-
పేదవాడి గుండె చప్పుడు సీఎం జగన్
-
ప్రజా సంక్షేమ రథ సారథి!
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటికే ఉన్న వ్యవస్థలను అత్యంత ప్రభావవంతం చేయడంతో పాటు, ప్రజల కోసం నూతన వ్యవస్థలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సంక్షేమ రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలూ, ప్రజలకు సంక్షేమ ఫలాలను చేరవేస్తున్న తీరూ విప్లవాత్మకం. అందుకే సంక్షేమ రంగానికి సంబంధించినంత వరకూ ప్రగతి గురించి చెప్పుకోవాలంటే జగన్కు ముందు, జగన్ తర్వాత అని చెప్పుకోవాలి. ఈ కారణంగానే యావత్ భారత దేశం ఈరోజున ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. జగన్ తన నాలుగేళ్ల పదవీ కాలంలోనే ఎవరూ పూర్తిగా గుర్తు పెట్టుకోలేనన్ని ఎక్కువ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటి వరకూ ఉన్న వ్యవస్థల పని తీరును ప్రభావితం చేస్తూ వాటిని ప్రజలకు మరింత చేరువ చేయగలిగారు. ఉదాహరణకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చే పథకాలు గత ప్రభుత్వాల హయాంలోనూ ఉన్నాయి. అయితే అప్పట్లో పెన్షన్ మంజూరు కావడం, పెన్షన్ మొత్తాలు చేతికి అందడం పెద్ద ప్రహసనంగా ఉండేది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అర్హత కలిగిన వారికి పెన్షన్ల మంజూరు చాలా సులభతరంగా మారింది. కచ్చితంగా ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి కొచ్చి తలుపుతట్టి పెన్షన్ మొత్తాలను అందించే సరికొత్త వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడింది. పెన్షన్లను మాత్రమే కాదు రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా పేదలకు అందించే బియ్యం తదితర చౌక వస్తువుల కోసం దుకాణాల వరకూ వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి ముంగిటకే రేషన్ వాహనాలను తెచ్చి పెట్టారు. అలాగే ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి ‘దిశ యాప్’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అందరి మన్ననలూ పొందుతోంది. గతంలోనూ సంక్షేమ పథకాలు ఉన్నా... లబ్ధిదారులకు ఆ ఫలాలు చేరడానికి దళారీ వ్యవస్థ వాహకంగా ఉండేది. ‘కులం చూడం, మతం చూడం, పార్టీలు అసలే చూడం.. పేదరికం ఒక్కటే అర్హతకు ప్రామాణికం’ అన్నదే సంక్షేమ పథకాల అజెండాగా జగన్ పెట్టుకున్నారు. ఒక్క బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్న ‘డీబీటీ’ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ ఫర్) విధానం సీఎంగా జగన్ రాకతోనే వచ్చింది. ఈ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయ డంలో ఎక్కడైనా పొరపాట్లు దొర్లి దాని కారణంగా ఎవరైనా అర్హులు నష్టపోయే పరిస్థితి ఏర్పడితే అలాంటివారు ఎప్పుడైనా ఆ పథకాల కోసం దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందే వెసులుబాటు కలిగించారు. గతంలో కుల, ఆదాయ సర్టిఫికెట్లు లాంటివి తీసుకోవాలంటే పెద్ద తతంగమే ఉండేది. లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవ స్థకు రూపకల్పన చేశారు. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కం సర్టిఫికెట్, ఈడబ్లు్యఎస్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లాంటి ముఖ్యమైన సర్టిఫికెట్లను ఈ రోజున ప్రజలు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, ఎవ రినీ కలవాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారా సులభంగా అందుకోగలుగుతున్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు ఎలాంటి వివాదాల్లేకుండా ఇళ్ల స్థలాలను అందించడం కూడా సచివాలయాల ద్వారా మత్రమే సాధ్యమైంది. సచివాలయాలకు అనుబంధంగా సీఎం జగన్ సృష్టించిన 2.56 లక్షల మంది ‘వాలంటీర్ల’ వ్యవస్థ... సిఫార్సులు, పైరవీలను పాతరేసింది. వ్యవసాయానికి వెన్ను దన్నుగా రైతుకు విత్తనాలు అందించడం దగ్గర నుంచి వ్యవసాయోత్పత్తుల అమ్మకాల దాకా ఆసరాగా నిలిచే ‘రైతు భరోసా కేంద్రాలు’ (ఆర్బీకే) కూడా ఈ రోజున దేశ, విదేశీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, బాబూ జగ్జీవన్ రామ్, మౌలానా ఆజాద్, కొమురం భీం, అల్లూరి సీతారామరాజు కోరుకున్న సమాజం దిశగా ప్రభుత్వ ఫలాలు అట్టడుగువర్గాల వారికి చేరాలంటే పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అత్యధిక ప్రాధా న్యత ఇవ్వాలన్నది జగన్ ప్రభుత్వం నమ్మిన సిద్ధాంతం. తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రిది. ఏ వర్గాలైతే ఇంత కాలం అణచి వేయబడ్డాయో, ఏ వర్గాలైతే ఇంత కాలం రాజకీయ పదవులకు దూరంగా ఉన్నాయో ఆ వర్గాలకు రాజ్యాధికారం దక్కుతోంది. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన జకియా ఖానవ్ుకు అవకాశం ఇచ్చారు. ఇది కాకుండా శాశ్వత ప్రాతిపదికన ‘బీసీ కమిషన్’తో పాటుగా ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి, దాన్ని అమలు చేసిన తొలి ప్రభుత్వం జగన్దే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనతా జగన్ సర్కార్దే. గత మూడేళ్ల కాలంలోనే రెగ్యులర్, ఔట్ సోర్సింగ్లతో కలిపి ఇప్పటి వరకూ 2.61 లక్షల ఉద్యో గాలను బీసీ వర్గాల వారికి ఇవ్వడం, గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చిన 1.30 లక్షల శాశ్వత ఉద్యో గాలలో 83 శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయమే. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వర్గాల వారికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న చేయూతను చూసి ‘మేము కూడా ఈ సామాజిక వర్గాల్లో పుట్టి ఉంటే బాగుండేద’నే భావన ఈ రోజున అగ్రవర్ణాల వారిలో కలుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న జగన్ కలకాలం ఆయురారోగ్యాలతో విలసిల్లాలి! డా‘‘ మేరుగు నాగార్జున వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
రాజంపేట.. జనంతోట
సాక్షి రాయచోటి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకొన్న బడుగు, బలహీన వర్గాలు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సాధికారతను ప్రదర్శించాయి. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు మంగళవారం రాజంపేటకు తరలివచ్చారు. వేలాది మంది జై జగన్ నినాదాలు చేస్తుండగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర సాగింది. మధ్యాహ్నం మన్నూరు వద్దగల యల్లమ్మ ఆలయంలో నేతలు పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి యాత్ర పాత బస్టాండ్ వరకు సాగింది. వేలాది ప్రజలు హాజరైన సభలో నేతలు ప్రసంగించారు. బడుగు, బలహీనవర్గాలను వెన్ను తట్టి నడిపించిన నాయకుడు జగన్: డిప్యూటీ సీఎం అంజాద్బాష రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారిని వెన్నుతట్టి నడిపించిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని డిప్యూటీ సీఎం అంజాద్బాష చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపించి, సామాజిక న్యాయంతో సాధికారత సాధించిన సీఎం దేశంలో వైఎస్ జగన్ ఒక్కరేనని అన్నారు. కేవలం మాటలతో సరిపెట్టక, ఆలోచనలతో ఆగిపోకుండా, ఆచరణలో అనేక పథకాలతో పేదల ఆర్థికస్థాయిని పెంచారని, రాజకీయంగా ఉన్నత పదవులిచ్చి సామాజిక సాధికారతకు అసలైన అర్థం చెప్పారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో 17 పదవులిచ్చారని, ఇతర పదవులు, నామినేటెడ్ పదవుల్లోనే అధికశాతం ఈ వర్గాలకే ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరింతగా అభివృద్ధి సాధించాలంటే జగన్ను మరోసారి సీఎంను చేసుకోవాలన్నారు. మనకు, పిల్లల భవిష్యత్తుకు వైఎస్ జగన్ అవసరం: మంత్రి మేరుగు మనతోపాటు మన పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరికొంత కాలం సీఎంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో బడుగులకు అండగా నిలుస్తున్న నాయకునికి మద్దతు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుండెల మీద చేయి వేసుకుని బతుకుతున్నారంటే అది సీఎం జగన్ చలవేనని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలను అడుగడుగునా అవహేళన చేసి, అవమానించిన చంద్రబాబు ఓ దురహంకారి అని అభివర్ణించారు. రాష్ట్రంలో బడుగులకే పెద్దపీట: మాజీ ఎంపీ బుట్టా రేణుక రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకే సీఎం జగన్ పెద్దపీట వేసి, వారిని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీలను ఉన్నత స్థానాల్లో నిలుపుతోందని తెలిపారు. ప్రతి హామీని నెరవేర్చారు సీఎం జగన్ : ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ ఈ వర్గాలన్నింటినీ అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగనన్న ఒక్కరేనని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ కొనియాడారు. విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసి, బడుగు బలహీనవర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నారన్నారు. ఇంగ్లిష్ చదువులతో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు అంతర్జాతీయస్థాయిలో పోటీపడాలని తపిస్తున్న జగనన్నను 2024లో మరోమారు ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి , జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, రాయలసీమ జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురే‹Ùబాబు, ఎమ్మెల్సీ రమే‹Ùయాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ అశ్వర్థనాయక్ పాల్గొన్నారు. -
మళ్లీ జగనే కావాలి... మళ్లీ జగనే రావాలని
-
కమలాపురం.. జనసంద్రం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. చెన్నూరులో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి డప్పుల దరువులు, ఆటపాటలతో ప్రజానీకం ర్యాలీగా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇలా వేలాది మంది తరలి రావడంతో సభాస్థలిలో అందరూ కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది. వెరసి చెన్నూరులో ఎటు చూసినా, ఏ వీధిలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీ జెండాలను రెపరెపలాడిస్తూ కనిపించారు. కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు తమ ప్రసంగాల్లో సీఎం జగన్ పేరును ఉచ్ఛరించగా.. సభికులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. అంబేడ్కర్ ఆలోచన విధానాలు అమలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావ్ పూలే, కొమురం బీమ్ వంటి మహానీయుల ఆలోచనలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అణగారిన వర్గాలకు అండగా, భావి తరాల ఉన్నతికి దూరదృష్టితో పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్ను మరోమారు మన కోసం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కామెడీ యాక్టర్ పవన్, నయవంచకుడు చంద్రబాబు కలిసికట్టుగా వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మొద్దని సూచించారు. సామాజిక సాధికారత మా విధానం : డిప్యూటీ సీఎం అంజద్బాషా స్వతంత్ర భారతదేశంలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే మిగిలిపోయిందని, అయితే వైఎస్సార్సీపీ సామాజిక సాధికారతను తన విధానంగా మార్చుకుందని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్బాషా చెప్పారు. 2014–19 వరకు సాగిన టీడీపీ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదని, వైఎస్సార్సీపీ.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా చేసిందని, మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిందన్నారు. తనకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. ఏపీలోనే సామాజిక విప్లవం: మంత్రి మేరుగు సామాజిక న్యాయం అనేది ఏపీలోనే, వైఎస్ జగన్ నాయకత్వంలోనే సాకారమైందని సాంఘిన సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా బడుగులకు రావాల్సిన హక్కులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితులపై, బీసీలపై దాడులు చూశామని, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న నాడే చంద్రబాబు దళితద్రోహి అని తేలిపోయిందని, బీసీల తోకలు కత్తిరిస్తానన్న నాడే బీసీ వ్యతిరేకి అని వారు పసిగట్టారని చెప్పారు. సన్నిధి గొల్ల కొనసాగింపు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమల సన్నిధి గొల్లను తిరిగి కొనసాగించి రాష్ట్రంలోని యాదవుల ఆత్మగౌరవాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిపారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రాయలసీమలో తొలిసారి యాదవులకు ఎమ్మెల్సీ దక్కిందని, మేయర్ పదవులను యాదవులకు అప్పగించి గౌరవించిన చరిత్ర సీఎం జగన్దేనన్నారు. ఆచరణలో చూపిన సీఎం: ఎంపీ అవినాష్రెడ్డి సామాజిక సాధికారిత కాగితాలకే పరిమితమయ్యేదని.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే దానిని ఆచరణలో చూపారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చెప్పారు. కేబినెట్ కూర్పు నుంచి నామినేటెడ్ పదవులు.. చివరకు ఆలయాల పాలక మండళ్లలో సైతం చిత్తశుద్ధి ప్రదర్శించారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం పాటించిన చరిత్ర జగనన్నదేనని మాజీ ఎంపీ బుట్టా రేణుకా అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్యాదవ్, రామచంద్రారెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాయం..శరవేగం
-
రెండుచోట్లా ఓటేయకుండా చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి:తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా ఎన్నికల కమిషన్ కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్కు విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఓటర్ల నమోదుకు సంబంధించి టీడీపీ చేస్తున్న అక్రమాలపై మంగళవారం ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీకి సంబంధించి ఓటర్ల నమోదు, రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహించడంపై ఫిర్యాదు చేసి, ఆధారాలు సమర్పించారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు హైదరాబాద్ ప్రగతి నగర్లో బ్యానర్లు కట్టి మరి ఓటర్ల రిజిస్ట్రేషన్ చేస్తున్నారని వివరించారు. ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. మాజీ ఎన్నికల కమిషనర్ రమేషు్కమార్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో సంస్థ పెట్టి, దానికి కార్యదర్శిగా ఉంటూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో లేని వారిని తీసుకువచ్చి టీడీపీ ఇక్కడ ఓటర్లుగా చేర్పిస్తోందన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. -
చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు
-
తెలంగాణ ఓట్లను ఏపీకి మార్చడానికి సిగ్గులేదా?: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాను మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మంగళవారం కలిశారు. హైదరాబాద్లో టీడీపీ ఆధ్వర్యంలో ఏపీ ఓటర్ల రిజిస్ట్రేషన్ చేయడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరారు. చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు: మంత్రి మేరుగు అనంతరం మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రగతినగర్లో బ్యానర్లు కట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సిగ్గులేకుండా పక్క రాష్ట్రంలో బ్యానర్లు కట్టి ఓట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. మాజీ మంత్రి ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి’’ అంటూ మంతి మేరుగ మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రలు: మల్లాది విష్ణు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. స్థిర నివాసం ఉన్నచోటే ఓటు హక్కు కల్పించాలి: లేళ్ల అప్పిరెడ్డి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, స్థిర నివాసం ఉన్నచోటే ఓటు హక్కు కల్పించాలని సీఈవోను కోరాం. తెలంగాణ ఓట్లను ఏపీలో మార్చడానికి సిగ్గులేదా?. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా వాలంటీర్లను ఉపయోగించడం లేదు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ టీడీపీ కండువా వేసుకుని మాట్లాడితే బాగుంటుంది’’ అంటూ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: ‘మిచౌంగ్’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది -
అన్ని మూసుకొని కూర్చున్న చంద్రబాబు...కాంగ్రెస్ గెలిస్తే సంబరాలా !
