-
క్షణం ఆలోచించలేదు.. వాళ్ల కోసమే కల్కి చేశా: మృణాల్ ఠాకూర్
అందరూ ఎదురుచూసిన కల్కి 2898 ఏడీ మూవీ ఎట్టకేలకు గురువారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ విజువల్ వండర్ను చూసిన సినీప్రియులు హాలీవుడ్ సినిమాను మించిపోయిందని ఖుషీ అవుతున్నారు. యాక్టర్స్ పోటీపడి మరీ నటించారని సినిమా చూస్తేనే తెలిసిపోతుంది. భైరవగా ప్రభాస్ ఎంత మెప్పించాడో అశ్వత్థామగా అమితాబ్ అంతే స్థాయిలో అదరగొట్టాడు. వారిపై నమ్మకంతోనే..విజయ్ దేవరకొండ, ఫరియా అబ్దుల్లా, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రల్లో కనిపించి మురిపించారు. అయితే తాను కల్కి మూవీలో గెస్ట్ రోల్లో నటించడానికి ఈ ముగ్గురే కారణమంటోంది మృణాల్. ఆమె మాట్లాడుతూ.. కల్కి సినిమా గురించి నన్ను సంప్రదించినప్పుడు క్షణం ఆలోచించలేదు. ఎందుకంటే నిర్మాతలు అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంకలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందువల్లే ఈజీగావారితో కలిసే సీతారామం సినిమా చేశాను. దానివల్లే ఈసారి ఈజీగా నిర్ణయం తీసుకున్నాను. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్లో భాగమవడం సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి మూవీ రెండు రోజుల్లోనే రూ.298 కోట్లు రాబట్టింది. వీకెండ్ కలిసొస్తుండటంతో ఈ శని, ఆదివారాల్లో ఇంకెత రాబడుతుందో చూడాలి!చదవండి: హృతిక్ రోషన్ అలా చేస్తాడనుకోలేదు: బాలీవుడ్ నటుడు'కల్కి 2' షూటింగ్ 60% అయిపోయింది.. నిర్మాత కామెంట్స్ -
'కల్కి' గెస్ట్ రోల్స్లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. భారీ బడ్జెట్తో ఎనలేని తారాగాణంతో వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించారు. ఇప్పటికే భైరవగా థియేటర్స్లో దుమ్మురేపుతున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం భవిష్యత్ కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల్ని దర్శకుడు నాగ్ అశ్విన్ అద్బుతంగా క్రియేట్ చేశాడు. ఆ మూడు ప్రపంచాల నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీలో భారీ అగ్ర తారాగణం ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన,దిశా పటాని, కీర్తి సురేష్ వాయిస్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు కల్కిలో ఉన్నాయి.కల్కి చిత్రాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు చూశారు. ఈ మూవీలో గెస్ట్ రోల్స్లో మరికొందరు పోషించారు. ఇప్పుడు వారందరి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ మూవీలో ఉన్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే, కల్కిలో మృణాళ్ ఠాకూర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, కె.వి. అనుదీప్తో పాటు ఫరియా అబ్దుల్లా కూడా ఉన్నారు. వీరందరూ కూడా గెస్ట్ రోల్స్ కనిపించినా కథకు తగ్గట్లు ఉండటం విశేషం. -
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. హీరో ఎవరంటే..?
యంగ్ బ్యూటీ శ్రీలీల తెలుగులో దూసుకెళుతున్నారు. ఇక ఆమె బాలీవుడ్ ఎంట్రీ గురించి ఏదో ఒక వార్త ప్రచారంలోకి వస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ నటించనున్న ఓ హిందీ చిత్రం ద్వారా శ్రీలీల బాలీవుడ్ అరంగేట్రం జరగనుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. తాజాగా హిందీలో ఆమె తొలి చిత్రం ఇది కాదన్నట్లుగా మరో వార్త వైరల్గా మారింది. వరుణ్ ధావన్ హీరోగా రూపొందనున్న చిత్రం ద్వారా హీరోయిన్గా శ్రీలీల బాలీవుడ్ తెరపై కనిపించనున్నారన్నది ఆ వార్త సారాంశం. ముక్కోణపు ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని టాక్. శ్రీలీల ఓ హీరోయిన్గా, మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్గా నటిస్తారట. కామెడీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్నారని సమాచారం. జూలై నెల చివర్లో చిత్రీకరణ ఆరంభించి, అక్టోబర్లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. మరి... శ్రీలీలకు హిందీలో ఇదే తొలి చిత్రం అవుతుందా? అనే ప్రశ్నకు సమాధానం తెలియా లంటే మరో నెల ఆగాల్సిందే. -
కాంచన-4లో టాలీవుడ్ హీరోయిన్.. రాఘవ లారెన్స్ క్లారిటీ!
