-
Hyderabad: పబ్లో మైనర్లతో పార్టీ నిర్వహణ.. బడా నేత ప్రమేయం!
సాక్షి, హైదరాబాద్: వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. విమర్శలు వెల్లువెత్తుతున్నా.. హైదరాబాద్లో పబ్ల తీరు మారడం లేదు. తాజాగా.. జూహ్లీహిల్స్ అమ్నీషియా పబ్ తరహాలో ఓ పబ్లో మైనర్ల పార్టీ నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఓ పబ్లో రెండ్రోజుల పాటు మైనర్ల పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. సైబర్ హవర్స్ వాల్యూమ్-11 పేరుతో ఈవెంట్ను నిర్వహించారు. మైనర్ల పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతి నిరాకరించింది. అయితే ఒక బడా నేత ప్రమేయంతో మైనర్ల పార్టీ ఎరేంజ్ చేసినట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ల పార్టీకి కొందరు ఆహ్వానాలు పంపించారు. ఇక నిర్వాహకులేమో పబ్లో మద్యం సరఫరా చేయలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు తెలియాల్సి ఉంది. -
ప్రేమ పేరుతో రూ.11 లక్షలు కాజేశాడు
యలమంచిలి రూరల్ : పెళ్లి పేరిట మైనర్ యువతిని మోసం చేసిన యువకుడిపై యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెదపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక మోసపోయిందని తండ్రి యలమంచిలి రూరల్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సన్నిబాబు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. యలమంచిలి మండలం పెదపల్లి గ్రామానికి చెందిన మైనర్ యవతిని (16)ను కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన బొద్దపు నానాజీ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె నుంచి దశలవారీగా రూ.11 లక్షల కాజేసాడు. ఇంటిలో పెట్టిన డబ్బు కనిపించకపోవడంతో తండ్రి కూతురిని ప్రశ్నించగా విషయం బయట పడింది. దీంతో తండ్రి రూరల్ పోలీసులను ఆశ్రయించి యలమంచిలి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు నానాజీతో కలిసి అతని పిన్నమ్మ కరణం వెంకట లక్ష్మి, తల్లి బొద్దపు పాప, చెల్లి లల్లీలు కూడా తమ కుమార్తెను ఏమార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోల్ యలమంచిలి రూరల్ స్టేషన్కు వచ్చి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన సూచన మేరకు పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు. మొదట రూ.2 లక్షల వరకు ఫోన్ పే ద్వారా.. తర్వాత రూ.6 లక్షలు నేరుగా నగదు రూపంలో ఇచ్చినట్లు, మిగిలిన డబ్బు దశలవారీగా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. నలుగురిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. (చదవండి: నమ్మించి.. రియల్టర్ కిడ్నాప్) -
జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో మరో మలుపు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లో మైనర్పై అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా బాలిక అత్యాచారం కేసులో మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఓ ఎంఐఎం కార్పొరేటర్ని పోలీసులు విచారించనున్నారు. సదరు కార్పొరేటర్ని విచారణకు రావాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్ మాజీ మేయర్గా ఆ కార్పొరేటర్ సేవలందించారు. ఈ కేసులో నిందితులకు సహకారం చేశాడని కార్పొరేటర్పై పలు ఆరోపణలు వచ్చాయి. కారులో మొయినాబాద్ వరుకు కార్పొరేటర్ వెళ్లినట్టు, నిందితులకు సహకరించినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. చదవండి: ఉత్తర ప్రదేశ్లో అమానుషం.. కస్టడీలో ఉన్న వ్యక్తికి కరెంట్ షాక్, లాఠీ దెబ్బలు -
పోక్సో చట్టం కింద పూజారికి పదేళ్ల జైలు
విశాఖ లీగల్: బాలికను మోసగించి మాయమాటలతో వివాహం చేసుకుని లైంగికదాడికి పాల్పడిన యువకుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నగరంలోని పొక్సో నేరాల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. జైలుశిక్షతోపాటు రూ.20వేల జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో అదనంగా ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆ తీర్పులో స్పష్టం చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పుల్లకందం సతీష్కుమార్ విజయనగరం జిల్లా జియ్యమ్మవలసకు చెందినవాడు. వృత్తిరీత్యా హైదరాబాద్లో పూజారి. బాధిత బాలిక విశాఖలోని గాజువాక నియోజకవర్గ పరిధి పెదగంట్యాడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదివేది. ఈ నేపథ్యంలో 2015 ఏప్రిల్ 30న బాలిక తమ బంధువుల ఇంట్లో వివాహానికి విజయనగరం వెళ్లింది. పెళ్లిలో సతీష్కుమార్ బాలికను చూశాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. బాలిక విజయనగరంలోని సతీష్ ఇంటికి వెళ్లగా ఇద్దరూ గుడిలో సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం అన్నవరంలో కొన్ని రోజులు గడిపారు. ఈ క్రమంలో తమ కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తల్లి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తగిన సమాచారంతో సతీష్ని, బాధితురాలిని పట్టుకున్నారు. అనంతరం వివాహానికి సహకరించిన సతీష్ తల్లి పుల్లకందం గిరిజ, సోదరుడు పుల్లకందం సంతోష్కుమార్పై కూడా కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో లైంగికదాడికి సహకరించిన వారిద్దరికీ ఐపీసీ సెక్షన్ 366 కింద ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20వేలు చొప్పున జరిమానా విధించారు. సతీష్, అతని సోదరుడు, తల్లిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. (చదవండి: భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం) -
మైనర్ పై సాముహిక అత్యాచారం... ఫిర్యాదు చేసిందనే కోపంతో తోటి విద్యార్థులే...
పాట్నా: రాను రాను మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాల జరగడం అనేది సర్వసాధారణంగా అయిపోతుందేమో. ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా పరిస్థితి నానాటకీ దిగజారిపోతుందే గానీ చక్కబడుతుందనే ఆశ కానరావడం లేదు. ప్రతి నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు గురించే వింటున్నాం. చదువుకున్నవాళ్లు సైతం కామంధులై అత్యంత దారుణాలకి ఒడిగడుతున్నారు. అచ్చం అలానే బీహార్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బీహార్లోని జాముయ్లో ఒక మైనర్ కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తుండగా ఆమె పై ఐదుగురు విద్యార్థులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఐదుగురు అదే కోచింగ్ సెంటర్ విద్యార్థులు. ఐతే ఆ బాలిక గతంలో తనతో ఒక అబ్బాయి అసభ్యంగా ప్రవర్తించాడంటూ కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఆమె పై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ మైనర్ తల్లిదండ్రులు కోచింగ్ నిర్వాహకులు ఇకపై మీ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇవ్వడంతోనే కోచింగ్ సెంటర్ పంపామని పోలీసులకు చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అత్యాచారం చేశారని ఫిర్యాదు కోసం వస్తే.. స్టేషన్లో పోలీసులు..) -
మైనర్పై 59 ఏళ వ్యక్తి అఘాయిత్యం
శివాజీనగర: సీఎం సొంతూరిలో దారుణం జరిగింది. 59 ఏళ్ల వ్యక్తి 11 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన హావేరి శిగ్గాంవి తాలూకా బంకాపుర వద్ద జరిగింది. నిందితుడు నాగప్ప బాడదను బంకాపుర పోలీసులు మంగళవారం పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈతకు వెళ్లి ఇద్దరు బాలికల మృతి రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా మీర్జాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇందు (14), సుజాత (13) సోమవారం సాయంత్రం రాజోలుబండ కాలువలో ఈతకు దిగి నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈత రాకపోవడంతోనే నీట మునిగిపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం గ్రామీణ ఎమ్మెల్యే బసవనగౌడ మృతుల కుటుంబాలను పరామర్శించి రూ. 20 వేలు పరిహారం అందించారు. (చదవండి: కన్నతండ్రి అఘాయిత్యం.. అపరకాళిగా మారిన తల్లి) -
బాలికపై సాముహిక అత్యాచారం... ఆపై వీడియో తీసి...
సాక్షి, బెంగళూరు: మహిళలు, బాలికల భద్రతకై ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నెన్ని చట్టాలు తీసుకువస్తున్నప్పటకీ ఈ అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. మైనర్లు, చిన్నపిల్లలు అని చూడకుండా వారిపై అఘాయిత్యాలకు పాల్పడటమే కాకుండా వీడియోలు తీసి బెదిరించడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....బెంగళూరులో 16 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ ఘటనను వీడియో తీసి తన స్నేహితులకు షేర్చేశాడు. అంతేకాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని బెదిరిస్తూ తన ఏడుగురు స్నేహితులతో కలిసి ఆ బాలిక పై మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని యలహంకలో చోటుచేసుకుంది. అయితే బాధితురాలు ఆ నిందితుడి ఆగడాలు భరించలేక ఏడుస్తూ ఇంటికి రావడంతో.. తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పమని ఆమెను బలవంతం చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మరొక నిందుతుడి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: పరీక్షలు రాయాలి.. బెయిల్ వచ్చిందని తెలియక విచారణ ఖైదీ ఆత్మహత్య) -
స్కూల్కి వెళ్తున్న మైనర్ను ఫాలో చేసి.. టాయిలెట్స్లోకి లాకెళ్లి..
సాక్షి, ముంబై: దేశంలో మైనర్లు, మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాలు వారిని వేధింపులకు గురి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. లైంగిక దాడులు, వేధింపులను ఆపేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా కొందరి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్కూల్లోని టాయిలెట్స్లోకి లాక్కెళ్లి మైనర్(11)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శివాజీనగర్ ప్రాంతంలోని ఓ ఉన్నత పాఠశాలలో మైనర్(11) చదువుకుంటోంది. ప్రతీ రోజు స్కూల్కు వెళ్లినట్టుగానే పాఠశాలకు వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆమెను ఫాలో చేశాడు. స్కూల్ దగ్గరకి చేరుకోగానే ఆమెతో గొడవకు దిగి.. బలవంతంగా మైనర్ను టాయిలెట్స్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమెను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిన బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఈ క్రమంలో బాలిక తల్లి వెంటనే శివాజీనగర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. -
పోలీసు ఓవరాక్షన్.. విద్యార్థిని మెడపై మోకాలితో నొక్కి, చేతులను కట్టి..
వాషింగ్టన్: సెక్యూరిటీగా పని చేసే ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆమె మెడపై మెకాలును నొక్కి పెట్టి మైనర్ను హింసించాడు. ఈ దారుణ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. విస్కాన్సిన్లోని కెనోషా పాఠశాలలో మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో విద్యార్థిని(12) మరో బాలుడితో గొడవ పడుతోంది. అది చూసిన ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి షాన్ గుట్షో అక్కడికి వెళ్లాడు. గొడవలో ఆమె ఆపే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆమె సదరు పోలీసులను వెనక్కి నెట్టి వేసింది. తిరిగి లేచిన అతడు విద్యార్థిని అడ్డుకున్నాడు. ఆ సమయంలో ఆమె ఆవేశంతో ఊగిపోతుండగా.. విద్యార్థిని నియంత్రించే క్రమంలో షాన్ గుట్షో దురుసుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని స్కూల్ యాజమాన్యం విడుదల చేసింది. విద్యార్థిని కింద పడేసి ఆమె కదలకుండా చేతులు కట్టేసి, ఆమె మెడపై మోకాలితో నొక్కి పెట్టి నియంత్రించాడు. దాదాపు అర నిమిషంపాటు ఇలా మోకాలు ఉంచటంతో విద్యార్థిని గాయపడింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి గుట్షోపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాలిక తండ్రి స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ దాడి కారణంగా తన కూతురికి గాయాలు అయ్యాయని పేర్కొన్నాడు. కాగా, ఈ ఘటన తర్వాత అతడు తన సెక్యూరిటీ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. -
మైనర్పై ఐదేళ్లుగా కుటుంబ సభ్యుల లైంగిక వేధింపులు.. తండ్రితో సహా..
సాక్షి, ముంబై: దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాలు వావివరుసలు మరచి చిన్నారులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కన్న కూతురిపైనే తండ్రి, ఇంటి సభ్యులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు(11) కుటుంబం బీహార్ నుంచి మహారాష్ట్రలోని పుణెకు వలస వచ్చింది. సదరు మైనర్ తాను చదువుతున్న పాఠశాలలో జరిగిన గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనే కార్యక్రమంలో తన గోడును వెల్లడించింది. తాను ఐదేళ్లుగా కన్న తండ్రి, ఇంటి సభ్యులతో లైంగికంగా వేధించబడుతున్నట్టు తెలిపింది. 2017 నుంచి తండ్రి లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా.. తండ్రి, సోదరుడు వేరు వేరు సందర్భాల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 2020లో ఆమె సోదరుడు బాధితురాలిపై లైంగిక దాడి చేయగా.. తాత, మామ కూడా మైనర్ను లైంగికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇది సామూహిక లైంగిక దాడి కాదని, మైనర్పై లైంగిక దాడులన్నీ వేర్వేరు సందర్బాల్లో జరిగాయని ఎస్సై అశ్విని సాత్పుతె పేర్కొన్నారు. ఈ క్రమంలో మైనర్ కుటుంబ సభ్యులపై పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. -
ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చిన మైనర్ కూతురు
-
ఆకతాయిల వేధింపులు.. సిగరెట్ తాగమని చెట్టుకు కట్టేసి..
బెంగళూరు(కర్ణాటక): చిన్న పిల్లలపై కొందరు అల్లరి మూకలు అమానుషంగా ప్రవర్తించారు. సిగరెట్ తాగాలని బలవంతం చేశారు. అంతటితో ఆగకుండా.. పాఠశాల ఆవరణలోనే చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆధ్వర్యంలో నడుపుతున్న పాఠశాలలో 10-13 సంవత్సరాల మధ్య వయస్సు గల కొంతమంది విద్యార్థులను క్యాంపస్లో ప్రవేశించిన ఆరుగురు సభ్యుల ముఠా తరచుగా బెదిరింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో గత శనివారం కూడా.. చిన్న పిల్లలను పట్టుకుని సిగరెట్ తాగాలని వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా పాఠశాల సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లి సిగరెట్లు తేవాలని చిన్న పిల్లలను బెదిరించారు. కాగా, నిందితులు... సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు.. పాఠశాలకు సమీపంలోని గ్రామానికి చెందిన వారు కావడంతో యాజమాన్యం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిందితులు పలుమార్లు ఉపాధ్యాయులను కూడా బెదిరించారని స్థానికులు తెలిపారు. కాగా, ఈ క్రమంలో కొంత మంది స్థానికులు.. పిల్లలను చెట్టుకు కట్టేసి కొడుతున్న క్లిప్పింగ్లను స్థానిక కార్పోరేటర్కు పంపించారు. కార్పోరేటర్.. పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక పోలీసులు ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారిలో ఐదుగురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని జువైనల్ హోమ్కు తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్న పిల్లల తల్లిదండ్రులు పోలీసులను కోరారు. కాగా, దీనిపై స్పందించిన డీసీపీ దేవరాజ్ మాట్లాడుతూ.. గ్రామంలో, పాఠశాల పరిసరాలలో అసాంఘిక చర్యలు జరగకుండా పెట్రోలింగ్ గస్తీని పెంచుతామన్నారు. చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య.. -
తమతో పాటు ఆశ్లీల చిత్రాలు చూడలేదని.. బాలికను కిరాతకంగా రాళ్లతో కొట్టి..
గువాహటి: అశ్లీల వీడియోలు చూసేందుకు అలవాటుపడ్డ ముగ్గురు చిన్నారులు తమతో కలిసి వాటిని చూసేందుకు నిరాకరించిందని ఆరేళ్ల బాలికను అమానుషంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన అస్సాంలోని నాగావ్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన ఆ ప్రాంతంలో ఎన్నో కుటుంబాలకు ఓ హెచ్చరికలా మారింది. నిందితుల్లో ఇద్దరి వయసు 11 ఏళ్లు ఉండగా, మరొకరి వయసు 8 ఏళ్లే. జిల్లాలోని కలియాబోర్ ప్రాంతంలోని ఓ క్వారీ వద్ద టాయిలెట్లో బాలిక మృతదేహం బయటపడటంతో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు యువకులు బాధితురాలి ఇంటి సమీపంలో నివసించేవారు. వారు గత కొంత కాలం మొబైల్లో అశ్లీల వీడియోలు చూస్తూ వాటికి బానిసగా మారారు. మంగళవారం కూడా అశ్లీల వీడియోలను చూస్తూ బాధితురాలిని ఏదో పని ఉందని చెప్పి క్వారీ వద్దకు రప్పించారు. అక్కడ వారు ఆ క్లిప్లను తనని చూడాలని బలవంతం చేశారు. అందుకు ఆ బాలిక నిరాకరించడంతో కోపంతో ఆ ముగ్గురు ఆమెను రాళ్లతో కొట్టి కిరాతకంగా చంపారు. బాలిక మృతదేహం బయటపడటంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించినందుకు నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా అరెస్టు చేశారు. ఆ ముగ్గురు యువకులు బాధితురాలిపై లైంగిక వేధింపులకు ప్రయత్నించారన్న అనుమానం, దీనిపై ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. ముగ్గురు బాలల్లో ఒకరు ఆన్లైన్ తరగతుల కోసం అతని తండ్రి నుంచి స్మార్ట్ఫోను తీసుకుని మిగతా ఇద్దరితో కలిసి అందులో నీలిచిత్రాలు చూడటం మొదలెట్టి వాటికి బానిసగా మారారని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. చదవండి: బాలికతో క్రికెట్ కోచ్ అసభ్యకర ప్రవర్తన..భుజాలు, ఇతర భాగాలను తాకుతూ.. -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
నాగ్పూర్: ఎన్ని చట్టాలు తీసుకువస్తున్న మహిళలపై సామూహిక అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ భారతదేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే నాగ్పూర్లో చోటు చేసుకుంది. ఈ మేరకు నాగపూర్లోని మాదవ్ నగరి ప్రాంతానిక చెందిన ఒక మైనర్ బాలిక్ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి రాత్రి 8 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తుండగా నలుగురు యువకులు వచ్చి వారిపై దాడి చేశారు. (చదవండి: "అనుకోని అరుదైన వ్యాధి జీవితాన్నే మార్చేసింది") ఈ క్రమంలో ఆ యువకులు ఆ బాలుడుని కొట్టి ఆ అమ్మాయిని ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు ఒక నిందుతుడిని అరెస్ట్ చేయగా మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. అయితే థానేలోని డోంబివ్లి, సకినాకాలో జరిగిన వరుస అత్యాచార ఘటనలన మరువక మునుపే మరి కొద్ది రోజులకే మళ్లీ ఇలాంటి ఘటనే చోటు చేసుకోవటం అత్యంత బాధాకరం. (చదవండి: వరద ఉధృతిని నేరుగా వీక్షిస్తూ ఆస్వాదించచ్చు!) -
మైనర్పై అత్యాచారం: 9 రోజుల్లో తీర్పు.. 20 ఏళ్ల శిక్ష
జైపూర్: మైనర్పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి రాజస్తాన్లోని ప్రత్యేక పోక్సో కోర్టు కేవలం 9 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్ష విధించింది. 9 ఏళ్ల బాలికపై కమలేశ్ మీనా (25) సెప్టెంబర్ 26న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించిన పోలీసులు ఘటన తర్వాతి ఉదయమే నిందితున్ని అరెస్టు చేశారు. అనంతరం కేవలం 18 గంటల్లోనే కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీటు దాఖ లు చేశారు. చలాన్ నమోదైన అయిదు పని దినాల్లో జైపూర్ మెట్రోపాలిటన్ సిటీ పోక్సో 3వ నంబర్ కోర్ట్ తీర్పు ప్రకటించింది. దోషిగా తేలిన కమలేశ్కు రూ. 2 లక్షల జరిమానాతో పాటు 20 ఏళ్ల జైలు శిక్ష విధిం చింది. జరిగిన ఘటన తీవ్రమైనది కావడంతో కేసును సీరియస్గా తీసుకున్నట్లు జైపూర్ డిప్యూటీ కమిషనర్ హరేంద్ర కుమార్ చెప్పారు. -
టిక్టాక్ స్టార్ల మధ్య రచ్చ.. లైంగికంగా వేధించి.. ఆపై
ముంబై: ఇద్దరు మైనర్ టిక్టాక్ స్టార్ల మధ్య గొడవ లైంగిక వేధింపులకు దారితీసింది. నాతో కలిసి ఉండకపోతే.. నీ వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ సదరు టిక్టాక్ స్టార్.. మైనర్ బాలికను వేధించాడు. ప్రస్తుతం ఈ ఘటన మహరాష్ట్రాలో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు..ముంబైలోని 16 ఏళ్ల యువకుడు టిక్ టాక్ వీడియోలను చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి 17 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరు కలిసి టిక్టాక్ వీడియోలు చేస్తుండేవారు. కాగా, 2020 లో టిక్టాక్ బాన్కాక ముందు నుంచే వీరిద్దరు కలసి పనిచేసేవారు. వీరిద్దరికి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో, వీరిద్దరు కలిసి అనేక వీడియోలను చేశారు. కొంత కాలం వీరి స్నేహం బాగానే సాగింది. ఆ తర్వాత.. వీరిమధ్య కొన్ని మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో గతవారం.. 17 ఏళ్ల యువతి, తాను సొంతంగా వేరే బిజినెస్ చేయాలనుకుంటున్నట్లు యువకుడికి తెలియజేసింది. దీంతో, ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తనతోనే కలిసి ఉండాలని కోరాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అతను, యువతిని ప్రతిరోజు మానసికంగా హింసించేవాడు. ఆమె వ్యక్తిగత వీడియోలు తన దగ్గర ఉన్నాయని వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు కూడా దిగాడు. దీంతొ ఆమె.. అతని వేధింపులకు విసిగి పోయింది. ఒకరోజు రాత్రి యువకుడు.. యువతి ఇంటికి తన మిత్రులతో కలిసి వెళ్లి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆమెను విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ అనుకోని సంఘటనతో భయపడిపోయిన ఆ యువతి తన తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని తెలియజేసింది. దీంతో వారు, ముంబైలోని పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ యువకుడు, అతని మిత్రులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
‘అత్యాచారం చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా’.. కీలక పరిణామం
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ జిల్లాలో పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేసి, బిడ్డకు జన్మనివ్వడానికి కారణమైన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2016 లో మైనర్పై అత్యాచారానికి పాల్పడిని కేసులో దోషిగా తేలి, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న క్యాథిలిక్ చర్చి ఫాదర్ రాబిన్ వడక్కుం చెర్రీని వివాహం చేసుకోవడానికి అనుమతి కోరుతూ బాధితురాలు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాదు ఇది తన సొంత నిర్ణయమని, కేరళలోని కొట్టియూర్కు చెందిన బాధితురాలు పేర్కొంది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఈ అప్పీల్నుసుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానంటూ కేరళ హైకోర్టులో రాబిన్ దాఖలు పిటిషన్ను తిరస్కరించిన అయిదు నెలల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. 2016 లో రాబిన్ మైనర్ బాలిక (16)ను లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక 2017లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2017 ఫిబ్రవరిలో రాబిన్ వడక్కుం చెర్రిన కొచ్చిలో అరెస్టు చేశారు. తనకు సంబంధం లేదని, తాను అమాయకుడిననీ రాబిన్ మొదట్లో బుకాయించాడు. కానీ డీఎన్ఏ టెస్టులో నిజాలు నిగ్గు తేలడంతో రెండేళ్ల తర్వాత అతడిని దోషిగా నిర్ధారించింది. 2019లో రాబిన్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న రాబిన్ తన వల్ల బాధితురాలికి జన్మించిన చిన్నారి సంరక్షణ బాధ్యతలను జైలు శిక్ష కారణంగా చూసుకోలేకపోతున్నానని, ఆమెను పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలంటూ కేరళ హైకోర్టుకు లేఖ రాశాడు. ఇందుకు తనకు రెండు నెలలు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. అయితే రాబిన్ ప్రతిపాదనను కేరళ హైకోర్టు తిరస్కరించింది. శిక్షనుంచి తప్పించుకునేందుకు అతను ఈ ఎత్తుగడ వేశాడని వ్యాఖ్యానించింది. అంతేకాదు దీనికి అంగీకరిస్తే ఇకపై ప్రతి అత్యాచార దోషి, శిక్షలు తప్పించుకునేందుకు బాధితురాలిని పెళ్లి చేసుకుంటాననే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇలాంటి సంప్రదాయన్ని తాము ప్రోత్సహించమని ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
పదిలో రెండుసార్లు ఫెయిల్.. హ్యాకింగ్ పాఠాలు!
భోపాల్: మధ్యప్రదేశ్లోని సిన్గ్రులి జిల్లాలో ఓ 16 ఏళ్ల మైనర్ బాలుడు మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేసి, బ్లాక్ మెయిల్కు పాల్పడుతుడటంతో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..‘‘ నిందితుడు మధ్యప్రదేశ్లోని మోర్వా పట్టణానికి చెందినవాడు. అతడి పుట్టిన రోజున తల్లిదండ్రులు ఓ ల్యాప్టాప్ను గిఫ్ట్గా ఇచ్చారు. నిందితుడు పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు. హ్యాకింగ్లో శిక్షణ కూడా తీసుకోలేదు. కానీ, రోజుకు 15 గంటలపాటు యూట్యూబ్ వీడియోలు చూస్తూ హ్యాకింగ్ చేయడం నేర్చుకున్నాడు. కెనడియన్ ఫోన్ నెంబర్తో ఓ వాట్సాప్ సృష్టించాడు. అతను ఒక ప్రవాస భారతీయ అమ్మాయిగా నటిస్తూ.. చుట్టుపక్కల వాళ్లతో, పరిచయం ఉన్న వారితో చాట్ చేసేవాడు. అదే సమయంలో వారి కాంటాక్ట్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలు, చిత్రాలు, వీడియోలతో సహా డేటాను తస్కరించి, అందులో ఏవైనా అశ్లీల వీడియోలు ఉంటే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. కాగా ఈ విషయంపై ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే తాజాగా ఓ పొరుగు వ్యక్తి నిందితుడిపై ఫిద్యాదు చేశాడు. దీంతో అతడిని విచారించగా నేరాన్ని అంగీకరించాడని’’ మోర్వా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి మనీష్ త్రిపాఠి తెలిపారు. -
మైనర్ల పేరుతో పీఓఎమ్ఐఎస్ ఖాతా తెరవొచ్చు
జూన్-సెప్టెంబర్ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడి పెట్టిన వారు ఏడాదికి 6.6 శాతం వడ్డీ రేటును పొందనున్నారు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం(పీఓఎమ్ఐఎస్) అనేది పొదుపు పథకం. దీనిలో మీరు పెట్టుబడి పెట్టిన నిర్ధిష్ట మొత్తంపై ప్రతి నెలా స్థిర వడ్డీని పొందవచ్చు. మీ దగ్గరలోని పోస్టాఫీసులో పీఓఎమ్ఐఎస్ ఖాతాను తెరవవచ్చు. ఏ భారతీయ నివాసి అయినా పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఖాతా తెరవవచ్చు. అలాగే, ముగ్గురు వయోజనులు ఉమ్మడిగా కూడా ఖాతాను తెరవవచ్చు. మీరు కనుక మీ పిల్లల పేరు మీద కొత్త మొత్తం పొదుపు చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మీ మైనర్ల పేరిట పీఓఎమ్ఐఎస్ ఖాతాను తెరవవచ్చు. డిపాజిట్లు ఈ ఖాతాతెరవడానికి అవసరమైన కనీస మొత్తం ₹1,000, గరిష్టంగా ₹4.5 లక్షలను మాత్రమే సింగిల్ హోల్డర్ ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలో పరిమితి ₹9 లక్షలు మించి పెట్టుబడి పెట్టలేరు. ఉమ్మడి ఖాతా హోల్డర్లు సమాన వాటాను ప్రతి నెల పొందుతారు. వడ్డీ రేట్లు ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తరువాత వడ్డీ చెల్లించడం మొదలు అవుతుంది. ఇది మెచ్యూరిటీ వరకు కొనసాగుతుంది. మీరు ప్రతి నెలా చెల్లించే వడ్డీని క్లెయిం చేసుకోనట్లయితే, అటువంటి వడ్డీ ఎలాంటి అదనపు వడ్డీనిపొందలేరు. అంతేగాక, ఫిక్సిడ్ లిమిట్లకు మించి ఎక్కువ డిపాజిట్ చేస్తే రీఫండ్ చేయబడుతుంది. డిపాజిట్ చేయబడ్డ అదనపు మొత్తంపై పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ కు వర్తించే వడ్డీ రేటు వర్తిస్తుంది. మీరు ఆటో క్రెడిట్ ఆప్షన్ ఎంచుకుంటే ప్రతినెల వడ్డీని మీ సేవింగ్స్ ఖాతాలోకి పొందవచ్చు. అయితే ఈ వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే ఈ వడ్డీ మొత్తం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ వర్తించదు. మెచ్యూరిటీ: మీరు పోస్టాఫీసులో ఖాతా తెరిచిన ఐదు సంవత్సరాల తర్వాత ఖాతాను క్లోజ్ చేయవచ్చు. అయితే, ఒకవేళ మీరు పీఓఎమ్ఐఎస్ అకౌంట్ మెచ్యూరిటీకి ముందే మరణించినట్లయితే, దానిని క్లోజ్ చేయవచ్చు. మీరు చేసిన డిపాజిట్ నామినీ లేదా లీగల్ వారసులకు రీఫండ్ చేయబడతాయి. అలాంటప్పుడు, వడ్డీని మునుపటి నెల వరకు మాత్రమే చెల్లిస్తారు. ఖాతా తెరచేటప్పుడు, మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరునైనా నామిని కింద నమోదు చేయాలి, తద్వారా ఒకవేళ మీరు ఖాతా కాలవ్యవధిలో మరణించినట్లయితే, వారు ఈ ప్రయోజనాలను క్లెయిం చేసుకోవచ్చు. డిపాజిట్ తేదీ నుంచి గడువు ముగియడానికి ఒక సంవత్సరం ముందు ఎలాంటి డిపాజిట్ విత్ డ్రా చేయరాదని మీరు గుర్తుంచుకోవాలి. అయితే, ఒక సంవత్సరం తర్వాత, మూడు సంవత్సరాలకు ముందు ముందస్తుగా ఖాతా క్లోజ్ చేసినట్లయితే, ప్రిన్సిపాల్ నుంచి 2 శాతం తగ్గించి మిగిలిన మొత్తం మీకు చెలిస్తారు. ఒకవేళ ఖాతా మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య క్లోజ్ చేసినట్లయితే, ప్రిన్సిపాల్ నుంచి 1 శాతం తగ్గించి మిగిలిన మొత్తం మీ ఖాతాలో జమ చేస్తారు. చదవండి: చిన్న పొదుపు పథకాల ఆదాయంపై పన్ను ఎంతో తెలుసా? -
మైనర్తో బూట్లు నాకించి.. సిగరెట్ తాగించి..
భోపాల్ : రెండు వేల రూపాయల విషయంలో చోటుచేసుకున్న గొడవలో ఓ మైనర్ తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురు వ్యక్తులు అతడ్ని విచక్షణా రహితంగా కొట్టి.. అమానుషంగా ప్రవర్తించారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం జబల్పూర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల మైనర్కు అదే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులతో 2 వేల రూపాయల విషయంలో గొడవైంది. ఈ నేపథ్యంలో వారు మైనర్ను నయాగావ్ ఏరియాలోని పొలంలోకి తీసుకెళ్లారు. అనంతరం విచక్షణా రహితంగా కొట్టారు. బూట్లు నాకించారు. బలవంతంగా సిగరెట్ కూడా తాగించారు. కుమారుడు ఎంతకీ ఇంటికి రాకపోవటంతో మైనర్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం రోజున మైనర్ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి : మీ ఇంట్లో భూతం ఉంది.. ఎద్దుతో తరిమేస్తాం! ఇష్టం లేని పెళ్లి.. కాబోయే భర్తను చంపమని.. -
నీ న్యూడ్ ఫొటోలు పంపు.. లేకపోతే..
బెంగళూరు : ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ వ్యక్తి తన కూతుర్ని వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులోని అగ్రహార దసరహల్లి ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలికకు గత జనవరి నెలలో ఇన్స్టాగ్రామ్ ద్వారా కార్తిక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్దిరోజులు ఇద్దరి మధ్య చాటింగ్లు నడిచాయి. ఆ తర్వాతి నుంచి బాలికను న్యూడ్ ఫొటోలు పంపాలంటూ అతడు వేధించసాగాడు.( పోర్న్ రాకెట్: వాళ్లే ఈ నటి టార్గెట్!) ఆమె స్పందించకపోయే ‘నీ న్యూడ్ ఫొటోలు పంపు! లేకపోతే చెయ్యి కోసుకుంటా’ అని బెదిరించసాగాడు. దీంతో భయపడిపోయిన బాలిక అతడికి తన న్యూడ్ ఫొటోలు కొన్ని పంపింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. కార్తిక్పై ఫిర్యాదు చేసింది. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ( నేవీ అధికారి సజీవదహనం: ఆ 6 రోజులు ఏం జరిగింది? ) -
వారి మధ్య పెళ్లి ఆమోదయోగ్యం కాదు:హైకోర్టు
చండీగఢ్: హిందూ వివాహ చట్టం ప్రకారం తోబుట్టుల మధ్య వివాహం చట్ట విరుద్దమని పంజాబ్ హర్యానా హైకోర్టు కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్లో అమ్మాయి మేజర్ అని తెలిపినప్పటికీ ఇది న్యాయ సమ్మతం కాదని కేసును విచారించిన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పంజాబ్లోని లూథియానాకు చెందిన పిటిషనర్ తనపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్), 366 ఏ(మైనర్ అమ్మాయిని అనుమతి లేకుండా తీసుకెళ్లడం) వంటి సెక్షన్లు ఖన్నాసిటిలోని రెండవ ఠాణాలో నమోదయ్యాయని, వాటిపై ముందస్తు బెయిల్ మంజూర్ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. జీవిత రక్షణ,స్వేచ్ఛ కోసం పిటిషనర్తో కలిసి బాలిక క్రిమినల్ రిట్ పిటిషన్ దాఖలు చేసుకున్నట్లు అతని తరుపు న్యాయవాది అరవింద్ సింగ్ సాంగ్వాన్ కోర్టుకు నివేదించాడు. ఈ ముందస్తు బెయిల్ను ప్రభుత్వ తరుపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. వారిద్దరూ సొంత అన్నదమ్ముల బిడ్డలు కావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. పిటిషన్ పరీశీలించిన న్యాయమూర్తి వారిద్దరూ కలిసి ఉంటున్నారని అంటున్నారు, కానీ నివేదికనూ చూస్తే తనకు కేవలం 17 సంవత్సరాల మాత్రమే ఉన్నాయని అన్నారు. బాలిక పుట్టిన తేదీ 2003 ఆగస్ట్ అని,సెప్టెంబర్ 3,2020 నాటికీ 17 సంవత్సరాల 14 రోజులని న్యాయమూర్తి అన్నారు. కేవలం మగ సోదరులని మాత్రమే వాళ్ల తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారని, మైనర్ని వేధిస్తున్నారని బాలిక ఇచ్చిన నివేదికను సైతం పిటిషనర్ దీనికి జతపర్చాడు. అందుకోసం తనతో కలిసి జీవించాలని బాలిక నిర్ణయించుకుందని వాదించాడు. తన సొంత తల్లిదండ్రుల నుంచి ప్రాణానికి హాని ఉందన్నారు. తనను వేధించకుండా చూడాలని వేసిన పిటిషన్ని, కోర్టు సెప్టెంబర్ 7 న కొట్టివేసింది. ప్రభుత్వం ఇద్దరికి రక్షణ కల్పించాలని ఆదేశిందని న్యాయమూర్తి అన్నారు. ఏది ఏమైన చట్ట ఉల్లంఘన కోసం చట్టపరమైన చర్యల నుంచి రక్షించడానికి ఈ ఉత్తర్వూ ఇవ్వరాదని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్లో తాను బాలికకూ సోదరుడినవుతాననే విషయాన్ని వెల్లడించలేదని ,అందువల్ల 18 సంవత్సరాలు నిండిన తరువాత కూడా వారు చేసుకున్న పెళ్లి చట్ట సమ్మతం కాదని అంది." పిటిషనర్ హిందూ వివాహ చట్టం క్రింద నిషేధించబడిన 'సపిందా'లో (ఇద్దరు వ్యక్తుల మధ్య ఉమ్మడి పూర్వీకులు ఉంటే వారి మధ్య వివాహాన్ని నిషేధిస్తుంది) వస్తారని, ఒకరితో ఒకరు వివాహం చేసుకోలేరని అని ప్రభుత్వ న్యాయవాది" వాదనలతో కోర్టు ఏకీభవించింది., ఇది అనైతికం, సమాజంలో ఆమోద యోగ్యం కాదని పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. -
పబ్జీ: ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో..
