-
ప్రారంభమైన మొబైల్ థియేటర్
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలకు సమీపాన హెబిటేట్ రెస్టారెంట్ పక్కన ఏర్పాటు చేసిన మొబైల్ థియేటర్ ప్రారంభమైంది. జీఎస్ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు సోమవారం దీనిని ప్రారంభించారు. ‘పిక్చర్ టైమ్’ సంస్థ ఏర్పాటు చేసిన ఈ థియేటర్ గ్రామీణ ప్రాంతాల వారికి ఐమాక్స్లో సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులలో ఒకరైన చైతన్య తెలిపారు. ఇన్ఫ్లాటబుల్ అకోస్టిక్ మెటీరియల్ (గాలి నింపిన టెంట్)తో తయారైన ఈ థియేటర్ అన్ని వాతావరణ పరిస్థితులను, అగ్ని ప్రమాదాలను తట్టుకుంటుందన్నారు. 35 ఎంఎం స్క్రీన్తో, 120 సిటింగ్ సదుపాయంతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్కి ఏడాది పాటు అనుమతులున్నాయని, ఈనెల 29న విడుదలయ్యే ఆచార్య సినిమాతో రెగ్యులర్ షోలు వేస్తామని చెప్పారు. ఆన్లైన్తోపాటు బుకింగ్ కౌంటర్లోను లభించే టికెట్లు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే లభిస్తాయన్నారు. ప్రారంభ కార్యక్రమంలో జీఎస్ఎల్ ప్రతినిధులు డాక్టర్ గన్ని సందీప్, డాక్టర్ జి. తరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
కుంభస్థలాన్ని బద్దలు కొట్టనున్న ఆర్ఆర్ఆర్, ఎన్ని స్క్రీన్లలో రిలీజంటే?
‘‘ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం... రా’’ అంటూ రామ్, భీమ్ చేసిన యుద్ధాన్ని తెరపై చూసే సమయం ఆసన్నమైంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఈ యుద్ధాన్ని చూడటానికి దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది వేల స్క్రీన్లకు పైగా ‘ఆర్ఆర్ఆర్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్ నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం.. రణం.. రుధిరం). రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. కాగా ‘ఆర్ఆర్ఆర్’ భారీ సినిమా కాబట్టి ఈ సినిమాతో పోటీ పడకుండా తెలుగుతో కలుపుకుని ఇతర భాషల్లో కూడా తమ చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నాయి పలు నిర్మాణ సంస్థలు. అంతెందుకు? దేశవ్యాప్తంగా చాలావరకూ ఎక్కువ స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ కనిపిస్తుంది. ఇక జంట నగరాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్) అయితే శుక్రవారం ‘ఆర్ఆర్ఆర్’ తప్ప వేరే సినిమా కనిపించదు. ఆ విశేషాల్లోకి వస్తే... సింగిల్ 100... మల్టీప్లెక్స్ 40 హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న థియేటర్లు ఎన్ని? అనే లెక్కలోకి వస్తే... సింగిల్ థియేటర్లు దాదాపు 100. మల్టీప్లెక్స్ దాదాపు 40 ప్రాపర్టీస్ (మల్టీప్లెక్స్లో పలు స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి వీటిని ప్రాపర్టీస్ అంటారు). మామూలుగా ఏ మల్టీప్లెక్స్ థియేటర్లో అయినా మినిమమ్ మూడు స్క్రీన్ల నుంచి మ్యాగ్జిమమ్ తొమ్మిది స్క్రీన్ల వరకూ ఉంటాయి. సో... టూకీగా ఒక్కో ప్రాపర్టీలో ఐదు స్క్రీన్లు ఉన్నాయనుకుందాం... అప్పుడు 40 ప్రాపర్టీస్లో 200 స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ విడుదలవుతుందనుకోవచ్చు. సో.. సింగిల్, మల్టీప్లెక్స్ కలుపుకుని దాదాపు 300 స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ ఆడుతుంది. మరి.. ఇప్పటివరకూ థియేటర్లలో ఉన్న సినిమాల సంగతేంటి? రెండు మూడు స్క్రీన్లు మినహా... గురువారం వరకూ ‘ద కశ్మీర్ ఫైల్స్’, ‘రాధే శ్యామ్’, ‘బచ్చన్ పాండే’, ‘జేమ్స్’తో పాటు హాలీవుడ్ ‘బ్యాట్ మేన్’ తదితర చిత్రాలు కొన్ని థియేటర్లలో ప్రదర్శితమయ్యాయి. అయితే శుక్రవారం రెండు మూడు స్క్రీన్లు మినహా మిగతా అన్నింటిలోనూ ‘ఆర్ఆర్ఆర్’ దర్శనమిస్తుంది. ఎన్ని రోజుల పాటు ఇలా అన్ని స్క్రీన్లలో ‘ఆర్ఆర్ఆర్’ మాత్రమే ఉంటుంది అంటే..? ‘ద కశ్మీర్..’కి చాన్స్ జంట నగరాల్లో ఆడుతున్న ఆలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’, ‘రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ చిత్రాల ప్రదర్శన గురువారంతో ముగిసింది. అయితే ‘ద కశ్మీర్ ఫైల్స్’ శుక్రవారం ఒకట్రెండు స్క్రీన్లలో మాత్రమే కనిపించి, మళ్లీ సోమవారం నుంచి కాస్త ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శితమవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ వంటి రెండు మూడు చిత్రాలకూ స్కోప్ ఉంది. అయితే ఈ రెండు మూడు సినిమాలూ జస్ట్ పదీ పదిహేను శాతం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శితమవుతాయని, మిగతా అన్ని స్క్రీన్లలోనూ ఓ వారం.. పది రోజులు ‘ఆర్ఆర్ఆర్’ ఉంటుందని జంట నగరాలకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ పేర్కొన్నారు. ఆ పదిహేను శాతంలో కూడా మల్టీప్లెక్స్ స్క్రీన్లే ఎక్కువని, అది కూడా ‘ద కశ్మీర్...’ సినిమా స్క్రీన్లే ఎక్కువ అని కూడా తెలిపారు. ‘‘ఆదివారం వరకూ ఎలానూ ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీన్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత వేరే సినిమాలకు ఎన్ని స్క్రీన్లు కేటాయించాలనేది ‘ఆర్ఆర్ఆర్’కి వచ్చే స్పందన నిర్ణయిస్తుంది’’ అని ఓ డిస్ట్రిబ్యూటర్ అన్నారు. 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు.. ఎన్టీఆర్, రామ్చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, సముద్ర ఖని, శ్రియ, రే స్టీవెన్సన్... ఇలా భారీ తారాగణంతో దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ‘ఆర్ఆర్ఆర్’ రూపొందింది. కోవిడ్ బ్రేక్స్ నడుమ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రూపొందించిన ఈ సినిమా నిడివి ఎంత అంటే.. 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు. నిజానికి ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు అట. అయితే ముందు 1 నిమిషం 35 సెకన్ల నిడివిని తగ్గించారట. ఆ తర్వాత క్రెడిట్స్లో 3 నిమిషాల 26 సెకన్ల నిడివిని తగ్గించారని భోగట్టా. ఫైనల్గా ప్రేక్షకులు చూడనున్నది 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు ‘ఆర్ఆర్ఆర్’ అని తెలిసింది. చదవండి: RRR Movie: అందరిముందే అబద్ధాలు ఆడతాను: రాజమౌళి -
ఎల్లలు దాటిన అభిమానం, ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఏకంగా థియేటర్నే కొనేశారు!
Jr NTR Fans Buy Entire Theatre For RRR Movie: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ల మానియే కనిపిస్తుంది. మార్చి 11న రాధేశ్యామ్, మార్చి 25న ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ల బుకింగ్ ప్రారంభమై రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈమూవీ కోసం ఇటూ మెగా ఫ్యాన్స్ అటూ నందమూరి ఫ్యాన్స్ ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా బజ్ నెలకొంది. చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు ఇంకా ఆర్ఆర్ఆర్ విడుదలకు రెండు వారాలపైనే సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే ఈ మూవీ టికెట్స్ ఓ రేంజ్లో సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఏకంగా థియేటర్ మొత్తాన్నే కొన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది అమెరికాలో చోటుచేసుకోవడంతో మరింత ఆసక్తిని సంతరించుకుంది. ఫ్లోరిడాలోని ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీమియర్ చూసేందుకు ఏకంగా ఓ థియేటర్ అంతా బుక్ చేసుకున్నారట. చదవండి: జ్యోతిష్యాన్ని నమ్మను కానీ.. బాహుబలి విజయం తర్వాత ఫ్లోరిడాలోని సినిమార్క్ టిన్సెల్టౌన్లో సాయంత్రం 6 గంటల షో కోసం అన్ని ప్రీమియర్ టికెట్స్ బుక్ చేసుకొని ఎన్టీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. అసలే భారీ సినిమా, పైగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒకే థియేటర్లో కూర్చొని ప్రీమియర్ చూస్తుంటే ఇక ఆ హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కాగా దర్శక ధీరుడు రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీలో తారక్ కొమురంభీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా కాగా.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, శ్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
కారులో కూర్చుని వెండితెరపై సినిమా చూడొచ్చు.. త్వరలో హైదరాబాద్లో..
Hyderabad: డ్రైవ్ ఇన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ నగర వాసులకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఈ ఆలోచన ఆచరణ రూపం దాల్చితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇక్కడ ఉండనుంది. డ్రైవ్ ఇన్ థియేటర్ సాధారణ సినిమా థియేటర్/మల్టీప్లెక్స్కి వెళితే ముందుగా వాహనం పార్కింగ్ చేయాలి. ఆ తర్వాత టిక్కెట్ తీసుకుని క్లోజ్డ్ హాల్లో అక్కడున్న సీట్లో కూర్చుని సినిమా చూడాలి. కానీ డ్రైవ్ ఇన్ థియేటర్లో మనం కారులో కూర్చుని.. ఎదురుగా కనిపించే అతి భారీ స్క్రీన్పై సినిమా చూడొచ్చు. ఈ ఓపెన్ థియేటర్కి తగ్గట్టుగా సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అక్కడ కామన్ యూరప్, అమెరికా దేశాల్లో డ్రైవ్ ఇన్ థియేటర్ కాన్సెప్టు ఎప్పటి నుంచో ఉంది. కార్లలో థియేటర్కి వచ్చే వినియోగదారుడు అందులో ఉంటూనే తన కంఫర్ట్కి అనుగుణంగా సినిమాను అక్కడ చూస్తుంటారు. మనదగ్గర ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నైలలో కూడా ఈ డ్రెవ్ ఇన్ థియేటర్లు ఉన్నాయి. రజనీకాంత్ శివాజీ మూవీలో ఓ ఫైట్ సీన్లో ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ కనిపిస్తుంది. లోకేషన్ ఎక్కడ కనీసం 150 కార్ల సామార్థ్యంతో డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటు చేయాలంటే రూ. 5 నుంచి 8 కోట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా వేస్తున్నారు. 150 కార్లు సుళువుగా వచ్చి పోయేలా, నిలిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దీనికి సువిశాలమైన స్థలం కావాలి. నగరం మధ్యలో లోకేషన్ కోసం అన్వేషిస్తున్నారు. ఓఆర్ఆర్ మరోవైపు నగరం నలువైపులా విస్తరిస్తూ ఓఆర్ఆర్ని తనలో కలిపేసుకుంటోంది. దీంతో నగర పరిధిలో ఉన్న 19 ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ పాయింట్ల సమీపంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ను అందుబాటులోకి తెస్తే ఎలా ఉంటుందనే అంశంపై హెచ్ఎండీఏ పరిశీలిస్తోంది. అనువైన స్థలాలను గుర్తిస్తోంది. వెనువెంటనే పర్మిషన్లు హెచ్ఎండీఏ డ్రైవ్ ఇన్ థియేటర్కి సంబంధించిన స్థలాలను గుర్తించిన తర్వాత నిర్మాణ కంపెనీల నుంచి దరఖాస్తులు అహ్వానించనుంది. ఎవరైనా డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటుకు ముందుకు వస్తే త్వరితగిన అనుమతులు జారీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కోవిడ్తో కోవిడ్ ఎఫెక్ట్తో థియేటర్కి వెళ్లి సినిమా చూసేందుకు వెనుకాడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అదే డ్రైవ్ ఇన్ థియేటర్ అందుబాటులోకి వస్తే ఎవరి కారులో వారు ఉంటూనే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే బిగ్స్క్రీన్పై థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు డ్రైవ్ ఇన్ థియేటర్ ఫెసిలిటీ ఉన్న అతి కొద్ది నగరాల జాబితాలో హైదరాబాద్కి చోటు దక్కుతుంది.] చదవండి: 47 అంతస్తులతో ‘హైదరాబాద్ వన్’.. దేశంలోనే ఫస్ట్! -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే..
కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇటీవల మరోసారి మహమ్మారి విజృంభించడంతో సంక్రాంతికి చిన్న సినిమాలు మాత్రమే సందడి చేశాయి. అయినప్పటికీ కొన్ని సినిమాలు విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో వరసగా సినిమాల విడుదలను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ వారం పలు సినిమాలు ఇటూ థియేటర్లో అటూ ఓటీటీలో అలరించబోతున్నాయి. మరి అవేంటో చూడాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. రవితేజ ‘ఖిలాడి’ ఈ వీకెండ్కు మంచి కిక్ ఇచ్చేందుకు మాస్మాహారాజా రవితేజ సిద్దమవుతున్నాడు. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలో కథానాయికలు. కోనేరు సత్యనారాయన నిర్మించిన ఈ సినిమాలో యాంకర్ అనసూయ, అర్జున్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు విశాల్ ‘ఎఫ్ఐఆర్’ విష్ణు విశాల్ హీరోగా, నటించి నిర్మించిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో హీరో రవితేజ, అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల కానుంది. సెహరి మూవీ హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం సెహరి. ఈ సినిమాకు జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రవితేజ గిరిజాలా ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’.అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్త్నున్నారు యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఆహాలో ‘భామ కలాపం’ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భామ కలాపం’. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. గృహిణిగా పక్కింట్లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపే మహిళగా ప్రియమణి కనిపించనుంది. అలాగే యూట్యూబ్ ఛానల్లో వంటచేసే మనిషిగా కనిపిస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. విక్రమ్ ‘మహాన్’ మూవీ విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో అలరించబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 10న మహాన్ విడుదలకు చేస్తున్నారు. మళ్లీ ముదలైంది చిత్రం సుమంత్ హీరోగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్రాజన్, న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ నటించారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథతో రూపొందిన సినిమా ఇది. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అశోక్ గల్లా హీరో మూవీ యంగ్ హీరో గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా బ్యానర్పై గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్స్టార్లో ఈనెల 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావులు ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొనె ‘గెహ్రాయా’ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, సిద్దాంత్ చతుర్వేది జంటగా నటించిన చిత్రం గెహ్రాయా.. ఇందులో అనన్యా పాండే, ధైర్వా కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది. -
సినిమా థియేటర్ను జప్తు చేసే అధికారం వారికే: హైకోర్టు
సాక్షి, అమరావతి: లైసెన్స్ లేదన్న కారణంతో సినిమా థియేటర్ను జప్తు చేసే అధికారం తహసీల్దార్కు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఏపీ సినిమా (నియంత్రణ) రూల్స్ 1970 ప్రకారం.. లైసెన్స్ జారీ చేసే అధికారి మాత్రమే సినిమా థియేటర్ను జప్తు చేయగలరని స్పష్టం చేసింది. ఈ రూల్స్ ప్రకారం లైసెన్స్ జారీ అధికారి జాయింట్ కలెక్టర్ (జేసీ) అవుతారని తెలిపింది. అందువల్ల జేసీకి మాత్రమే సినిమా థియేటర్ను మూసివేసే అధికారం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో శ్రీనివాస మహల్ లైసెన్స్ పునరుద్ధరణ కాలేదని తహసీల్దార్ దాన్ని జప్తు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు థియేటర్ను జప్తు చేస్తున్నట్లు తహసీల్దార్ చెప్పడాన్ని కూడా ఖండించింది. జప్తు చేసిన థియేటర్ను తెరవాలని తహసీల్దార్ను ఆదేశించింది. లైసెన్స్ పునరుద్ధరణ అంశం లైసెన్స్ జారీ అధికారి ముందు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ థియేటర్లో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని థియేటర్ యాజమాన్యానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్స్ లేదన్న కారణంతో తమ థియేటర్ను తహసీల్దార్ జప్తు చేయడాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస మహల్ మేనేజింగ్ పార్టనర్ సనపాల శంకరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఇలా జరగడం బాధగా ఉంది: నాని భావోద్వేగం
Hero Nani Gets Emotional On Social Media Over Movie Theater Fire Accident: హైదరాబాద్ బిగ్స్క్రీన్ థియేటర్లో కేపీహెచ్బీ కాలనీలోని శివపార్వతి థియేటర్ ఒకటి. మంచి సౌండ్ సిస్టం ఉన్న థియేటర్ శివ పార్వతి. అంత్యంత ప్రాముఖ్యత ఉన్న ఈ థియేటర్ సోమవారం ఉదయం అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ వల్ల థియేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి థియేటర్ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో సినిమా హాల్లోని ఫర్నీచర్, సినిమా స్క్రీన్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. చదవండి: నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్ బాబు, స్పందించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు ఈ థియేటర్ ప్రమాదంపై నేచురల్ స్టార్ నాని స్పందిస్తూ భావోద్యేగానికి లోనయ్యాడు. శివ పార్వతి థియేటర్తో తనకున్న జ్ఞాపకాలని సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేసుకున్నాడు. ‘శివ పార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం జరగడం చాలా బాధాకరం. ఇక్కడ ‘టక్కరి దొంగ’ మొదటి షో చూడటం నాకింగా గుర్తుంది. ఆ సినిమాకి ఫ్రెండ్స్ వేళ్లి రచ్చ రచ్చ చేశాం. ఇలా ఎన్నో సినిమాలు ఆ థియేటర్లో చూశాం. ఆ థియేటర్తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలా కాలిపోవడం చాలా బాధగా ఉంది. ఎవరికీ ఎటువంటి గాయాలు అవకపోవడం అదృష్టం’ అంటూ నాని ట్వీట్ చేశాడు. చదవండి: Radhe Shyam: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్ గారూ.. Sad to hear about the fire accident at Shiva Parvathi theatre. I remember watching Takkari Donga there on the first day in mad euphoria. Glad to know that no one is hurt. — Nani (@NameisNani) January 3, 2022 -
అద్దెకు ఫ్యామిలీ థియేటర్ ! హైదరాబాద్లో న్యూ బిజినెస్ !
కోవిడ్ మహమ్మారి ఎటాక్ చేసినప్పటి నుంచి ఇంటి బయట కాలు పెట్టాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. వైరస్ భయంతో కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్తామంటే మనసు రావడం లేదు. చిన్న చిన్న సరదాలకు కూడా దూరం కావాల్సి వస్తోంది. ఇంటిల్లిపాది సినిమాకి వెళ్లి ఏళ్లు నెలలు దాటిన కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి వారి కోసమే ప్రైవేటుగా సినిమా చూసేందుకు వీలుగా ఫ్యామిలీ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లో ఈ కొత్త రకం ఫ్యామిలీ థియేటర్ బిజినెస్ ఊపందుకుంటోంది. అద్దెకు థియేటర్ కరోనా తెర మీదకు వచ్చిన తర్వాత వెండి తెర మీద సినిమాలు చూడటం చాలా అరుదైన విషయంగా మారింది. వందల మందితో కలిసి సినిమా చూడాలంటే భయపడే కుటుంబాల సంఖ్య పెరిగింది. వినోదం కోసం ఓటీటీ ఫ్లాట్ఫామ్ అందుబాటులో ఉన్నా థియేటర్లో చూసిన ఫీల్ అయితే మిస్ అవుతున్నారు. ఇలాంటి వారి కోసం కేవలం ఒక ఫ్యామిలీ మాత్రమే సినిమా చూసేలా అత్యాధునిక సౌకర్యాలతో థియేటర్ను స్టార్ ట్రాక్ గ్రూప్ హైదరాబాద్లో అందుబాటులోకి తెచ్చింది. థియేటర్ను అద్దెకు తీసుకుని నచ్చిన సినిమాను చూసేయోచ్చు. మల్టీప్లెక్స్ స్థాయిలో స్టార్ట్రాక్ గ్రూపు థియేటర్లో ఏడుగురు కుటుంబ సభ్యుల వరకు సినిమా చూసే వీలుంది. ఈ థియేటర్లో 142 ఇంచెస్ ఆధునిక స్క్రీన్, మెయిన్ స్ట్రీమ్ థియేటర్కి ఏ మాత్రం తీసిపోని ఆడియో సిస్టమ్తో పాటు రిక్లెయినర్ చైయిర్లు అందుబాటులో ఉన్నాయి. థియేటర్ ఇంటీరియర్ సైతం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. థియేటర్ అనుభూతిని అందివ్వడంలో ఈ ఫ్యామిలీ థియేటర్ మల్టీప్లెక్స్కి ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందించారు. కంటెంట్ మనదే ఈ రెంటెండ్ థియేటర్లో ఫ్యామిలీ ఫంక్షన్ వీడియోలతో పాటు నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆహా, హాట్స్టార్ తదితర ఓటీటీ కంటెంట్లపై వచ్చే సినిమాలను సైతం ఇక్కడ చూసే వీలుంది. ఈ రోజుల్లో చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. థియేటర్ ఫీల్ కావాలనుకునే వారు ఈ రెంటెండ్ థియేటర్లో కరోనా భయాలు లేకుండా సినిమాలను ఆస్వాదించవచ్చు. రోజుకి మూడు షోలు ఈ ఫ్యామిలీ థియేటర్ను రోజుకు మూడు షోలకు అద్దెకు ఇస్తున్నారు. మార్నింగ్ , ఆఫ్టర్నూన్, ఈవెనింగ్ సమయాల్లో ఇందులో ఫ్యామిలీతో సినిమాను చూసేయోచ్చు. షో టైమింగ్, వారాన్ని బట్టి ఒక్కో షోకి కనిష్టంగా రూ. 1500ల నుంచి గరిష్టంగా రూ.1900ల వరకు రెంట్ తీసుకుంటారు. ప్రతీ షో తర్వాత థియేటర్ మొత్తాన్ని ఆధునిక పద్దతిలో శానిటైజ్ చేస్తున్నారు. ఈ గ్రూప్కి చెందిన వెబ్సైట్కి వెళ్లి ముందుగా షోని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రెండ్కి తగ్గట్టుగా హైదరాబాద్ నగరంలో ఒకప్పటి సంగీత్ థియేటర్ మొదలు ఆర్టీసీ క్రాస్రోడ్లో సంధ్య థియేటర్స్ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లను డిజైన్ చేయడంలో స్టార్ ట్రాక్ గ్రూపుకి మంచి రికార్డు ఉంది. ఈ గ్రూపు ఓనర్లు మూడు తరాలు నగరంలో దాదాపు 300ల వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. బ్రిటీష్ జమానాలో ఇంజీనింగ్లో గోల్డ్ మెడల్ పొంది బీకే మూర్తితో ఈ పరంపర మొదలైంది. ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్టుగా రూపొందిన ఫ్యామిలీ థియేటర్ సికింద్రాబాద్, సర్థార్పటేల్ రోడ్లోని పైగా హౌసింగ్ కాలనీలో ఉంది. చదవండి: కింగ్డమ్ ఆఫ్ కిడ్స్.. హైదరాబాద్లో కొత్త స్టూడియో -
