mock assembly
-
ఓయూలో సీఎంగా వ్యవహరించిన ఈటల రాజేందర్
సాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ: ఇటీవల హుజూరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓయూలో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన మాక్ అసెంబ్లీలో ఆయన సీఎం సీట్లో ఆసీనులై ఆదేశాలిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘భవిష్యత్తు తెలంగాణ వేదిక’ ఆధ్వర్యంలో ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రం ఆడిటోరియంలో ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించగా.. ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి సెషన్ను ప్రారంభించారు. గవర్నర్గా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నాయకులు పేరాల శేఖర్రావు వ్యవహరించారు. చదవండి: ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగమే దృఢమైన పునాది ముఖ్యమంత్రి హోదాలో ఈటల మాట్లాడుతూ మన రాజ్యాంగం సామాన్యులకు సైతం కల్పిస్తున్న అవకాశాలను వివరించారు. ఇటీవలి హుజూరాబాద్ ఎన్నికల్లో తన ఓటమికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు తనకు ఓటు వేసి ధర్మాన్ని గెలిపించారని చెప్పారు. మాక్ అసెంబ్లీ స్పీకర్లుగా ఎర్రబెల్లి రజినీకాంత్, సాయికృష్ణారావు, దేవికారెడ్డిని ఎన్నుకోగా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, రాణిరుద్రమ దేవి పాల్గొన్నారు. చదవండి: యాదాద్రి గోపురానికి 2 కిలోల బంగారం విరాళం -
‘టీడీపీ మాక్ అసెంబ్లీలో మహా నటులు కన్పిస్తున్నారు’
సాక్షి, అమరావతి: టీడీపీ నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీని చూస్తుంటే సురభి డ్రామా కంపెనీ గుర్తొస్తుందని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. టీడీపీ నిర్వహించే మాక్ అసెంబ్లీలో మహా నటులు కన్పిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎస్వీఆర్, నాగభూషణం, సావిత్రి వంటి నటులు మాక్ అసెంబ్లీలో కన్పిస్తున్నారని సెటైర్లు వేశారు. టీడీపీ మాక్ అసెంబ్లీని చూసి తమకు వినోదాన్ని పంచేందుకు మరో డ్రామా కంపెనీ వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్లల్లో తప్పులుంటే టీకా ఉత్పత్తి కంపెనీలు చెప్పాలి. కానీ చంద్రబాబు, లోకేష్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని మండిపడ్డారు. టీకా ఉత్పత్తి కంపెనీల్లో చంద్రబాబుకు ఏమన్నా వాటాలున్నాయా అని ప్రశ్నించారు. గ్లోబల్ టెండర్లల్లో పాల్గొనేందుకు టీకా కంపెనీలు సిద్దంగా ఉంటే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేమిటని నిలదీశారు. బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశామని, సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి మరీ ప్రజలకు సంక్షేమం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తొలిసారి జెండర్ బడ్జెట్, పిల్లల బడ్జెట్, మైనార్టీల బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఎస్సీ, బీసీ సబ్ ప్లాన్ తరహాలో జెండర్, పిల్లలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాం. కాపు నేస్తం పథకాన్ని చెప్పిన దానికంటే మిన్నగా అమలు చేస్తున్నాం. అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బంది లేకుండా ఆహార భద్రత కల్పిస్తున్నాం. చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మేం తీరుస్తున్నాం. రూ. 31 వేల కోట్లతో ఆస్తుల కల్పనకు నిర్ణయించాం’ అని మంత్రి తెలిపారు. చదవండి: సీఎం జగన్ అప్యాయంగా పలకరించారు: మండలి చైర్మన్ -
ఓగా బీఈడీ కళాశాలలో మాక్ అసెంబ్లీ
పరిగి : చట్టాలు, అమలు చేసే విధానంపై మండల పరిధిలోని విద్యారణ్యపురిలోని ఓగా బీఈడీ కళాశాలలో విద్యార్థుల చేత మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులే స్పీకర్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలుగా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటు సవాళ్లు, సమస్యలు చర్చించారు. మన రాష్ట్రానికి ఏయే అవసరాలున్నాయనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ఈ మాక్ అసెంబ్లీ నిర్వహణ ద్వారా రాష్ట్రంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు, ప్రజాప్రతినిధులు పోషించే పాత్రను తెలుసుకుంటారన్నారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం మహబూబ్ అలి, బాల్రెడ్డి, వినోద్కుమార్, బసవరాజ్, జహంగీర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.