ప్రస్తుతం సీతారామం బ్యూటీ మృణాల్ టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీస్టార్లో మెరిసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. మృణాల్ త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు లేటేస్ట్ టాక్ నడుస్తోంది. రాఘవ లారెన్స్ తెరకెక్కించనున్న కామెడీ హారర్ కాంచన-4లో మృణాల్ ఠాకుర్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతోంది.అయితే ఈ వార్తలపై కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ స్పందించారు. ఈ విషయంపై రాఘవ లారెన్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కాంచన-4 సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపికపై వస్తున్న వార్తలు వాస్తవం కాదని ట్వీట్ చేశారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని.. ఏదైనా ఉంటే రాఘవేంద్ర ప్రొడక్షన్ ద్వారా అధికారికంగానే ప్రకటిస్తామని పోస్ట్ చేశారు. అయితే ఇది చూసిన కొందరు మృణాల్ ఠాకూర్ తీసుకోండంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. గతంలో వచ్చిన ముని, ముని-2 (కాంచన), కాంచన-2, కాంచన-3 చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అదే సిరీస్లో ప్రస్తుతం కాంచన-4 తెరకెక్కునుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమాలు తెరకెక్కించారు. కాగా.. మృణాల్ ప్రస్తుతం హిందీలో పూజా మేరీ జాన్లో కనిపించనుంది. మరోవైపు రాఘవ చివరిసారిగా జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో కనిపించారు. Hi friends and fans, All the information regarding Kanchana 4 and casting that are circulating around social media are just rumors. Official announcement will be made through Ragavendra Production. Coming soon! pic.twitter.com/T46gcYyjAN— Raghava Lawrence (@offl_Lawrence) June 9, 2024 -
హీట్ పెంచేలా మృణాల్.. చీరలో మరింత అందంగా ఆషిక!
చిట్టి పొట్టి డ్రస్సుల్లో మృణాల్ ఠాకుర్.. చూస్తే అంతేచీరలో అందాలన్నీ చూపించేస్తున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్'పుష్ప 2' పాటకు క్యూట్ స్టెప్పులేసిన బిగ్ బాస్ దివిసింగర్ నేహా కక్కర్తో కలిసి డ్యాన్సులేస్తున్న ధనశ్రీచందమామ లాంటి ముఖంతో వావ్ అనిపిస్తున్న కాయద్ లోహర్ఫ్రెండ్ పెళ్లి హాట్ బ్యూటీ సీరత్ కపూర్ హంగామా View this post on Instagram A post shared by Rahul Jhangiani (@rahuljhangiani) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Bhavya (@bhavyatrikha) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Shruti Sodhi (@aslishrutisodhi) View this post on Instagram A post shared by Anala Susmitha (@anala.susmitha) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Niti Taylor (@nititaylor) -
కాంచనలో మృణాల్?
‘సీతారామం, ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హిందీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మరోవైపు తమిళం నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. శివ కార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ తమిళ సినిమాలో తొలుత మృణాల్ ఠాకూర్నే హీరోయిన్గా అనుకున్నారు.అయితే ఈ చాన్స్ కన్నడ భామ రుక్మిణీ వసంత్ దక్కించుకున్నారు. ఇప్పుడు మృణాల్ కోలీవుడ్ ఎంట్రీ గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి. హారర్ హిట్ ఫ్రాంచైజీ ‘కాంచన’లో రానున్న ‘కాంచన 4’లో మృణాల్ని తీసుకున్నారట. రాఘవా లారెన్స్ నటించి, దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్గా మృణాల్ నటించనున్నారని టాక్. మరి.. వార్తల్లో ఉన్నట్లు ‘కాంచన 5’లో మృణాల్ నటిస్తే తమిళంలో ఆమెకు ఇదే తొలి చిత్రం అవుతుంది. -
దెయ్యం సినిమాలో మృణాల్.. మరి ఒప్పుకొంటుందా?
చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ 'సీతారామం' మూవీతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకుర్. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ.. ప్రస్తుతం సౌత్తో పాటు హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో వరసగా రెండు హిట్లు కొట్టిన మృణాల్.. రీసెంట్గా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' డిజాస్టర్ దెబ్బకు సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతానికైతే ఓ హిందీ మూవీ చేస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్)ఇప్పుడు 'కాంచన' సినిమాల సిరీస్లో హీరోయిన్గా మృణాల్కి ఆఫర్ వచ్చిందట. ఇప్పటికే నెరేషన్ అయిపోయిందని, ఈమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. 'ముని', 'కాంచన' చిత్రాలతో తనకంటూ సెపరేట్ ట్రెండ్ సెట్ చేసిన లారెన్స్.. వాటితో వరస హిట్స్ కొడుతున్నాడు. ఈ మూవీస్లో డ్యాన్సులు వేయడం, హీరో పక్కన అలా కనిపించడం తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం ఉండదు.అయితే 'కాంచన 4' మూవీ కోసం మాత్రం లారెన్స్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. సెప్టెంబరు నుంచి షూటింగ్ మొదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే మృణాల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆమె ఒప్పుకొంటుందా? లేదా అనేది చూడాలి? ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం మృణాల్కి తమిళ డెబ్యూ అవుతుంది!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. ఈ పేరు చెబితే తెలుగు గుర్తుపట్టేస్తారు. 'సీతారామం' బ్యూటీ అంటే ఇంకా త్వరగా గుర్తుపట్టేస్తారు. చేసినవి మూడు నాలుగు సినిమాలే అయినా గోల్డెన్ లెగ్ అనిపించింది. 'ఫ్యామిలీ స్టార్' తప్పితే మిగతా రెండు సూపర్ హిట్ అయ్యాయి. అయినా సరే ఆచితూచి సినిమాలు చేస్తోంది. మరోవైపు తాజాగా ఓ యువ హీరోతో చెట్టాపట్టాలేసుకుని కనిపించడం హాట్ టాపిక్గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం)2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మృణాల్కి 'సీతారామం' సినిమాతో బోలెడంత గుర్తింపు దక్కింది. హిట్ దక్కింది కదా అని వరసపెట్టి మూవీస్ ఏం చేసేయలేదు. కానీ ఫొటోషూట్స్తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటోంది. అలానే మొన్నీమధ్య ఎగ్ ఫ్రీజింగ్ గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో డేటింగ్ చేస్తుందా అనే డౌట్ వస్తోంది.ఎందుకంటే తాజాగా సిద్ధాంత్-మృణాల్.. ముంబయిలోని ఓ రెస్టారెంట్కి కలిసి వెళ్లారు. తిరిగి వెళ్లిపోయేటప్పుడు మృణాల్.. ఇతడికి హగ్ ఇవ్వడంతో పాటు చేతులు పట్టుకుని బయటకు నడుచుకుంటూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా? అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు వీళ్లిద్దరూ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి ఉంటారని పలువురు నెటిజన్లు అంటున్నారు. వీటిలో ఏది నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)#siddhantchaturvedi being the true Gentleman for Mrunal ❤️✨ #mrunalthakur pic.twitter.com/n4zLhtI46T— Viral Bhayani (@viralbhayani77) May 13, 2024 -
అలాంటి సన్నివేశాలకు నో: మృణాళ్ ఠాకూర్
‘కథకి, పాత్రకి అవసరమైతే గ్లామర్ సన్నివేశాల్లో, ముద్దు సీన్స్లో నటించేందుకు సిద్ధం’ అనే మాటని ఎక్కువశాతం హీరోయిన్లు అంటుంటారు. అయితే అలాంటి సన్నివేశాలకు నో అనే కథానాయికలూ లేకపోలేదు. హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కూడా గ్లామర్ సన్నివేశాలు, ముద్దు సీన్స్లో నటించేందుకు నో చెబుతాను అంటున్నారు. ‘సీతా రామం’(2022) సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు ఈ మరాఠీ బ్యూటీ. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు మృణాళ్. ఆ తర్వాత తెలుగులో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నారామె.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ–‘‘ఇంటెన్స్ కిస్సింగ్ సీన్స్, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. పైగా నేను అలాంటి సీన్స్లో యాక్ట్ చేసేందుకు నా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. అందుకే మొహ మాటం లేకుండా నో చెబుతాను’’ అన్నారు. -
రిలేషన్షిప్ కష్టం.. ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నా: మృణాల్
తెలుగు సినిమాల్లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా వచ్చిన ముంబయి బ్యూటీ మృణాల్ ఠాకుర్. 'సీతారామం'తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొనే విషయంలో ఆచితూచి వ్యహరిస్తున్న మృణాల్.. రిలేషన్, పిల్లలు కనడం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. హ్యుమన్స్ ఆఫ్ బాంబే అనే యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన అభిప్రాయల్ని బయటపెట్టింది.'కెరీర్, జీవితం.. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. కానీ మనం ఎప్పుడూ దానిని ఎలా చేయాలనే దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. రిలేషన్షిప్ అంటే కష్టమనే విషయం నాకు తెలుసు. మనం చేసే పనిని అర్థం చేసుకునే భాగస్వామి దొరకడం చాలా అవసరం. అలానే ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నాను' అని మృణాల్ ఠాకుర్ చెప్పుకొచ్చింది.మృణాల్ చెప్పిన దానిబట్టి చూస్తే.. ఇప్పట్లో బాయ్ ఫ్రెండ్, పెళ్లి లాంటివి ఉండవనమాట. ఇక ఎగ్ ఫ్రీజింగ్ అనే మాట మనకు కొత్తేమో కానీ హీరోయిన్లకు ఈ మధ్య కాస్త కామన్ అయిపోతుంది. ఓ దశ దాటిన తర్వాత నిల్వ చేసిన తమ అండాలతో పిల్లల్ని కనడాన్నే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. వయసులో ఉన్నప్పుడు పిల్లల్ని కంటే కెరీర్ ఇబ్బందుల్లో పడొచ్చనే భయంతో ఈ విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల దారిలోనే మృణాల్ కూడా వెళ్లబోతుందనమాట. -
సడన్గా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ఫ్యామిలీ స్టార్'
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ఎట్టకేలకు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. వచ్చిన తర్వాత చూసేందుకు ప్లాన్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాల దెబ్బకు విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వరసగా మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ ఒక్కటంటే ఒక్క దానితో హిట్ కొట్టలేకపోతున్నాడు. 'ఖుషి' ఓ మాదిరి కలెక్షన్స్తో పర్వాలేదనిపించింది. ఇది తప్పితే మిగతావన్నీ డిజాస్టర్స్ అవుతూ వచ్చాయి. దీంతో 'ఫ్యామిలీ స్టార్'పై విజయ్ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ విషయంలోనూ నిరాశే ఎదురైంది.ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఉగాది, రంజాన్ లాంటి హాలీడే వీకెండ్ దొరికినప్పటికీ.. 'ఫ్యామిలీ స్టార్' చూసేందుకు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఊహించని విధంగా 20 రోజుల్లోనే ఓటీటీలో తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఏప్రిల్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్లో దక్షిణాది భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిన 'ఫ్యామిలీ స్టార్'.. ఓటీటీలో ఇంకేం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) -
కోట్లు సంపాదించే మృణాల్.. మరీ అంత చీప్ డ్రెస్సులు ధరిస్తుందా?
-
జిమ్లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్
ఫ్యామిలీ స్టార్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అందానికి మాత్రమే కాదు ఫిట్నెస్కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు, జిమ్లో హెవీ వర్కౌట్స్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాలో ఒక వీడియో షేర్ చేసింది. ట్రైనర్ చూసేటపుడు, కెమెరా సహా ట్రైనర్ మన ముందుకు వచ్చినపుడు అనే క్యాప్షన్తో వర్కౌట్ ఫన్నీ చీటింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ట్రైనర్ కెమెరాను ఆమెవైపు చూపినప్పుడల్లా, వెంటనే వ్యాయామం చేయడం ప్రారంభించడం, ట్రైనర్ చూడని సమయంలో వర్కవుట్స్ ఆపేసి డాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మళ్లీ అతడు చూడగానే కష్టపడి వర్కవుట్ చేస్తున్నట్లు నటించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. దీంతో నెటిజన్లు కోచ్ ఉన్నపుడు మేము కూడా ఇంతే అంటూ కమెంట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) కాగా ‘సీతారామం’ చిత్రంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. త తన అద్భుతమైన నటన, అందంతో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తరువాతహీరో నానీతో కలిసి ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే విజయ దేవర కొండ సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. -
ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అద్భుతమైన వీకెండ్, సెలవుల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం అక్కడక్కడ థియేటర్లలో ఉన్న ఈ చిత్రానికి పెద్దగా జనాలు వెళ్లట్లేదు. ఈ క్రమంలోనే ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' లాంటి మూవీస్ దెబ్బకు విజయ్ దేవరకొండ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్ ఇండియా ఫేమ్ అయిత్ వచ్చింది కానీ సరైన హిట్ ఒక్కటి పడటం లేదు. తాజాగా 'ఫ్యామిలీ స్టార్' కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికలపడిపోయింది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. 45 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనుకుంది. కానీ ఇప్పుడు థియేటర్ రిజల్ట్ తేడా కొట్టేయడంతో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. మే 3 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొచ్చేయాలని అనుకుంటోందట. కుదిరితే ఇంకా ముందే కూడా వచ్చేయొచ్చు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఆ సినిమా వల్ల భారీగానే నష్టపోయాం: చిరంజీవి) -
గుండె బద్దలైంది.. బయటపడటానికి చాలా టైమ్ పట్టింది: మృణాల్
తెలుగులో ఒకటి రెండు సినిమాలతోనే స్టార్స్ అయిన హీరోయిన్లు తక్కువ మంది ఉంటారు. అందులో మృణాల్ ఠాకుర్ ఒకరు. సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టింది. కానీ 'ఫ్యామిలీ స్టార్'తో ఈమెకు ఫస్ట్ దెబ్బ పడింది. అయితే ఈమెని ఇప్పటికీ 'సీతారామం' బ్యూటీ అనే పిలుస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్.. ఆ చిత్ర అనుభవాలని పేర్కొంది. (ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) 'నా ఫ్రెండ్, మార్గదర్శి అంతా నటుడు దుల్కర్ సల్మానే. 'సీతారామం' షూటింగ్ టైంలో ఆయన సహకారం అస్సలు మరిచిపోను. చాలా కష్టమైన విషయం ఏమిటంటే ఓ చిత్రాన్ని పూర్తి చేసి వెళ్తున్నప్పుడు గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. పాత్రను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలా పూర్తిగా మారిపోతా. అలా నటించిందే 'సీతారామం'లోని సీతామహాలక్ష్మి పాత్ర. ఈ పాత్ర నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది' తెలుగులో ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లోనూ ఒకే తరహాలో డబ్బింటి అమ్మాయి తరహా పాత్రలు చేసిన మృణాల్.. హిందీలో మాత్రం గ్లామరస్ రోల్స్ చేసింది. తెలుగులోనూ ఈమెకు అలాంటి పాత్రలు ఎవరైనా ఆఫర్ చేస్తే, మృణాల్ చేయడానికి రెడీగా ఉంది. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఇంకా ఈమెని 'సీతారామం' బ్యూటీగానే చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు. తమిళంలోకి త్వరలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. (ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే) -
సీతామహాలక్ష్మిని మరచిపోని మృణాల్ ఠాకూర్
తమిళసినిమా: బెంగాలీ భామ మృణాళ్ ఠాకూర్ ఇప్పుడు దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా వెలిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ దక్షిణాదిలో నటించిన తొలి చిత్రం సీతారామం. తెలుగులో రూపొందిన ఈ చిత్రంలో ఈ అమ్మడు దుల్కర్ సల్మాన్తో జత కట్టారు. చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈమె పేరు బాగా పాపులర్ అయ్యింది. నాని సరసన నటించిన హాయ్ నాన్నా చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. దీంతో మృణాళ్ ఠాకూర్కు పట్ట పగ్గాలు లేకుండా పోయాయనే చెప్పాలి. అలాంటి సమయంలో తమిళంలో ఏఆర్.రెహ్మాన్ దర్శకత్వంలో శివకార్తీకేయన్కు జంటగా నటించే అవకాశాన్ని తిరస్కరించారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా విజయ్దేవరకొండతో రొమాన్స్ చేసిన ఫ్యామిలీస్టార్ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ఇది ఈ అమ్మడి క్రేజ్కు కాస్త బ్రేక్ వేసినట్లే అవుతుంది. దక్షిణాదిలో నటించిన తొలి చిత్ర జ్ఞాపకాలను ఈ అమ్మడు ఇంకా మరువలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక బేటీ లో తనకు మిత్రుడు, మార్గదర్శి అంతా నటుడు దుల్కర్ సల్మాన్ అని పేర్కొన్నారు. సీతారామం చిత్రం షూటింగ్ సమయంలో ఆయన సహకారం మరువలేనిదని అన్నారు. ఇక చాలా కష్టమైన విషయం ఏమిటంటే ఒక చిత్రాన్ని పూర్తి చేసి వెళుతున్నప్పుడు హృదయం పగిలినట్లు అనిపిస్తుందన్నారు. తాను ఒక చిత్రంలోని పాత్రను ఇష్టపడి నటిస్తే ఆ పాత్రగా మారిపోతానని అన్నారు. అలా నటించిన పాత్రే సీతారామం చిత్రంలోని సీతామహాలక్ష్మి పాత్ర అని పేర్కొన్నారు. ఈ పాత్ర నుంచి బయట పడటానికి చాలా సమయం పట్టిందని నటి మృణాళ్ ఠాకూర్ అన్నారు. కాగా అందాలారబోతకు ఏమాత్రం వెనుకాడని ఈ అమ్మడు త్వరలోనే కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
తెరపై చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో నిలిచిపోతుంది: మృణాల్ ఠాకూర్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామలీ స్టార్. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. తాజాగా ఈ మృణాల్ ఠాకూర్ తన పాత్రపై ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుందని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా పంచుకుంది ముద్దుగుమ్మ. మృణాల్ ఇన్స్టాలో రాస్తూ.. 'నేను ఇందుగా ఉన్న క్షణాలు. ఇందు నేనుగా ఉన్న క్షణాలు. తెరపై నేను చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో ఉంటుంది. ఇందు పాత్రకు న్యాయం చేయడానికి నేను ఇందుగానే ఉండాలి. ఆమెలా కేవలం షూస్ ధరించడం మాత్రమే కాదు. ఆమెలా ఒక మైలు నడవాలి. ఆమెను నా జీవితంలోకి తీసుకురావడానికి మొదట కొంచెం సవాలుగా అనిపించింది. కానీ నేను నెమ్మదిగా ఆమెను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ... నేను ఆ పాత్రను ఇంకా వదిలివేయాలని అనుకోలేదు. ఇందు పాత్రను నేను ఎంత ఆనందించానో మీరు కూడా ఆస్వాదించారని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఇందు పాత్రలో కనిపించింది. ఓ కంపెనీకి సీఈవోగా అందరినీ మెప్పించింది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
Mrunal Thakur: ఫ్యామిలీతో సీతారామం బ్యూటీ కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
హాయ్ నాన్నకు అవార్డుల పంట.. ఏకంగా 11 విభాగాల్లో!
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. గతేడాది రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్తో శౌర్యవ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. న్యూయార్క్లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఒనిరోస్ ఫిల్మ్ ప్రకటించిన విభాగాల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ జంట, ఉత్తమ బాలనటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ప్లే, ఉత్తమ తొలి దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్ ట్రాక్, ఉత్తమ ఎడిటింగ్ల్లో 11 అవార్డులు గెలుచుకుంది. కాగా.. ఈ చిత్రాన్ని హాయ్ డాడీ పేరుతో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు అవార్డ్స్ దక్కడం పట్ల డైరెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. -
అలియా భట్, మృణాల్ ఠాకూర్ ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కేది ఎవరికి..?
