-
ఎంపీగా ప్రమాణ స్వీకారానికి.. రషీద్ ఇంజినీర్కు ఎన్ఐఏ అనుమతి
న్యూఢిల్లీ: జైలులో ఉండి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర ఎంపీ షేక్ రషీద్ ఇంజినీర్కు లోక్సభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనుమతించింది. దీంతో ఈ నెల అయిదవ తేదీన రషీద్ లోక్సభ సభ్యుడిగా పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్ఐఏ ఆయనకు కొన్ని షరతులు విధించింది.నూతన ఎంపీ మీడియాతో మాట్లాడకూడదని పేర్కొంది. కాగా షరతులకు సంబంధించి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జూలై 2న తుదితీర్పు ఇవ్వనుంది. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని రషీద్ ఇంజినీర్ తరపు లాయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్ఐఏ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.షేక్ అబ్దుల్ రషీద్ ఎవరు?జమ్మూకాశ్మీర్కు చెందిన షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ రషీద్ ఇంజినీర్.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఇంజనీర్ రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చారనే ఆరోపణలతో యూఏపీఏ చట్టం కింద ఎన్ఐఏ 2019లో ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఆయన కుమారుడు అబ్రర్ రషీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అబ్దుల్ రషీద్ జమ్మూ కాశ్మీర్ అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2008 మరియు 2014లో గెలుపొందిన జమ్మూ కశ్మీర్లోని లాంగేట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 లోక్సభ ఎన్నికలలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. -
ఆ తమిళ ఎంపీకి తెలుగుపై ఎందుకంత ప్రేమ?
తమిళనాడుకు చెందిన ఒక ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ సమావేశాల రెండో రోజు లోక్సభలో ఇది చోటు చేసుకుంది. ఇంతకీ ఆయన తెలుగులో ఎందు ప్రమాణం చేశారు? ఆయనకు తెలుగుతో ఉన్న అనుబంధం ఏమిటి?పార్లమెంట్ సమావేశాల రెండవ రోజున కొత్తగా ఎంపీకైన ఎంపీలలోని పలువులు తమ ప్రాంతీయ భాషలలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందిన ఎంపీ కే గోపినాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఒక రాష్ట్రానికి చెందిన ఎంపీ మరొక రాష్ట్రపు మాతృ భాషలో ప్రమాణ స్వీకారం చేయడం ఏమిటా? అని అందరూ అతనిని ఆసక్తిగా గమనించారు. ఎంపీ గోపినాథ్ ఓ చేతితో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం చివరిలో జై తమిళనాడు అని తమిళంలో నినదిస్తూ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ గోపీనాథ్ తెలుగు కుటుంబానికి చెందిన వారు. కృష్ణగిరి జిల్లా హోసూరు ఆయన స్వస్థలం. గోపీనాథ్ విద్యాభ్యాసం తెలుగులో కొనసాగింది. 2001, 2006, 2011లలో హోసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. తమిళనాడులో ఏర్పడిన తెలుగు భాషా సమస్యలతో పాటు, అక్కడి తెలుగు వారి కోసం ఎంపీ గోపీనాథ్ పోరాడారు. తమిళనాడు అసెంబ్లీలోనూ ఆయన పలుమార్లు తెలుగులో ప్రసంగించారు. మాతృభాషపై ఎనలేని మమకారమున్న గోపీనాథ్ మరోమారు పార్లమెంటులోనూ తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు.కృష్ణగిరి జిల్లా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతుంది. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్కు అతి సమీపంలో ఉంది. దీంతో ఇక్కడి ప్రజలు తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషలను కూడా మాట్లాడుతారు. కాగా గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత కూడా అసెంబ్లీలో తెలుగులో ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వివిధ సందర్భాల్లో వైరల్ అవుతుంటుంది. .@INCTamilNadu MP K. Gopinath from the Krishnagiri constituency surprised everyone by taking his oath in #Telugu. pic.twitter.com/ooGgVDg4VH— South First (@TheSouthfirst) June 25, 2024 -
రాజ్యాంగం చేతబూని ఎంపీగా ప్రమాణం
న్యూఢిల్లీ: 18వ లోక్సభ ప్రత్యేక సమావేశాల్లో రెండో రోజు మంగళవారం పలు పార్టీల సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాం«దీ, సమాజ్వాదీ పార్టీ సభ్యులు అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, బీజేపీ సభ్యుడు ఓం బిర్లా, బీజేపీ సభ్యురాలు హేమామాలిని, డీఎంకే నేత కనిమొళి, కేంద్ర మంత్రులు నారాయణ్ రాణే, ఎన్సీపీ(ఎస్పీ) నేత సుప్రియా సూలే, శివసేన(ఉద్ధవ్) సభ్యుడు అరవింద్ సావంత్ తదితరులు లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.రాహుల్ గాం«దీ, అఖిలేశ్ యాదవ్ సహా పలువు ప్రతిపక్ష సభ్యులు రాజ్యాంగ ప్రతిని చేతబూని ప్రమాణం చేయడం విశేషం. ప్రమాణ స్వీకారం అనంతరం రాహుల్ గాంధీ ‘జైహింద్, జై సంవిధాన్’ అంటూ నినదించారు. స్వతంత్ర సభ్యుడు రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ‘నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి’ అని రాసి ఉన్న టి–షర్టును ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ సమాజ్ పార్టీ(కాన్షీరామ్) ఎంపీ చంద్రశేఖర్ ప్రమాణం చేసిన తర్వాత ‘జైభీమ్, జైభారత్, జై సంవిధాన్, జైమండల్, జైజోహార్, జైజవాన్, జైకిసాన్’ అని నినాదాలు చేశారు. -
చేతిలో రాజ్యాంగం.. ఎంపీగా రాహుల్ గాంధీ ప్రమాణం
కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం .. తొలి 18వ లోక్సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.. సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆయనతో ప్రమాణం చేయించారు. చిన్న రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఇంగ్లీష్లో ఆయన ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. చివరలో జైహింద్, జై సంవిధాన్ అని నినదించారు. ప్రమాణం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు భారత్ జోడో అంటూ నినాదాలు చేశారు.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుని రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ ఉత్తర ప్రదేశ్లోని రాయ్బరేలి, కేరళలోని వయనాడ్.. రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీచేసి విజయం సాధించారు. అనంతరం ఆయన వయనాడ్ను వదులుకొని రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.కేరళలోని వయనాడ్ స్థానానికి ఆయన చేసిన రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక వయనాడ్ నుంచి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ బరిలో నిలవనున్నారు.ఈరోజుతో ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తి కానుంది. బుధవారం స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేశ్ పోటీ పడుతున్నారు. -
ఆ ఎంపీ మాతృభాషలో ప్రమాణం ఎందుకు చేయలేకపోయారు?
18వ లోక్సభలో భాషా సాంస్కృతిక వైవిధ్యం కనిపించింది. పలువురు ఎంపీలు తమ మాతృభాషలో ప్రమాణం చేశారు. అయితే తన భాష అయిన భోజ్పురిలో ప్రమాణం చేయలేకపోయినందుకు బీహార్లోని సారణ్కు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ విచారం వ్యక్తం చేశారు.లోక్సభలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ ఒరియాలతో సహా పలు భారతీయ భాషల్లో ప్రమాణం చేశారు. ఎంపీలు ఇంగ్లీషులో లేదా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో దేనిలోనైనా ప్రమాణం చేయవచ్చు. అయితే భోజ్పురి భాషకు ఎనిమిదవ షెడ్యూల్ జాబితాలో స్థానం దక్కలేదు. రాజీవ్ ప్రతాప్ రూడీ భోజ్పురిలో ప్రమాణం చేయకపోవడానికి కారణం ఇదే. ఎంపీలు మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని రూడీ అన్నారు.ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీహార్లోని తూర్పు చంపారన్కు చెందిన బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ అధ్యక్షత వహించారు. కాగా రాజీవ్ ప్రతాప్ సింగ్ రూడీ హిందీలో ప్రమాణం చేశారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్యపై రాజీవ్ ప్రతాప్ రూడీ విజయం సాధించారు. -
బీజేపీ రాముడు నన్ను ఆశీర్వదించాడు: సమాజ్వాదీ ఎంపీ
యూపీలోని అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ తాజాగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. సమాజ్ వాదీ పార్టీ నేత అయిన ఎంపీ అవధేష్ ప్రసాద్ తాను రాముని దయతో ఎంపీగా ఎన్నికయ్యానని అన్నారు. రాముణ్ణి తీసుకొచ్చింది తామేనని బీజేపీ చెబుతున్నప్పటికీ, రాముని ఆశీస్సులు తనకే అందాయని అవధేష్ అన్నారు.అయోధ్య ఎవరి వారసత్వం కాదని, ఇది శ్రీరాముని జన్మ భూమి అని, తామే నిజమైన రామభక్తులమని అవధేష్ పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు.. అహంకారులను ఓడించారని అన్నారు. నీట్ పరీక్షల గురించి మాట్లాడిన ఆయన బీజేపీ ప్రభుత్వం లీక్లు లేకుండా ఏ పరీక్షనూ నిర్వహించలేకపోతున్నదన్నారు.అయోధ్య ఎంపీగా ఎన్నికైన తర్వాత అవధేష్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 5,54,289 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్కు 4,99,722 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి సచ్చిదానంద్ పాండే 46,407 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. -
ప్రతి ఇంటికి మంచి చేశాం.. వైఎస్సార్సీపీ ఎంపీలతో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వసుంధరా రాజేను మెచ్చుకున్న కాంగ్రెస్ ఎంపీ
ఒక పార్టీకి చెందిన నేత మరో పార్టీ నేతను మెచ్చుకుంటే అది ఆసక్తికరంగా మారుతుంది. దీనివెనుక ఏదో పెద్ద కారణమే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. సరిగ్గా ఇటువంటిదే రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.రాజస్థాన్లోని చురు నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన రాహుల్ కశ్వాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ మహిళా నేత వసుంధరా రాజేకు వీరాభిమానినని పేర్కొన్నారు. ఆమెను తాను నూటికి నూరు శాతం అభిమానిస్తానని అన్నారు. బీజేపీని వీడిన తర్వాత కూడా తనకు వసుంధర రాజేపై పూర్తి గౌరవం ఉందని అన్నారు. రాజస్థాన్లో వసుంధరకు అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, ఆమె అద్భుతమైన నాయకురాలని పేర్కొన్నారు.తామంతా వసుంధర నాయకత్వంలో ముందుకు సాగామని, ఆమె రాష్ట్రానికి పలువురు సమర్థవంతమైన నేతలను అందించారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు తాము వేర్వేరు పార్టీలలో ఉన్నామని, ప్రతిపక్ష ఎంపీగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని రాహుల్ తెలిపారు. ఇదిలావుండగా రాహుల్ బీజేపీ నేత రాజేంద్ర రాథోడ్ తీరుపై విరుచుకుపడ్డారు. ఆయన పలువురి రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారారని ఆరోపించారు.తనకు లోక్సభ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి టిక్కెట్ రాకపోవడానికి రాజేంద్రే కారణమని ఆరోపించారు. రాథోడ్ మొండి వైఖరికి వ్యతిరేకంగా తాను గళం విప్పానన్నారు. కాగా లోక్సభ ఎన్నికల్లో రాహుల్ కశ్వాన్కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆగ్రహించిన ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. తదనంతరం చురు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. -
‘‘వయనాడ్, రాయ్బరేలీలో ఏది వదులుకోవాలి’’
తిరువనంతపురం: వయనాడ్, రాయ్బరేలీలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలో తెలియడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ అన్నారు. బుధవారం(జూన్12) కేరళలోని మల్లప్పురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్గాంధీ మాట్లాడారు. ‘నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏమైనా కానీ.. వయనాడ్, రాయ్బరేలీల్లో ఒక నియోజకవర్గానికే నేను ఎంపీగా ఉండాలి. నా నిర్ణయంతో రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’అని రాహుల్ వ్యాఖ్యానించారు. రెండింటిలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలనే అంశంపై రాహుల్ పార్టీ పెద్దలకు ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం. ఎంపీగా రెండు చోట్ల విజయం సాధించిన అనంతరం తొలిసారి బుధవారం కేరళలో రాహుల్ పర్యటించారు. -
ఆ సీట్లలో గెలిస్తే కేంద్రమంత్రులే!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుల్లో కొన్నేళ్లుగా బలపడిన సెంటిమెంట్ ఈసారి లోక్సభ ఎన్నికల్లోనూ నిజమైంది. గత ముప్పై ఏళ్లుగా ఉమ్మడి ఏపీలో, ఇప్పుడు తెలంగాణలోనూ ఈ సెంటిమెంట్ బలపడుతూ వస్తోంది. ఉమ్మడి ఏపీలోని సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ, సీహెచ్.విద్యాసాగరరావు, నరసాపురం నుంచి గెలిచిన రెబెల్స్టార్ యూవీ కృష్ణంరాజు గతంలో వాజ్పేయి కేబినెట్లో సహాయమంత్రులుగా పనిచేశారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ నుంచి గెలిచిన దత్తాత్రేయ కేంద్ర సహాయమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత గవర్నర్గా నియమితులయ్యారు.2019 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచిన జి.కిషన్రెడ్డి తొలుత మోదీ కేబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవిని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రిగా కేబినెట్ హోదా పొందారు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచే గెలిచి తిరిగి మోదీ కేబినెట్లో ఈ దఫా బొగ్గు, గనులశాఖ మంత్రి అయ్యారు. ఇక గతంలో కరీంనగర్ నుంచి గెలిచిన విద్యాసాగరరావు వాజ్పేయి కేబినెట్లో కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇప్పుడు కరీంనగర్ నుంచి రెండోసారి గెలుపొందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం తాజాగా మోదీ మంత్రివర్గంలో అదే పదవిని పొందారు. ఉమ్మడి ఏపీలోని నరసాపురం నుంచి గెలిచిన సినీ హీరో కృష్ణంరాజుకు కేంద్ర సహాయమంత్రి పదవి దక్కగా, 2024 ఎన్నికల్లో బీజేపీ టికెట్పై గెలిచిన శ్రీనివాసవర్మకు మోదీ కేబినెట్లో గ్రామీణ సహాయమంత్రి శాఖ లభించింది.ఎప్పుడూ అవే స్థానాలకు పదవులా? గతంలో మాదిరిగానే సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలకే మళ్లీ పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈసారైనా తెలంగాణలోని వెనకబడిన జిల్లాలైన మహబూబ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాలకు మోదీ కేబినెట్లో చాన్స్ లభిస్తుందేమోననే ఆశాభావం వ్యక్తమైంది. కానీ మళ్లీ సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలకే చోటు లభించడంతో కొందరు నిరుత్సాహపడటం కొసమెరుపు. -
‘నాన్నే నా ప్రాణం’.. చిరాగ్ భావోద్వేగ పోస్ట్
బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ మూడోసారి ఎంపీగా ఎన్నికై, తొలిసారి మోదీ కేబినెట్లో మంత్రి అయ్యారు. మోదీ 3.0 క్యాబినెట్లో చిరాగ్ పాశ్వాన్కు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖను కేటాయించారు. చిరాగ్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఒకప్పుడు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖలను చేపట్టారు. తాజాగా చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ను గుర్తుచేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగంతో కూడిన పోస్ట్ను షేర్ చేశారు.ఈ పోస్టుకు తన తండ్రికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలను జతచేశారు. నాడు రాష్ట్రపతి భవన్లో రామ్ విలాస్ పాశ్వాన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫొటోను చిరాగ్ పోస్ట్ చేశారు. అలాగే తాను తన తండ్రితో ఉన్నప్పటి ఫొటోలను కూడా షేర్ చేశారు. వీడియోలో రామ్ విలాస్ పాశ్వాన్ రికార్డ్ చేసిన వాయిస్ ప్లే అవుతుంది. అలాగే ఇదే వీడియోలో చిరాగ్ మాట్లాడుతూ ఈ దీపం(చిరాగ్) దేశానికి, ప్రపంచానికి వెలుగు నిచ్చేదిగా మారినందుకు సంతోషిస్తున్నాను’ అని పేర్కొన్నారు.చిరాగ్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు మూడు కోట్ల మంది వీక్షించగా, 11 లక్షల మంది లైక్ చేశారు. అదే సమయంలో చిరాగ్ను ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో బీహార్ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కొందరు పేర్కొన్నారు. -
కెనడా ఎంపీ.. కన్నడలో ప్రమాణం
ఒట్టావా: ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిలో చాలా మంది తమ మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్లో ప్రమాణస్వీకారం చేసే రోజులివి. మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలుగా ఎన్నికైన వాళ్లు మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేయడం, ప్రసంగించడం తరచుగా చూస్తుంటాం. కానీ కెనడాలో ఎంపీగా ఎన్నికైన ప్రవాస కన్నడిగుడు చంద్రఆర్య అక్కడి పార్లమెంటులో కన్నడ భాషలో ప్రమాణస్వీకారం చేసి మాతృభాషపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. చంద్రఆర్య కన్నడలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సహచర ఎంపీలు ఆయనను సీట్లలో నుంచి లేచి అభినందించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఎంత ఎదిగినా ఎక్కడికి వెళ్లినా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మరచిపోవద్దని నెటిజన్లు చంద్ర ఆర్య వీడియోనుద్దేశించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. pic.twitter.com/lYW3RDH4vO— Harish Itagi (@HarishSItagi) June 9, 2024 -
ఈసారి లోక్సభలో ముస్లిం ఎంపీలు ఎందరు?
దేశంలోని అన్ని రంగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం కనిపిస్తుంది. రాజకీయాల్లోనూ దీనికి మినహాయింపేమీ లేదు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీచేసిన ముస్లిం అభ్యర్థులలో ఎందరు విజయం సాధించారు? వీరిలో ఏ పార్టీకి లేదా కూటమికి చెందినవారు ఎందరున్నారు?2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 24 మంది ముస్లిం అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య ఈ ఏడాది రెండుకు తగ్గింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, వీరిలో ఒక్క ఎంపీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి చెందినవారు లేరు. ఈ 24 మంది లోక్సభ ఎంపీలలో 21 మంది ఇండియా అలయన్స్కు చెందిన వారే కావడం విశేషం.ఈ జాబితాలో తొమ్మిది మంది ముస్లిం ఎంపీలతో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ముస్లిం ఎంపీలు ఉన్నారు. నలుగురు ముస్లిం ఎంపీలు సమాజ్వాదీ పార్టీకి, ఇద్దరు ఇండియన్ ముస్లిం లీగ్కు, ఒకరు నేషనల్ కాన్ఫరెన్స్కు చెందినవారున్నారు. అలాగే అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎంకు చెందిన ముస్లిం ఎంపీ. ఇద్దరు ముస్లిం ఎంపీలు స్వతంత్రులుగా ఎన్నికయ్యారు.ఈసారి లోక్సభలో ముస్లింల వాటా కేవలం 4.42 శాతానికి తగ్గింది. 1980 లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా 49 మంది ముస్లిం ఎంపీలు విజయం సాధించారు. 1984 లోక్సభ ఎన్నికల్లో 45 మంది ముస్లిం ఎంపీలుగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లిం ఎంపీల సంఖ్య 40కి మించలేదు. 2014లో 11 ప్రధాన పార్టీలు మొత్తం 82 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టాయి. వీరిలో 16 మంది అభ్యర్థులు విజయం సాధించారు. 2019లో ఈ పార్టీలు 115 మంది అభ్యర్థులను నిలబెట్టగా, అప్పుడు 16 మంది అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. -
బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కీలక విషయాలు
-
వలపు వల విసిరి.. చర్మం వలిచి.. ముక్కలుగా నరికి
కోల్కతా: బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనపై వలపు వల(హనీ ట్రాప్) విసిరి కోల్కతాకు రప్పించి, దారుణంగా హత్య చేసి, చర్మం వలిచి ముక్కలు ముక్కలుగా నరికినట్లు తేలింది. వలపు వల విసిరిన యువతిని బంగ్లాదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను శిలాంతి రెహమాన్గా గుర్తించారు. బంగ్లాదేశ్ జాతీయురాలైన శిలాంతి ప్రధాన నిందితుడు, అమెరికా పౌరుడైన అఖ్తరుజమాన్ షహీన్కు ప్రియురాలు అని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. కోల్కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో అక్తరుజమాన్ అద్దె ఇంట్లో ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శిలాంతి రెహమాన్ కోల్తాలోనే ఉన్నట్లు వెల్లడయ్యింది. మరో నిందితుడు అమానుల్లా అమన్తో కలిసి ఈ నెల 15న బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లిపోయింది. తన మిత్రుడు అన్వరుల్ అజీమ్ అనర్ను బంగ్లాదేశ్ నుంచి కోల్కతాకు రప్పించడానికి ప్రధాన నిందితుడు అఖ్తరుజమాన్ తన ప్రియురాలు శిలాంతిని ప్రయోగించినట్లు పోలీసులు తేల్చారు. అన్వరుల్ అజీమ్ అనర్, అఖ్తరుజమాన్ మధ్య ఆర్థికరమైన వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. అక్రమంగా దేశంలోకి చొరబడి హత్యాకాండ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ను చంపడానికి నిందితులు పక్కా పథకం వేశారు. జంతువులను వధించడంలో అనుభవం ఉన్న మాంసం వ్యాపారి జిహాద్ హవల్దార్ను బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు రప్పించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డాడు. కొంతకాలం ముంబైలో తలదాచుకున్నాడు. పథకం ప్రకారం హత్యకు రెండు నెలల ముందు కోల్కతాకు చేరుకున్నాడు. అఖ్తరుజమాన్ అద్దె ఇంట్లో అన్వరుల్ అజీమ్ను ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడు. -
Md Anwarul Azim Anwar: బెంగాల్లో బంగ్లా ఎంపీ హత్య
కోల్కతా/ఢాకా: చికిత్స కోసం భారత్కు వచ్చిన బంగ్లాదేశ్కు చెందిన ఆవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ దారుణ హత్యకు గురయ్యారు. కోల్కతాలోని న్యూటౌన్ లగ్జరీ అపార్ట్మెంట్లో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. నిందితులు, హత్యకు గల కారణాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బంగ్లా సీనియర్ నేత హత్యోదంతాన్ని ఇరుదేశాల ప్రభు త్వాలు సీరియస్గా తీసుకు న్నాయి. పశ్చిమబెంగాల్ సీఐడీ విభాగం ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ముగ్గు్గరు నిందితులను ఢాకాలోని వరీ ప్రాంతంలో అరెస్ట్చేశారు. కోల్కతాకొచ్చి కనిపించకుండాపోయి..మే 12వ తేదీన ఎంపీ అన్వర్ నార్త్ కోల్కతాలోని బారానగర్లో తనకు పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్ ఇంటికి వచ్చారు. మే 13వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి అన్వర్ బయటకు వెళ్లారు. రాత్రి భోజనానికి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో గోపాల్కు అనుమానమొచ్చింది. అయితే అత్యవసర పని మీద ఢిల్లీకి వెళ్తున్నానని, వీఐపీలను కలబోతున్నానని వాట్సాప్ సందేశాలు వచ్చాయి. తర్వాత మే 17వ తేదీదాకా ఆయన నుంచి ఎలాంటి మెసేజ్లు, ఫోన్కాల్స్ రాకపోవడంతో మే 18వ తేదీన మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్ ఫోన్ జాడను కనిపెట్టే పనిలో పడ్డారు. మే 13న అన్వర్ చివరిసారిగా సంజీబ్ ఘోష్కు చెందిన అపార్ట్మెంట్లో లోపలికి ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళతో వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. మే 15, 17 తేదీల్లో ఆ గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు, మహిళ ఆ అపార్ట్మెంట్ నుంచి బయటికొచ్చారుగానీ అన్వర్ రాలేదు. అన్వర్ మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఎక్కడో పడేసి ఉంటారని సీఐడీ ఐజీ అఖిలేశ్ అనుమానం వ్యక్తంచేశారు. -
ఆ అవార్డు వస్తే సంతోషిస్తా: నటి కంగనా
దేశంలో ప్రస్తుతం 2024 లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా, కొన్ని స్థానాలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ రంగంలోకి దిగారు.తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నటిగా తనకు అనేక జాతీయ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు వచ్చినా, రాబోయే కాలంలో మండీ ప్రాంత అభివృద్ధే తనకు ముఖ్యమని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను కృషి చేస్తానని, అప్పుడు తనకు ‘ఎంపీ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వస్తే చాలా సంతోషిస్తానని తెలిపారు. భవిష్యత్తులో తనకు ఏదైనా మంత్రిత్వ శాఖ లేదా ఏదైనా పెద్ద పదవి అప్పగిస్తే బాధ్యతగా నెరవేరుస్తానని అన్నారు. తాను ముందుగా మండి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.కంగనా తన సినిమా ప్రాజెక్ట్ల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని, తన కొత్త సినిమా ‘ఎమర్జెన్సీ’ త్వరలోనే విడుదల కాబోతున్నదని కంగనా తెలిపారు. ఎన్నికల ప్రచారం కారణంగా తాను హీరో ఆర్ మాధవన్తో చేస్తున్న సినిమాకు గ్యాప్ ఇచ్చానని తెలిపారు. దానిని తిరిగి ప్రారంభించాల్సి ఉందని, అలాగే మరో మూడునాలుగు సినిమాలకు సైన్ చేశానని తెలిపారు.యాపిల్ పండించే రైతుల గురించి కంగనా మాట్లాడుతూ, వారికి కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యాపిల్ ధరల పెంపు తదితర విషయాలపై అధికార యంత్రాంగంతో చర్చించాల్సి ఉందన్నారు. బీజేపీ అభ్యర్థిగా సొంత వాగ్దానాలు చేయకూడదని పార్టీ ఆదేశించిందన్నారు. -
బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో పలు ఆసక్తికర వైనాలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి ఉదంతం గుజరాత్లో చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని గుజరాత్కు చెందిన బీజేపీ ఎంపీ ఆరోపించిన నేపధ్యంలో ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.వీరిద్దరూ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భరూచ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నర్మదా జిల్లాలోని దేడియాపాడలో బీజేపీకి చెందిన భరూచ్ ఎంపీ మన్సుఖ్ వాసవా, ఆప్ ఎమ్మెల్యే చైత్ర వాసవా మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.జనం మధ్యలో ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరగడాన్ని వీడియోలో చూడవచ్చు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం ఇద్దరు నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేష్ యాదవ్ తెలిపారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. బీజేపీ ఎంపీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఆప్ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించిన దరిమిలా ఈ వివాదం చోటుచేసుకుంది. મારી ગેર હાજરી ના 6 માસમાં થયેલ કામગીરી મનરેગા માં 22 cr, વિકાસશીલ તાલુકા જોગવાઈ 4 cr, આદિ આદર્શગામ 68 cr,નલ સે જલ યોજનામાં 40 cr, SBM 2 cr,F. R.A માં 3.90 cr ના આયોજન બાબતે ડેડીયાપાડા TDO સાથે ચર્ચા કરતાની સાથે જ મનસુખ વસાવા અને ભાજપ ના હોદ્દેદારો ને 420 વોલ્ટનો કરંટ લાગતા 1/2 pic.twitter.com/FRPFFmbRWN— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) May 18, 2024 -
విదేశాల నుంచి ఆప్ ఎంపీ .. సీఎం కేజ్రీవాల్తో భేటీ