ఢిల్లీ సీఎంకు కరణ్ జోహార్ ట్వీట్, నిర్మాతపై నెటిజన్ల మండిపాటు
Karan Johar Trolled By Netizens For His Tweet to Delhi CM Over Theatres Re-Open: సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ట్రోల్స్ సెగ తగలడం కొత్తేమి కాదు. పలువురు సినీ సెలబ్రెటీలు వారి తీరుతో సోషల్ మీడియాలో చేదు అనుభవాన్ని చవిచూస్తుంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్కు ట్రోల్స్ సెగ తగిలింది. అయితే సోషల్ మీడియాలో నెగిటివిటి తెచ్చుకోవడం కరణ్కు ఇదేం కొత్త కాదు. తరచూ ఆయన సోషల్ మీడియాల్లో ట్రోల్స్ బారిన పడుతుంటాడు. తాజా కరోనా నేపథ్యంలో మూసి వేసిన థియేటర్లను తెరవాలంటూ ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. దీంతో కరణ్పై నెటిజన్లు ధ్వజమెతున్నారు. చదవండి: దుబాయ్లో హీరోయిన్తో హీరో విక్రమ్ తనయుడు డేటింగ్, ఫొటోలు వైరల్ అయితే ప్రస్తుతం దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలు వరసగా కరోనా బారిన పడుతున్నారు. దీనికి కరణ్ ఇచ్చిన ఓ విందు పార్టీయే వేదిక అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో దేశ రాజధానిలో మరోసారి థియేటర్లు మూత పడ్డాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్కడి థియేటర్లు మూసీవేయాలంటూ ఆదేశం ఇచ్చారు. దీంతో సీఎం నిర్ణయంపై స్పందిస్తూ కరణ్ జోహార్ ఇలా ట్వీట్ చేశాడు. ‘మిగతా చాల చోట్లతో పోలిస్తే సినిమా థియేటర్లో కరోనా వ్యాపించే అవకాశాలు తక్కువ. చదవండి: విషాదం: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సొషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ బాక్సాఫీస్ నడపవచ్చు. అందుచేత తిరిగి థియేటర్లు ఒపెన్ చేయడానికి అనుమతి అవ్వండి’ అని కోరుతూ ఆయన ట్వీట్ చేశాడు. అది చూసిన నెటిజన్లు కరణ్పై విరుచుపడుతున్నారు. మీ ట్వీట్ ఉద్దేశం ఏంటి.. మమ్మల్ని డబ్బులు సంపాదించుకోనివ్వండి. సామాన్యులు యాతన పడనివ్వండి అనేగా అంటూ కరణ్కు నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. కరణ్ చెబుతోన్న లాజిక్ ‘బాలీవుడ్ వర్సెస్ సైన్స్’ అంటూ వెక్కిరించారు. మరికొందరు ‘సినిమాల్ని ఓటీటీలో చూసుకోవచ్చు. థియేటర్స్ తెరిచి జనం ప్రాణాలతో ఆటలాడకండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. We urge the Delhi Government to allow cinemas to operate. Cinemas are equipped with better ability to ensure a hygienic environment while maintaining social distancing norms as compared to other out-of-home settings. @LtGovDelhi @ArvindKejriwal @OfficeOfDyCM #cinemasaresafe — Karan Johar (@karanjohar) December 30, 2021 -
సినిమా టికెట్ ధరల హేతుబద్ధీకరణపై చర్చ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను హేతుబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి శుక్రవారం వర్చువల్గా సమావేశమైంది. టికెట్ రేట్లు నిర్ణయించే క్రమంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, సినీగోయర్స్ అసోసియేషన్ సభ్యులతో కమిటీ ప్రాథమికంగా చర్చించింది. ఈ క్రమంలో సభ్యుల సూచనలు, సలహాలను సైతం కమిటీ స్వీకరించింది. వీటిపై సమగ్రంగా చర్చించేందుకు జనవరి 11వ తేదీన మరోసారి సమావేశమవ్వాలని కమిటీ నిర్ణయించింది. ప్రేక్షకులపై భారం పడకుండా తక్కువ ధరకు వినోదాన్ని అందించేందుకు హైకోర్టు సూచనల మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్గా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. -
సినిమా థియేటర్లకు గడ్డుకాలం
-
అడ్డగోలు దోపిడీ.. ప్రేక్షకులపై తిను‘బండ’రాలు
సాక్షి, అమరావతి బ్యూరో: వినోదం కోసం సినిమా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు అక్కడ విక్రయించే తినుబండారాల ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ థియేటర్, ఈ థియేటర్ అనే తేడా లేదు. థియేటర్ స్థాయి బట్టి ధరలు మోతమోగుతున్నాయి. సినిమా టికెట్టుకంటే స్నాక్స్, పాప్కార్న్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ధరలే అధికం. విజయవాడలో ఏసీ, నాన్ ఏసీ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్లు వెరసి 46 వరకు ఉన్నాయి. థియేటర్లలో అన్ని తరగతుల వారికి వారి స్థాయిని బట్టి టికెట్ల ధరలుంటాయి. సినిమా హాళ్ల క్యాంటీన్లలో విక్రయించే తినుబండారాలకు మాత్రం అలాంటి భేదం లేదు. చదవండి: Andhra Pradesh: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.134.95 కోట్లు ఏ క్లాస్కు వెళ్లిన వారి కైనా ఒకటే బాదుడు. ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులకు పది నిమిషాల పాటు విరామం ఉంటుంది. ఆ సమయంలో క్యాంటీన్లకు వచ్చి తినుబండారాలు, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ కొనుగోలు చేయడం రివాజు. కుటుంబ సమేతంగా వెళ్లిన వారు పిల్లలకు తినుబండారాలు కొనివ్వక తప్పదు. లేదంటే వారు మారం చేస్తారు. క్యాంటీన్లలో విక్రయించే ధరలు బయట దొరికే రేట్లకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఉదాహరణకు 200 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ ధర మార్కెట్లో రూ.14 (గాజు బాటిల్), రూ.20 (ప్లాస్టిక్ బాటిల్) ఉండగా థియేటర్లలో రూ.60 నుంచి 79 వరకు వసూలు చేస్తున్నారు. బయట రూ.30కి దొరికే 150 గ్రాముల పాప్కార్న్ రూ.180, రూ.20 విలువచేసే స్వీట్కార్న్ రూ.60, రూ.20కే దొరికే ఐస్క్రీంను రూ.50కి, రూ.20ల కేక్, పఫ్ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. బయట రూ.10లకే దొరికే టీ సినిమా హాళ్ల క్యాంటీన్లలో కొన్నిచోట్ల రూ.25, మల్టీప్లెక్స్ల్లో టీ, కాఫీ, లెమన్ టీలు ఏదైనా రూ.50 చొప్పున పిండుతున్నారు. సినిమా హాళ్ల క్యాంటీన్లలో నాలుగైదు రెట్ల అధికంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మరో విచిత్రమేమిటంటే.. థియేటర్లలో విక్రయించే కొన్ని తినుబండారాలపై ప్రత్యేక ఎమ్మార్పీలుంటాయి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ‘ఎమ్మార్పీకే విక్రయిస్తున్నాం’ అని క్యాంటీన్ల నిర్వాహకులు దబా యిస్తుంటారు. థియేటర్లలో ధరలు భరించలేని వారెవరైనా బయట నుంచి తినుబండారాలను తీసుకెళ్లడానికి అనుమతించరు. కనీసం మంచి నీళ్ల బాటిల్ను కూడా తీసుకెళ్లనీయరు. గేటు బయటే అలాంటి వాటిని తిరస్కరిస్తారు. విధి లేని పరిస్థితుల్లో ప్రేక్షకులు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. కుటుంబానికి రూ.వెయ్యి ఖర్చు నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం సినిమాకు వెళ్తే కనీసం రూ.వెయ్యి ఖర్చవుతోంది. మామూలు థియేటర్ టికెట్టు ధర రూ.100 ఉంటే నలుగురికి రూ.400 అవుతుంది. థియేటర్లో తినుబండారాలకు పొదుపుగా ఖర్చు చేస్తే మరో రూ.600 అయినా వెచ్చించక తప్పదు. ఇలా ఒక మధ్య తరగతి కుటుంబం సినిమాకి వెళ్లాలంటే రాను, పోను ఖర్చులు కాకుండా రూ.వెయ్యి భారం పడుతోంది. -
తెలంగాణ ప్రభుత్వంపై చిరంజీవి ప్రశంసలు
థియేటర్లలో సినిమా టికెట్ ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’అని చిరంజీవి ట్వీట్ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు.🙏🏻🙏🏻 సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. pic.twitter.com/w6VbRMtrG5 — Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021 -
ఏపీలో సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు
-
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లపై దాడులు
-
క్రిస్మస్కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!
కరోనా తగ్గుముఖం పట్టాక ఇండస్ట్రీ సినిమా రిలీజ్ల మీద దృష్టిపెట్టింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ వరకు కదిలి వస్తారని అఖండ, పుష్ప సినిమాలు నిరూపించడంతో చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దూకుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం పెద్దపెద్ద సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. అటు థియేటర్తో పాటు ఓటీటీలో కూడా పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. అవేంటో చూద్దాం.. క్రిస్మస్కు థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే! నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా గతంలో నాని నటించిన టక్ జగదీశ్ ఓటీటీలో విడుదల కావడంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ థియేటర్లోనే విడుదలవుతుండటంతో అతడి ఫ్యాన్స్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. టిమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్గా రూపొందిన ఈ చిత్ర రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ పోషిస్తుండగా దీపికా ఆయన భార్య రోమి భాటియాగా నటిస్తోంది. కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, దీపిక పదుకొనె, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూడు పుఠాణి’. పరుపాటి శ్రీనివాస్రెడ్డి, కటారి రమేష్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ థ్రిల్లర్ డిసెంబరు 25న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రఘు కుంచె ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుందని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాక్డోర్’. బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మాత. ప్రణవ్ స్వరాలందించారు. ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో.. చక్కటి సందేశమిస్తూ సినిమాని రూపొందించాం. పూర్ణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని నిర్మాత తెలియజేశారు. యాక్షన్ ప్రియులను విశేషంగా అలరించిన చిత్రం ‘ది మ్యాట్రిక్’. 1999లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ది మ్యాట్రిక్స్ రీలోడెడ్’, ‘ది మ్యాట్రిక్స్ రెవెల్యూషన్స్’ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత ఈ సిరీస్లో వస్తున్న చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రీసర్కషన్స్’ లానా వచౌస్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీనూ రీవ్స్, క్యారీ అన్నె మోస్లతో పాటు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తుస్తోంది. ఈ చిత్రంలో ఆమె సతి అనే సాహసోపేతమైన పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఆనంద్ చంద్ర తెరకెక్కించిన చిత్రం ‘ఆశ ఎన్కౌంటర్’. 2010లో యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్రేప్ను ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. హైదరాబాద్ నగరశివారులోని చటాన్పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను అతి క్రూరంగా హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్ చంద్ర ‘ఆశ ఎన్కౌంటర్’ తెరకెక్కించాడు. డిసెంబరు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్చే చిత్రాలు ఇవే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)'. తొలిసారిగా కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్', డిసెంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘వరుడు కావలెను’ నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అతరంగీ రే బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్, కోలీవుడ్ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘అతరంగీ రే’. సారా అలీఖాన్ కథానాయిక. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ ప్లస్ హాట్స్టార్’ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్కానుంది. ఇంద్రజాలికుడిగా అక్షయ్కుమార్, ప్రేమికులుగా ధనుష్, సారా అలీఖాన్ కనిపించనున్నారు. సత్యమేవ జయతే జాన్ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘సత్యమేవ జయతే’. దానికి కొనసాగింపుగా ‘సత్యమేవ జయతే 2’ వచ్చిన సంగతి తెలిసిందే. మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కుమార్ ఓ కీలక పాత్రలో నటించింది. యాక్షన్ సన్నివేశాలకు ఇందులో పెద్ద పీట వేశారు. కాగా, డిసెంబరు 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. పరంపర మూవీ సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా?లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? వంటి విషయాలకు సమాధానం కావాలంటే ‘పరంపర’ చూడాల్సిందే అంటున్నారు ‘బాహుబలి’ నిర్మాతలు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్ను నిర్మించారు. హరి యెల్లేటి కథను అందించారు. డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ‘పరంపర’ స్ట్రీమింగ్ కానుంది. మానాడు తమిళ నటుడు శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ‘లూప్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం లూప్ అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో పాత్రతోపాటు పోలీసు ఆఫీసర్ ‘డీసీపీ ధనుష్కోటి’ పాత్ర కూడా ఎంతో కీలకం. ఈ పాత్రను నటుడు, దర్శకుడు ఎస్.జె సూర్య పోషించారు. కాగా, ఇప్పుడు ఈ చిత్రం డిసెంబరు 24న ప్రముఖ ఓటీటీ సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. -
15 నిమిషాలు ఆలస్యంగా షో వేసిన థియేటర్కు రూ. లక్ష జరిమానా
Hyderabad Theatre Fined Rs 1 Lakh For Wasting Time On Advertisements: హైదరాబాద్లోని ఓ థియేటర్కు కంజ్యూమర్స్ ఫోరమ్ లక్ష రూపాయల జరిమాన విధించి షాకిచ్చింది. షో సమయానికి కంటే 15 నిమిషాలు ఆలస్యంగా సినిమా వేసి తన సమయాన్ని వృథా చేశారంటూ రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన వినియోగదారుల కోర్టు తాజాగా సదరు థియేటర్కు లక్ష రూపాయల జరిమాన విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి టికెట్పై ముద్రించిన సమయానికి సినిమా ప్రారంభించకుండా ప్రకటనలు వేసి 15 నిమిషాలు ఆలస్యంగా షో వేశారని ఆరోపిస్తూ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. చదవండి: షాకిస్తున్న అనసూయ లేటెస్ట్ లుక్, ఈ రేంజ్లో గ్లామర్ ఇచ్చిందా! ఈ క్రమంలో 15 నిమిషాలు తన సమయాన్ని వృథా చేసిన సదరు థియేటర్పై చర్యలు తీసుకోవాలంటూ కేసు నమోదు చేశాడు. అంతేగాక తనకు న్యాయం చేయాలంటూ అతడు విజ్ఞప్తి చేశాడు. విజయ్ తన ఫిర్యాదులో ‘2019 జాన్ 22న వచ్చిన గేమ్ ఓవర్ సినిమాను చూసేందుకు కాచిగూడ క్రాస్ రోడ్స్లోని ఓ థియేటర్లు వెళ్లినట్లు చెబుతూ ఆధారాలన్నిటీని సమర్పించాడు. టికెట్పై ముంద్రించిన సమయం ప్రకారం సినిమా సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కావాలి, కానీ సాయంత్రం 4:45 గంటలకు ప్రారంభించారని ఆరోపించాడు. చదవండి: ‘పుష్ప’ టీమ్కి భారీ షాక్, ఆందోళనలో దర్శక-నిర్మాతలు 15 నిమిషాలు ప్రకటనలు వేసి తన సమయం వృథా చేశారంటూ థియేటర్ మేనేజర్కు కూడా ఫిర్యాదు చేశానని, అయితే, ఆయన స్పందించలేదని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్కు చెప్పాడు. దీంతో ఈ కేసులో రెండో ప్రతివాదిగా లైసెన్సింగ్ అథారిటీ 'హైదరాబాద్ పోలీస్ కమిషనర్'ను చేర్చారు. అయితే, తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ చట్టం-1955 ప్రకారం పాత విధానం ప్రక్రారమే ప్రకటనలు వేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తమకు ఆర్టికల్ 19(1)(జీ), (ఏ) ప్రకారం ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. చదవండి: బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఓటీటీలోకి పుష్ప మూవీ అయితే, ఐనాక్స్ సంస్థ వాదనలను వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. చట్టం ప్రకారం కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉచిత ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. అంతేగాక, వాణిజ్య ప్రకటనలు వేయడం నిబంధనలకు విరుద్ధమని తీర్పు వెలువరించి, ఫిర్యాదుదారుడికి పరిహారంగా రూ. 5 వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ. 5 వేలు చెల్లించాలని తాజాగా తీర్పు ఇచ్చింది. అంతేగాక, లైసెన్సింగ్ అథారిటీ అయిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్కి పెనాల్టీ కింద లక్ష రూపాయలు జరిమాన చెల్లించాలని ఆదేశించింది. ఆ థియేటర్ నుంచి వచ్చే ఈ డబ్బును థియేటర్లలో భద్రతకు, విపత్తు నిధిగా వినియోగించాలని పోలీసులకు సూచించింది. -
ఫ్యాన్స్ ముసుగులో యథేచ్చగా బ్లాక్ మార్కెట్!!
నరసరావుపేట టౌన్: సగటు మానవుడి వినోదం సినిమా. అభిమాన హిరో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంటాడు. కుటుంబ సమేతంగా వెళ్లి చూద్దామనుకుంటాడు. కాని బెనిఫిట్ షో, అదనపు షోల పేరుతో ధరల దోపిడీ చేస్తుంటారు. సినిమా చూసే పరిస్థితి ఉండేది కాదు. ఇదీ ఒకప్పటి మాట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ ధరలకు కళ్లేం వేశారు. అయితే థియేటర్ నిర్వాహకులు శుక్రవారం అక్రమాలకు తెరదీశారు. థియేటర్ల వద్ద యథేచ్ఛగా బహిరంగా టికెట్లు అమ్మిస్తూ సొమ్ము చోటుచేసుకున్నారు. మూడు బ్లాక్ టికెట్లు.. ఆరు షోలు శుక్రవారం విడుదలైన యువ హిరో సినిమా నాలుగు షోలకు బదులు ఐదు షోలు వేశారు. టికెట్లన్ని ఆన్లైన్లో విక్రయించాల్సి ఉండగా టికెట్ రూ.300 నుంచి రూ.500 వరకు బ్లాక్లో విక్రయించారు. నిబంధలనకు విరుద్ధంగా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. అధిక ధరకు విక్రయిస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమాలు ప్రదర్శించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. థియేటర్లలో తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు టికెట్లు, తినుబండారాలు విక్రయించినట్టు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. –రమణానాయక్, తహసీల్దార్ ఫ్యాన్స్ ముసుగులో బ్లాక్ మార్కెట్ థియేటర్ల వద్ద యథేచ్ఛగా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. నిర్వాహకులను ప్రశ్నిస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లకు టికెట్లు విక్రయించినట్టుగా చెబుతున్నారు. అధిక ధరలపై అధికారులు దృష్టి సారించి బ్లాక్మార్కెట్ను అరికట్టాలి. –షేక్ ఫారూక్, ప్రేక్షకుడు జేబుకు చిల్లు ఫ్యామిలీతో సినిమాకు వెళితే రూ.2వేలు ఖర్చు అవుతోంది. అధిక ధరలకు టికెట్ కొనాల్సి వస్తుంది. దీంతో పాటు పాప్కార్న్, కూల్డ్రింక్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలు సినిమాకు వెళ్లాలి అంటేనే భయం వేస్తోంది. –షేక్గౌస్, ప్రేక్షకుడు చదవండి: గుజరాత్ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: వీళ్ల అరాచకాలు ఒక్కొక్కటిగా.. -
జేసీలను సంప్రదించాకే టికెట్ ధరల ఖరారు..
సాక్షి, అమరావతి: సినిమా థియేటర్ల యాజమాన్యాలకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. లైసెన్స్ జారీచేసే అధికారులైన జాయింట్ కలెక్టర్లకు ముందుగా తెలియజేసి, వారిని సంప్రదించాకే టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలని ఆదేశించింది. ఈ ధరల ఖరారు విషయంలో సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పాటు ప్రభుత్వాధికారులతో ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్నీ ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధుల్లో సినిమా టికెట్ ధరలను ఖరారుచేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీఓ–35తో సంబంధంలేకుండా, ఈ జీఓ జారీకి ముందున్న విధంగానే టికెట్ ధరలను ఖరారు చేసుకోవచ్చునంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై సీజే ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. చట్టప్రకారమే ధరలను నిర్ణయించాం ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఏపీ సినిమాటోగ్రఫీ చట్ట నిబంధనల ప్రకారమే టికెట్ ధరలను భౌగోళిక ప్రాంతాల వారీగా నిర్ణయించామన్నారు. థియేటర్ల యాజమాన్యాలు సౌకర్యాలతో నిమిత్తం లేకుండా నిర్ణయిస్తున్న ధరలకు కళ్లెంవేసి ప్రేక్షకులకు లబ్ధిచేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సినిమా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య కోర్టును లాగుతున్నారంటూ నవ్వుతూ వ్యాఖ్యానించింది. టికెట్ ధరలను పెంచి థియేటర్లు, పన్నులు వసూలుచేసుకుంటూ ప్రభుత్వం రెండూ సంతోషంగా ఉంటాయని.. కానీ, అంతిమంగా నష్టపోయేది మాత్రం ప్రేక్షకులేనని తెలిపింది. టికెట్ ధరలను పెంచడంవల్ల నష్టపోతామన్న విషయాన్ని యాజమాన్యాలు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పింది. తాము చేస్తున్నది కూడా ప్రేక్షకుల కోసమేనని.. వారు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఆన్లైన్ టికెట్ వ్యవస్థను కూడా తీసుకొచ్చామని ఏజీ వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. టికెట్ ధరలను అందరితో మాట్లాడి చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందులో సినిమా పరిశ్రమకు చెందిన వారిని కూడా భాగస్వాములను చేయాలని చెప్పింది. తాము ఏకపక్షంగా చేయబోమని.. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతుల ఆధారంగానే టికెట్ ధరల విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, అందుకే చట్ట ప్రకారం ధరలను నియంత్రిస్తున్నామని ఏజీ శ్రీరామ్ వివరించారు. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ధరలు థియేటర్ల యాజమాన్యాల తరఫు సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం టికెట్ ధరలను తాము నిర్ణయించుకునే వెసులుబాటు ఉందన్నారు. థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వాటిని నిర్ణయిస్తున్నామన్నారు. పంచాయతీల్లో టికెట్ ధరను రూ.5గా నిర్ణయించారని, ఈ రేటుకి కప్పు కాఫీ కూడా రావడంలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. టిక్కెట్ ధరల విషయంలో కొత్త కమిటీని ఏర్పాటుచేయాలని, అందులో సినిమా పరిశ్రమకు చెందిన వారు, ప్రభుత్వాధికారులు ఉండాలని సూచించింది. కొత్త కమిటీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటో చెప్పాలని ఏజీని కోరింది. విచారణను శుక్రవారానికే వాయిదా వేస్తామంది. అప్పటివరకు సింగిల్ జడ్జి ఉత్తర్వుల జోలికి వెళ్లబోమంది. భారీ రేట్లకు టికెట్ల విక్రయం ఏజీ స్పందిస్తూ.. కొత్త కమిటీ ఏర్పాటునకు అభ్యంతరంలేదని.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం టికెట్ ధరల ఖరారు విషయంలో థియేటర్ల యాజమాన్యాలు జాయింట్ కలెక్టర్లను సంప్రదించాలని, కానీ ఇప్పటివరకు ఏ థియేటర్ కూడా జాయింట్ కలెక్టర్లకు ధరలను తెలియజేయలేదన్నారు. ఈ వారంలో విడుదలవుతున్న ఓ పెద్ద సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.80 టికెట్ను రూ.140 నుంచి రూ.400 వరకు అమ్ముతున్నారని ఏజీ ధర్మాసనానికి వివరించారు. అలాగే, నాలుగు షోలకు బదులు 6 షోలు వేస్తున్నారని తెలిపారు. దీనిని ఖండిస్తూ.. నాలుగు షోలు మాత్రమే వేస్తున్నామని ఆదినారాయణరావు చెప్పారు. ఈ విషయాన్ని రికార్డ్ చేయాలని ఏజీ పట్టుబట్టారు. కమిటీ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని, అప్పటివరకు సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం నడుచుకునేలా థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించాలని ధర్మాసనాన్ని ఏజీ అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, జాయింట్ కలెక్టర్లకు తెలియజేసి, వారిని సంప్రదించాకే ధరలను ఖరారుచేసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించింది. -
సినిమా టికెట్ రేట్లపై కోర్టు ఉత్తర్వులను నిలిపేయండి
సాక్షి, అమరావతి: సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను ఖరారు చేస్తూ జారీ అయిన జీవోకు ముందు అమలులో ఉన్న రేట్ల ప్రకారమే సినిమా థియేటర్లను నిర్వహించుకోవచ్చంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ఎదుట బుధవారం అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయా లని కోరుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ విషయాన్ని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అప్పీల్పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీ అందుబాటులోకి రాలేదని, ఆ కాపీ దాఖలుకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. అత్యవసర విచారణకు అనుమతించిన ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
అఖండ సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్లో చెలరేగిన మంటలు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మునిసిపాలిటీలోని రవిశంకర్ థియేటర్లో అఖండ సినిమా ప్రదర్శన సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. సినిమా కొనసాగుతుండగా తెర వెనుక ఉన్న సౌండ్ సిస్టమ్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. -
తెలంగాణలో థియేటర్స్ మూసివేతపై మంత్రి తలసాని క్లారిటీ
కరోనా థర్డ్వేవ్ వచ్చిందని, ఇక సినిమా థియేటర్స్ మూసివేస్తారనే అసత్యాలను నమ్మొద్దని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ప్రజలు ధైర్యంగా థియేటర్స్కి వెళ్లి సినిమాలు చూడొచ్చని చెప్పారు. శుక్రవారం ఆయన టాలీవుడ్కి చెందిన నిర్మాతలు, దర్శకులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా దృష్ట్యా థియేటర్లపై ఆంక్షలు విధిస్తారనే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ‘కరోనా కారణంగా రెండేళ్లుగా సిని పరిశ్రమ ఇబ్బంది పడింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ వస్తుందనే భయాలు మొదలయ్యాయి. ప్రజలు భయాన్ని వదిలి ధైర్యంగా థియేటర్లకి వెళ్లి సినిమాలు చూడండి. అన్ని ఎదర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు వస్తున్నాయి. నిర్మాతతు ఇబ్బందులు పడొద్దు. కొన్ని సమస్యలతో పాటు టిక్కెట్ ధరల పెంపు అంశం పెండింగ్లో ఉంది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృష్టి చేస్తా’అని మంత్రి హామీ ఇచ్చారు. ఈ భేటీలో దిల్రాజు, డీవీవీ దానయ్య, చినబాబు, యేర్నేని నవీన్, రాజమౌళి, త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాలంలో ఓటీటీ మంత్రజాలం
సాక్షి, అమరావతి: అంతర్జాలంలో ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్ఫామ్ వినోదాన్ని పంచుతోంది. కోవిడ్ దెబ్బకు సినిమా థియేటర్లు మూతపడటం, టీవీ సీరియల్స్, షోలు నిలిచిపోవడంతో ఓటీటీ ఆన్లైన్ ట్రెండ్కు తెరలేచిన సంగతి తెలిసిందే. వెండి తెర, బుల్లి తెరను తలదన్నేలా పట్టునిలుపుకుంటున్న ఓటీటీ ఇప్పుడు సినిమా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ హవా కొనసాగిస్తోంది. ఓటీటీ ఫ్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్స్టార్తోపాటు తెలుగులో ప్రధానమైన ‘ఆహా’, జీ5 వంటి ఆన్లైన్ సైట్ల ద్వారా మొదలైన సినిమాల రిలీజ్ ఇప్పుడు వెబ్ సిరీస్, టాక్ షోల ట్రెండ్ను కొనసాగిస్తోంది. క్రైౖమ్, థ్రిల్లర్, సస్పెన్స్, సెంటిమెంట్, దేశభక్తి, సందేశం వంటి అంశాలే ప్రధానంగా వెబ్ సిరీస్, ప్రత్యేక కార్యక్రమాలకు ఆదరణ లభిస్తోంది. ఆన్లైన్ వీక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటంతో సినీ దర్శకులు, నటులదృష్టి ఇప్పుడు వెబ్ సిరీస్, టాక్ షోల వైపు మళ్లింది. సమయం.. నిడివి పరిమితి లేకుండా.. తక్కువ నిడివితో ఎక్కువ ఎపిసోడ్ల ద్వారా ఆకట్టుకునే సన్నివేశాలతో రూపొందిస్తున్న వెబ్ సిరీస్కు క్రేజ్ పెరిగింది. సినిమాలైతే తాము చెప్పదల్చుకున్న విషయాన్ని కేవలం 2.15 గంటల నుంచి 2.45 గంటల్లో కథను చిత్రీకరించాలి. అదే వెబ్ సిరీస్లో అయితే సమయం, నిడివి పరిమితి లేకపోవడంతో కథ, విషయాలను బట్టి ఎన్ని ఎపిసోడ్లు అయినా, ఎంత సమయమైన ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉంది. ఒక్కో సిరీస్ను ఐదు నుంచి 20 ఎపిసోడ్లుగా రూపొందిస్తున్నారు. ఈ సిరీస్లో ఒక్కో ఎపిసోడ్ 28 నిమిషాల నుంచి 42 నిమిషాలపాటు ఉండేలా చిత్రీకరిస్తున్నారు. ఈ మొత్తం సిరీస్ 7.30 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటాయి. దీనివల్ల టీవీ సీరియల్స్ మాదిరిగానే వెబ్ సిరీస్ను ప్రేక్షకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ చూడాలంటే అన్ని చూడొచ్చు. వెబ్ సిరీస్ వైపు.. సినీ దర్శకుల చూపు సినీ నిర్మాతలు, నటులు సైతం వెబ్ సిరీస్ వైపు మక్కువ చూపుతున్నారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్లో ప్రియమణి నటించడం గమనార్హం. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు చెందిన ఒక అధికారి అటు కుటుంబ బాధ్యతలు, ఇటు దేశ రక్షణలో సతమతమైన తీరును పది ఎపిసోడ్లలో అద్భుతంగా చిత్రీకరించారు. మరో పది ఎపిసోడ్లతో చిత్రీకరించిన ‘ది ప్యామిలీ మ్యాన్–2’లో ప్రియమణితోపాటు సమంత కూడా నటించింది. తాజాగా రిలీజ్ చేసిన ‘బ్రీత్ ఇంటూ ది షాడోస్’లో నిత్యామీనన్, ‘ది లస్ట్ స్టోరీస్’లో ఈషా రెబ్బ, ‘ముద్దపప్పు ఆవకాయ’లో నిహారిక కొణిదెల నటించారు. ‘నవరస’ టైటిల్తో తొమ్మిది మంది డైరెక్టర్లతో తొమ్మిది రసాలు ప్రతిబింబించేలా వెబ్ సిరీస్ తీస్తున్నట్టు సినీ దర్శకుడు మణిరత్నం ప్రకటించారు. శృతిహాసన్ ప్రధాన పాత్రగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన వెబ్ సిరీస్ విడుదల కావాల్సి ఉంది. ‘శతమానం భవతి’ సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న వెబ్ సిరీస్ తీయనున్నట్టు ప్రకటించారు. మణిరత్నం దర్శకత్వంలో శరత్కుమార్, వరలక్ష్మి(సర్కార్ ఫేం) నటించిన ‘అద్దం’ సిరీస్ ఓటీటీ ద్వారా విడుదలకు సిద్ధమైంది. ‘ఆహా’లో బాలయ్య ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కు చెందిన ‘ఆహా’ ఓటీటీ మీడియా సర్వీసెస్లో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ‘ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ పేరుతో వెబ్ సిరీస్గా ప్రముఖుల ఇంటర్వ్యూలను నవంబర్ 4 నుంచి ప్రసారం చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. వెండితెర, బుల్లితెరకు దీటుగా ఆదరణ చూరగొంటున్న ఓటీటీ ప్లాట్ఫామ్లోకి మరింత మంది సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు క్యూ కట్టేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. ఓటీటీ అంటే.. ఓటీటీ (ఓవర్ ది టాప్) మీడియా సర్వీస్ అంతర్జాలం (ఇంటర్నెట్)పై ఆధారపడి పనిచేస్తుంది. దీనినే డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సర్వీస్ అని కూడా పిలుస్తారు. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ కార్యక్రమాలు, సెలబ్రిటీ షోలు ప్రసారం చేస్తారు. ఓటీటీలో వినియోగదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ కార్యక్రమం కావాలంటే అది చూడొచ్చు. కేబుల్ టీవీ, డీటీహెచ్ కనెక్షన్ అవసరం లేకుండా ఇంటర్నెట్ ఉపయోగించుకుని సెల్ఫోన్, ల్యాప్టాప్, టాబ్, టీవీల్లోనూ ఈ కార్యక్రమాలు చూడొచ్చు. ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో సగటున 39 నుంచి 45 శాతం మంది ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోలు వీక్షిస్తున్నట్టు అంచనా. వెబ్ సిరీస్లో వెగటు సన్నివేశాలు సినిమాలపై ఉన్న సెన్సార్ కత్తెర వెబ్ సిరీస్కు లేకపోవడంతో వెగటు పుట్టించే సన్నివేశాలు కూడా రూపొందించడం గమనార్హం. సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు, కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులను కించపరిచే సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగిస్తుంది. వెబ్ సిరీస్పై అటువంటి ఆంక్షలు లేకపోవడంతో క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ పేరుతో అశ్లీల సన్నివేశాలు, అసభ్య పదజాలం యథాతథంగా చూపిస్తుండటం శోచనీయం. -
థియేటర్స్ Vs హోమ్ థియేటర్స్
Theatre Vs Home Theater : ఓ వైపు మల్టీప్లెక్సీల్లో టికెట్లు అధిక ధరలు..పార్కింగ్ ఫీజుల నుంచి పాప్కార్న్, కేక్లు, పఫ్, కూల్డ్రింక్ ధరలతో సామాన్య ప్రేక్షకుడు థియేటర్స్కు వెళ్ళేందుకు ధైర్యం చేయడం లేదు. ఓ చిన్న కుటుంబం తమ పిల్లలతో కలిసి సరదాగా సినిమా చూద్దామంటే రూ.1500 నుంచి రూ.2,000 ఖర్చు అయ్యే పరిస్దితి ఏర్పడింది. ఇదే క్రమంలో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లెక్స్, హాట్స్టార్, వూట్ తదితర ఓవర్ ది టాప్ వీడియో కంటెంట్ ప్రొవైడర్లు కొత్త సినిమాలను నట్టింట్లోకి తెచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్స్ వర్సస్ హోమ్ థియేటర్స్ అనే పరిస్థితి ఏర్పడింది. యావరేజ్ అంటే కుదరదు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 60 మూవీ థియేటర్లు ఉన్నాయి. నగరంలో మొత్తం పెద్ద థియేటర్లు 14 ఉండగా మల్టీప్లెక్స్లకు సంబంధించి ఎస్2లో మూడు స్క్రీన్లు, ది సినిమాలో ఐదు స్క్రీన్లు, రెయిన్ థియేటర్స్లో మూడు స్క్రీన్ లీలామహల్, సిరి థియేటర్లో రెండు స్క్రీన్లు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు, కంటెంట్ బాగున్న చిత్రాలు, కాంబినేషన్ వర్కవుట్ అయ్యే సినిమాలు రిలీజైనప్పుడు థియేటర్లు కళకళాడుతున్నాయి. గతంలోలా యావరేజ్, బిలో యావరేజ్ చిత్రాలు వస్తే ప్రేక్షకుడు థియేటర్ వైపు కన్నెత్తి చూడటం లేదు. వాళ్లు సేఫ్.. వీళ్లు డౌట్ సినిమా విడుదల కాకముందే నిర్మాతలు చిత్రాన్ని పంపిణీ దారులకు అమ్మేస్తున్నారు. అంతేకాదు ఓటీటీ రైట్స్ కింద అమెజాన్, హాట్స్టార్, జీమూవీస్, సన్నెట్వర్క్ స్క్రీమింగ్లకు విక్రయిస్తున్నారు. చిత్రం విడుదలయ్యాక 20 రోజుల నుంచి 30 రోజుల్లో ఆ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లపైకి వచ్చేలా అగ్రిమెంట్ చేసుకుంటారు. అయితే నిర్మాతల నుంచి కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్ పరిస్దితి మాత్రం దయనీయంగా ఉంటుంది. సినిమా విడుదలైన మూడు నుంచి నాలుగు వారాల్లోపే థియేటర్స్ నుంచి రెవిన్యూ వస్తోంది. గతంలో 100రోజులు 150రోజులు ధియేటర్స్లో సినిమా ప్రదర్శనలు జగరడం లేదు. సినిమా టాక్ బాగుంటేనే పెట్టిన పెట్టుబడి వచ్చేది. లేదంటే అంతే సంగతులు, దీనికి తోడు పైరసీ బెడద ఉండనే ఉంది. 30 రోజుల్లోనే కొత్త సినిమా విడుదలైన 20 నుంచి 30 రోజుల్లోనే కొత్త సినిమాలను చూసే అవకాశం నెట్ఫ్లెక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్స్టార్, జీమూవీస్, సన్నెక్ట్స్, వూట్ తదితర ఓటీటీ స్ట్రీమింగ్ వెబ్సైట్లు, యాప్ల ద్వారా అవకాశం లభిస్తోంది. ఈ ఓటీటీ కంపెనీలు నెలరోజులు, ఏడాది ప్యాకేజీల వంతున ప్రేక్షకులకు చందాదారులగా చేర్చుకుంటున్నాయి. ఒక సినిమాని థియేటర్కి వెళ్లి కుటుంబ సమేతంగా చూసే ఖర్చుతో అత్యంత ఖరీదైన పాపులర్ ఓటీటీకి సంవత్సర చందా కట్టేయ్యోచ్చు. కొత్త సినిమాలతో పాటు వందలాది ఇతర భాషా చిత్రాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఓటీటీకి తోడు ఇంటర్నెట్ కనెక్షన్ తప్ప మరో భారం ఉండనే ఉండదు. అమెజాన్ స్టిక్తో... ఇటీవల ప్రతీ ఇంటిలో ఎల్సీడీ, ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు ఉంటున్నాయి. కొన్ని టీవీ కంపెనీలు నెట్ఫ్లెక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్స్టార్, జీమూవీస్, సన్నెక్ట్స్, వూట్ తదితర యాప్లను ప్రీ ఇన్స్టాల్గా అందిస్తున్నాయి. ప్రీ ఇన్స్టాల్ లేని వాళ్లకు ఫైర్స్టిక్ పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని అందిస్తోంది. ప్లగ్ అండ్ ప్లే తరహాలో ఫైర్ స్టిక్తో సినిమాలు చూసేయొచ్చు. టీవీతో కూడా పోటీ అమేజాన్ ప్రైమ్. నెట్ఫ్లెక్స్, హాట్స్టార్ తదితర ఓటీటీలలో సినిమా కంటెంట్ తో పాటు ఒరిజనల్ కంటెంట్ కూడా లభిస్తుంది. వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలు, సినిమాలను ఈ ఓటీటీలే నిర్మించి నేరుగా ప్రేక్షకులకు అందిస్తున్నాయి. మరోవైపు జీ , సోనీ, స్టార్ చానల్స్, సన్నెట్వర్క్ వంటి టీవీ ఛానల్స్కి అనుబంధంగా ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్లో టీవీలో కంటే ముందే సీరియల్స్ని ఓటీటీలో అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో ఓటీటీటీ ఛానల్స్ సినిమా థియేటర్లకే కాదు టీవీ ఛానల్స్కి సైతం పోటీగా మారాయి. చదవండి : నెట్ఫ్లిక్స్పై ప్రశంసలను కురిపించిన అమెజాన్ అధినేత..! యూజర్లు షాక్..! -
సినీ నిర్మాత వినతిపై నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జారీ చేసిన జీవో–35 అమలు కోరుతూ సినీ నిర్మాత నట్టి కుమార్ ఇచ్చిన వినతి పత్రంపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీ సినిమాస్ రెగ్యులేషన్స్ చట్టం 1995లోని సెక్షన్ 9, 10, 11లను అనుసరించి ఆయన వినతిపై నిర్ణయం తీసుకోవాలంది. న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. మునిసిపాలిటీలు, నగరాలు, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ పరిధుల్లోని థియేటర్లలో టికెట్ల రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న జీవో 35 జారీ చేసింది. అయితే, జీవోకు విరుద్ధంగా సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తున్నారని, ఇదే రీతిలో విశాఖపట్నంలోని శ్రీలక్ష్మి థియేటర్ యాజమాన్యం అధిక ధరకు టికెట్లు అమ్ముతోందంటూ నట్టి కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 35 అమలు కోసం తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు.