-
లాక్డౌన్ ముగింపు: ప్రజారవాణాకు సిద్ధం!
బెంగళూరు: కరోనా వ్యాప్తి కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు మే 17తో ముగియనుంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో మరోసారి లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల ఇప్పటికే నిబంధనలు సడలించారు. ఈ క్రమంలో దాదాపు 54 రోజుల తర్వాత బస్సులు నడిపేందుకు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంసిద్ధమవుతోంది. బస్పులు నడిపే క్రమంలో కోవిడ్-19 నివారణ చర్యలపై ఒక వ్యూహంతో ముందుకు సాగేలా ప్రణాళికలు రచించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ప్రజారవాణా ప్రారంభించడానికి అన్ని విధాలా సిద్ధమవుతోంది. ఈ విషయం గురించి బీఎంటీసీ ఎండీ శిఖా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ బస్సుల్లో మిడిల్ సీటు లేదు. కాబట్టి భౌతిక దూరం నిబంధనలకు ఎటువంటి విఘాతం కలుగబోదు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం’’అని స్పష్టం చేశారు. కాగా బీఎంటీసీ ఆధ్వర్యంలో 6500 బస్సులు ఉన్నాయి. వీటిలో 800 ఏసీ బస్సులు. కరోనా నేపథ్యంలో వాటిని డిపోలకే పరిమితం చేయనున్నారు. బీఎంటీసీ ముందుజాగ్రత్త చర్యలు 1. బీఎంటీసీ సిబ్బందికి ప్రతిరోజూ హెల్త చెకప్ 2. ఇందుకోసం ప్రతీ డిపోలోనూ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ అందుబాటులో ఉంచాలి 3. సిబ్బందికి తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందించాలి. 4. కోవిడ్-19 గురించి అప్రమత్తం చేసే నోట్లను బస్సులో అంటించాలి. 5. ప్రతిరోజూ బస్సులను రసాయనాలతో శుభ్రం చేయాలి. 6. వారం, నెలవారీ పాసులు జారీ చేయడం, టికెట్ డబ్బు వసూలు కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయాలి. 7. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలి 8. సామాజిక ఎడబాటు తప్పక పాటించాలి 9. జ్వరం ఉన్న వాళ్లు బస్సులు ప్రయాణాలు మానుకుంటే మంచింది. -
మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ
సాక్షి,న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడకపోవడంతో మే 4 నుంచి మే 17 వరకు దేశంలో లాక్డౌన్ 3.0 (మూడవ దశ)కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో జోన్ల వారీగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రెడ్ జోన్లలో సడలింపులు, నిబంధనలు కఠినంగా ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్ , గ్రీన్ జోన్లుగా విభజించింది. రెడ్ జోన్లు (అత్యధిక సంఖ్యలో కేసులు, రేటు) ఆరెంజ్ జోన్ (తక్కువ కేసులు) గ్రీన్ జోన్ ( గత 21 రోజులలో కేసులు లేకపోవడం) గా వర్గీకరించింది. తాజా సడలింపులు, మద్యం దుకాణాలు లేదా ఇ-కామర్స్ సేవలపై గందరగోళం నెలకొనడంతో కేంద్రం స్పష్టతనిచ్చింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాలు అందించిన వివరాల ప్రకారం ఆంక్షలు, సడలింపులు ఈ విధంగా ఉండనున్నాయి. (ప్రధాని కీలక భేటీ : రెండో ప్యాకేజీ సిద్దం!) ఆరెంజ్ , గ్రీన్ జోన్లు రెండింటిలోనూ మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతి వుంటుంది. అన్ని వస్తువులకు ఇ-కామర్స్ అనుమతి. ఇప్పటివరకూ నిత్యావసర వస్తువులను మాత్రమే అనుమతి వుండగా, తాజా మార్గదర్శకాలతో నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇంటి పనిమనుషులను అనుమతించాలా లేదా అనేది ఆయా రాష్ట్ర, లేదా యూటీ (కేంద్రపాలిత ప్రాంతాలు)ల నిర్ణయంపై ఆధారపడి వుంటుంది. రెడ్ జోన్లు నాన్ కంటైన్ మెంట్ జోన్లలో మార్కెట్ కాంప్లెక్స్ లేదా మాల్లో భాగం కాని స్వతంత్ర మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతి. అత్యవసరమైన వస్తువులకు మాత్రమే ఇ-కామర్స్ అనుమతి. అత్యవసరం కాని వస్తువుల విక్రయానికి అనుమతి లేదు. మాల్స్, అందులో ఉండే షాపులకు అనుమతి లేదు. అయితే సింగల్ విండో షాపులు, కాలనీల్లోని షాపులకు, గృహ సముదాయాల్లో ఉండే షాపులకు అనుమతి ఉంది. ఇక ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి. అత్యవసర సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, మెడికల్ ఉత్పత్తులు, ఐటీ హార్డ్వేర్, జూట్ మిల్లులకు అనుమతి ఉంది. అయితే ఇక్కడ పనిచేసే వారందరూ తప్పకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ ధరించాల్సి ఉంటుంది. పల్లె ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు వర్తిస్తాయి. పట్టణాల్లో భవన నిర్మాణ పనులు స్థానికంగా ఉన్న కూలీలతో కొనసాగుతాయి. అంతేకాక అక్కడ పని చేసేందుకు వచ్చే కూలీలను బయట ప్రాంతాలకు తరలించకూడదు. ప్రైవేట్ ఆఫీసులు 33శాతం స్టాఫ్తో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. డిప్యూటీ సెక్రటరీ, ఆపైస్థాయి ప్రభుత్వ ఆఫీసులు 100 శాతం సిబ్బందితో.. అలాగే మిగిలిన ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా 33 శాతం సిబ్బందితో పని చేయాల్సి ఉంటుంది. గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సడలింపులు, పరిమితులు రెడ్, ఆరెంజ్ జోన్లలో స్థానిక అధికారులు గుర్తించిన కంటైన్ మెంట్ ప్రాంతాలకు వర్తించవు. అనుమతించిన నిత్యావసరాల సరఫరాకు మించి కంటైన్ మెంట్ జోన్ ప్రాంతాలు తీవ్రమైన పరిమితులకు లోబడి వుంటాయి . (హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట) ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, లాక్డౌన్ ఆదేశాల ప్రకారం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం జారీ చేసిన ఆంక్షలను సడలించడానికి వీల్లేదు. ఉదాహరణకు రెడ్ (స్వతంత్ర దుకాణాలు మాత్రమే), ఆరెంజ్, గ్రీన్ జోన్స్, జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి అవకాశం వుంది. కానీ కావాలనుకుంటే రాష్ట్రాలు, యూటీలు మద్యం షాపులను మూసి వుంచడానికి కేంద్రం అనుమతినిచ్చింది. అదే సందర్భంలో రెడ్ జోన్లలో నాన్ ఎసెన్షియల్ వస్తువుల అమ్మకానికి ఇ-కామర్స్ సంస్థలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి వుండదు. ఈ నెల 3వ తేదీతో ముగియనున్నరెండవ దశ లాక్ డౌన్ ను పొడిగించి, అనేక ప్రాంతాల్లో విధించిన ఆంక్షలను ప్రభుత్వం గణనీయంగా సడలించింది. మార్చి చివరిలో అమల్లోకి వచ్చిన దేశవ్యాప్త లాక్డౌన్ విస్తరించడం ఇది రెండోసారి. (కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం) -
మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మే 4 నుంచి మే 17 వరకూ లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ జారీచేసింది. అయితే లాక్డౌన్ సమయంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతించారు. జోన్ల పరిస్థితిపై ప్రతివారం అంచనా వేసి పరిస్ధితిని సమీక్షిస్తామని కేంద్ర హోంశాఖ పేర్కొంది.(తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే..) కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నానాటికీ దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో లాక్డౌన్ పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ మొదటి దశ మార్చి 22న ప్రారంభమై మార్చి 31న ముగిసింది. లాక్డౌన్ రెండో దశ ఏప్రిల్ 1న ప్రారంభమై మే3 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ మూడో దశ మే 4 నుంచి మే 17 వరకు ప్రకటించింది. దీంతో మొత్తం 56 రోజులు భారత్లో లాక్డౌన్ విధించినట్టయింది. అయితే మూడో దశలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో చెప్పుకోదగ్గ మినహాయింపులు ఇచ్చారు.(ఆంధ్రప్రదేశ్లో రెడ్ జోన్లు ఇవే) 3వ దశ లాక్డౌన్ నిబంధనలు ఇవే.. ►విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం ►స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు బంద్ ►హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్లు బంద్ ►స్విమ్మింగ్ పూల్స్, స్టేడియంలు మూసి ఉంచాలి ►అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్ ఈవెంట్లు రద్దు ►అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి ►గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు ►రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు ►వారానికి ఒకసారి రెడ్ జోన్లలో పరిస్థితి పరిశీలన ►కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్పు ►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి ►గ్రీన్ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి ►ఆరెంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి ►ఆరెంజ్ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి ►ఆరెంజ్ జోన్లు: టూ వీలర్ మీద ఒక్కరికే అనుమతి ►ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు ►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్ క్యాబ్లకు అనుమతి ►వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి ►రెడ్ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు ►33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు అనుమతి ►రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం ►బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణాలకు అనుమతి ►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆన్ లైన్ షాపింగ్కు అనుమతి ►ప్రైవేట్ కార్యాలయాల్లో 33% వరకు సిబ్బంది హాజరుకు అనుమతి ►అన్ని రకాల గూడ్స్, కార్గో, ఖాళీ లారీలకు కూడా అనుమతి ►బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాల్సిందే ►పెళ్లిళ్లకు అనుమతి, 50 మంది వరకు హాజరు కావొచ్చు ►అంత్యక్రియలకు 20 మంది వరకు హాజరయ్యేందుకు అనుమతి ►గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు కూడా అనుమతి(ఆ జోన్లలో లిక్కర్ కిక్..) ►మద్యం షాపుల వద్ద ఐదుగురికి మించకుండా ఉండాలి కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించిన విషయం తెలిసిందే. ఆ శాఖ రూపొందించిన పలు నియమ నిబంధనల మేరకు జిల్లాలను మూడు రకాల జోన్లుగా విభజించారు. రెడ్, ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్లుగా విభజించి తదనుగుణంగా కొన్ని పరిమితులను విధించారు. రెడ్ జోన్స్ (హాట్స్పాట్ జిల్లాలు) - కరోనా వైరస్కు సంబంధించి మొత్తం యాక్టివ్ కేసులు, పాజిటివ్ కేసులు రెండింతలుగా నమోదు కావడం, ఆయా ప్రాంతాల్లో జరిగిన పరీక్షలు, నిఘా వర్గాల సమాచారం మేరకు రెడ్ జోన్లను ప్రకటించారు. గ్రీన్ జోన్లు - గడిచిన 21 రోజులుగా ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాని జిల్లాలను గ్రీన్జోన్లుగా గుర్తించారు. ఇకపోతే, రెడ్, గ్రీన్ కానీ పరిస్థితులున్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా ప్రకటించారు. ఈ లెక్కన దేశ వ్యాప్తంగా 733 జిల్లాలను ఆయా జోన్ల కింద విభజించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తీరు, పాజిటివ్ కేసులు నమోదు వంటి ప్రక్రియల ఆధారంగా 130 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. అలాగే 284 ఆరెంజ్ జోన్లోకి రాగా 319 జిల్లాలు గ్రీన్ జోన్లో నిలిచాయి. -
ఆంక్షలు సడలింపు..షరతులు కూడా
-
గుడ్న్యూస్.. మరికొన్ని ఆంక్షలు సడలింపు
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ను నుంచి ప్రజలకు కొంతమేర ఉపశమనం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ఆంక్షల నుంచి మరికొన్ని సడలింపులను ఇచ్చింది. నిత్యావసరాల్లో భాగంగా ప్రజలకు అవసరమైన గూడ్స్ సరఫరకు కేంద్రం అనుమతినిచ్చింది. అలాగే నాన్ హాట్స్పాట్ ఏరియాలోని మున్సిపాలిటీ పరిధిలో గల దుకాణాలను కూడా తెరవబడతాయి. మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిమితిలో ఉన్న మార్కెట్ సముదాయాలపై మాత్రం ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం అర్థరాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే తెరుచుకునే షాపులకు మాత్రం షరతులు కూడా విధించింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవాలని తెలిపింది. హాట్ స్పాట్, కంటైన్మెంట్ జోన్లు ఉన్న చోటమాత్రం ఏషాపులూ తెరవడానికి వీలేద్దని కేంద్ర విడుదల చేసిన జీవో పేర్కొంది. కాగా ఇప్పటి వరకు కిరాణా దుకాణాలు, నిత్యవసర, అత్యవసర, మందుల, ఫార్మసీలకు మాత్రమే అనుమతి ఉంది. తాజా సడలింపులతో స్టేషనరీ, బ్యూటీ సెలూన్స్, డ్రైక్లీనర్స్, ఎలక్టికల్ స్టోర్స్ తెరుచుకోవచ్చు. అయితే ఇవన్నీ ఆయా రాష్ట్రా ప్రభుత్వాల అనుమతితో మాత్రమే జరగాలని కేంద్ర స్పష్టం చేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు. మరికొంతకాలంపాటు వీటిపై ఆంక్షలు కొనసాగనున్నాయి. అయితే తెరుచుకోబడిన ఆయా షాపుల్లో కేవలం 50శాతం మంది సిబ్బంధి మాత్రమే విధులు నిర్వర్తించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ముఖాలకు మాస్క్లు, శానిటైజర్లు, సామాజిక దూరం తప్పనిసరి పాటించాలని పేర్కొంది. కాగా లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఉండేందుకు కేంద్ర ఇప్పటికే పలు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే పలు షాపులకు అనుమతి ఇచ్చింది. -
లాక్డౌన్ 2: రాష్ట్రాలపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన రెండోసారి లాక్డౌన్ను పలు రాష్ట్రాలు కఠినంగా అమలు చయకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యవసరం కాని సేవలకు అనుమతినిస్తూ నిబంధనలు సడలించడంపై మండిపడింది. ఇలాంటి ఏమరపాటు చర్యల వల్ల కరోనా విజృంభించే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్ల సోమవారం లేఖ రాశారు. తక్షణమే అన్ని రాష్ట్రాలు కఠిన నిబంధనలు పాటించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. (లాక్డౌన్: కేరళ సర్కారుపై కేంద్రం సీరియస్!) ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యంగా లాక్డౌన్ సడలింపు చేయడం వల్ల పలు చోట్ల సామాజిక ఎడబాటును ఉల్లంఘించడమే కాక పట్టణ ప్రాంతాల్లో స్వేచ్ఛగా వాహనదారులు రోడ్ల మీదకు వస్తున్నారన్న విషయాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. కాబట్టి వెంటనే రెండవసారి లాక్డౌన్ అమలు చేయడంపై కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు. ఇదిలావుండగా ఇండోర్, ముంబై, పుణె, జైపూర్, కోల్కతా, హౌరా, మెదినీపూర్ ఈస్ట్, డార్జిలింగ్, కలింపోంగ్, జల్పైగురి నగరాల్లో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రాల్లో కోవిడ్-19 పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి, అందుకవసరమైన సూచనలు చేయడానికి, లాక్డౌన్ అమలును పర్యవేక్షించడానికి ఆరు ఐఎమ్సీటీ(ఇంటర్ మినిస్టరియల్ సెంట్రల్ టీమ్స్)లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. (శానిటైజర్ తయారీ పరిశ్రమలో పేలుడు) -
వైద్య సిబ్బందిపై దాడులు: కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనాపై పోరులో ముందుండి బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. అదే విధంగా పట్టణాల్లో భౌతిక దూరం పాటించకపోవడం, లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వైద్య సిబ్బందిపై దాడుల కేసులు, నిబంధనల ఉల్లంఘనలు అధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కరోనా వైరస్ వ్యాప్తి, వైద్య సిబ్బందిపై దాడులను కట్టడి చేసేందుకు.. లాక్డౌన్ నిబంధనలు అమలు తీరును పర్యవేక్షించేందుకు ఆరు కీలక మంత్రిత్వ శాఖ సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కాగా మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, కర్ణాటకలో విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులపై దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. (లాక్డౌన్: కేరళ సర్కారుపై కేంద్రం సీరియస్!) అదే విధంగా కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలు సడలించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్డౌన్ నిబంధనల సడలింపులో ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని.. వాటికి విరుద్ధంగా సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేంద్రం జారీ చేసిన నిబంధనలను అనుసరించి కొన్ని రంగాలకు మాత్రమే మినహాయింపునివ్వాలని స్పష్టం చేసింది. కేరళ, రాజస్తాన్ ఏప్రిల్ 20 నుంచి సవరించిన లాక్డౌన్ నిబంధనల ఆధారంగా రాష్ట్రంలో వివిధ రంగాలకు మినహాయింపునివ్వగా.. ఢిల్లీ, పంజాబ్ తమ రాష్ట్రంలో నిబంధనలను సులభతరం చేయబోమని స్పష్టం చేశాయి. (ఆశా వర్కర్లపై దాడి.. కరోనా టెంట్లు ధ్వంసం) GoI to States: Violations to #lockdown measures reported, posing a serious health hazard to public & risk for spread of #COVIDー19: Incidents of violence on frontline healthcare prof; complete violations of social distancing norms; movement of vehicles in urban areas — Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) April 20, 2020 -
కేరళలో కొన్ని సడలింపులపై కేంద్రం సీరియస్
-
లాక్డౌన్: కేరళ సర్కారుపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ను సడలిస్తూ కేరళ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై కేంద్రం సీరియస్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్లు, బుక్ షాపులు తెరవడం, కొన్ని పట్టణాల మధ్య బస్సు సర్వీసులు నడపడం, కార్లలో వెనుక సీట్లలో ఇద్దరితో ప్రయాణానికి అనుమతినివ్వడం వంటి సడలింపులను తప్పుబట్టింది. తక్షణమే వీటిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్రం రూపొందించిన గైడ్లైన్స్ను అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు.(లాక్డౌన్: కేరళ కీలక ఆదేశాలు.. సడలింపులు ఇవే) ‘‘ఏప్రిల్ 15,2020న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం ఉల్లంఘించింది. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం జారీ చేసిన నిబంధనలను పాటించకుండా కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా వివిధ కార్యకలాపాల నిర్వహణకు అనుమతినిస్తూ ఆదేశాలు ఇచ్చింది’’అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పినరయి విజయన్ సర్కారు తీరును విమర్శించాయి. ఇక కేంద్రం లేఖపై స్పందించిన కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మాట్లాడుతూ... ‘‘ కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే లాక్డౌన్ నిబంధనలు సడలించాం. అపార్థాలు చోటుచేసుకున్నందు వల్లే ఇలా జరిగింది. అందుకే కేంద్రం వివరణ కోరింది. ఇందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వివరణ ఇచ్చిన తర్వాత సమస్య సమసిపోతుంది. కేంద్ర నిబంధనలనే మేం కచ్చితంగా అమలు చేస్తున్నాం’’అని స్పష్టం చేశారు.(లాక్డౌన్ : పాటించాల్సిన కొత్త రూల్స్) కాగా లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ బీ, గ్రీన్ జోన్లుగా విభజిస్తూ అక్కడ పాటించాల్సిన నిబంధనలపై కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాసర్గడ్, కన్నూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలను రెడ్ జోన్... పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలను ఆరెంజ్ ఏ జోన్... ఆరెంజ్ బీ జోన్లోని అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్, వయనాడ్, త్రిసూర్ జిల్లాలు... కొట్టాయం, ఇడుక్కి జిల్లాలను గ్రీన్ జోన్ కింద పరిగణిస్తూ కొన్ని రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చింది. -
లాక్డౌన: గూడ్స్ వాహనాలకు ఉపశమనం
