడ్ లఖ్ జెర్రీ మూవీలో నటిస్తోంది. ఇది తమిళ ఫిలిం కొలమావు కోకిల మూవీకి రీమేక్. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
విద్యార్థులకు స్వాగతం పలికిన కేంద్రమంత్రి సింధియా
-
ఉక్రెయిన్: ముంబై ఎయిర్పోర్టులో ఉద్విగ్న క్షణాలు
ముంబై: రష్యా సైనిక దాడులతో ఉక్రెయిన్ దేశంలో భయం గుప్పిట్లో గడిపిన భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రుమేనియా నుంచి బయల్దేరిన ఎయిరిండియా తొలి విమానం ముంబై చేరుకుంది. ఈ విమానంలో 219 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శనివారం బుకారెస్ట్ నుంచి బయల్దేరిన ఎయిరిండియా తొలి విమానంలో ఇండియాకు వచ్చిన విద్యార్థులకు కేంద్ర మంత్రులు ఎస్.జయశంకర్, పీయూష్ గోయల్ ముంబై ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు. విద్యార్థులను స్వస్థలాకు తరలించేందుకు అధికారులు ముమ్మర ఏర్పట్లు చేస్తున్నారు. 219 భారతీయుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఉన్నారు. తెలుగు విద్యార్థులు.. పోతుల వెంకట లక్ష్మీధర్రెడ్డి, తెన్నేటీ వెంకట సుమ, అర్ఫాన్ అహ్మద్, అమ్రితాంష్, శ్వేతశ్రీలు తొలి విమానంలో భారత్కు సురక్షితంగా చేరుకున్నారు. #WATCH | Union Minister Piyush Goyal welcomes the Indian nationals safely evacuated from Ukraine at Mumbai airport pic.twitter.com/JGKReJE1ct — ANI (@ANI) February 26, 2022 Union Minister Piyush Goyal welcomes Indian students evacuated from Ukraine at Mumbai Airport pic.twitter.com/eqUfOuViyw — ANI (@ANI) February 26, 2022 -
సీఎం కేసీఆర్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
-
ఎయిర్ పోర్టులో డ్రగ్స్ కలకలం.. జింబాబ్వే మహిళ వద్ద రూ. 60 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
సాక్షి, ముంబై: దేశంలో మరోసారి భారీ స్థాయిలో మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. మహిళా ప్రయాణికురాలి వద్ద దొరికిన దాదాపు రూ. 60 కోట్ల విలువైన డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు డ్రగ్స్ తరలిస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో విమానాశ్రయంలో వారు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా జింబాబ్వేకు చెందిన ఓ ప్రయాణికురాలి వద్ద మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు డ్రగ్స్ ను ట్రాలీ బ్యాగ్తో పాటు రెండు ఫైల్ ఫోల్డర్లలో దాచిపెట్టి తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపుగా రూ. 60 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. -
ఎయిర్పోర్ట్లో రష్మిక అలా కనిపించేసరికి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
Rashmika Mandanna Spotted In Airport, Fans Trolls On Her Dress Sense: ఛలో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భావ రష్మిక మందన్నా. ఆ తర్వాత గీత గోవిందంతో గుర్తింపు పొందిన ఈ భామ సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది. రీసెంట్గా వచ్చిన పుష్పతో మరో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకొని సక్సెస్ని ఎంజాయ్ చేస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ముంబై ఎయిర్పోర్టులో కనిపించింది. అయితే ఆమె వేసుకున్న డెనిమ్ షార్ట్ మరీ పొట్టిగా ఉండటంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. రష్మిక డ్రెస్సింగ్ మరీ ఓవర్గా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తూ.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? ఇంక నువ్వు బట్టలు వేసుకోవడం దేనికి అంటూ ఈ అమ్మడిపై ఫైర్ అవుతున్నారు.స్కిన్ షో చేయొచ్చు కానీ, ఇది టూ మచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. #RashmikaMandanna #DilKoKaraarAaya 💕🤩🔥#Rashmika #Rash #Mumbai #Srivalli #cutenessoverloaded pic.twitter.com/EEo9koiIPE — team_rashmika_mandanna (@MandannaTeam) January 24, 2022 -
ఫ్లైట్ ఎక్కేముందు కరోనా నెగెటివ్.. దిగాక పాజిటివ్!!
భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి భారత్లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ముంబై ఎయిర్పోర్ట్లో ఎదురైన అనుభవం దృష్ట్యా.. కరోనా టెస్టులు, ఐసోలేషన్లో ఉంచడం.. ఇదంతా పెద్ద స్కామ్ అంటూ వీడియోలో వ్యాఖ్యానించాడా వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్బుక్ ద్వారా వైరల్ అవుతోంది. మనోజ్ లాద్వా యూకేలో సెటిల్ అయిన వ్యక్తి. తన మామ అంత్యక్రియల కోసం భార్యతో పాటు లండన్ ‘హీథ్రో ఎయిర్పోర్ట్’ నుంచి విమానంలో వచ్చాడు. విమానం ఎక్కే ముందు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. డిసెంబర్ 30న వర్జిన్ అట్లాంటిక్ ఫ్లయిట్లో ముంబై ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడ ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన అయిన.. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఎయిర్పోర్ట్ సిబ్బందిని కోరారు. అయితే అందుకు నిరాకరించిన సిబ్బంది.. ఆయన్ని ప్రభుత్వం నిర్వహించే ఓ క్వారంటైన్ సెంటర్కు షిఫ్ట్ చేశారు. దీంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. ఈ అనుభవంపై ఫేస్బుక్ లైవ్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ముంబై ఎయిర్పోర్ట్లో అంతా మాయగా ఉంది. విమానంలో గట్టిగా పదిహేను మంది కంటే ఎక్కువమంది లేం. దిగగానే.. అదీ గంటల వ్యవధిలో పాజిటివ్ ఎలా నిర్ధారణ అవుతుంది? లండన్ ఎయిర్పోర్టులు రిపోర్టులు చూపించినా నమ్మకపోతే ఎలా? ఇండిపెండెంట్ పరీక్షలకు అంగీకరించకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. ఇదో పెద్ద కుంభకోణంలా ఉంది అంటూ ఆరోపించాడాయన. నాతో పాటు మరికొందరు ప్రయాణికులు గట్టిగా సిబ్బందిని నిలదీశాం.ఇక్కడి మార్గదర్శకాలు ఇష్టం లేకపోతే.. బయట డబ్బులు కట్టి అయినా క్వారంటైన్ సెంటర్లో ఉండాలంటూ బీఎంసీ అధికారులు(Brihanmumbai Municipal Corporation) బెదిరిస్తున్నారు’’ అంటూ మనోజ్ లాద్వా ఆరోపించారు. ఇదిలా ఉంటే లాద్వా వీడియో తీసిన టైంలో.. వెనకాల మరికొంతమంది ప్రయాణికులు సెంటర్ నిర్వాహకులతో గొడవ పడుతున్నట్లు వాయిస్ వినిపించింది. అయితే ఎయిపోర్ట్ సిబ్బంది మాత్రం తాము అంతా పక్కాగా రూల్స్ ప్రకారమే ముందుకు పోతున్నట్లు చెబుతున్నారు. చదవండి: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం?? ఎక్కడంటే.. -
మనీలాండరింగ్ కేసు: జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు స్వల్ప ఊరట
ముంబై: మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు స్వల్ప ఊరట లభించింది. ఆమె దేశంవిడిచి వెళ్ళేందుకు ఈడీ అనుమతిచ్చింది. 200కోట్లకు సంబంధించిన ఓ మనీ లాండరింగ్ కేసును విచారిస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ప్రధాన నిందితుడిగా సుకేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి పేరును ఛార్జిషీటులో పేర్కొంది. అందులో బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్తోపాటు నోరా ఫతే పేర్లను కూడా చేర్చింది. చదవండి: బాలీవుడ్ భామకి గిఫ్ట్గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఇప్పటికే ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు తీసుకున్న ఆరోపణలపై జాక్వెలిన్కు ఈమధ్యే మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈడీ అధికారులు ఆమెపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదే సయమంలో ఆమె దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ముంబయి విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. -
Hardik Pandya: అవన్నీ ఉత్త పుకార్లే.. 5 కోట్లు కాదు.. ఆ వాచీ ధర కోటిన్నర మాత్రమే
Hardik Pandya Clarifies on 2 Luxury Wrist Watches Price After Customs Row: ‘‘సోమవారం.. నవంబరు 15 ఉదయం నేను నా లగేజీతో దుబాయ్ నుంచి ఇండియాకు చేరుకోగానే... ముంబై ఎయిర్పోర్టు కస్టమ్స్ కౌంటర్ దగ్గరకు వెళ్లి.. నేను కొన్న వస్తువుల గురించి తెలియజేశాను. కస్టమ్స్ డ్యూటీ చెల్లించాను కూడా. కానీ.. నాకు సంబంధించిన వస్తువులను సీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి. అందుకే.. అసలు విషయం గురించి స్పష్టతనివ్వాలని భావించాను’’ అంటూ తన గురించి ప్రచారమవుతున్న కథనాలపై టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. కాగా సరైన పత్రాలు చూపని కారణంగా పాండ్యాకు చెందిన సుమారు 5 కోట్ల విలువైన వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా పాండ్యా క్లారిటీ నోట్ షేర్ చేశాడు. ‘‘నాకు నేనుగా.. స్వయంగా కస్టమ్స్ అధికారుల వద్దకు వెళ్లాను. దుబాయ్లో నేను చట్టబద్ధంగా ఖరీదు చేసిన వస్తువులకు పన్ను చెల్లించాను. వాళ్లు అడిగిన పత్రాలు అన్నీ కూడా సమర్పించాను. వస్తువులకు సంబంధించి ఎంత డ్యూటీ చెల్లించాల్సి వస్తుందో వాళ్లు నాకు చెప్పారు. నిజానికి ఆ వాచ్ వాస్తవ ధర ఇంచు మించు కోటిన్నర. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్లుగా రూ. 5 కోట్లు కాదు’’ అని పాండ్యా పేర్కొన్నాడు. పాండ్యా గతంలో షేర్ చేసిన ఫొటోలు నేను చట్టాన్ని గౌరవిస్తాను ‘‘ప్రభుత్వ సంస్థలను నేను గౌరవిస్తాను. చట్టాన్ని పాటించే దేశ పౌరుడిని నేను. ముంబై కస్టమ్స్ డిపార్టుమెంటు అడిగిన విధంగా నేను అన్ని వివరాలు అందించాను. చట్టబద్ధమైన డాక్యుమెంట్లు చూపించాను. దీంతో వాళ్లు కూడా నాకు సహకరించారు. నేను చట్టాన్ని అతిక్రమించాననే వార్తలు అన్నీ కూడా నకిలీవే’’ అని హార్దిక్ పాండ్యా తన సుదీర్ఘ పోస్టులో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో అభిమానులు పాండ్యాకు అండగా నిలుస్తుండగా.. కొంతమంది హేటర్స్ మాత్రం.. ‘‘ఏంటి.. కోటిన్నర వాచ్ పెట్టుకుంటేనే సిక్స్ కొడతావా లేదంటే.. ఆడటం చేతకాదా? విలాసాలపై కాదు.. ఆటపై దృష్టి పెట్టు ముందు’’ అని ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Shoaib Akhtar: ఏంటది అసహ్యంగా.. అసలు విషయం తెలీదా.. లేదంటే సెమీస్లో పాక్ను ఓడించినందుకేనా అక్కసు! pic.twitter.com/k9Qv0UnmyS — hardik pandya (@hardikpandya7) November 16, 2021 -
కంగనా..సెలబ్రిటీలకు రూల్స్ వర్తించవా?
Kangana Ranaut Ignores No Mask, No Entry Sign: కంగనా రనౌత్ తాజాగా ముంబై విమానాశ్రయాంలో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో కెమెరాలకు ఫోజులిస్తూ లోపలికి కదిలింది. అయితే నో మాస్క్, నో ఎంట్రీ అనే బోర్డు ఉన్నా కంగనా ఏమాత్రం పట్టించుకోలేదు. మాస్క్ లేకుండానే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. చదవండి: ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్ ఈ విషయంపై ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ స్పందిస్తూ.. కంగానాకు అతి దగ్గర్లోనే ‘నో మాస్క్, నో ఎంట్రీ’బోర్డు ఉంది. అయినా నిర్లక్ష్యంగా మాస్క్ లేకుండానే వెళ్లిపోయింది. ఎన్నికల తర్వాత ఎలా అయితే రాజకీయ నాయకులు ఓటర్లను పట్టించుకోరో, కంగనా కూడా నియమాలను విస్మరించింది అంటూ దుయ్యబట్టారు. మాస్క్ లేకపోతే లోపలికి ప్రవేశం లేదు అనే నియమం సెలబ్రిటీలకు మాత్రం వర్తించవా అంటూ మరో యూజర్ ప్రశ్నించారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలె కంగనా తలైవి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అరెరె.. కత్రినా కైఫ్కు జిరాక్స్ కాపీలా ఉందే.. View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap)