-
అడవి పందులు అంత డేంజరా?
మెల్బోర్న్: అడవి పందులు.. పంటలకు ఇవి కలిగించే నష్టం అంతా ఇంతా కాదు. అంతేకాకుండా స్థానిక వన్యప్రాణులకు ఇవి ముప్పుగా మారుతున్నాయి. భూగోళంపై జీవజాతుల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారుతున్న వాతావరణ మార్పులకు సైతం అడవి పందులు కారణమవుతున్నట్లు ఆస్ట్రేలియాలో నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ట్రాక్టర్లతో నేలను దున్నినట్లుగా అడవి పందులు నేలను తవ్వేస్తుంటాయి. ఒక్క అంటార్కిటికా తప్ప ప్రపంచవ్యాప్తంగా అడవి పందులు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ప్రతి ఏటా తవ్వుతున్న భూవిస్తీర్ణం ఎంతో తెలుసా? తైవాన్ దేశ విస్తీర్ణంతో సమానం. భూమిలో పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అడవి పందుల తవ్వకం వల్ల ఏటా 49 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ భూమి నుంచి వెలువడి వాతావరణంలో కలుస్తోంది. ఇది 10 లక్షల కార్లు ఉత్పత్తి చేసే కార్బన్ డయాక్సైడ్తో సమానం. ఒకప్పుడు యూరప్, ఆసియాకే పరిమితమైన అడవి పందులు క్రమంతా ఇతర ఖండాలకు సైతం విస్తరించాయి. ఆస్ట్రేలియాలో 30 లక్షల అడవి పందులు ఉన్నట్లు అంచనా. ఆస్ట్రేలియాలో ఇవి ఏటా 10 కోట్ల డాలర్ల మేర పంట నష్టం కలుగజేస్తున్నాయి. ఇక అమెరికాలో వీటి కారణంగా కేవలం 12 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం 27 కోట్ల డాలర్ల విలువైన పంట నష్టం వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో 672 రకాల వన్యప్రాణులు, మొక్కలకు అడవి పందులు పెద్ద ముప్పుగా తయారయ్యాయి. రాబోయే దశాబ్దాల్లో వీటి ఆవాస ప్రాంతాలు మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నాయి. వీటి సంతతి పెరిగితే మనుషుల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అడవి పందుల వల్ల పెరుగుతున్న కర్బన్ ఉద్గారాలపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. -
వైరల్ వీడియో: చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలు!
కాన్బెర్రా: ఈ చరాచరా సృష్టిలో మనిషి అత్యంత బలహీనుడు. కానీ, అతడి మేధా శక్తితో ఇతర జీవులను శాసిస్తున్నాడు. ఇక పాడైపోయిన చెప్పులనైనా ఇంట్లో ఉంచుకుంటారు. కానీ మనిషి చచ్చిన మరుక్షణమే కాటికి పంపంచే కార్యక్రమం మొదలవుతుంది. అయితే మెల్బోర్న్కి చెందిన జాక్కి విలియమ్స్(29) అనే మహిళ చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలను తయారు చేస్తోంది. గ్రేవ్ మెటాలమ్ జ్యువెలరీలో చనిపోయిన వ్యక్తుల దంతాలు, వెంట్రుకలతో వారి కుటుంబాలకు ఉంగరాలు, కంఠహారాలు తయారు చేస్తోంది. దీని పై విలియమ్స్ మాట్లాడుతూ..‘‘ తనని తాను కాల్చుకుని చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబ కోసం ఐయూడీని ఉపయోగించి ఓ ఆభరణాన్ని తయారు చేసి ఇచ్చాను. ఆ విధంగా ఈ వ్యాపారం మొదలైంది. ఈ ఆభరణాలను తయారు చేయడానికి ఎనిమిది వారాలు పడుతుంది. వీటి ధర 350 నుంచి 10,000 డాలర్ల వరకు ఉంటుంది. మరణం పై ఉన్న భయాలను పోగొట్టాలనే ఆశయంతో ఈ పని చేస్తున్నాను. గ్రేవ్ మెటాలమ్ అనే వెబ్సైట్లో వీటిని విక్రయానికి పెట్టాను.’’ అని జాక్కి విలియమ్స్ పేర్కొంది. -
జొకోవిచ్దే ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్బోర్న్: సెర్బియా స్టార్ నొవాక్ జోకోవిచ్ తన కెరీర్లో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ను ఎగురేసుకుపోయాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ రష్యాకు చెందిన డానిల్ మెద్వెదెవ్( 4వ సీడ్)ను 7-5,6-2,6-2తో ఓడించి టైటిల్ను కైవసం చేసుకున్నాడు. గంటా 53 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో మెద్వెదెవ్ తొలి సెట్లో మాత్రమే జొకోవిచ్ను కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. అయితే తర్వాత జొకోవిచ్ అద్భుతమైన స్ట్రోక్ప్లేతో పదునైన సర్వీస్ షాట్లు ఆడి రెండు సెట్లను గెలుచుకోవడంతో మ్యాచ్ ముగిసింది. ఈ విజయంతో కెరీర్లో తొమ్మిదో ఆస్ట్రేలియన్ ఓపెన్ను.. మొత్తంగా 18వ గ్రాండ్స్లామ్ టైటిల్ను సాధించాడు. అంతేగాక ఆస్ట్రేలియన్ ఓపెన్లో 82-9 తో తన విజయాల రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. కాగా జొకోవిచ్ మరో రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధిస్తే 20 గ్రాండ్స్లామ్స్తో ఫెదరర్, నాదల్ సరసన నిలవనున్నాడు. -
ఆస్ట్రేలియా ఓపెన్ విజేత నయోమి ఒసాకా
మెల్బోర్న్: జపనీస్ టెన్నీస్ స్టార్ నయోమి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన జెన్నిఫర్ బార్డీ(22వ సీడ్)ని 6-4,6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించిన ఒసాకా(3వ సీడ్) కెరీర్లో రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుంది. ఓవరాల్గా ఆమె కెరీర్లో ఇది నాలుగో గ్రాండ్స్లామ్ టైటిల్ కాగా.. అందులో రెండు యూఎస్ ఓపెన్(2018, 2020)టైటిల్స్తో పాటు రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్(2019,2021) టైటిల్స్ ఉన్నాయి. కాగా నేటి ఫైనల్ మ్యాచ్లో ఒసాకా తన ప్రత్యర్థి బార్డీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 6-4తో తొలి సెట్ను 41 నిమిషాల్లో సొంతం చేసుకున్న ఒసాకా రెండో సెట్ను మరో 36 నిమిషాల్లోనే 6-3తో నెగ్గి టైటిల్ను సొంతం చేసుకుంది. కాగా కరోనా కారణంగా 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రద్దు కావడంతో 2021లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ను వరుసగా రెండోసారి గెలుచుకొని ఒసాకా చరిత్ర సృష్టించింది. 𝒯𝒽𝒶𝓉 𝓂𝑜𝓂𝑒𝓃𝓉. When @naomiosaka became our 2021 Women's Singles champion 🏆#AO2021 | #AusOpen pic.twitter.com/Id3ZZhaJHh — #AusOpen (@AustralianOpen) February 20, 2021 -
ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంచలనం
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్లో పెను సంచలనం నమోదైంది. టాప్ సీడ్ ఆష్లే బార్టీ క్వార్టర్స్లోనే వెనుదిరిగింది. 25వ సీడ్ కరోలినా ముచోవా చేతిలో 6-1,3-6,2-6 తేడాతో ఓడి బార్టీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి సెట్లో 6-1తో వెనుకబడిన ముచోవా.. రెండో సెట్లో ఫుంజుకొని 3-6తో సెట్ను గెలుచుకుంది. కీలకమైన మూడోసెట్లోనూ ముచోవా అదే జోరు కొనసాగించి 2-6తో సెట్ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్ను గెలుచుకొని సెమీస్కు ప్రవేశించింది. 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ, అన్సీడెడ్ జెస్సికా పెగులా మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ముచోవా సెమీస్లో తలపడనుంది. కాగా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో పదో సీడ్ సెరెనా 6–3, 6–3తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలుపొంది సెమీఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో నయామి ఒసాకాతో సెరెనా తలపడనుంది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్: బియాంక, క్విటోవా అవుట్
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మూడో రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ విభాగంలో 2019 యూఎస్ ఓపెన్ చాంపియన్, ఎనిమిదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా)... 2011, 2014 వింబుల్డన్ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్లో 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) కూడా రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ను 2019 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడించిన బియాంక మోకాలి గాయం కారణంగా గతేడాది మొత్తం ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది నేరుగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడిన బియాంక రెండో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయింది. 35 ఏళ్ల సె సువె (చైనీస్ తైపీ) 6–3, 6–2తో తొమ్మిదో ర్యాంకర్ బియాంక ఆండ్రెస్కూను ఓడించి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. టాప్–10లోని క్రీడాకారిణులను ఓడించడం 71వ ర్యాంకర్ సె సువెకిది ఎనిమిదోసారి కావడం విశేషం. 83 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో బియాంక ఐదు డబుల్ ఫాల్ట్లు, 25 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్లో సొరానా కిర్స్టియా (రొమేనియా) 6–4, 1–6, 6–1తో క్విటోవాపై సంచలన విజయం సాధించింది. రెండు గంటల మూడు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సొరానా ఆరుసార్లు క్విటోవా సర్వీస్ను బ్రేక్ చేసింది. సెరెనా జోరు... కెరీర్లో 24వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన అమెరికా దిగ్గజం సెరెనా మరో అడుగు ముందుకేసింది. నినా స్లొజనోవిచ్ (సెర్బియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో పదో సీడ్ సెరెనా 6–3, 6–0తో గెలిచి మూడో రౌండ్కు చేరింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–2, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 4–6, 6–4, 7–5తో తమియనోవిచ్ (ఆస్ట్రేలియా)పై, ఏడో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/5), 6–3తో కసత్కినా (రష్యా)పై, 15వ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–2, 6–4తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై గెలిచి మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. మాజీ నంబర్వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 1–6, 0–6తో క్వాలిఫయర్ సారా ఎరాని (ఇటలీ) చేతిలో, 17వ సీడ్ ఎలీనా రైబకినా (కజకిస్తాన్) 4–6, 4–6తో ఫియోనా ఫెరో (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. అయ్యో వావ్రింకా... పురుషుల సింగిల్స్ విభాగంలో 17వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) చేజేతులా ఓడిపోయాడు. ప్రపంచ 55వ ర్యాంకర్ మార్టన్ ఫుచోవిచ్ (హంగేరి)తో 3 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో వావ్రింకా 5–7, 1–6, 6–4, 6–2, 6–7 (9/11)తో పరాజయం పాలయ్యాడు. నిర్ణాయక ఐదో సెట్ టైబ్రేక్లో వావ్రింకా 6–1తో ఆధిక్యంలో నిలిచి విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే ఫుచోవిచ్ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి స్కోరును 6–6తో సమం చేశాడు. చివరకు ఫుచోవిచ్ 11–9తో టైబ్రేక్లో గెలిచి సెట్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–7 (3/7), 7–6 (7/2), 6–3తో టియాఫో (అమెరికా)పై, మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–0, 6–2తో కోఫెర్ (జర్మనీ)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 6–4, 6–3తో క్రెసీ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ ష్వార్ట్జ్మన్ (అర్జెంటీనా) 6–2, 6–0, 6–3తో ములెర్ (ఫ్రాన్స్)పై గెలిచారు. 11వ సీడ్ షపోవలోవ్ (కెనడా), 14వ సీడ్ రావ్నిచ్ (కెనడా), 15వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్), 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా మూడో రౌండ్కు చేరుకున్నారు. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–బెన్ మెక్లాలన్ (జపాన్) జంట 4–6, 6–7 (0/7)తో జీ సుంగ్ నామ్–మిన్ క్యు సాంగ్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
క్వారంటైన్కు 47 మంది టెన్నిస్ ప్లేయర్లు
మెల్బోర్న్: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీని కరోనా వదిలేలా కనిపించడం లేదు. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ కోసం మెల్బోర్న్కు ప్రత్యేక విమానంలో వచ్చిన ముగ్గురికి తాజాగా పాజిటివ్గా తేలడంతో నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారితో ప్రయాణించిన మొత్తం 47 మంది ప్లేయర్లను 14 రోజుల పాటు కఠిన క్వారంటైన్కు తరలించారు. క్వారంటైన్ సమయంలో ఆటగాళ్లంతా హోటల్ గదులకే పరిమితం కావాల్సిందిగా ఆదేశించారు. శనివారం లాస్ ఏంజెలిస్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు, అబుదాబి ఫ్లయిట్లో ఒక్కరు పాజిటివ్గా తేలినట్లు ఆరోగ్య అధికారులతో పాటు, టెన్నిస్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ రెండు విమానాల్లోని ఆటగాళ్లెవరూ వైరస్ బారిన పడకపోవడం ఊరటనిచ్చే అంశం. ఫిబ్రవరి 8 నుంచి జరిగే ఈ టోర్నీ కోసం నిర్వాహకులు 15 ప్రత్యేక విమానాల ద్వారా విదేశీ ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని మెల్బోర్న్కు తీసుకొస్తున్నారు. -
వైరల్ : క్రికెటర్ల బిల్లు చెల్లించిన అభిమాని
మెల్బోర్న్ : భారత్లో క్రికెట్ను అభిమానులు ఒక మతంలా చూస్తారు. ఇక టీమిండియా ఆటగాళ్లను ఎంతలా ఆరాధిస్తారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో వాళ్ల ఆటను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు కలలు కంటారు. అలాంటిది వాళ్లు నేరుగా కళ్ల ముందే ప్రత్యక్షమైతే ఆ అనుభవం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. తాజాగా మెల్బోర్న్లో ఒక ఇండియన్ అభిమానికి అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది. బాక్సింగ్ డే టెస్ట్ విజయంతో కాస్త రిలాక్స్ మోడ్లో ఉన్న టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, నవ్దీప్ సైనీ న్యూ ఇయర్ సందర్భంగా మెల్బోర్న్లోని ఒక రెస్టారెంట్కు వెళ్లారు. తమకు నచ్చిన ఫుడ్ను ఆర్డర్ చేసుకొని తింటున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న నవల్దీప్ సింగ్ టీమిండియా క్రికెటర్లు కూర్చున్న టేబుల్కు ఎదురుగా కూర్చున్నాడు. క్రికెటర్లను చూసి మురిసిపోయిన నవల్దీప్ సింగ్ ఆటగాళ్లు భోజనం చేస్తున్న సమయంలో వీడియో తీశాడు. ఈ సందర్భంగా వాళ్లకు ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకోవాలని భావించాడు.(చదవండి: రోహిత్ శర్మకు ప్రమోషన్) క్రికెటర్ల భోజనం పూర్తయిందనుకున్న సమయంలో.. నవల్దీప్ సింగ్ నేరుగా కౌంటర్ వద్దకు వెళ్లి క్రికెటర్లకు తెలియకుండా 118 ఆస్ట్రేలియన్ డాలర్లు( రూ. 6700) బిల్లు కట్టాడు. అయితే బిల్లు చెల్లించడానికి కౌంటర్ వద్దకు వచ్చిన క్రికెటర్లకు మీ బిల్లును ఆ వ్యక్తి కట్టాడంటూ నవల్దీప్ సింగ్ వైపు చూపించారు దీంతో రోహిత్ శర్మ, పంత్లు నవల్దీప్ వద్దకు వచ్చి డబ్బు ఇవ్వబోయారు. అయితే నవల్దీప్ అందుకు అభ్యంతరం చెప్పి డబ్బు తీసుకోలేదు. 'మీ మీద ఉన్న అభిమానంతోనే బిల్లు చెల్లించానని.. మిమ్మల్ని ఇంత దగ్గర్నుంచి చూడడం సంతోషం కలిగించిదని' చెప్పాడు. అనంతరం తన అభిమాన క్రికెటర్లతో సెల్ఫీ దిగిన నవల్దీప్ను ఈ విషయాన్ని తన ట్విటర్లో పంచుకున్నాడు. 'లంచ్ స్పాన్సర్ చేసినందుకు రోహిత్, పంత్ సహా అందరూ థ్యాంక్స్ చెప్పారు. అనంతరం పంత్ నా భార్య దగ్గరకు వచ్చి మెల్బోర్న్లో మాకు మంచి లంచ్ను గిఫ్ట్గా ఇచ్చినందుకు థ్యాంక్స్ బాబీ అని చెప్పాడు. నా సూపర్స్టార్స్ కోసం చేసిన ఈ చిన్న పని నాకు సంతోషాన్ని కలిగించిందంటూ' ట్విటర్లో చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (చదవండి : 8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు) Bc mere saamne waale table par gill pant sharma saini fuckkkkkk pic.twitter.com/yQUvdu3shF — Navaldeep Singh (@NavalGeekSingh) January 1, 2021 ఇక నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి మూడో టెస్టు జరగనుంది. మాయాంక్ స్థానంలో రోహిత్ శర్మ చేరికతో టీమిండియా బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం కాగా.. మూడో టెస్టుకు విహారి స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మెల్బోర్న్ టెస్టులో గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో టి. నటరాజన్ను ఎంపిక చేశారు. కాగా ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. -
రహానేకు అరుదైన గౌరవం.. ఇది రెండోసారి
మెల్బోర్న్ : టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే మరో అరుదైన ఘనత సాధించాడు. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలోని ‘హానర్స్ బోర్డు’లో దిగ్గజాల సరసన రహానే చోటు దక్కించుకున్నాడు.ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో 112 పరుగులతో చెలరేగిన రహానే భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించినందుకు అతనికి ఈ గౌరవం దక్కింది. ఎంసీజీ హానర్స్ బోర్డులో రహానే పేరు చేర్చడం ఇది రెండోసారి కావడం విశేషం. (చదవండి : 'క్వారంటైన్ తర్వాత మరింత యంగ్ అయ్యావు') ప్రతిష్టాత్మక హానర్స్ బోర్దులో ఆస్ట్రేలియా గ్రౌండ్ సిబ్బంది తన పేరును చెక్కే వీడియో క్లిప్ను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. 2014లో తొలిసారి రహానే పేరును హానర్స్ బోర్డులో చేర్చారు. ఎంసీజీలో డ్రాగా ముగిసిన ఆ మ్యాచ్లో రహానే 147 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ ఇదే మైదానంలో 169 చేసి హానర్స్ బోర్డులో పేరు దక్కించుకున్నాడు. పర్యాటక జట్లకు చెందిన ఆటగాళ్లు టెస్టు సెంచరీ లేదా కనీసం ఐదు వికెట్లు తీసిన వారి పేర్లను హానర్స్ బోర్డులో చేర్చుతారు. ఇక ఆసీస్, భారత్ల మధ్య మూడో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 7నుంచి మొదలుకానుంది. (చదవండి : డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్) A look at the Honours Board at the G. .@ajinkyarahane88 scored a Test century in 2014 and here he is today all set to get his name engraved again. Well done, Skip 💯#AUSvIND pic.twitter.com/1YfqQl3DKk — BCCI (@BCCI) December 27, 2020 -
రోహిత్కు టీమిండియా గ్రాండ్ వెల్కమ్
మెల్బోర్న్ : టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు మెల్బోర్న్ హోటల్ రూంలో బుధవారం సాయంత్రం టీమిండియా గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. ఫిట్నెస్ పరీక్షల అనంతరం రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చిన రోహిత్ కఠిన క్వారంటైన్ నిబంధనలను పాటించాడు. తాజాగా బుధవారం సాయంత్రం మెల్బోర్న్లోని హోటల్ రూలంలో ఉన్న టీమిండియా జట్టును కలిశాడు. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా తదితర ఆటగాళ్లు రోహిత్కు ఘనస్వాగతం పలికారు. భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ రోహిత్తో కాసేపు ముచ్చటించాడు.(చదవండి : డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్) అయితే టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి రోహిత్తో అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హాయ్ రోహిత్.. 14రోజుల క్వారంటైన్ ఎలా ఉంది.. క్వారంటైన్ తర్వాత చాలా యంగ్గా కనిపిస్తున్నావు అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా జరగనున్న మూడో టెస్టులో రోహిత్ ఆడే అవకాశాలున్నాయి. కాగా నాలుగు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మరోవైపు తాము ఐదు బౌలర్ల వ్యూహానికి కట్టుబడి ఉన్నామని... క్వారంటైన్ తర్వాత రోహిత్ శర్మ మానసిక స్థితి, మ్యాచ్ ఫిట్నెస్ ఎలా ఉన్నాయో చూసిన తర్వాతే ఆడించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని రవిశాస్త్రి వెల్లడించాడు. అయితే మూడో టెస్టుకు తగినంత సమయం ఉండటంతో పాటు, మయాంక్ అగర్వాల్ వరుస వైఫల్యాలతో అతని స్థానంలో రోహిత్ మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. (చదవండి : రహానే అన్ని ప్రశంసలకు అర్హుడు: రవిశాస్త్రి) Look who's joined the squad in Melbourne 😀 A warm welcome for @ImRo45 as he joins the team 🤗#TeamIndia #AUSvIND pic.twitter.com/uw49uPkDvR — BCCI (@BCCI) December 30, 2020 -
పైన్ అద్భుత క్యాచ్కు పుజారా బలి
మెల్బోర్న్ : ఆసీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆచితూచి ఆడుతుంది. 36/1 క్రితంరోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ గిల్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న క్రమంలో కమిన్స్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ గిల్ కీపర్ పైన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 61 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కాసేపటికే 17 పరుగులు చేసిన చతేశ్వర్ పుజారా కూడా కమిన్స్ బౌలింగ్లో పైన్ అద్భుత క్యాచ్కు వెనుదిరిగాల్సి వచ్చింది. (చదవండి : సిరాజ్... ఇప్పుడే వద్దులే!) కమిన్స్ వేసిన గుడ్లెంగ్త్ బంతి పుజారా బ్యాట్ను ఎడ్జ్లో తాకుతూ కీపర్ వైపు వెళ్లింది. ఫైన్ అద్భుతంగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమిండియా 64 పరుగుల వద్ద ప్రధాన వికెట్ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విహారితో కలిసి రహానే మరోవికెట్ పడకుండా ఆడుతూ 3 వికెట్ల నష్టానికి 90 పరుగుల వద్ద లంచ్ విరామానికి వెళ్లారు. లంచ్ అనంతరం 21 పరుగులు చేసిన హనుమ విహారి లయన్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో 116 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 57 ఓవర్లలో 166 పరుగులు చేసింది. రహానే 43, పంత్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. (చదవండి : అతనికి అరుదైన గౌరవం.. ఇది రహానేకే సాధ్యం) A pearler of a pluck from Paine! And it's the big wicket of Pujara too!@hcltech | #AUSvIND pic.twitter.com/q4rFhCb7Yj — cricket.com.au (@cricketcomau) December 27, 2020 -
మయాంక్ డకౌట్.. ముగిసిన తొలి రోజు ఆట
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా తొలి రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్టార్క్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. వన్డౌన్లో వచ్చిన పుజారాతో కలిసి మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రోజును ముగించారు. గిల్ 28 పరుగులు, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి టీమిండియా తొలి రోజు మూడు సెషన్లలోనూ తన ఆధిపత్యం చూపించింది. అంతకముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆసీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆసీస్ బ్యాటింగ్లో వేడ్ 48 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హెడ్ 38 పరుగులు చేశాడు. భారత బౌలింగ్లో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ తీశాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు టీమిండియా బౌలర్ బుమ్రా తొలి షాక్ ఇచ్చాడు .ఆసీస్ ఓపెనర్ బర్న్స్ను బుమ్రా డకౌట్ చేశాడు. దీంతో ఆసీస్ 10 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరి జోడి బలపడుతున్న తరుణంలో బౌలింగ్కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ వేడ్ను 30 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆసీస్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ దశలో మరోసారి బౌలింగ్కు వచ్చిన అశ్విన్ స్మిత్ను డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హెడ్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లబుషేన్,హెడ్లు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆచితూచి ఆడారు. (చదవండి : అతనికి అరుదైన గౌరవం.. ఇది రహానేకే సాధ్యం) టీ విరామానికి ముందు బుమ్రా బౌలింగ్లో 38 పరుగులు చేసిన హెడ్ ఔట్ కాగా.. కాసేపటికే అర్థసెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్న లబుషేన్ను సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ 136 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీ విరామానికి వెళ్లింది. విరామం అనంతరం భారత బౌలర్లు మరింత విజృంభించడంతో 59 పరుగులు మాత్రమే నమోదు చేసి మరో 5 వికెట్లను కోల్పోయింది. కాగా సిరాజ్ లబుషేన్ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో మెయిడెన్ వికెట్ తీశాడు. -
అతనికి అరుదైన గౌరవం.. రహానేకే సాధ్యం
మెల్బోర్న్ : బాక్సింగ్ డే టెస్టు ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్ను టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే వినూత్న రీతిలో గౌరవించాడు. టీమిండియా డ్రెసింగ్ రూమ్కు వెళ్లే సందర్భంలో మహ్మద్ సిరాజ్ను జట్టును లీడ్ చేశాడు. ఆసీస్తో మ్యాచ్ సందర్భంగా టీ విరామం సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. టీ విరామం ఇవ్వడంతో టీమిండియా కెప్టెన్ రహానే సిరాజ్ వద్దకు వెళ్లి ..నువ్వు ముందు వెళ్లు.. నీ వెనకాల మేము వస్తాం అని చెప్పాడు. రహానే చెప్పినట్లుగా సిరాజ్ ముందు నడవగా.. టీమ్ మొత్తం అతని వెనకాల నడిచింది. టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన సిరాజ్కు మేము ఇచ్చే గౌరవం ఇదేనని రహానే తెలిపాడు.(చదవండి : మైండ్గేమ్ ఆడనివ్వండి.. మేం మాత్రం: రహానే) రహానే చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. కెప్టెన్కుండే అన్ని లక్షణాలు రహానేలో ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. ఒక డెబ్యూ ఆటగాడిని ఇలా గౌరవించడం రహానేకు మాత్రమే చెల్లింది.. రహానే చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక లబుషేన్ను అవుట్ చేయడం ద్వారా మహ్మద్ సిరాజ్ టెస్టు క్రికెట్లో మెయిడెన్ వికెట్ సొంతం చేసుకున్నాడు. టాస్ గెలిచిన ఆసీస్ నత్తనడకన ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. భారత బౌలర్లు విజృంభించడంతో కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్ 68 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కమిన్స్ 2, లయన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. అశ్విన్, బుమ్రా చెరో 3, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. (చదవండి : క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు) -
క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు
మెల్బోర్న్ : టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మెరుపు ఫీల్డింగ్కు పెట్టింది పేరు. ఆసీస్తో జరిగిన టీ20 సిరీస్లో గాయపడిన జడేజా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు ద్వారా మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తూ స్టన్నింగ్ క్యాచ్తో ఆకట్టుకున్నాడు. అసలు విషయంలోకి వెళితే.. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో మాథ్యూ వేడ్ భారీ షాట్ ఆడాడు. (చదవండి : బాక్సింగ్ డే టెస్టు : స్టీవ్ స్మిత్ డకౌట్) మిడాన్లో ఉన్న జడేజా క్యాచ్ అందుకోవడానికి పరిగెత్తుకు రాగా.. కమ్యునికేషన్ గ్యాప్ రావడంతో మిడాఫ్లో ఉన్న గిల్ కూడా పరిగెత్తుకు వచ్చాడు. జడేజా క్యాచ్ను అందుకునే క్రమంలో అతని చేయి గిల్ను తాకింది. దీంతో క్యాచ్ మిస్సవుతుందని అంతా భావించారు. కానీ జడేజా మాత్రం బంతిని వదలకుండా చేతిలోనే ఒడిసిపట్టుకోవడంతో వేడ్ అవుట్గా వెనుదిరిగాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు. అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ టీ విరామం అనంతరం 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 7, కెప్టెన్ టిమ్ పైన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా బౌలర్ బుమ్రా ఆసీస్ ఓపెనర్ బర్న్స్ను డకౌట్ చేశాడు.