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: లాక్డౌన్లో చిక్కుకున్న లారీలు, అన్ని రకాల గూడ్స్ వాహనాలకు ఉపశమనం కలిగేలా కేంద్రం హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వీటిని నిరాటంకంగా అనుమతించాలని తాజాగా ఆదేశాలిచ్చింది. ఈ నిర్ణయంవల్ల నిత్యావసర వస్తువుల రవాణాకు ఇబ్బంది లేకుండా పోవడమే కాకుండా పోర్టుల నుంచి, ఇతర కర్మాగారాల నుంచి సరుకుల రవాణా సులభతరం కానుంది. లాక్డౌన్వల్ల గత కొద్దిరోజుల నుంచి రాష్ట్రంలో ఈ తరహా లారీలు ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోయాయి. ఉదాహరణకు.. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఫ్రిజ్లు, ఏసీలు, స్టీల్, పరిశ్రమలకు అవసరమైన సామగ్రి తదితర వాటితో ఉన్న అన్ని వాహనాలు మార్గ మధ్యంలోనే నిలిచిపోయాయి. అలాగే.. ► అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిత్యావసరాల వాహనాలను తప్ప మిగిలిన వాహనాలు వేటినీ ఆయా రాష్ట్రాల్లో పోలీసులు అనుమతించడంలేదు. ► ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాలతో లారీలు, ట్రక్కులు, వ్యాన్లు వంటి గూడ్స్ వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. ► ఇతర రాష్ట్రాలకు పంట ఉత్పత్తులతో పాటు పరిశ్రమలకు చెందిన సామగ్రిని రవాణా చేసేందుకు వీలు ఏర్పడింది. ► రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, ఎగుమతులను ప్రస్తుతం ముమ్మరం చేసిన నేపథ్యంలో ఏపీకి మరింత వెసులుబాటు కల్పించినట్లయింది. ఖాళీ లారీలకూ లైన్క్లియర్ సరుకుతో పనిలేకుండా ఖాళీ లారీలను కూడా అనుమతించాలని కేంద్రం ఆదేశించింది. లాక్డౌన్ వల్ల రాష్ట్రానికి చెందిన సుమారు 2,500 లారీలు వివిధ రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాలకు చెందిన వెయ్యికి పైగా లారీలు మన రాష్ట్రంలోనూ సరుకులతో నిలిచిపోయాయి. ఇలాంటివన్నీ ఇప్పుడు తమతమ గమ్యస్థానాలకు బయలుదేరతాయి. అలాగే, రాష్ట్రంలో సుమారు 3 లక్షల వరకు లారీలు, సరుకు రవాణా చేసే వాహనాలున్నాయి. లాక్డౌన్ నుంచి వీటికి ఇప్పుడు మినహాయింపు నివ్వడంతో ఇవి రోడ్డెక్కనున్నాయి. దీంతో డీజిల్ అమ్మకాలూ ఊపందుకుంటాయి. డీజీపీ, రవాణా కమిషనర్ ఆదేశాలు అన్ని రకాల సరుకు రవాణా వాహనాలకు అడ్డంకులు కల్పించవద్దంటూ డీజీపీ సవాంగ్, రవాణా కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు కూడా జిల్లాల పోలీస్, రవాణా అధికారులను ఆదేశించారు. ఖాళీగా Ððð ళ్లే వాహనాలనూ అనుమతించాలన్నారు. ఈ వాహనాల్లో డ్రైవర్, క్లీనరు తప్ప ప్రయాణికులను అనుమతించవద్దని స్పష్టంచేశారు. వెసులుబాటు కల్పించడం హర్షణీయం గూడ్స్ వాహనాలు నడిపేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం సంతోషదాయకం. ఈ నిర్ణయంతో సరుకు రవాణా మొదలై వ్యవస్థ గాడిలో పడుతుంది. – వైవీ ఈశ్వరరావు, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అన్ని వాహనాలకు అనుమతి అన్ని రకాల వాహనాలు అనుమతించాలని రవాణా శాఖాధికారులకు ఆదేశాలిచ్చాం. పోలీస్, రవాణా అధికారులు చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేసి అనుమతిస్తారు. – ప్రసాదరావు, సంయుక్త రవాణా కమిషనర్ వస్తువుల రవాణా వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు వస్తువుల రవాణా వాహనాల రాకపోకలపై ఎటువంటి ఆంక్షలు లేవని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గతంలోనే స్పష్టంగా చెప్పినప్పటికీ నిత్యావసరాలతోపాటు ఇతర వస్తువుల రవాణా వాహనాలను రాష్ట్రాలు అనుమతించడం లేదని తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మరింత స్పష్టత ఇస్తూ రోజూ వినియోగించే ఆహారం, నిత్యావసర సరుకులన్నింటికీ లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సోమవారం లేఖ రాశారు. ► నిత్యావసర సరుకులతోపాటు ఇతర సరుకు రవాణా వాహనాలన్నింటినీ రాష్ట్రాల మధ్య తిరిగేందుకు అనుమతించాలి. ఈ వాహనాల్లో లైసెన్స్ కలిగిన ఒక డ్రైవర్తోపాటు అదనంగా మరొకరు ఉండొచ్చు. ► ఖాళీ గూడ్స్ వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వాలి. ► అనుమతించిన పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు కార్మికులు వెళ్లడానికి ఆంక్షలు పెట్టకూడదు. ► నిత్యావసరాలు, ఇతర సరుకు రవాణాకు రైల్వేలు, ఎయిర్పోర్టులు, పోర్టుల్లో కార్గో సర్వీసులను అనుమతించాలి. సరుకుల లోడింగ్, అన్ లోడింగ్ కోసం కాంట్రాక్టు కార్మికులకు కూడా జిల్లా అధికార యంత్రాంగం పాస్లు జారీ చేయాలి. నిత్యావసరాల రవాణా డ్రైవర్లకు ప్రత్యేక కిట్లు పంట ఉత్పత్తులు, నిత్యావసర సరుకుల రవాణాకు అవసరమైన వాహనాలను రాష్ట్ర రవాణా శాఖ సేకరిస్తోంది. అయితే, కరోనా వైరస్ భయంతో డ్రైవర్లు ముందుకు రాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో డ్రైవర్ భద్రత, వారి కుటుంబ సభ్యుల భయాలను దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం సమీకరించిన ప్రతి వాహనం నడిపే డ్రైవర్లకు డ్రైవ్ ప్రొటెక్షన్ కిట్లను ఉచితంగా అందించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ కిట్లో ఒక శానిటైజర్ బాటిల్, రెండు డెట్టాల్ సబ్బులు, ఐదు చేతి గ్లవ్స్, ఐదు ఫేస్ మాస్క్లు ఉంటాయి. ఇలాంటి 10 వేల కిట్లను రవాణా శాఖ సిద్ధం చేసింది. -
కోవిడ్.. జాతీయ విపత్తు
న్యూఢిల్లీ: కోవిడ్ను భారత్ జాతీయ విపత్తుగా ప్రకటించింది. వ్యాధి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు హోంశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం రాసిన ఒక లేఖలో పేర్కొంది. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించిన కారణంగా కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని నిర్ణయించినట్లు తెలిపింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద రాష్ట్రాలకు సాయం అందించేందుకు నిర్ణయించింది. కోవిడ్ చికిత్సకు ఆసుపత్రుల్లో చేరేవారి కోసం ఈ నిధులు రాష్ట్రాలకు అందిస్తామని, ఇందుకు తగిన రేట్లను ఆయా రాష్ట్రాలే నిర్ణయిస్తాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ బాధితులకు తాత్కాలిక వసతి ఇచ్చేందుకు, ఆహారం, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు. క్వారంటైన్ క్యాంపుల సంఖ్య, ఎంత కాలం కొనసాగాలి? ఎంత మందిని ఈ క్యాంపుల్లో ఉంచాలన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకుంటాయి. ఎస్డీఆర్ఎఫ్ నిధులను ధర్మల్ స్కానర్లు, వెంటిలేషన్ తదితర పరికరాల కొనుగోలుకూ వాడవచ్చునని హోం శాఖ తెలిపింది. మార్గదర్శకాలను ట్వీట్ చేసిన ప్రధాని కోవిడ్ వైరస్ను నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఇళ్లలోనే గడిపే సందర్భంలో తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు మిమ్మల్నీ, మీ వాళ్లను రక్షించుకునేందుకు ఉపయోగపడతాయి’ అని ట్వీట్ చేశారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు అటాచ్డ్ బాత్రూమ్ ఉండే, గాలి, వెలుతురు బాగా వచ్చే గదిలో ఉండాలని సూచించారు. ఎక్కువ మంది అదే గదిలో ఉండాల్సి వస్తే 3అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉండాలని చెప్పారు. వీలైనంత వరకు వృద్ధులు, గర్భిణులు, పిల్లలకు దూరంగా ఉండాలన్న ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను ట్వీట్లో పేర్కొన్నారు. పద్మ ప్రదానోత్సవాలు వాయిదా మార్చి 26, ఏప్రిల్ 3వ తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో జరగాల్సిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం వాయిదావేసింది. వేర్వేరు రంగాల్లో విశేష కృషిచేసిన 141 మందికి కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించడం తెల్సిందే. ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులను గతంలో ప్రకటించారు. అంత్యక్రియలపై మార్గదర్శకాలు ఢిల్లీలో వైరస్ కారణంగా మృతి చెందిన 68 ఏళ్ల మహిళ అంత్యక్రియలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కరోనా మృతుల అంతిమ సంస్కారాలపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. మృతుల శరీరాల నుంచి ఇతరులకు వ్యాధి సోకే అవకాశం లేకపోయినప్పటికీ ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అపోహలను తొలగించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదంచేస్తాయి. శ్వాస సంబంధిత వ్యాధి అయిన కోవిడ్ దగ్గు, తుమ్ముల వల్ల బయటకు వచ్చే ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని, మార్చురీ నుంచి లేదా మృతదేహం నుంచి వ్యాపించే అవకాశం లేదని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎబోలా, నీపా వంటి వైరస్లు మృతుల శరీరాల నుంచి వెలువడే ద్రవాలను తాకడం ద్వారా రావచ్చుకానీ కరోనా అలా కాదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం శరీరాన్ని తగు విధంగా చుట్టి దహనం/ఖననం చేయవచ్చునని పేర్కొనడం గమనార్హం. -
కరోనా కలకలం : వీసా ఆన్ అరైవల్ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : చైనా కేంద్రంగా కరోనా వైరస్ పలు ప్రపంచ దేశాలకు వ్యాపించడంతో భారత ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. జపాన్, దక్షిణ కొరియా నుంచి వచ్చే ట్రావెలర్స్కు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇమిగ్రేషన్ బ్యూరో, హోం వ్యవహరాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు వెల్లడించాయి. మరోవైపు చైనాలో 44 తాజా మరణాలతో కరోనా వైరస్ మృతుల సంఖ్య 2,788కి చేరింది. చైనా వ్యాప్తంగా గురువారం 433 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 78,824కు పెరిగింది. ఈ డెడ్లీ వైరస్ బయటపడిన హుబేయ్ ప్రావిన్స్లోనే నూతన కేసులు, మృతుల సంఖ్య అధికంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. చదవండి : ‘ముక్క’ ముట్టడం లేదు! -
నిరుద్యోగులకు బొనాంజా; 84 వేల కొలువులు
సాక్షి, న్యూఢిల్లీ : పారామిలటరీ బలగాల్లో దాదాపు 84,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) 9,99,795 పోస్టులు మంజూరు కాగా ఏటా వివిధ గ్రేడుల్లో పది శాతం ఖాళీలు ఏర్పడుతున్నాయని, దీంతో ప్రస్తుతం 84,037 పోస్టులు భర్తీ చేసేందుకు ఖాళీగా ఉన్నాయని హోం శాఖ మంగళవారం లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది. కాగా, సీఆర్పీఎఫ్లో 22,980 ఖాళీలు, బీఎస్ఎఫ్లో 21,465, సీఐఎస్ఎఫ్లో 10,415, ఎస్ఎస్బీలో 18,102, ఐటీబీపీలో 6643, అస్సాం రైఫిల్స్లో 4432 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. నూతనంగా ఏర్పడిన పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్రం సత్వర చర్యలు చేపడుతుందని పేర్కొంది. రిక్రూట్మెంట్ నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను నియామకాలు, పదోన్నతులు, డిప్యుటేషన్ల ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. -
పౌరసత్వ రగడ : రాహుల్కు హోం శాఖ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. రాహుల్ పౌరసత్వంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హోం శాఖ కోరింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు ఆధారంగా రాహుల్కు నోటీసులు జారీ అయ్యాయి. రాహుల్ గాంధీకి నాలుగు పాస్పోర్ట్లున్నాయని, ఒకదానిపై ఆయన పేరు రౌల్ విన్సీ, క్రిస్టియన్గా నమోదైందని సుబ్రఃహ్మణ్య స్వామి ఇటీవల ఆరోపించారు. కాగా రాహుల్ పౌరసత్వంపై వివాదం నేపధ్యంలో ఈసీ ఇటీవల రాహుల్ నామినేషన్ పత్రాలను ఆమోదించడంతో కాంగ్రెస్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. మరోవైపు రాహుల్ పౌరసత్వంపై ఆమేధిలో ఆయనపై స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన ధ్రవ్లాల్ సైతం ఫిర్యాదు చేశారు. బ్రిటన్లో ఓ కంపెనీ నమోదు సమయంలో రాహుల్ గాంధీ తాను బ్రిటన్ పౌరుడినని ప్రకటించుకున్నారని ధ్రువ్లాల్ న్యాయవాది రవిప్రకాష్ పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతీయేతరులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని చెప్పారు. -
2018లో 96 మంది జవాన్ల ఆత్మహత్య
న్యూఢిల్లీ: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు బలగాలకు చెందిన 96 మంది జవాన్లు 2018లో వివిధ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే నివేదిక ద్వారా 2016లో 90 మంది, 2017లో 121 మంది జవాన్లు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు బలగాల పని పరిస్థితుల మెరుగుదల అనేది ఒక స్థిరమైన ప్రయత్నమని, అవసరమైనపుడు హోంశాఖ తగు సూచనలు చేస్తుందని కేంద్ర హోంశాఖకు చెందిన అధికారి కిరణ్ రింకు రాజ్యసభలో తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా కాలానుగుణంగా సమీక్ష నిర్వహిస్తోందని వివరించారు. జవాన్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఒత్తిడికి గల కారణాలపై ప్రొఫెషనల్ ఏజెన్సీల ద్వారా సమాచారం తెప్పించుకుని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మాక ప్రాంతాల్లో జవాన్లు పని చేసిన తర్వాత ఒత్తిడి తగ్గించడానికి, ఆత్మహత్యలను నివారించడానికి వారు కోరుకున్న చోట్ల పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెగ్యులర్గా అధికారులతో జవాన్లు తమ సమస్యలు చెప్పుకునే సమావేశాలు ఏర్పాటు చేసి ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. పని వేళలు కూడా తగ్గించి జవాన్లకు కావాల్సినంత విశ్రాంతి ఇస్తున్నట్లు, పని ఒత్తిడి మరింత తగ్గించేందుకు క్రీడలు కూడా నిర్వహిస్తున్నట్లు కిరణ్ రింకు రాజ్యసభలో తెలిపారు. -
ఉద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం
న్యూఢిల్లీ: కేంద్ర పారా మిలటరీ బలగాల్లో 76,578 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు హోంశాఖ తెలిపింది. ఈ మొత్తం ఉద్యోగాల్లో 54,953 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా, వీటిలో మహిళల కోసం 7,646 పోస్టులను కేటాయించినట్లు వెల్లడించింది. కానిస్టేబుల్ పోస్టుల్లో సీఆర్పీఎఫ్లో అత్యధికంగా 21,566 ఖాళీలు ఉండగా, బీఎస్ఎఫ్(16,984), ఎస్ఎస్బీ(8,546), ఐటీబీపీ(4,126) అస్సాం రైఫిల్స్(3,076) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. ఇందుకోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 2019, ఫిబ్రవరి 11 నుంచి మార్చి 11 వరకూ కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. ఇక సబ్ఇన్స్పెక్టర్ హోదాలో 1,073 పోస్టులు ఉండగా వాటిలో బీఎస్ఎఫ్లో 508, సీఆర్పీఎఫ్లో 274, ఎస్ఎస్బీలో 206, ఐటీబీపీలో 85 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా ట్రేడ్స్మెన్, హోంశాఖ, వైద్యం, పారా మెడికల్, కమ్యూనికేషన్, ఇంజనీరింగ్ రంగాల్లో మరో 20,086 పోస్టులను పదోన్నతుల ద్వారా హోంశాఖ భర్తీ చేయనుంది. -
ఎలాగైనా ఆపాలనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) ప్రక్రియను ఎలాగైనా అడ్డుకోవాలని కేంద్రం భావిస్తోందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్–మే నెలల్లో జరుగుతాయని భావిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర సాయుధ బలగాలు విధులు నిర్వర్తించాల్సి ఉందని, ఆ సమయంలో ఈ ప్రక్రియను రెండు వారాల పాటు నిలిపేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దాఖలుచేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఎన్ఆర్సీని పూర్తిచేయడానికి గతంలో విధించిన జూలై 31 గడువును పొడిగించేది లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో కేంద్రం సహకరించడం లేదని, ఎన్ఆర్సీ ప్రక్రియను మొత్తం నాశనం చేసేలా హోం శాఖ వ్యవహరిస్తోందని తప్పుపట్టింది. రాష్ట్ర అధికారులకు లోక్సభ ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశాల్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. లోక్సభ ఎన్నికల వల్ల ఎన్ఆర్సీ నమోదుకు ఆటంకం కలగకుండా చూడాలని ఇది వరకే అత్యున్నత ధర్మాసనం అస్సాం ప్రభుత్వం, ఎన్ఆర్సీ కోఆర్డినేటర్, ఈసీలకు సూచించింది. గడువులోనే పూర్తిచేస్తాం: రాజ్నాథ్ నిర్దిష్ట గడువులోగా ఎన్ఆర్సీని పూర్తిచేయడానికి కట్టుబడి ఉన్నామని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. విదేశీయులకు ఈ జాబితాలో స్థానం కల్పించమని, అలాగే ఒక్క భారతీయుడిని కూడా విస్మరించమని హామీ ఇచ్చారు. ఎన్ఆర్సీ ప్రక్రియ న్యాయబద్ధంగా జరగాలని కోరుకుంటున్నామని, ఇందుకు అవసరమైన అన్ని నిధుల్ని అస్సాంకు సమకూర్చామని చెప్పారు. సుప్రీంకోర్టు కేంద్రానికి చీవాట్లు పెట్టిన కొన్ని గంటల తరువాత రాజ్నాథ్ ఈ విధంగా స్పందించారు. -
నిఘాపై అట్టుడికిన రాజ్యసభ
న్యూఢిల్లీ: కంప్యూటర్లపై నిఘా పెట్టేందుకు పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులకు అధికారాలిస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల అంశంపై రాజ్యసభ అట్టుడికింది. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధింపుపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. సభ ప్రారంభం కాగానే ఈ అంశాలపై విపక్షాలు ఆందోళన చేపట్టడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. తిరిగి 2.30 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కంప్యూటర్ సమాచారంపై నిఘా అంశాన్ని లేవనెత్తారు. దేశంలో అప్రకటిత అత్యయిక స్థితి తుదిరూపు దిద్దుకుందని ఆయన ఆరోపించారు. వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ మాట్లాడుతూ.. 2009లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన నిబంధనలపైనే దొంగ ఏడుపు ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, రానురాను పోలీసుల రాజ్యంగా మారుతోందని మండిపడ్డారు. ఉత్తర్వుల్లో ఎక్కడ కూడా జాతీయ భద్రత, రక్షణ అనే పదం లేదని ఆజాద్ పేర్కొన్నారు. కావేరీ సమస్యపై రాజ్యసభలో అన్నా డీఎంకే సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలనపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరగకపోవడం దారుణం అని ఆజాద్ పేర్కొన్నారు. స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి.. ప్రజా ప్రతినిధులకు స్వీయ క్రమశిక్షణ ఉండాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా నడిచేలా చూసే బాధ్యత వారిపై ఉందని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. కాగా, శుక్రవారం లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే రఫేల్ వివాదంపై కాంగ్రెస్, కావేరీ డ్యాం వివాదంపై అన్నా డీఎంకే పార్టీల సభ్యులు నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేపట్టారు. ఇకపై లోక్సభ వెల్లోకి దూసుకెళ్లి సభా కార్యకలాపాలకు భంగం కలిగించే ఎంపీలు ఆటోమేటిక్గా సస్పెండ్ కానున్నారు. ఉద్దేశపూర్వకంగా వెల్లోకి దూసుకొచ్చి ఆందోళనలు చేపట్టే ఎంపీలపై ఆటోమేటిక్గా వేటు పడేలా నిబంధనను సవరించాలని నిబంధనల కమిటీ సిఫార్సు చేసింది. -
కంప్యూటర్లపై కేంద్రం నిఘా
న్యూఢిల్లీ: కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా నేత్రం పెట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దేశంలోని ఏ కంప్యూటర్లోకి అయినా చొరబడి, అందులోని సమాచారాన్ని విశ్లేషించేందుకు, డీక్రిప్ట్(సంకేత భాష నుంచి సాధారణ భాషలోకి మార్చడం) చేయడానికి పది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధికారాలిచ్చింది. ఇందులో దర్యాప్తు, నిఘా, భద్రత, పోలీసు విభాగాలున్నాయి. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి దాటాక నోటిఫికేషన్ జారీ అయింది. నిఘా సంస్థలకు కొత్తగా ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని, 2009 నుంచి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే తాజా ఆదేశాలు జారీ చేశామని కేంద్రం ప్రకటించింది. మరోవైపు, తాజా నోటిఫికేషన్ పౌరుల ప్రాథమిక హక్కులను ప్రమాదంలోకి నెడుతుందని, దేశాన్ని నిఘా రాజ్యంగా మారుస్తుందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ప్రభుత్వ చర్య చట్టబద్ధమేనని, ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా సమాచార సాంకేతిక చట్టంలో పలు రక్షణలున్నాయని కేంద్రం సమర్థించుకుంది. విపక్షాలు గుడ్డిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని తిప్పికొట్టింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ ఈ నిబంధనల్ని రూపొందించింది. ప్రయోజనాలు ఇవే.. ‘ఏవైనా కంప్యూటర్లలో భద్రపరచిన, రూపొందించిన, అక్కడి నుంచి వేరే చోటికి పంపిన, వేరేచోటి నుంచి స్వీకరించిన సమాచారాన్ని అడ్డగించి, పర్యవేక్షించి, డిక్రిప్ట్ చేయడానికి ఈ పది సంస్థలకు అధికారాలు ఇస్తున్నాం’ అని హోం శాఖ ప్రకటనలో తెలిపింది. టెలిగ్రాఫ్ చట్టంలో మాదిరిగానే ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఈ నోటిఫికేషన్తో మూడు ముఖ్య ప్రయోజనాలున్నట్లు తెలిపింది. అందులో మొదటిది..సమాచార విశ్లేషణ, పర్యవేక్షణ చట్ట పరిధికి లోబడి జరుగుతుంది. రెండోది..ఈ అధికారాల్ని కొన్ని సంస్థలకే కట్టబెట్టడం ద్వారా అవి ఇతర సంస్థలు, వ్యక్తుల చేతుల్లో దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చు. మూడోది.. దేశ సార్వభౌమత్వం, రక్షణ, ఇతర ప్రయోజనాల రీత్యా అనుమానాస్పద సమాచార మార్పిడిపై ఓ కన్నేసేందుకు వీలవుతుంది. హోం శాఖ కార్యదర్శి అనుమతితోనే.. కంప్యూటర్లపై నిఘా పెట్టే ముందు కంపీటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. ఐటీ చట్టంలోని సెక్షన్ 69లోని ఉప సెక్షన్1లో పేర్కొన్న అవసరం మేరకు పలానా కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా ఉంచాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జాబితాలోని సంస్థను కోరొచ్చు. టెలిగ్రాఫ్ చట్టం మాదిరిగానే ఇక్కడ కూడా సమీక్ష కమిటీకి లోబడికి ఈ మొత్తం ప్రక్రియ జరుగుతుంది. కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ఈ కమిటీ కనీసం రెండు నెలలకోసారి సమావేశమై తమ ముందుకొచ్చిన ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రాల స్థాయిలో సమీక్ష కమిటీ సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతుంది. నిఘా సంస్థలు కోరితే సర్వీస్ ప్రొవైడర్లు, కంప్యూటర్ వినియోగదారులు, చివరికి వ్యక్తిగత కంప్యూటర్ల వినియోగదారులు కూడా అవసరమైన సహకారం అందించాలి. లేని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం.. పలానా ఫోన్కాల్స్ను ట్యాపింగ్ చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి నిఘా, భద్రతా సంస్థల్ని ఆదేశించేందుకు ఇది వరకే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. పాత నిబంధనలు అమలుచేసేందుకే: జైట్లీ హోం శాఖ తాజా నోటిఫికేషన్ రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిఘా రాజ్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు మూకుమ్మడిగా దుమ్మెత్తిపోశాయి. కంప్యూటర్లలోని సమాచారాన్ని అడ్డగించి, విశ్లేషించేందుకు యూపీఏ హయంలో 2009లోనే నిబంధనలు రూపొందించారని, వాటిని అమలుచేసే సంస్థల్నే తాజాగా ప్రకటించామని కేంద్రం తన చర్యను సమర్థించుకుంది. దేశాన్ని పోలీసు రాజ్యంగా మారిస్తే ప్రధాని మోదీ సమస్యలు పరిష్కారం కావని, నిఘా పెంచే ప్రయత్నాలు ఆయన ఓ అభద్ర నిరంకుశ పాలకుడని సూచిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా, ఇదే వ్యవహారం పార్లమెంట్ను కూడా కుదిపేసింది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి తుది దశకు చేరుకుందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. పూర్తి వివరాలు తెలుసుకుని ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తితే బాగుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. పుట్టలు కూడా లేనిచోట శిఖరాలు ఉన్నట్లు విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కంప్యూటర్లపై నిఘా ఉంచేందుకు కేంద్రం అధికారాలిచ్చిన సంస్థలు ఇవే.. 1.ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) 2. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 3.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 4.ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) 5.డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) 6. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 7. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) 8. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) 9. డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్(కశ్మీర్, ఈశాన్య రాష్ట్రా ల్లో సేవల నిమిత్తం) 10. ఢిల్లీ పోలిస్ కమిషనర్. దేశ భద్రత కోసమే ‘దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ ఉత్తర్వులు జారీచేశాం. పౌరుల కంప్యూటర్లపై నిఘాకు 10 సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయి’ – ఐటీ మంత్రి రవిశంకర్ కాంగ్రెస్ది తప్పుడు ప్రచారం ‘పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తున్నామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇది అబద్ధం. ఈ టెక్నాలజీని వాడకుంటే ఉగ్రవాదుల్ని ఎలా పట్టుకోగలం?’ – ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మోదీ గురించి తెలుస్తుంది ‘మోదీజీ.. భారత్ను పోలీస్ రాజ్యంగా మార్చేస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోవు. అది కేవలం మీరు ఎంత అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్న నియంతో దేశంలోని 100 కోట్ల మందికిపైగా ఉన్న భారతీయులకు తెలియజేస్తో్తంది’ – కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కొత్త ఉత్తర్వులెందుకు? 2009 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉంటే కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం ఏముంది? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఓటమితో బీజేపీకి భయం పట్టుకుంది. దీంతో నిఘా పెట్టడం, సమాచార చౌర్యం ద్వారా ప్రజలను బెదిరించాలని చూస్తోంది. ప్రజా వ్యతిరేకతను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది’ –కాంగ్రెస్ నేత జయ్వీర్ షేర్గిల్ -
దర్యాప్తు సంస్థలు కంప్యూటర్లోకి చొరబడవచ్చు
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలకు సరికొత్త అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ కంప్యూటర్నైనా క్షుణంగా పరిశీలించే అధికారాన్ని పలు దర్యాప్తు సంస్థలకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పది దర్యాప్తు సంస్థలకు ఈ నిబంధనలు వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం సంతకం చేశారు. వీటిలో సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కో కంట్రోల్ బ్యూరో, ఈడీ, సీబీడీటీ, డీఆర్ఐ, ఎన్ఐఏ, రా, డీఎస్ఐ, ఢిల్లీ పోలీసులకు ఈ కొత్త అధికారాన్ని కల్పించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం కంప్యూటర్లోని సమాచారాన్ని, మెయిళ్లను, డేటాను పరిశీలించే అధికారం ఆయా దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. అంతేకాకుండా మెయిళ్లను అడ్డుకునే, పర్యవేక్షించే అధికారం కూడా దర్యాప్తు సంస్థలకు కల్పించబడింది. గతంలో దర్యాప్తు సంస్థలకు వాడుకలో ఉన్న డేటాను మాత్రమే నియంత్రించే అధికారం ఉండేది. దర్యాప్తు సంస్థలకు కొత్త అధికారాలు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తుందని మండిపడుతున్నాయి. కేంద్రం బిగ్ బ్రదర్లా అన్నింట్లో వేలు పెట్టే ప్రయత్నం చేస్తుందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఇది భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అధికారాలు దుర్వినియోగం కావని కేంద్రం చెప్పగలదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం అవసరం ఈ అపరమిత అధికారం ఇప్పుడెందుకని నిలదీస్తున్నారు. -
మానవ అక్రమ రవాణా నియంత్రణపై సమష్టి కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన కార్యాచరణపై రాష్ట్ర పోలీస్ శాఖ–కేంద్ర హోంశాఖ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది. శనివారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని పోలీస్ అధికారుల మెస్లో జరిగిన రాష్ట్ర స్థాయి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సదస్సును డీజీపీ మహేందర్రెడ్డి, రిటైర్డ్ డీజీపీ పీఎం నాయర్ కలిసి ప్రారంభించారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలు, అదనపు ఎస్పీలు మొత్తం 100మంది వరకు పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై గ్రూప్ డిస్కషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై సుదీర్ఘంగా శిక్షణ ఇచ్చారు. అక్రమ రవాణా కేసుల నమోదు, వాటి దర్యాప్తులో చేపట్టాల్సిన అంశాలపై మహేందర్రెడ్డి, పీఎం నాయర్ అధికారులకు అవగాహన కల్పించారు. చట్టపరంగా సమన్వయం చేసుకోవాల్సిన విభాగాలు, వాటి ద్వారా చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా శిక్షణ కొనసాగింది. అక్రమ రవాణా కూపాల నుంచి బయటపడ్డ బాధితులకు అందాల్సిన పరిహారం, స్వచ్ఛంద సంస్థల సహకారంపై వేగవంతంగా స్పందించాలని సూచించారు. యూనిసెఫ్ నుంచి వచ్చిన ప్రతినిధులు మానవ అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, అందుకు తగిన సహకారంపై ప్రజెంటేషన్ అందించారు. ప్రజ్వల, మై చాయిస్, దివ్యదిశ, తరుణి, బచ్పన్ బచావ్, సంకల్ప్ తదితర స్వచ్ఛంద సంస్థలతో ఈ కార్యక్రమంలో కలిసి చేపట్టాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మెట్రోపాలిజన్ సెషన్స్ జడ్జి వెంకట కృష్ణయ్య అవగాహన కల్పించారు. హైదరాబాద్ కమిషనరేట్లో ఏర్పాటుచేసిన భరోసా లాంటి సెంటర్లను జిల్లాల్లోనూ వేగవంతంగా విస్తరించి చర్యలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, మహిళ భద్రత విభాగం ఐజీ స్వాతిలక్రా, ఎస్పీ సుమతి, ప్రజ్వల ఎన్జీవో నిర్వాహకురాలు సునీతకృష్ణన్, మహిళ శిశుసంక్షేమ శాఖ అధికారులు, పలు స్వచ్చంద సంస్థల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు. -
అమిత్షాపై దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్
-
కేంద్ర హోంశాఖ వెబ్ సైట్ హ్యాక్.. అంతా బ్లాక్!
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని సంబంధితశాఖ అధికారులు వెల్లడించారు. హోంశాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయిందన్న విషయాన్ని గుర్తించిన వెంటనే ఆ వెబ్ సైట్ ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ బృందం తాత్కాలికంగా బ్లాక్ చేసింది. సైబర్ నేరగాళ్లు డాటా చోరీకి పాల్పకుండా ఇలా చేసినట్లు సమాచారం. కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ హ్యాక్ అయిన సైట్ ను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగింది. గత నెలలో పాకిస్తాన్ కు చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) అధికారిక వెబ్ సైట్ హ్యాక్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, భారత్ కు వ్యతిరేకంగా సమాచారాన్ని పోస్ట్ చేయడం అప్పట్లో కలకలం రేపింది. గత నాలుగేళ్ల వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 700కు పైగా వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ కేసుల్లో 8,348 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు గతవారం ఓ నివేదికలో వెల్లడైంది. -
ఖాతా వివరాలు ఆన్లైన్లో లేకుంటే చర్యలు
ఎన్జీవోలకు హోంశాఖ ఆదేశాలు న్యూఢిల్లీ: విదేశాల నుంచి నిధులు సేకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలు తమ బ్యాంకు ఖాతా వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో ఉంచాలని లేకుంటే చర్యలు తప్పవని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఎన్జీవోల వార్షిక పన్ను రిటర్నుల హార్డుకాపీలను స్వీకరించబోమని, అవన్నీ ఆన్లైన్లోనే సమర్పించాలని కూడా ఆదేశించింది. ఈ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యే సంస్థలు లేదా వ్యక్తులు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం–2010 కింద శిక్షార్హులవుతారని హోంశాఖ ప్రకటించింది. విదేశీ నిధులు పొందే సంస్థలు తమ ఆదాయ వ్యయాల వివరాలు, బ్యాలెన్స్ షీట్ల స్కానింగ్ కాపీలను డిజిటల్ సంతకం చేసిన నివేదికతో పాటు ఆర్థిక సంవత్సరం ముగిసిన 9 నెలల్లోపే ఆన్లైన్లో సమర్పించాలని ఆదేశించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పలువురు తమ రిటర్నులను హార్డు కాపీల రూపంలో దాఖలు చేశారని, అయితే తాము వాటిని అంగీకరించలేదని పేర్కొంది. -
ఆ పత్రాలు మా వద్ద లేవు
ఎమర్జెన్సీలో మానవ హక్కుల తొలగింపుపై హోం శాఖ న్యూఢిల్లీ: ఆత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) విధించిన నాటి రోజుల్లో మానవ హక్కులను తాత్కాలికంగా తొలగించిన దానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద లేవని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర సమాచార కమిషన్కు (సీఐసీ) తెలిపింది. 1975లో ఆత్యయిక స్థితి అమలులో ఉన్న సమయంలో మానవ హక్కుల తొలగింపునకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. హోం మంత్రిత్వ శాఖలోని మానవ వనరుల విభాగం దీనికి సమాధానమిస్తూ..తమ విభాగం 1993లో ఏర్పాటైందనీ, 1975 నాటి సమాచారం తమ వద్ద లేదని తెలిపింది. ఈ మేరకు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని సీఐసీ హోం శాఖను ఆదేశించింది.