ఇప్పుడు కోలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దళపతి విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసి, పార్టీని కూడా స్థాపించారు. 2026లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరొక చిత్రం మాత్రమే చేయనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అది ఆయన నటించే 169వ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి పలువురు ప్రముఖ దర్శకుల పేర్లు వినిపించినా, చివరికి హెచ్.వినోద్ పేరు ఖరారైనట్లు టాక్ వైరల్ అవుతోంది. ఈయన ఇంతకు ముందు ఖాకీ, తెగింపు, వలిమై వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ తరువాత కమలహాసన్ కథానాయకుడిగా చిత్రం చేయాల్సింది. దానికి సంబంధించిన కథా చర్చలు కూడా జరిగాయి. అయితే కారణాలేమైనా ఆ చిత్రం డ్రాప్ అయ్యింది. తాజాగా విజయ్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈయన చెప్పిన కథకు విజయ్ చాలా ఇంప్రెస్ అయ్యారని సమాచారం. ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. రూ.10 కోట్ల పారితోషికం తీసుకునే రేంజ్ హీరోయిన్ను ఎంపిక చేయాలని యూనిట్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లిస్ట్లో లేడీ సూపర్స్టార్ నయనతార లేదట. ఇకపోతే బాలీవుడ్ భామ అలియా భట్, మృణాళ్ ఠాకూర్, త్రిష, సమంతలలో ఒకరిని ఎంపిక చేయడానికి వారితో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. త్రిష, సమంత ఇప్పటికే విజయ్ సరసన నటించారు. కాబట్టి ఇప్పటి వరకూ విజయ్తో జతకట్టని నటిని ఇందులో నటింపజేసే ఆలోచనలో యూనిట్ వర్గాలు ఉన్నట్లు సమాచారం. నటి అలియాభట్, మృణాళ్ఠాకూర్ ఇప్పటి వరకూ నేరుగా తమిళ చిత్రాల్లో నటించలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అలియాభట్, సీతారామం మృణాళ్ ఠాకూర్లో తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ రెండు అనువాద చిత్రాలేనన్నది గమనార్హం. దీంతో బాలీవుడ్ భామ అలియాభట్ గానీ, మృణాళ్ ఠాకూర్ గానీ విజయ్ 69వ చిత్రంలో నటించే చాన్స్ ఎక్కువగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. వీరిలో ఆ అదృష్టం ఎవరికి లభిస్తుందన్నదే తాజాగా జరుగుతున్న చర్చ. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన మేలో వెలువడే అవకాశం ఉంది. -
ఎందుకురా మా వాడి వెంట ఇలా పడ్డారు.. ? విజయ్ మేనమామ కామెంట్స్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా బాగున్నప్పటికీ సోషల్మీడియాలో మరోవైపు నెగెటివ్ ప్రచారం చేయడంపై నిర్మాత దిల్ రాజు ఇప్పటికే స్పందించారు. మేము కష్టపడి తీసిన సినిమాపై కొందరు అలా చేయడం మంచిది కాదని ఆయన కోరారు. ఇలాంటి పద్ధతి కంటిన్యూ అయితే సినిమాలు తీయడం మానేసే పరిస్థితి కూడా రావచ్చని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ మేనమామ యష్ రంగినేని కూడా నెగెటివ్ ప్రచారంపై ఇలా రియాక్ట్ అయ్యారు. 'ఎందుకురా బాబు మా వాడి వెంట మరీ ఇలా పడ్డారు. ఇంత కసా ? ఇంత ఓర్వలేని తనమా ? లేక మావోడి కటౌట్ చూసి భయమా ? ఒక మంచి విలువలతో , సందేశంతో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమాని కూడా వదలటం లేదు.మీ నెగటివ్ బ్యాచ్కు వాడంటే (విజయ్ దేవరకొండ) ఎలాగూ పడదు. కానీ ఆ ఇష్టపడేవాళ్లని కూడా సినిమాకి రానివ్వకుండా చేస్తున్నారేంటిరా బాబు. ఐనా ఇంకే హీరో సినిమాలకు లేని లాజిక్స్ మావోడి సినిమాలకి మాత్రం భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక మంచి హీరోగా పేరుతెచ్చుకుంటే తప్పా.. ?' అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Yash Rangineni (@yashrangineni) -
'అలా చేయడం ఇండస్ట్రీకి మంచిది కాదు'.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ముఖ్యంగా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంటోంది. అయితే మరోవైపు ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడంపై దిల్ రాజు స్పందించారు. మే కష్టపడి తీసిన సినిమాపై కొందరు అలా చేయడం మంచిది కాదంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే సినిమాలు తీయడం మానేసే పరిస్థితి వస్తుందని దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దిల్ రాజు మాట్లాడూతూ..'ఈ సినిమాను చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. కొంతమంది మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. కొంతమంది కావాలని నెగెటివ్ వైబ్లో ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన ఒకలా ఉంటే.. సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ స్ప్రెడ్ చేయడం బాధాకరం. ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ సినిమా రీచ్ అయింది. మేము మంచి సినిమానే తీశాం. మంచిగా తీయలేదంటే దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం. నేను కలిసిన వాళ్లు చాలామంది బయట ఎందుకు ఇంత నెగెటివ్ ఉంది? అని అడుగుతున్నారు. కొందరు కాల్ చేసిన సినిమా చాలా బాగుంది అంటున్నారు. మంచి సినిమానా? కాదా? అనేది మీరు థియేటర్కు వస్తే మీకే తెలుస్తుంది.' అని అన్నారు. నెగెటివ్ ప్రచారంపై మాట్లాడుతూ.. 'కేరళలో కోర్ట్ మొదటి మూడు రోజుల వరకు రివ్యూ ఇవ్వకుండా తీర్పు ఇచ్చారట. అలాంటిది మన దగ్గర వస్తే బాగుంటుంది. లేకపోతే సినిమా ఇండస్ట్రీ బతకడం కష్టం. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది నిర్మాతలే. ఎంతో కష్టపడి చేసే సినిమాను ఆడియన్స్ థియేటర్కు రాకుండా చేయడమనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఇలాగే జరిగితే పోను పోను ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఇక సినిమాలు ఏం తీస్తాంలే అన్న ఫీలింగ్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ పద్ధతి ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు' అని అన్నారు. -
హాయ్ నాన్నకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. బెస్ట్ ఫీచర్ ఫిలింగా..
నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ మూవీ "హాయ్ నాన్న". అంతర్జాతీయంగా "హాయ్ డాడ్"గా విడుదలైన ఈ చిత్రం ప్రతిష్టాత్మక ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్ 2024 ఎడిషన్లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డును కైవసం చేసుకుంది. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన "హాయ్ నాన్న" కథనం, నటీనటుల పర్ఫామెన్స్ న్యాయనిర్ణేతలను ఆకర్షించింది. శౌర్యువ్ మాట్లాడుతూ.. 'ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలిం ఫెస్టివల్లో లభించిన ఈ గుర్తింపు మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. సాంస్కృతిక సరిహద్దులను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యిందీ మూవీ. 'హాయ్ నాన్న'కి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. ఫెస్టివల్ నిర్వాహకులకు, జ్యూరీకి, 'హాయ్ నాన్నా'కి ప్రాణం పోసిన మా బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను"అన్నారు. Hi Nanna celebrations continue across all corners! 💥💥#HiNanna released as #HiDad and received the prestigious award for Best Feature Film at the esteemed Athens International Art Film Festival in their March 2024 edition ❤️🔥 Natural 🌟 @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN… pic.twitter.com/Yu2AtVdPTW — Vyra Entertainments (@VyraEnts) April 6, 2024 చదవండి: నన్ను వాడుకుని వదిలేశారు.. డబ్బులు కూడా ఇవ్వలేదు.. కళ్లు తెరిపించారు! -
‘ఫ్యామిలీ స్టార్’బంపరాఫర్.. మీ ఇంటికే విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్తో దూసుకెళ్తోంది. తమ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్. అలాంటి ఫ్యామిలీ స్టార్స్ ను కలిసేందుకు ఫ్యామిలీ స్టార్ టీమ్ సర్ ప్రైజ్ విజిటింగ్ కు వస్తోంది. మీ ఇంటి ఫ్యామిలీ స్టార్ ను ఫ్యామిలీ స్టార్ టీమ్ కలవాలని కోరుకునే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు గొప్ప అవకాశం ఇది. (చదవండి: ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ) ఈ అనౌన్స్ మెంట్ లోని ఫామ్ ఫిల్ చేస్తే ఫ్యామిలీ స్టార్ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకుడు పరశురామ్ పెట్ల మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేస్తారు. కింద ఇచ్చిన ఫామ్ లో మీ పేరు అడ్రస్ తో పాటు మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు, ఎందుకు అనే ప్రశ్నలకు ఆన్సర్స్ రాసి ఫిల్ చేయాలి. నిన్న థియేటర్స్ లోకి వరల్డ్ వైడ్ రిలీజ్ కు వచ్చింది ఫ్యామిలీ స్టార్ సినిమా. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు సహా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెటెడ్ ఆడియెన్స్ అయిన సకుటుంబ ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతోంది Families are celebrating #TheFamilyStar in theatres ❤️🔥 The team will now celebrate the FAMILY STARS in real life ❤️ Fill the form below and tell us who your FAMILY STAR is. And get ready for a surprise visit by the team ✨ 📜 https://t.co/tvTkPpZev7 Book your tickets for the… pic.twitter.com/mCgiwHAKJw — Sri Venkateswara Creations (@SVC_official) April 6, 2024 -
Family Star Review: ‘ ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ
టైటిల్: ఫ్యామిలీ స్టార్ నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, వాసుకి, రోహిణీ హట్టంగడి, అభినయ, అజయ్ ఘోష్ నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్ ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది: ఏప్రిల్ 5, 2024 కథేంటంటే.. గోవర్ధన్(విజయ్ దేవరకొండ) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. ఫ్యామిలీ అంటే అతనికి చాలా ఇష్టం. ఇద్దరు అన్నయ్యలు..వదినలు..వారి పిల్లలు..బామ్మ ఇదే తన ప్రపంచం. సివిల్ ఇంజనీర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. పెద్దన్నయ్య మద్యానికి బానిసవడం.. చిన్నన్నయ్య బిజినెస్ అంటూ ఇంకా స్థిరపడకపోవడంతో ఫ్యామిలీ ఆర్థిక భారానంత గోవర్ధనే మోస్తాడు. అనవసరపు ఖర్చులు చేయకుండా.. వచ్చిన జీతంతోనే సింపుల్గా జీవనాన్ని కొనసాగిస్తున్న గోవర్ధన్ లైఫ్లోకి ఇందు(మృణాల్ ఠాకూర్) వచ్చేస్తుంది. తనతో పాటు తన ఫ్యామిలీకి బాగా దగ్గరవుతుంది. ఇద్దరు ప్రేమలో కూడా పడిపోతారు. ఈ విషయం ఇరుకుటుంబాలలో చెప్పి, పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అని భావిస్తున్న సమయంలో ఇందు రాసిన ఓ పుస్తకం గోవర్ధన్ చేతికి వస్తుంది. ఆ పుస్తకం చదివి..