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు
-
బడుగుల అభివృద్ధి కనిపించడంలేదా?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో బడుగువర్గాల అభివృద్ధి ఈనాడు రామోజీరావుకు కనిపించడంలేదా అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిఢవిల్లుతున్న సామాజిక విప్లవం, నెరవేరుతున్న అంబేడ్కర్ ఆశయాలు వృద్ధ రామోజీరావు కంటికి కనిపించడం లేదని మండిపడ్డారు. దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా రాష్ట్రంలో బడుగులు అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. పని గట్టుకుని వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లుతూ రోత రాతలు రాసే రామోజీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరదీశారని చెప్పారు. అంబేడ్కర్ కోరుకున్న విధంగా విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన చేస్తున్నారన్నారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకన్నా మిన్నగా తీర్చిదిద్ది, ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టి పేద కుటుంబాల్లోని పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యనందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఇప్పుడు ఇంగ్లిష్ కూడా అనర్గళంగా మాట్లాడటం రామోజీకి కనిపించడంలేదన్నారు. ఇవేవీ రామోజీకి పట్టవని.., ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అణగదొక్కిన చంద్రబాబు మాత్రం ఆయనకు చాలా స్వీటుగా కనిపిస్తున్నారని అన్నారు. ఏపీలో దళితులకు అన్యాయం జరుగుతున్నట్లు రామోజీ చూపిస్తున్న కపట ప్రేమ అని, వాస్తవానికి రామోజీ, చంద్రబాబు ఇద్దరూ దళిత వ్యతిరేకులేనని స్పష్టంచేశారు. దళితుల భూముల్ని లాక్కుని ఫిల్మ్సిటీ నిర్మించుకుని రూ.లక్షల కోట్ల ఆస్తులు పోగేసుకున్నది రామోజీరావని అన్నారు. దళితులపై దాడుల్లో దేశంలో నాలుగో స్థానంలో నిలిచిన చరిత్ర చంద్రబాబుదన్నారు. బాబు చేసిన దళిత ఊచకోతలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. కారంచేడు, పదిరికుప్పం, చుండూరు, నీరుకొండ ఘటనలన్నీ బాబు హయాంలో ఆయన సామాజికవర్గం చేసిన దాష్టీకాలేనన్నారు. దళితులు బిక్కుబిక్కు మంటూ బతికారని, ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం మారుతుందా అని ఎదురుచూశారన్నారు. సీఎం జగన్ అధికారంలోకొచ్చాక దళిత కుటుంబాల స్థితిగతులు మారాయని, ధైర్యంగా బతుకుతున్నారని చెప్పారు. పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి వచ్చిందంటేనే సీఎం జగన్ పాలనా సమర్థత అర్ధమవుతుందన్నారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. దళిత క్రైస్తవుల్ని ఎస్సీలు చేసేందుకు తీర్మానం చేసిన చరిత్ర సీఎం జగన్దని చెప్పారు. ప్రపంచం గర్వించేలా అంబేడ్కర్ విగ్రహం చంద్రబాబు సీఎంగా ఉండగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ముళ్ల పొదలకే పరిమితం చేయాలని చూశారని.., సీఎంగా జగన్ వచ్చాక విజయవాడ నడిబొడ్డున ఆకాశమంత ఎత్తులో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు చంద్రబాబు అమ్ముకోవాలని ప్రయత్నించిన అత్యంత ఖరీదైన ప్రాంతంలో ప్రపంచం గర్వించేలా 125 అడుగుల విగ్రహాన్ని రూ.400 కోట్లతో సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. సీఎం జగన్ అందిస్తున్న సుపరిపాలనను ప్రపంచం యావత్తూ కొనియాడుతుంటే రామోజీరావు మాత్రం ఎందుకు రాయలేకపోతున్నారని ప్రశ్నించారు. బాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాలన్న కుతితో రామోజీరావు రోజుకో రీతిగా ప్రభుత్వ పథకాలపై, లబ్ధి పొందుతున్న వర్గాలపై రామోజీ రోత రాతలు రాస్తున్నారన్నారు. ఆయనెంతగా రాసుకుని, గునపాలతో పైకి లేపినా బాబుకు అధికారం కల్లేనని, రామోజీ పిచ్చి కలేనని చెప్పారు. ఇప్పటికైనా నీచమైన రాతలు మానుకోవాలని హితవు చెప్పారు. -
గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను పట్టించుకుందా?
-
నువ్వు ఎంత లేపిన చంద్రబాబుని జనం నమ్మరు: మేరుగు నాగార్జున
-
రామోజీ.. విషం కక్కడం కాదు.. చర్చకు రా : మంత్రి మేరుగ
సాక్షి,తాడేపల్లి : అబద్ధాల రామోజీకి చంద్రబాబంటే ఎంతో స్వీటని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పత్రికలో మళ్ళీ విషం కక్కి మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దానికి సమాధానం చెప్పాలని రాశారని మండిపడ్డారు. ఏపీ చరిత్రలోనే సీఎం జగన్ సామాజిక విప్లవానికి తెరతీశారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనలో సీఎం జగన్ పని చేస్తుంటే రామోజీకి కనపడటం లేదని విమర్శించారు. ‘నాడు నేడు కింద సీఎం జగన్ స్కూల్లను బాగు చేయించారు. చంద్రబాబు హయాంలో రెండు వేల స్కూళ్లను మూసివేసి పేదపిల్లల జీవితాలను నాశనం చేశారు. కార్పొరేట్ స్కూళ్లకు పోటీగా జగన్ ప్రభుత్వ స్కూళ్లని అభివృద్ధి చేశారు. చంద్రబాబు హయాంలో విదేశీ విద్య పేరుతో అక్రమాలకు పాల్లడ్డారు. దీనిపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతోంది. జగన్ చేసిన మంచిపనులు రామోజీరావుకి కనపడటం లేదు. ఆయన రాతలను జనం నమ్మే పరిస్థితి లేదుజ జగన్ వచ్చాకే దళితుల స్థితిగతులు మారాయి’ అని మేరుగ తెలిపారు. ‘జగన్ వచ్చాక పేద బతుకుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఎస్సీలను బాగు చేయడానికి కార్పొరేషన్లు పెట్టి నిధులు ఖర్చు చేస్తున్నాం. ప్రతి పైసా దళితులకు అందేలా చర్యలు చేపట్టాం. దళిత క్రైస్తవులు చంద్రబాబుకు ఏనాడైనా కనిపించారా? రాజధానిలో దళితులు ఉండటానికి వీల్లేదని చంద్రబాబు కోర్టుకు వెళ్తే రామోజీరావు ఎందుకు రాయలేదు? ఇంగ్లీష్ మీడియం పేదలకు అవసరం లేదని కోర్టుకు వెళ్తే మీ పత్రికలో ఎందుకు రాయలేదు? రాజధానిలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకుండా చంద్రబాబు కుట్ర పన్నితే ఎందుకు రాయలేదు’ అని మేరుగ ప్రశ్నించారు. ‘అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున జగన్ కట్టిస్తుంటే రామోజీరావుకి కనిపించడం లేదా? చంద్రబాబు హయాంలో దళితుల మీద దాడులు జరిగితే నీ పత్రికలో ఎందుకు రాయలేదు రామోజీ? దళితులపై దాడిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ ఉందని చంద్రబాబు హయాంలో తేలితే ఎందుకు రాయలేదు? గిరిజనుల కోసం ఎస్టీ కమిషన్ను జగన్ ఏర్పాటు చేశారు. పోడు భూములకు పట్టాలిచ్చి భరోసా కల్పిస్తే ఎందుకు రాయలేదు? గిరిజన యూనివర్సిటీ మేము నిర్మిస్తుంటే ఎందుకు రాయలేదు? దీనిపై చర్చకు మేము సిద్దమే, టీడీపీ నేతలు, రామోజీరావు చర్చకు వస్తారా? అని మంత్రి సవాల్ విసిరారు. ఇదీచదవండి...ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు -
ఒకరికి ఒక చోటే ఓటుండాలి
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యంలో ఒకరికి ఒకచోట మాత్రమే ఓటు ఉండాలని.. ఇది వైఎస్సార్సీపీ సిద్ధాంతమని మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్ స్పష్టం చేశారు. ఓటర్ల ముసాయిదా జాబితాలో కొందరికి రెండు, మూడుచోట్ల ఓట్లు ఉన్నట్లు తాము గుర్తించామన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు విదేశాల్లో ఉన్న వారికి సైతం ఇక్కడ ఓట్లు ఉన్నాయన్నారు. వాస్తవానికి ఆధార్ కార్డు ఎక్కడ ఉంటే.. అక్కడే ఓటు హక్కు ఉండటం న్యాయమని స్పష్టం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ నాయకుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాను కలిసి ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలు, డూప్లికేట్ ఓట్లు, డీ రిజిస్ట్రేషన్ (తెలంగాణ), ఓటర్ల రీఎన్రోల్మెంట్ (ఆంధ్రప్రదేశ్) అంశాలపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖేష్కుమార్ మీనాను కలిసి వినతిపత్రం సమర్పించారు. తొలగించారని ఒకరోజు.. చేర్పించారని మరో రోజు: మంత్రి రమేష్ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి ఒకచోట మాత్రమే ఓటు ఉండాలని.. కానీ.. ఒకే వ్యక్తికి రెండు, మూడుచోట్ల ఓట్లు ఉన్నట్టు తమ పార్టీ గుర్తించిందన్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రెండుచోట్ల కొందరికి ఓట్లు ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇలాంటివి కొన్ని తాము గుర్తించామని.. వాటి గురించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయలేని టీడీపీ నేతలు కొందరు తమ పార్టీపై రోజూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సిబ్బంది లక్షల ఓట్లు తొలగించారని ఒక రోజు.. లక్షల ఓట్లు చేర్పించారని ఇంకో రోజు రాస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామని తెలిసే టీడీపీ అనుకూల పచ్చమీడియా అలాంటి రాతలు రాస్తోందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత 70 రోజులు పత్తా లేకుండా పారిపోయిన లోకేశ్, మంత్రులకు భయం చూపెడతానంటున్నాడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్నారు. పీపుల్స్ యాక్ట్ ప్రకారం చర్యలు కోరాం: మంత్రి మేరుగు నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. గత నెలలో ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండుచోట్ల 16 లక్షలకు పైగా ఓటర్లుగా నమోదయ్యారన్నారు. అలాంటి వాటిని తొలగించాలని కోరామన్నారు. 1950 పీపుల్స్ యాక్ట్ సెక్షన్–17 ప్రకారం ఏ నియోజకవర్గంలో అయినా ఒక వ్యక్తికి ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నారు. దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని, అక్కడ ఓట్లు క్యాన్సిల్ చేయించుకుని ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేలా కొందరు చూస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు ఓటు వేసి.. ఆ తర్వాత మన రాష్ర్టంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే వారిపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని కోరినట్టు వివరించారు. ఈ మేరకు అధికారులకు క్లియర్గా ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం’ అనేది తమ నినాదమన్నారు. యుద్ధానికి రాకుండానే.. అస్త్ర సన్యాసం చేసే సన్నాసులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు, పవన్ కల్యాణే అని మేరుగ ఎద్దేవా చేశారు. -
చంద్రబాబుకు, జగన్కు మధ్య తేడా ఇదే: మంత్రి మేరుగు
సాక్షి, విజయవాడ: ఏపీ చరిత్రలో నూతన శకం నెలకొందని, సామాజిక సమతుల్యత విరాజిల్లుతుందనడానికి నిదర్శనమే ఈ అంబేద్కర్ విగ్రహం అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. స్వరాజ్యమైదానంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను సోమవారం.. మంత్రులు మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, సుమారు రూ. 420 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని దేశంలోనే ఒక చారిత్రక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ భావించారు. త్వరితగతిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సీఎం చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవమవుతుందని మంత్రి మేరుగ తెలిపారు. అంబేద్కర్ పేరు ఉచ్ఛరించడానికి చంద్రబాబు, లోకేష్కు అర్హత లేదు లోకేష్ ఎక్కడైనా ఎమ్మెల్యేగా చేశాడా అంటూ మంత్రి మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదంటే లోకేష్ ఎందుకు మాట్లాడలేదు?. అంబేద్కర్ విగ్రహం ముళ్లపొదల్లో పెట్టాలని చంద్రబాబు చూశాడు. చంద్రబాబు దళితులను అవమానించాడు.. దాడులు చేయించాడు. చంద్రబాబుకు, జగన్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంబేద్కర్ పేరు ఉచ్ఛరించడానికి చంద్రబాబు కుటుంబానికి అర్హత లేదు. ఐదేళ్లలో పాలనలో దళితులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ మంత్రి మేరుగ దుయ్యబట్టారు. చారిత్రాత్మకమైన నిర్ణయం: మంత్రి కొట్టు సత్యనారాయణ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడూతూ, భారతదేశంలోనే ఒక పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ విగ్రహాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసేలా స్మృతివనం ఉంటుంది. అంబేద్కర్ భావజాలాన్ని ఆకళింపు చేసుకున్న వ్యక్తి సీఎం జగన్. దేశానికి ఆదర్శవంతమైన పాలన సీఎం జగన్ అందిస్తున్నారు. అన్ని వర్గాలకు మేలు చేయడమే అంబేద్కర్ భావజాలం. బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం చారిత్రాత్మకమైన నిర్ణయం’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: వైద్యుడి ఆత్మహత్యపై టీడీపీ రాజకీయం -
రాష్ట్రంలో రజకులకు సమున్నత స్థానం
ఏఎన్యూ: రజకుల సాధికారతకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రజక ఆత్మగౌరవ మహాసభలో మంత్రి ప్రసంగిస్తూ.. రజకుల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. రజక కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా రజకులకు సమున్నత స్థానం కల్పించారని తెలిపారు. అంబేడ్కర్ ఆశించిన సామాజిక న్యాయమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు పేదవాడి చెంతకు చేరుతున్నాయని తెలిపారు. అణగారిన వర్గాల సాధికారతకు అంకితభావంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టమన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వంగా ఉందని తెలిపారు. రజకుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని నాగార్జున హామీ ఇచ్చారు. సామాజిక సాధికారతకు ఏపీ వేదిక.. బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. కులగణన విషయంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం ఏపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఈ ప్రక్రియ తరువాత రజకులకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయన్నారు. సామాజిక సాధికారతకు ఏపీ వేదికగా నిలుస్తోందని తెలిపారు. గత పాలకుల వివక్షకు గురైన వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమున్నత స్థానం కల్పిస్తోందన్నారు. ప్రస్తుతం ఏపీలో బీసీల రాజ్యం నడుస్తోందని తెలిపారు. రజకుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. రజకులకు ఏపీ ప్రభుత్వం అగ్రస్థానం కల్పించిందని.. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు కల్పించనుందన్నారు. చట్టసభల్లో రజకులకు తప్పకుండా స్థానం దక్కుతుందన్నారు. రజకులను వంచించిన చంద్రబాబు ఏపీ రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంజిబాబు ప్రసంగిస్తూ.. రజకుల సమస్యల పరిష్కారంపై సీఎం జగన్కు ప్రత్యేక ప్రణాళిక ఉందన్నారు. మాటతప్పే వ్యక్తిత్వం ఆయనది కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రజకులను తీవ్రంగా వంచించిందన్నారు. రజకుల్లో 50 ఏళ్ల వారికి పింఛన్ ఇవ్వమంటే మీకు ఇస్తే మిగతా కులాలు కూడా అడుగుతాయని చంద్రబాబు అవమానించారన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నాయకుడు బండి శ్రీనివాసరావు, పలువురు బీసీ సంఘాలు, రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏపీలో గొప్ప సంక్షేమ పథకాలు అమలు.. ఏపీలో గొప్ప సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలంగాణ ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న అన్నారు. రజకులపై తాను రాసిన పాట అంటే మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఎంతో ఇష్టమన్నారు. రాష్ట్రంలో గతానికి, ఇప్పటికి ఉన్న మంచిని గమనించాలని రజకులకు సూచించారు. పాటలతో ఆయన సభికులను ఉత్తేజపరిచారు. -
అన్ని స్పీచ్ లు ఒక లెక్క..ఈ స్పీచ్ ఒక లెక్క..
-
జగనన్న ఇది గొప్ప ఆలోచన..!
-
సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: మంత్రి మేరుగు నాగార్జున
-
‘ఏపీలో సంక్షేమ పాలన.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లుగా అన్నీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పేదలకు భూమి హక్కులు కల్పించిన నాయకుడు సీఎం జగన్. గత టీడీపీ ప్రభుత్వం పేదలను పట్టించుకుందా?’’ అని ప్రశ్నించారు. సీఎం జగన్ రైతుల పక్షపాతి. ఆయన సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు ఏరోజైనా వెనుకబడిన వర్గాలను పట్టించుకున్నారా?. సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఘనత వైఎస్ జగన్దే. చంద్రబాబు ఎన్ని హామీలిచ్చారు? ఎన్ని అమలు చేశారు?. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న నాయకుడు జగన్’’ మంత్రి పేర్కొన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. దళితులను గుండెల్లో పెట్టుకున్న నాయకుడు వైఎస్ జగన్. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు కనీసం సొంతిల్లు కూడా లేదు. రాష్ట్రంలో ఉండని వ్యక్తులు ప్రజలకు ఇంకేం న్యాయం చేస్తారు’’ అంటూ మంత్రి మేరుగు నాగార్జున దుయ్యబట్టారు. చదవండి: బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు?: మంత్రి సీదిరి -
తంబళ్లపల్లెలో సంక్షేమ యాత్ర
బి.కొత్తకోట: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చర్యల ఫలితం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రతిబింబించింది. శుక్రవారం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు వెల్లువెత్తారు. సీఎం జగన్ తమకు చేసిన మేలును వివరిస్తూ యాత్రలో సాగారు. పీటీఎం నుంచి మద్దయ్యగారిపల్లె వరకు పాదయాత్ర సాగింది. అనంతరం ములకలచెరువులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పెద్ద ఎత్తున పాల్గొని, జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును మంత్రులు, నాయకులు వివరించారు. సామాజిక సాధికారతను నిజం చేసిన సీఎం జగన్: మంత్రి మేరుగు ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకూ మేలు చేసి ప్రతి గుండెలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ కలలుగన్న సామాజిక సాధికారతను సీఎం జగన్ ఆచరణలో నిజం చేస్తున్నారని అన్నారు. దేశ ప్రధానులకే సాధ్యంకాని సామాజిక విప్లవానికి సీఎం వైఎస్ జగన్ నాంది పలికారని అన్నారు. చంద్రబాబు 2014లో 645 హామీలతో గెలిచి ప్రజలను మోసం చేశారన్నారు. 2024లో మరోసారి మోసం చేసేందుకు బాబు వస్తున్నారని, ప్రజలు మోసపోవద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా, రాజకీయంగా మరింతగా ఎదగడానికి సీఎం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగన్తోనే స్వాతంత్య్రం: మంత్రి గుమ్మనూరు జయరాం 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో సీఎం వైఎస్ జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. బీసీల్లోని అన్ని వర్గాలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. జగన్ అనే శక్తి లేకపోతే, పార్టీ పెట్టకపోతే ఈ మార్పు ఉండేది కాదని అన్నారు. స్కీం సీఎం జగన్ : మంత్రి ఉషశ్రీ చరణ్ ఏపీలో స్కీం సీఎం జగన్ అయితే స్కాం సీఎం చంద్రబాబు అని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మహిళలను కార్పొరేషన్ చైర్మన్లు చేసిన ఘనత జగన్దేనని చెప్పారు. కనకదాస్, వాల్మికి జయంతిని అధికారికంగా నిర్వహించి గౌరవం పెంచారన్నారు. టీడీపీ నేతల మాటలు ఎవరూ వినడంలేదు: మాజీ మంత్రి అనిల్ కుమార్ చంద్రబాబును స్థానిక ఎన్నికల్లో సొంత జిల్లా చిత్తూరు ప్రజలే తిప్పికొట్టారని, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ,బీసీలు మైనార్టీలంతా వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. నెల్లూరు గడ్డపై ఓ బీసీకి టికెట్ ఇచ్చి రెండుసార్లు గెలిపించి మంత్రిగా చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కష్టంతో పాలు పోసిన వారి ఆదాయంతో చంద్రబాబు హెరిటేజ్ ఆస్తులు పెరిగాయని అన్నారు. ఎన్నికల్లో కిలో బంగారం, బెంజి కారు ఇస్తామని చెబుతారని, అలాంటి వారి మాటలకు మోసపోవద్దని కోరారు. సామాజిక సాధికార యాత్రలో నల్ల రిబ్బన్లతో నిరసనలు తెలపాలని టీడీపీ నేతలంటున్నారని, వారి మాటలు ఎవరూ వినడంలేదని చెప్పారు. -
సామాజిక న్యాయంలో చరిత్ర సృష్టించిన జగన్
పామర్రు: సామాజిక న్యాయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే చరిత్ర సృష్టించారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని, అనేక కార్యక్రమాలతో ఈ వర్గాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చి సామాజిక సాధికారత సాధించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ ముఖ్యమంత్రీ ఈ ఘనత సాధించలేదన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం కృష్ణాజిల్లా పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేబినెట్ సహా అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారని, మహిళలకు 50 శాతం పదవులిచ్చారని అన్నారు. ఇది ఓ చరిత్రగా నిలిచిపోతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు ఊపిరిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ని ప్రజా క్షేత్రంలో ఎవరూ ఓడించలేరని, పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం, చంద్రబాబు, లోకేశ్, రామోజీ, రాధాకృష్ణతో కలిసి ఎన్ని వ్యూహాలు పన్నినా జగన్ ముందు పనిచేయవన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకొన్నారని, సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించి చరిత్ర సృష్టించారని చెప్పారు. రాజ్యసభ సీటిస్తానని ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. అదే సీటును వంద కోట్లకు కనకమేడల రవీంద్రకుమార్కు అమ్ముకున్నారని తెలిపారు. ఇలా అడుగడుగునా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించిన చంద్రబాబును మరోసారి చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ అక్కున చేర్చుకున్న సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలను కోరారు. ఉన్నత స్థితికి బడుగు వర్గాలు: మంత్రి నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే, జగజ్జీవన్రామ్, సాహూ మహరాజ్, అబ్దుల్ కలామ్ వంటి మహానుభావుల ఆలోచనా విధానాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను ఉన్నత స్థితికి చేరుస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా, రూపాయి లంచం లేకుండా పేదవారి చెంతకు సంక్షేమ పథకాలను చేరుస్తున్నారని అన్నారు. 31 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలిచ్చి వారి కుటుంబాలకు గూడు కల్పించిన సీఎంగా దేశంలోనే రికార్డు సృష్టించారన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యను, అత్యాధునిక కార్పొరేట్ వైద్యాన్ని పేదవారికి అందిస్తున్న ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. 2014లో 648 వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. పైగా, రుణాలు మాఫీ చేస్తానని రైతులు, మహిళలను మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎందుకూ పనికిరారని అవహేళన చేశారని తెలిపారు. మన విలువలు కాపాడుకోవడానికి 2024లో తిరిగి జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బాబును ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎప్పటికీ క్షమించరు : ఎంపీ సురేష్ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సోమరిపోతులవుతారన్న చంద్రబాబును ఈ వర్గాలు ఎప్పటికీ క్షమించబోవని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఆరు లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన చంద్రబాబు సోమరిపోతు కాదా అని ప్రశ్నించారు. రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చెబితే వారు కూడా కోటీశ్వరులు అవుతారని అన్నారు. రూ.370 కోట్లు అవినీతికి పాల్పడిన చంద్రబాబు జైలుకు వెళితే టీడీపీ ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. నిజం గెలవాలి అని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెబుతున్నారని, నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారని అన్నారు. బడుగులను అందలమెక్కిస్తున్న సీఎం జగన్: ఎంపీ మోపిదేవి అనేక పథకాలతో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను సీఎం జగన్ అందలమెక్కిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ మాట్లాడుతూ గతంలో పెన్షన్ కావాలంటే నాయకులకు దండాలు పెడితేనో, టీడీపీ కండువాలు కప్పుకుంటేనే మంజూరయ్యేదన్నారు. సెంటర్లో కనబడి దండం పెట్టకపోతే పెన్షన్ రద్దయ్యేదని చెప్పారు. సీఎం జగన్ పాలనలో కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పధకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, సింహాద్రి రమేష్ బాబు, పేర్ని నాని, ముస్తాఫా, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. -
ఇది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ చెప్పారు. సామాన్యుల సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయమని, సామాజిక సాధికారత మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించి దేశానికే రోల్ మోడల్గా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను పెద్దన్నలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా బుధవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవం తెచ్చారని, దేశంలో ఇప్పటివరకు మరే ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన కూడా చేయలేదని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు, వారి బాధలు స్వయంగా తెలుసుకుని సీఎం జగన్ న్యాయం చేశారని కొనియాడారు. అనేక పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా 2.53 లక్షల కోట్లు ప్రజలకు సంక్షేమం అందించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రూ.1.76 లక్షల కోట్లు లబ్ధి చేకూర్చిన ఘనత వైఎస్ జగన్దేనని అన్నారు. కనిగిరిలో జరిగిన బహిరంగసభకు హాజరైన జనసందోహంలో ఒక భాగం బడుగుల ఆత్మ బంధువు సీఎం జగన్: మంత్రి సురేష్ బడుగు, బలహీనవర్గాల ఆత్మ బంధువు సీఎం జగన్ అని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. పేదరికం పిల్లలకు విద్యను దూరం చేయకూడదనే సంకల్పంతో సీఎం జగన్ నిరుపేదలకు సైతం అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. దళితుడినైన తనను విద్యా శాఖ మంత్రిని చేయడం సాధికారత కాదా అని ప్రశ్నించారు. ఇంగ్లిష్ మీడియంపై గొడవ పెట్టిన టీడీపీ, జనసేన నేతలకు పేద బిడ్డలు మంచి చదువులు చదవడం ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కు దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులతో ఇంగ్లిష్లో మాట్లాడాలని సవాల్ చేశారు. ఇంత మేలు మరే రాష్ట్రంలో జరగలేదు: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలు ఇప్పటివరకు దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. మొట్టమొదటిసారి దేశంలో మంత్రివర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నియమించడం, ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నాలుగు పదవులు ఇవే సామాజిక వర్గాల వారికివ్వడం సీఎం జగన్కే సాధ్యమైందన్నారు. నాలుగు ఎమ్మెల్సీ, 12 రాష్ట్రస్థాయి చైర్మన్ పోస్టులు ఇచ్చిన ఘనత కూడా సీఎం జగన్కే దక్కుతోందన్నారు. ఏకంగా ముస్లిం మహిళను మండలి డిప్యూటీ చైర్మన్గా నియమించి చరిత్ర సృష్టించారన్నారు. బీసీలను అణగదొక్కడమే చంద్రబాబు సిద్ధాంతం: ఎంపీ బీద మస్తాన్రావు బీసీలను ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని, అధికారంలోకి వచ్చాక అణగదొక్కడమే చంద్రబాబు సిద్ధాంతమని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు చెప్పారు. 30 ఏళ్లు టీడీపీలో పనిచేసిన తనకు అనేకమార్లు రాజ్యసభ సీటు ఇస్తానని మోసం చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ నలుగురు బీసీలకు రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారని, దేశ చరిత్రలోనే ఇదొక సువర్ణాధ్యాయమని తెలిపారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తాను, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు వంటి తామే సీఎం జగన్ సామాజిక సాధికారత తెచ్చారనడానికి ఉదాహరణ అని చెప్పారు. కనిగిరిలో రూ.3,471 కోట్లతో అభివృద్ధి : ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు సామాన్యుడినైన తనను శాసన సభ్యుడిగా చేసిన ఘనత వైఎస్ జగన్దేనని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ అండతో కనిగిరిలో రూ. 3,471 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. కనిగిరిని రెవెన్యూ డివిజన్గా చేసి వెనుకబడిన ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. 18 వేల ఇళ్లకు ఇంటింటి కుళాయిలు ఇచ్చేందుకు రూ. 125 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయని, రూ. 150 కోట్లతో జేజేఎం ద్వారా పనులు చేపడుతున్నామని తెలిపారు. కనిగిరిలో రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కనిగిరి ప్రజలకు మంచి నీటిని అందించేందుకు రూ.1,250 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు టెండర్ల దశలో ఉందని చెప్పారు.