జైపూర్: రాజస్తాన్లో పబ్జీ ఆట ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. పబ్జీ ఆడడానికి తన స్నేహితుడు ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో ఒక బాలుడు అతనిని కొట్టి చంపాడు. రాజ్సమంద్ జిల్లా జైత్పురకి చెందిన 14 ఏళ్ల బాలుడు, అతని స్నేహితుడు హమీద్(17)కి పబ్జీ గేమ్ అంటే పిచ్చి. హమీద్ ఫోన్లో ఆ గేమ్ ఉండడంతో ఇద్దరూ తరచూ ఆడేవారు. ఈ నెల 9న హమీద్ పొలానికి వెళ్లి, తిరిగి రాలేదు. పబ్జీ ఆడడానికి ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో బాలుడైన అతడి స్నేహితుడే బండరాయితో మోదడంతో హమీద్ ప్రాణం కోల్పోయాడని పోలీసు విచారణలో తేలింది. చదవండి: పబ్జీలో లీనం.. ప్రాణాలు తీసింది! -
నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయకుంటే చస్తా!
ఇండోర్ : ఇష్టమైన వాడితో పెళ్లి జరిపించకపోతే ప్రాణాలు తీసుకుంటానంటూ ఓ మైనర్ హోర్డింగ్పైకి ఎక్కి కూర్చుంది. ప్రియుడు వచ్చి బ్రతిమాలితే గానీ కిందకు దిగలేదు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, ఇండోర్లోని పర్దేశీ పురాకు చెందిన ఓ మైనర్ ఓ యువకుడిని ఇష్టపడింది. అతడ్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. అయితే ఇందుకు ఆమె తల్లి ససేమీరా అంది. దీంతో ఆగ్రహించిన మైనర్ అక్కడికి దగ్గరలోని హోర్డింగ్పైకి ఎక్కింది. ( వైరల్ : నేను వెళ్లనంటూ ట్రంప్ మారాం ) నచ్చిన వాడితో పెళ్లి చేయకుంటే పైనుంచి కిందకు దూకి చస్తా! అంటూ బెదిరింపులకు దిగింది. తల్లిదండ్రులు, బంధువులు, చుట్టూ మూగిన జనం.. ఆఖరికి పోలీసులు కూడా బ్రతిమాలినా పట్టు వీడలేదు. మొబైల్ ఫోన్ను చూసుకుంటూ పైనే కూర్చుండిపోయింది. చివరకు మైనర్ ఇష్టపడుతున్న యువకుడు రంగంలోకి దిగక తప్పలేదు. అతడు అక్కడికి వచ్చి మైనర్కు నచ్చ చెప్పాడు. అతడి మాట విని బాలిక కిందకు దిగింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఇల్లు చూసుకోమంటే.. చంపేశారు!
సాక్షి, ముంబై: జల్గావ్ జిల్లాలో సంచలనం సృష్టించిన నలుగురు పిల్లల దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్గావ్ జిల్లా రావేర్ పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న భోర్ఖేడా గ్రామ సమీపంలోని ఓ పొలంలో పనులు చేసుకుంటూ మహతాబ్, రుమాలీబాయి బిలాల్ అనే దంపతుల తమ ఐదుగురి పిల్లలతో అక్కడే చిన్న గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బిలాల్ దంపతుల బంధువులు దశదిన కర్మలో పాల్గొనేందుకు స్వరాష్ట్రం మధ్యప్రదేశ్కు పెద్ద కుమారుడితో పాటు వెళ్లారు. మిగతా పిల్లలను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. మూడేళ్ల వయసున్న చిన్న కుమార్తె, మరో 11 ఏళ్లు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, 13 ఏళ్ల వయసున్న ఇంకో కుమార్తెను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో తమ తమ్ముళ్లు, చెల్లెళ్లు ఒక్కరే ఉంటారని, గ్రామానికి ఇల్లు దూరంగా ఉండటంతో వారిని చూసుకోవాలని బిలాల్ పెద్ద కుమారుడు అతని మిత్రులకు చెప్పాడు. ఇదే అదనుగా చూసుకున్న నిందితులు 13 ఏళ్ల వయసున్న బాలికపై కన్నేశారు. మద్యం తాగి వచ్చి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. (చదవండి: మిథున్ చక్రవర్తి కుమారుడిపై అత్యాచారం కేసు) విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో బాలికతో పాటు మిగతా వారిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి మృతదేహాలను పక్కనే ఉన్న పొలంలో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితులు ముఖేశ్ సన్యాల్, రాజు అలియాస్ గుడ్డు, సునీల్ సీతారాంలతో పాటు మరో మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, అంతవరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో గొడ్డలి, రక్తంతో తడిసిన నిందితుల దుస్తులు, రెండు నాటుసారా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలికపై సాముహిక అత్యచారం? ఈ ఘటనలో నిందితులు మైనర్ బాలికపై సామూహిక అత్యచారం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టంలో మైనర్ బాలికపై అత్యచారం జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అయితే పూర్తి రిపోర్టు వస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. రూ.రెండు లక్షల సాయం... - గులాబ్రావ్ పాటిల్, జిల్లా ఇన్చార్జి మంత్రి బాధిత కుటుంబ సభ్యులతో జల్గావ్ ఇంచార్జ్ గులాబ్ రావ్ పాటిల్ భేటీ అయ్యారు. బిలాల్ కుటుంబాన్ని ఓదార్చడంతో పాటు ఆ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. అదవిధంగా ఈ కేసు దర్యాప్తు సరైన దిశలో కొనసాగుతుందని తెలిపారు. దోషులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.