దీంతో ఆసీస్ 10 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరి జోడి బలపడుతున్న తరుణంలో బౌలింగ్కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ వేడ్ను 30 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆసీస్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. (చదవండి : బాక్సింగ్ డే టెస్టు : స్టీవ్ స్మిత్ డకౌట్) Almost disaster! But Jadeja held his ground and held the catch! @hcltech | #AUSvIND pic.twitter.com/SUaRT7zQGx — cricket.com.au (@cricketcomau) December 26, 2020 ఈ దశలో మరోసారి బౌలింగ్కు వచ్చిన అశ్విన్ స్మిత్ను డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హెడ్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లబుషేన్,హెడ్లు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆచితూచి ఆడారు. టీ విరామానికి ముందు బుమ్రా బౌలింగ్లో 38 పరుగులు చేసిన హెడ్ ఔట్ కాగా.. కాసేపటికే అర్థసెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్న లబుషేన్ను సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ 5 వికెట్లు కోల్పోయింది. కాగా సిరాజ్ లబుషేన్ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో మెయిడెన్ వికెట్ తీశాడు. భారత బౌలర్లలో అశ్విన్ 2, బుమ్రా 2, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. -
బాక్సింగ్ డే టెస్టు : స్టీవ్ స్మిత్ డకౌట్
మెల్బోర్న్ : బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆసీస్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత బౌలర్లు మెరిశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిషాక్ ఇచ్చాడు. ఓపెనర్ జో బర్న్స్ను డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 10 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరి జోడి బలపడుతున్న తరుణంలో బౌలింగ్కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ వేడ్ను 30 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆసీస్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ దశలో మరోసారి బౌలింగ్కు వచ్చిన అశ్విన్ స్మిత్ను డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. లబుషేన్ 26 పరుగులు, ట్రెవిస్ హెడ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇది 100వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 43 మ్యాచ్ల్లో, భారత్ 28 మ్యాచ్ల్లో గెలిచాయి. మిగతా 27 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఒక టెస్టు ‘టై’గా ముగిసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా 30 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్ల్లో ఓడి, 12 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. భారత్ స్వదేశంలో 21 టెస్టుల్లో నెగ్గి, 13 మ్యాచ్ల్లో ఓడింది. 15 ‘డ్రా’ కాగా, ఒక టెస్టు ‘టై’ అయింది. -
బాక్సింగ్ డే టెస్టు : షా అవుట్.. గిల్, పంత్లకు చోటు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు ఒకరోజే ముందే టీమిండియా తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే తొలి టెస్టులో ఓపెనర్గా విఫలమైన పృథ్వీ షాను జట్టు మేనేజ్మెంట్ పక్కనబెట్టింది. అతని స్థానంలో శుబ్మాన్ తుది జట్టులోకి రాగా.. మొదటిటెస్ట్ మ్యాచ్లో గాయపడిన బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో సిరాజ్ను ఎంపిక చేశారు. మొదటి మ్యాచ్లో కీపర్గా విఫలమైన సాహా స్థానంలో రిషబ్ పంత్ను ఎంపికచేయగా .. కేఎల్ రాహుల్కు మరోసారి నిరాశే మిగిలింది. (చదవండి : 'కోహ్లికి ఇచ్చారు.. నటరాజన్కు ఎందుకివ్వరు') ఆసీస్తో జరిగిన తొలి టీ20లో గాయపడిన రవీంద్ర జడేజాను ఆల్రౌండర్ కోటాలో రెండో టెస్టుకు ఎంపిక చేశారు. ఇక మయాంక్తో కలిసి శుబ్మన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. వన్డౌన్లో పుజారా బ్యాటింగ్ చేయనున్నాడు. అజింక్యా రహానే, హనుమ విహారిలు మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. ఇక బుమ్రా ,ఉమేశ్ యాదవ్, సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్లు బౌలింగ్ భారం మోయనున్నారు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో రహానే మిగిలిన టెస్టులకు నాయకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్లో ఆసీస్ 1-0 ఆధిక్యంతో ఉంది. కాగా మొదటి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటైన టీమిండియా టెస్టు క్రికెట్లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. (చదవండి : 'రూ. 45 లక్షలిస్తే కేసు ఉపసంహరించుకుంటా') టీమిండియా తుది జట్టు : అజింక్యా రహానే(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుబ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
రాహుల్ ఫొటోలపై బాలీవుడ్ నటి కామెంట్
మెల్బోర్న్: టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ సహచరులతో కలిసి మెల్బోర్న్ పుర వీధుల్లో చక్కర్లు కొట్టాడు. వింటర్ సూట్ ధరించిన రాహుల్ అక్కడున్న బెంచీలపై కూర్చుని సేద తీరాడు. ఈ విశేషాలన్నీ ‘మెల్బోర్న్ ఆర్కివ్స్’ అంటూ అతను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. అభిమానులు స్పందించారు. రాహుల్ ఫ్యాషన్ సెన్స్ బాగుందంటూ కితాబిచ్చారు. బాలీవుడ్ నటి అథియా శెట్టీ కూడా రాహుల్ ఫొటోలు బాగున్నాయని చెప్తు.. హార్ట్ ఎమోజీతో కామెంట్ చేసింది. అథియా, రాహుల్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆటవిషయానికి వస్తే.. ఐపీఎల్ 13వ సీజన్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న రాహుల్ 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. కెప్టెన్గా కింగ్స్ పంజాబ్ జట్టును ముందుండి నడిచాడు. అయితే, తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు వన్డేల్లో కలిపి 76 పరుగులు, మూడు టీ20ల్లో 81 పరుగులే చేశాడు. ఇక టెస్టు జట్టులోనూ చోటుదక్కించుకున్న రాహుల్ పింక్బాల్ టెస్టులో తుది జట్టులో మాత్రం బెంచ్కే పరిమితమయ్యాడు. కాగా, అడిలైడ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది. తన టెస్టు చరిత్రలోనే 36 పరుగుల అత్యల్ప స్కోరు నమోదు చేసింది. రేపటి నుంచి మెల్బోర్న్ వేదికగా జరిగే రెండో టెస్టులో రాహుల్ మైదానంలోకి దిగే అవకాశముంది. View this post on Instagram A post shared by KL Rahul👑 (@rahulkl) -
ఆసీస్కు షాక్ : ఆ ఇద్దరు ఆటగాళ్లు దూరం
మెల్బోర్న్ : ఆ్రస్టేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్ అబాట్ రెండో టెస్టుకూ దూరమయ్యారు. గజ్జల్లో గాయంతో వార్నర్, కండరాల గాయంతో అబాట్ తొలి టెస్టు ఆడలేకపోయారు. దీంతోపాటే వీళ్లిద్దరు బయో బబుల్ దాటి బయటికి రావడంతో కోవిడ్ ప్రొటోకాల్ నేపథ్యంలో శనివారం మొదలయ్యే ‘బాక్సింగ్ డే’ టెస్టు కూడా ఆడే వీలు లేకుండా పోయింది. పైగా వార్నర్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు! ‘సిడ్నీలోని నార్తర్న్ బీచ్ వద్ద కరోనా హాట్స్పాట్ న్యూసౌత్వేల్స్ ఆరోగ్య శాఖను కలవరపెడుతోంది. ఇద్దరు ఆటగాళ్లు కూడా అక్కడి నుంచే మెల్బోర్న్కు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వాళ్లిద్దరిని జట్టుతో కలిసేందుకు అనుమతించడం లేదు’ అని సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి : ధోని రనౌట్కు 16 ఏళ్లు..) శుబ్మన్కు అవకాశం! మెల్బోర్న్: తొలి టెస్టులో ఎదురైన పరాభవం దృష్ట్యా రెండో టెస్టు కోసం భారత జట్టు పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తోంది. కెప్టెన్ కోహ్లి స్వదేశం చేరడంతో తాత్కాలిక కెప్టెన్ రహానే నేతృత్వంలోని టీమిండియా ఆటగాళ్లంతా నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చారు. కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్ల సన్నాహాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఓపెనర్ పృథీ్వషా పేలవ ఫామ్ నేపథ్యంలో తుది జట్టులో చోటు ఖాయమనుకుంటున్న శుబ్మన్ గిల్ నెట్స్లో అదేపనిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. పింక్ బాల్ వార్మప్ మ్యాచ్లో గిల్ రెండు ఇన్నింగ్స్ల్లో 43, 65 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇతని కంటే పృథ్వీ షా అనుభవజ్ఞుడు కావడంతో అతన్నే ఆడించారు. కానీ షా 0, 4 పరుగులతో జట్టు మేనేజ్మెంట్ను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీంతో రంజీల్లో పంజాబ్ ఇన్నింగ్స్ను ఓపెన్ చేసే 21 ఏళ్ల శుబ్మన్వైపే జట్టు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతోంది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలు కూడా నెట్స్లో శ్రమించారు. పేసర్లు సిరాజ్, నవ్దీప్ సైనీలు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
మెల్బోర్న్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ నేత చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మెల్బోర్న్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా ఎన్నారైలనుద్దేశించి పార్టీ ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్రెడ్డి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ ఎన్నారై కో–ఆర్డినేటర్ వెంకట్ మేడపాటి తదితరులు జూమ్ ద్వారా మాట్లాడారు. అనంతరం మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా విభాగం తీర్మానం చేసింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా నాయకులు పాల్గొన్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్కు శుభాకాంక్షల వెల్లువ) -
భారతీయురాలినని బస్సులో నుంచి దింపేశారు
మెల్బోర్న్: తాను కూడా జాతి వివక్షకు గురైన బాధితురాలినేనంటూ విచారం వ్యక్తం చేసింది టీవీ నటి చాందిని భగ్వనాని. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉంటున్న ఆమె తనకు ఎదురైన చేదు సంఘటన గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. దీని ప్రకారం.. ఆమె మెల్బోర్న్ నుంచి ఓ ప్రదేశానికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. అయితే అక్కడ బస్సు ప్రయాణం ఆమెకు అదే తొలిసారి. బస్సు ఎన్నో మలుపులు తిరుగుతుండటంతో గాబరా పడ్డ ఆమె డ్రైవర్ దగ్గరకు వెళ్లి ఇది సరైన స్థానానికే వెళ్తుందా? అని అడిగింది. కానీ అతని వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులు సైతం ఇంచుమించు ఇలాంటి ప్రశ్నలే కురిపించగా వారికి సున్నితంగా, గౌరవంగా జవాబిచ్చాడు. ఇంతకుముందు తాను అడిగింది వినలేదేమోనని ఆమె మరోసారి ప్రయత్నం చేయగా నిశ్శబ్ధమే రాజ్యమేలింది. (నా చర్మం రంగు విలువ ఎంత?) దీంతో మరింత కంగారుపడిన చాందిని అసలు ఎందుకు స్పందించడం లేదని అడగ్గానే డ్రైవర్ ఆగ్రహంతో ఊగిపోతూ కసురుగా వెళ్లిపొమ్మన్నాడు. "నేను చాలా మర్యాదగా అడిగాను కానీ అతను వెళ్లిపొమ్మంటూ అరుస్తూనే ఉన్నాడు. 'చెత్త భారతీయులారా..ఇక్కడి నుంచి వెళ్లిపొండి' అని బూతులు మాట్లాడాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్నాను. అతనిపై ఎలా స్పందించాలో, అప్పుడు ఏం చేయాలనేది తోచలేదు. వణుకుతూనే బస్సు దిగిపోయాను. జాతి వవక్ష ఇంకా ఉంది అనడానికి నాకు జరిగిన ఈ అనుభవమే నిదర్శనం" అని తెలిపింది. కాగా చాందిని కొన్ని ప్రోగ్రాములు చేయడం కోసం ఆమె ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే లాక్డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయింది. ఆమె చివరిసారిగా "సంజీవని" వెబ్సిరీస్లో కనిపించింది. (రేసిజానికి అర్థం మార్చేసింది!) #racism #notcool #ptv #Melbourne smallest act of racism is as serious as another major act of racism pic.twitter.com/aysID8Wg9r — Chandni Bhagwanani (@chandnib21) July 9, 2020 -
టెండూల్కర్ డ్రైవ్... కోహ్లి క్రెసెంట్
మెల్బోర్న్: రియల్ ఎస్టేట్ మాయలు, జిమ్మిక్కులు ఇక్కడే కాదు ఆస్ట్రేలియాలోనూ ఉంటాయి. తాము డెవలప్ చేసినవి అమ్ముకోవాలన్నా, సొమ్ము చేసుకోవాలన్నా... కొనుగోలు దారుల కంట్లో పడాలని ఆసీస్ వెంచర్ యజమాని మన క్రికెటర్ల పేర్లపై పడ్డాడు. మెల్బోర్న్లోని రాక్బ్యాంక్ ప్రాంతంలో అకొలేడ్ ఎస్టేట్ ఓ వెంచర్ని అభివృద్ధి చేసింది. ఇక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆ వెంచర్ డైరెక్టర్ అక్కడి వీధులకు సచిన్, కోహ్లి, కపిల్ దేవ్ల పేర్లు పెట్టారు. టెండూల్కర్ డ్రైవ్, కోహ్లి క్రెసెంట్, దేవ్ టెర్రస్లతో బోర్డులు పాతాడు. అలాగే విదేశీ ఇతర దేశ అభిమానుల కోసం మిగతా వీధులకు వా స్ట్రీట్, మియందాద్ స్ట్రీట్, ఆంబ్రోస్ స్ట్రీట్, సోబర్స్ డ్రైవ్, కలిస్ వే అనే పేర్లు పెట్టారు. దీనిపై ఆ వెంచర్ డైరెక్టర్ ఖుర్రమ్ సయీద్ మాట్లాడుతూ తనకిష్టమైన క్రికెటర్ల పేర్లను కొత్త వెంచర్ వీధులకు పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీధుల పేర్లకు ఆమోదం కోసం 60 పేర్లతో స్థానిక మెల్టన్ కౌన్సిల్కు అతను దరఖాస్తు చేశాడు. -
‘అప్పుడు నా ఒంటి మీద బట్టల్లేవు’
మెల్బోర్న్ : ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లికూనను కాపాడటానికి రెండున్నర మీటర్ల పొడవైన కొండచిలువతో నగ్నంగా పోరాడాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని కునునుర్రాకు చెందిన నిక్ కియాన్స్ కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి బెడ్ మీద నిద్రపోతున్నాడు. గార్డెన్లోనుంచి ఏవో శబ్ధాలు రావటంతో నిద్రలోంచి మెలుకున్నాడు. ఏంటా అని చూస్తే.. అతని పెంపుడు పిల్లి కూన లిల్.. కొండ చిలువ బారిన పడి అరుస్తోంది. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే అతడు బెడ్పై నుంచి నగ్నంగా గార్డెన్లోకి పరిగెత్తాడు. ( కిచెన్లో బయటపడ్డ విషపూరిత పాము ) పిల్లిని పట్టుకుని దాన్ని కొండచిలువ నుంచి తప్పించటానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పాము పిల్లిని వదిలేసింది. కానీ, ఆ వెంటనే అతడి చేతిని బాగా కొరికింది. రక్తం ధారలు కడుతున్నా పట్టించుకోకుండా పిల్లి ని కాపాడానన్న ఆనందంలో మునిగిపోయాడు నిక్. ఈ సంఘటనపై మాట్లాడుతూ.. ‘‘ కొన్ని సంవత్సరాలకు ముందు పాముల్ని పట్టుకోవటంలో శిక్షణ తీసుకోవటం కలిసొచ్చింది. పాము లిల్ను పట్టుకోవటం చూడగానే.. బెడ్పై నుంచి కిందకు దూకి గార్డెన్లోకి పరిగెత్తాను. అప్పుడు నా ఒంటి మీద బట్టల్లేవ’’ని చెప్పాడు. ( కిచెన్లో బాత్రూమ్: ‘ఓనర్ను జైలులో వేయాలి’ ) -
ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్ నిర్వహిస్తారా?
మెల్బోర్న్ : స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా టి20 ప్రపంచకప్ను నిర్వహించవచ్చంటూ వస్తున్న కొన్ని ప్రతిపాదనలపై ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ విస్మయం వ్యక్తం చేశాడు. కోవిడ్–19 కారణంగా టోర్నీ నిర్వహణ సమస్యగా మారడంతో టీవీ ప్రేక్షకుల కోసమే మ్యాచ్లు జరపాలంటూ కొందరు చేసిన సూచనలపై అతను తీవ్రంగా స్పందించాడు. ‘ఖాళీ స్టేడియాల్లో ప్రపంచ కప్ ఆడటాన్ని నేను అసలు ఊహించలేను. అసలు ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టోర్నీతో సంబంధం ఉన్నవారంతా దేశం మొత్తం తిరుగుతూ ఆడవచ్చు. కానీ అభిమానులకు మాత్రం అనుమతి ఉండదా. నాకు తెలిసి ఇది జరిగే అవకాశం లేదు. కరోనా బాధ తగ్గి అంతా సాధారణంగా మారిన తర్వాత దీనిని నిర్వహించండి లేదా దీనిని ప్రస్తుతానికి రద్దు చేసి అవకాశం ఉన్న మరో తేదీల్లో సర్దుబాటు చేయండి’ అని బోర్డర్ సూచించాడు. విధ్వంసక ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులే రానప్పుడు వరల్డ్ కప్ జరుగుతోందని చెబితే ఎవరూ నమ్మరని, తనకు తెలిసి ఇది సాధ్యమయ్యే పని కాదని అతను అన్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు సుమారు 6,400 మంది కరోనా బారిన పడగా, 61 మంది చనిపోయారు. -
మహిళల క్రికెట్లో ప్రపంచ రికార్డు!
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ను ఆసీస్ మరోసారి ముద్దాడింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మెగా కప్ను ఐదోసారి అందుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్ బెత్ మూనీ (61 నాటౌట్; 43 బంతుల్లో 9ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటై పరాజయం చెందింది.(మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) కాగా, ఈ టీ20 కప్ ఫైనల్ మ్యాచ్లో ఒక ప్రపంచ రికార్డు నమోదైంది. రికార్డు సంఖ్యలో 86,174 మంది ప్రేక్షకులు మ్యాచ్కు హాజరయ్యారు. దాంతో ఇది సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రపంచ మహిళల క్రికెట్ చరిత్రలో రికార్డు వీక్షక్షులు హాజరైన మ్యాచ్గా నిలిచింది. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకూ జరిగిన మహిళల స్పోర్ట్స్ ఈవెంట్ పరంగా చూసినా ఎక్కువ మంది హాజరైన మ్యాచ్ ఇదే. అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున జరిగిన మ్యాచ్కు ఇంతటి విశేష ఆదరణ రావడం ఇక్కడ మరో విశేషం. ఓవరాల్గా చూస్తే మహిళల స్పోర్ట్స్ ఈవెంట్లో అత్యధిక మంది వీక్షకుల హాజరైన మ్యాచ్ 1999లో కాలిఫోర్నియాలో జరిగిన సాకర్ వరల్డ్కప్ ఫైనల్. 21 ఏళ్ల నాటి మహిళల సాకర్ ఫైనల్ మ్యాచ్కు 90, 185 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. (మన వనిత... పరాజిత) -
మహిళల టీ20 వరల్డ్కప్ శ్రీలంకపై భారత్ ఘన విజయం