ఇందుపై ద్వేషం పెంచుకుంటాడు గోవర్ధన్. అసలు ఆ పుస్తకంలో ఏం ఉంది? ఇందు ఎవరు? గోవర్ధన్ ఇంటికి ఎందుకు వచ్చింది? ఇందు రాసిన పుస్తకం వీరిద్దరి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? ఉన్నంతలో సర్దుకొని జీవించే గోవర్దన్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు? అమెరికాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు ఇందు, గోవర్దన్లు ఎలా ఒక్కటయ్యారు? అనేది తెలియాలంటే థియేటర్స్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్లో ఫ్యామిలీ కథలు చాలా వచ్చాయి. అన్ని సినిమాల్లోనూ కుటుంబ బంధాలు.. ప్రేమానురాగాలు.. ఇదే కథ. ఆ కథను తెరపై ఎంత కొత్తగా చూపించారనేదానిపై సినిమా ఫలితం ఆధారపడుతుంది. అందుకే కొన్ని సినిమాల కథలు రొటీన్గా ఉన్న ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ‘గీతగోవిందం’. సింపుల్ కథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను కొల్లగొట్టింది. అలాంటి కాంబినేషన్లో మరో సినిమా అంటే ప్రేక్షకుల్లో కచ్చితంగా భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను తగ్గట్టుగా ‘ఫ్యామిలీ స్టార్’ కథను తీర్చిదిద్దడంలో దర్శకుడు పరశురామ్ పూర్తిగా సఫలం కాలేకపోయాడు. హాస్యం, మాటలు, కథనంతో మ్యాజిక్ చేసే పరశురామ్.. ఈ సినిమా విషయంలో వాటిపై పెట్టిన ఫోకస్ సరిపోలేదనిపిస్తుంది. కథ పరంగా ఈ సినిమా చాలా చిన్నది. ఫ్యామిలీ భారమంతా మోస్తున్న ఓ మిడిల్ క్లాస్ యువకుడు.. తన సొంతప్రయోజనాల కోసం అతనికి దగ్గరైన ఓ యువతి.. ఇద్దరి మధ్య ప్రేమ.. గొడవలు.. చివరికి కలుసుకోవడం.. సింపుల్గా చెప్పాలంటే ‘ఫ్యామిలీ స్టార్’ కథ ఇదే. అంచనాలు లేకుండా వస్తే..ఈ కథకి అందరు కనెక్ట్ అవుతారు. కానీ ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి.. ప్రేక్షకులు అంతకు మించి ఏదో ఆశిస్తారు. దాన్ని దర్శకుడు అందించలేకపోయాడు. భారీ అంచనాలు ఉన్న సినిమాకు కావాల్సిన సరకు, సంఘర్షణ రెండూ ఇందులో మిస్ అయ్యాయి. అయితే హీరో క్యారెక్టరైజేషన్, కొన్ని సన్నివేశాలు మాత్రం విజయ్ ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఆకట్టుకుంటాయి. విజయ్ లుంగి కట్టుకొని తిరగడం.. ఉల్లి పాయల కోసం ఆధార్ కార్డులు పట్టుకొని క్యూలో నిలబడడం.. హీరోయిన్ లిఫ్ట్ అడిగితే పెట్రోల్ కొట్టించమని అడగడం.. చెంపదెబ్బలు తినడం ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎట్రాక్ట్ చేస్తాయి. ‘అతనికి కాస్త తిక్కుంటుంది.. పిచ్చి ఉంటుంది.. వెర్రి ఉంటుంది’ అంటూ హీరో గురించి హీరోయిన్ చేత చెప్పిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మిడిక్లాస్ యువకుడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో హీరో ఎంట్రీ సీన్తోనే చూపించాడు. ప్యామిలీ కోసం హీరో పడే పాట్లు.. అన్నయ్యలతో వచ్చే కష్టాలు చూపిస్తూనే ఇందు పాత్రను పరిచయం చేశాడు. ఆమె వచ్చిన తర్వాత కూడా కథనం రొటీన్గా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అయితే మరీ సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్స్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తినికి పెంచుతుంది. ద్వితియార్థం ఎక్కువగా అమెరికాలోనే సాగుతుంది. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఒకటి రెండు సీన్స్ మినహా మిగతావన్నీ బోర్ కొట్టిస్తాయి. మిడిల్ క్లాస్ యువకుడి మీద హీరోయిన్ థీసిస్ ఎందుకు రాసిందనేదానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయారు. ప్రీక్లైమాక్స్ బాగుంటుంది. పతాక సన్నివేశాలు రొటీన్గా అనిపిస్తాయి. కొన్ని సంభాషణలు మాత్రం ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. కథ, కథనాన్ని మరింత బలంగా రాసుకొని, హాస్యంపై ఫోకస్ పెడితే ‘ఫ్యామిలీ స్టార్’ మరో లెవెల్ విజయం సాధించేది. ఎవరెలా చేశారంటే.. మిడిల్ క్లాస్ యువకుడు గోవర్ధన్ పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయాడు. తన డైలాగ్ డెలీవరీ, మ్యానరిజం సినిమాకు ప్లస్ అయింది. కథంతా తన భుజాన వేసుకొసి సినిమాను ముందుకు నడిపించాడు. తెరపై చాలా అందంగా కనిపించాడు. ఇక ధనవంతుల కుటుంబానికి చెందిన యువతి ఇందుగా మృణాల్ చక్కగా నటించింది. తెరపై విజయ్, మృణాల్ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హీరో బామ్మగా రోహిణి హట్టంగడి తనదైన నటనతో ఆకట్టుకుంది. జగపతి బాబు, వెన్నెల కిశోర్, వాసుకి, అభినయతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే.. గోపీ సుందర్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. అద్భుతమైన పాటలతో మంచి బీజీఎం అందించాడు. కేయూ మోహన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.