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. ఆయన గత కొన్ని నెలలుగా బ్రిటన్లో ఉన్నారు. అక్కడ ఆయనకు కంటి శస్త్రచికిత్స జరిగింది. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో రాఘవ్ చద్దా ఇక్కడ లేరు. రాఘవ్ చద్దా గైర్హాజరుపై ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నాయి.ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతల్లో రాఘవ్ చద్దా ఒకరు. ఆయన బహిరంగ వేదికలపై పార్టీకి మద్దతుగా మాట్లాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు బ్రిటన్ వెళ్లారు. ఆ దరిమిలా ఆమ్ ఆద్మీ పార్టీ పలు సమస్యలను ఎదుర్కొంది. మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనిపై పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.ఆమ్ ఆద్మీ పార్టీలో గందరగోళం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రాఘవ్ చద్దా విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఇటీవల రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం పీఏ విభవ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను తనను కొట్టారని, సీఎం సభలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.కాగా స్వాతి ఇదంతా బీజేపీ డైరెక్షన్లో చేస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. స్వాతి మలివాల్ సీఎం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని, వారిని బెదిరించారని ఆప్ నేత అతిషి ఆరోపించారు. -
‘భారత్ చంద్రుడిపై అడుగు పెడితే.. మనం మాత్రం’
ఇస్లామాబాద్: భారత దేశం చంద్రుడి మీద అడుతుపెడుతుంటే.. కరాచీలో తెరిచి ఉన్న ముగురు కాలువలో పడి చిన్నారులు మృతి చెందిన వార్తలను పాక్ చూస్తోందని ఆ దేశ ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన నేషనల్ అసెంబ్లీ సమావేశంలో ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్థాన్ (MQM-P) ఎంపీ సయ్యద్ ముస్తఫా ప్రసంగించారు.‘‘కరాచీ పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక పక్క ప్రపం దేశాలు చంద్రుడిపైకి వెళ్తుంటే.. కరాచీ మాత్రం తెరిచిన ఉన్న మురుగు కాలువల్లో చిన్నారులు పడిపోయి మృతి చెందిన వార్తలతో నిలుస్తోంది. భారత్ చంద్రుడి అడుగుపెట్టిందన్న రెండు సెకండ్లకు కరాచీలో ఇటువంటి ఘటనకు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక.. కరాచీ స్వచ్ఛమైన నీరు దొరకటం లేదు.سید مصطفیٰ کمال نے ببانگ دہل کراچی کا مقدمہ پارلیمنٹ میں کھلے الفاظ میں پیش کیا۔ سنئے#Pakistan #Sindh #Karachi #MQMP #PTI #PPP #President #AsifAliZardari #Bilawal #MustafaKamal #Nation #NationalAssembly #Parliament pic.twitter.com/7B8wKPIYP7— Syed Mustafa Kamal (@KamalMQM) May 15, 2024మరోవైపు.. మొత్తం 2.6 కోట్ల మంది చిన్నారుల్లో 70 లక్షల మంది పిల్లలు అసలు పాఠశాలకు వెళ్లటం లేదు. కరాచీ పాకిస్తాన్కి ఆదాయం ఇచ్చే ఇంజన్ లాంటి నగరం. ఇక్కడ రెండు సముద్రపు పోర్టులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు మొత్తం పాకిస్తాన్కి కరాచీ గేట్వే వంటిది. అటువంటి కరాచీ నగరంలోనే స్వచ్ఛమైన నీరు లభించటం లేదు. నీటి కోసం ట్యాంకర్ మాఫియా నడుస్తోంది’’ అని సయ్యద్ విమర్శలు చేశారు. సయ్యద్ చేసిన వ్యాఖ్యలు ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఇక..పాకిస్థాన్ను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్.. విస్తరించిన రుణ సౌకర్యంలో భాగంగా ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్(ఐఎంఎఫ్) వద్ద రుణం కోరుతోంది. -
తమిళనాడు ఎంపీ మృతి
చెన్నై: తమిళనాడు ఎంపీ ఎం.సెల్వరాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.నాగపట్నం ప్రస్తుత ఎంపీగా ఉన్న 67 ఏళ్ల ఎం. సెల్వరాజ్కి గతంలో కిడ్నీ మార్పిడి జరిగింది. రైతు, సామాజిక కార్యకర్త అయిన సెల్వరాజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో అత్యంత సీనియర్ నేత. నాలుగు సార్లు ఎంపీగా పనిచేశారు. 1989, 1996, 1998, 2019లో ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు.ఎంపీ ఎం.సెల్వరాజ్ మృతికి సీపీఐ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఆయనను ఆదర్శప్రాయమైన నేతగా అభివర్ణించింది. తిరువారూర్ జిల్లాలోని సీతమల్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ తెలిపింది. కాగా ఈసారి నాగపట్నం నియోజకవర్గం నుంచి వి.సెల్వరాజ్ను సీపీఐ బరిలోకి దింపింది. -
Delhi court: బ్రిజ్ భూషణ్పై అభియోగాలు నమోదు చేయండి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలను నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. తమను వేధించారంటూ ఐదుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా తగు ఆధారాలున్నట్లు కోర్టు తెలిపింది. కేసులు నమోదు చేయాల్సిందిగా అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్(ఏసీఎంఎం) ప్రియాంకా రాజ్పుత్ ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో సహ నిందితుడు, డబ్ల్యూఎఫ్ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్పైనా అభియోగాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్పై ఆరో మహిళా మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలకు తగు ఆధారాలు లేనందున ఆమె పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. కోర్టు ఈనెల 21న అధికారికంగా అభియోగాలను నమోదు చేయనుంది. -
నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
లక్నో: దేశంలో సాధారణ ఎన్నికల వేళ చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల పర్వంలో పలువురు నేతలు ప్రజలకు వినోదం పంచుతుంటారు. ఇలాంటి కోవకే చెందిన ఒక నేత నామినేషన్ దాఖలుకు గడువు మించిపోతున్నా ప్రచార కార్యక్రమంలో పాల్గొని చివరి నిమిషంలో పరుగందుకున్నారు.దాదాపు 100 మీటర్ల దూరం పరుగులు పెట్టి చివరకు గడువు లోపల నామినేషన్ ఫైల్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ డేరియా నియోజకవర్గంలో గురువారం జరిగింది. ఇక్కడి బీజేపీ అభ్యర్థి త్రిపాఠి తన నామినేషన్కు ముందు జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య హాజరయ్యారు. దీంతో ఆ ప్రోగ్రామ్ బిజీలో ఉండిపోయి తన నామినేషన్నే రిస్కులో పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే చివరి 15 నిమిషాల్లో ఎలాగోలా పరుగెత్తి నామినేషన్ ఫైల్ చేయగలిగారు. 54 ఏళ్ల త్రిపాఠి తన కాలేజీ రోజుల్లో మంచి రన్నర్గా పేరుతెచ్చుకున్నారు. అది ప్రస్తుత ఎన్నికల్లో ఇలా ఆయనకు కలిసి రావడం విశేషం. ‘ఐఐటీలో చదివే రోజుల్లో నేను మంచి రన్నర్ను అది ఇప్పుడు నాకు గడువులోపల నామినేషన్ వేసేందుకు కలిసి వచ్చింది’అని త్రిపాఠి చెప్పారు. -
పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు!
దేశంలో లోక్సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్నాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్లు 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ తొమ్మిది స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈసారి అన్ని రాజకీయ పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీకి దిగడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పంజాబ్లోని హోషియార్పూర్ స్థానంలో పోటీపై ఎక్కడాలేని ఆసక్తి నెలకొంది. ఇక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాయి.హోషియార్పూర్ సిట్టింగ్ ఎంపీ సోమ్ప్రకాష్ భార్య అనితా ప్రకాష్ను భారతీయ జనతా పార్టీ ఎన్నికల పోరులో నిలిపింది. కాంగ్రెస్ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన డాక్టర్ రాజ్కుమార్ చబ్బేవాల్ను ఆ పార్టీ రంగంలోకి దింపింది. శిరోమణి అకాలీదళ్ మాజీ మంత్రి సోహన్ సింగ్ తాండల్ను, కాంగ్రెస్ పార్టీ యామినీ గోమర్ను తమ అభ్యర్థులుగా నిలబెట్టాయి.ఈ లోక్సభ నియోజకవర్గంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత ఏడు ఎన్నికల్లో హోషియార్పూర్ ఓటర్లు ప్రతీసారి ఎంపీని మారుస్తూనే ఉన్నారు. ఒక్క కమల్ చౌదరి మాత్రమే నాలుగుసార్లు ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులు కూడా కొత్తవారే కావడం విశేషం.గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ చబ్బెవాల్ ఈసారి ఆప్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. 2014లో ఇదే స్థానంలో ఆప్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన యామినీ గోమర్ను ఈసారి కాంగ్రెస్ తన అభ్యర్థిగా నిలబెట్టింది. గత లోక్సభ ఎన్నికల్లో హోషియార్పూర్ స్థానంలో బీజేపీకి చెందిన సోమ్ప్రకాష్ 48,530 ఓట్ల తేడాతో డాక్టర్ చబ్బెవాల్పై విజయం సాధించారు. సోమ్ప్రకాష్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం అతని భార్య అనితా సోమ్ప్రకాష్ బీజేపీ నుండి ఎన్నికల బరిలోకి దిగారు. హోషియార్పూర్లో అభ్యర్థులు పార్టీలను మార్చేస్తున్నట్లుగానే.. ఓటర్లు కూడా ప్రతీ ఎన్నికల్లోనూ ఎంపీలను మార్చేస్తుండటం విశేషం. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్
బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలోనే పార్టీ ఈ చర్యలు తీసుకుంది. ఇటీవల ఆయనపై లైంగిక ఆరోపణలు రాగా, కన్నడనాట రాజకీయంగా పెను దుమారం రేగింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. మంగళవారం జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో జేడీఎస్.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజ్వల్ సస్పెన్షన్ ముందు ఆయన బాబాయ్, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి డీకే శివకుమర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. అసభ్యకరమైన వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా? అందులో ఉన్నది అతడేననే ఆధారం ఏంటి?. అయినా సరే తాము నైతికత ఆధారంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక.. ప్రజ్వల్కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది.లోక్సభ ఎన్నికల వేళ రాజకీయంగా ఈ వ్యవహారం దుమారం రేగటంతో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కోర్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని సోమవారం జేడీఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే.