-
ర్యాగింగ్కు పాల్పడిన వైద్య విద్యార్థి ఏడాది సస్పెన్షన్
గాంధీఆస్పత్రి : ర్యాగింగ్ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు అడపాదడపా వెలుగుచూస్తున్నాయి. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్కు పాల్పడిన వైద్య విద్యారి్థని ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, గాంధీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్రెడ్డి నేతృత్వంలో గురువారం కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై తీర్మానాలు చేశారు. అనాటమీ విభాగంలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్లో ర్యాగింగ్కు సంబంధించి పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా 2020 బ్యాచ్కు చెందిన ఓ విద్యార్థి పలుమార్లు జూనియర్లను ర్యాగింగ్ చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో సదరు విద్యారి్థని ఏడాది పాటు హాస్టల్తోపాటు కళాశాలను నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. గతంలో ర్యాగింగ్కు పాల్పడి సస్పెన్షన్కు గురైన విద్యార్థులు, వారి తల్లితండ్రులు యాంటి ర్యాగింగ్ కమిటీని కలిసి మరోమారు ర్యాగింగ్కు పాల్పడమని, సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరగా, కమిటీ వారి అభ్యర్థనను ఏకగ్రీవంగా తిరస్కరించింది. క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా కేవలం సస్పెన్షన్తో సరిపెట్టినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. యాంటీ ర్యాగింగ్ చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని, ఇకపై ర్యాగింగ్కు పాల్పడిన వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. గాం«దీలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, కాలేజీకి చెడ్డపేరు తెచ్చెవారిని ఉపేక్షించరాదని తీర్మానించి, ర్యాగింగ్ నిరోధానికి పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో గాంధీ వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ రాజారావులతోపాటు పలు విభాగాలకు చెందిన హెచ్ఓడీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఎంబీబీఎస్ విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించండి
న్యూఢిల్లీ: దేశంలో 70 శాతం వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థులకు సక్రమంగా స్టైపెండ్ చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఏం చేస్తోందని నిలదీసింది. స్టైపెండ్ చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థుల నుంచి భారీగా డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేస్తుంటాయని పేర్కొంది. ఎంబీబీఎస్ విద్యార్థులు నిర్బంధ కారి్మకులు కాదని తేలి్చచెప్పింది. వారికి తక్షణమే స్టైపెండ్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఎంసీని ఆదేశించింది. -
వైద్య విద్యకు శ్రీకారం.. 30 ఎకరాల్లో.. రూ.180 కోట్లు
మెదక్: మెతుకు సీమగా పేరుగాంచిన మెదక్ జిల్లా త్వరలో వైద్య విద్యకు కేరాఫ్గా మారనుంది. స్పెషలిస్ట్లు లేక అత్యవసర వైద్యం కోసం ఇంతకాలం ఇతర ప్రాంతాలకు పరుగులు తీసిన ప్రజల కష్టాలు తప్పనున్నాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషితో జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో పాటు త్వరలో మెరుగైన వైద్యం స్థానికంగా అందనుంది. గత నెలలో సీఎం కేసీఆర్ మెదక్ పర్యటనలో మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన జీఓ విడుదల కావటంతో ఈ నెల 5న మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా కళాశాల పనులు ప్రారంభించేందుకు జిల్లా వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుబాటులో 400 బెడ్స్ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, బెడ్స్, వైద్యుల నియామకం చేపట్టి ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరిచేందుకు సర్కారు చర్యలు ప్రారంభించింది. జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ప్రభుత్వం.. వైద్యశాలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తోంది. ప్రస్తుతం మెదక్లోఉన్న మాతా, శిశు ఆస్పత్రి పక్కనే 30 ఎకరాల్లో వైద్య కళాశాలను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు జిల్లా వైద్యాధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నర్సింగ్ కళాశాలకు స్థలం కేటాయించిన అధికారులు మెడికల్ కళాశాలతో పాటు వసతి గృహం పనులు వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిబంధన ప్రకారం మెడికల్ కళాశాలకు భవనంతో పాటు 400 బెడ్స్ అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఎంసీహెచ్లో 150 బెడ్స్ ఉండగా క్రిటికల్ కేర్ కోసం మరో 100 పడకల ఆస్పత్రితో పాటు జిల్లా ఆస్పత్రిలో 250 బెడ్స్తో ఉండాలి. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో 200 పడకలకు అప్గ్రేడ్ చేసినా మరో 50 పడకల ఆస్పత్రిని నిర్మించాల్సి ఉంది. మెడికల్ కళాశాల ఏర్పాటైతే అన్నిరకాల స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాల ఫలితంగా ఏర్పాటవుతున్న మెడికల్ కళాశాలతో జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. సీఎం కేసీఆర్ కృషితో.. సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కృషితో మెడికల్ కళాశాల మంజూరైంది. వచ్చే ఏడాదిలో 100 మంది మెడికోలతో తరగతులు ప్రారంభిస్తాం. కళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. – పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్ అన్ని రకాల వైద్యసేవలు.. మెడికల్ కాళాశాల ఏర్పాటుతో అన్నిరకాల స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. అన్ని రకాల వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుతాయి. వైద్యం రంగంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. – చందూనాయక్, డీఎంహెచ్ఓ, మెదక్ -
నిత్యం కాల్పులతో ములుగు ప్రాంతం వణికిపోయేది: హరీష్ రావు
సాక్షి, ములుగు: తెలంగాణ మంత్రి హరీష్ రావు ములుగు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. రూ.183 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ములుగు నియోజకవర్గంలోనే 14 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోనే నక్సలైట్ల ఉద్యమం పుట్టింది. నిత్యం కాల్పులతో ములుగు ప్రాంతం వణికిపోయేది అభివృద్ధి ఫలాలను సీఎం కేసీఆర్ ప్రతీ ఒక్కరికీ అందిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో కాల్పులు, ఎన్కౌంటర్లు, రైతులకు అప్పులు కరెంట్ బాధలు, ఎరువుల కొరతలు, తాగు నీటి కష్టాలు ఉండేవి. కేసీఆర్ లేకుంటే ములుగు జిల్లా ఏర్పడేదా?. కల్యాణ లక్ష్మి పథకానికి ములుగు జిల్లా స్ఫూర్తినిస్తోంది. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. కేసీఆర్ హయాంలో పోడు భూములకు పట్టాలు, ప్రతి గ్రామానికి రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి పెళ్లికి కళ్యాణ లక్ష్మి, ప్రతి బిడ్డకు కేసిఆర్ కిట్టు, ప్రతి రైతుకు 24 గంటల కరెంటు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక కల్యాణ లక్ష్మి పథకం. రాజకీయాలకు అతీతంగా పేదింటి ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గత ప్రభుత్వం మూడు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిస్తే కేసీఆర్ ప్రభుత్వం 4 లక్షల 6 వేల ఎకరాలకు పోడు పట్టాలిచ్చింది. ములుగు నియోజకవర్గంలోనే 14 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. 76.8% ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు అవుతున్నాయి. ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంత బాగుపడిందో అనడానికి ఇది నిదర్శనం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 87% డెలివరీలతో రాష్ట్రంలోనే ములుగు జిల్లా రెండవ స్థానంలో ఉంది. గిరిజనేతరుల పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘రాష్ట్రంలో ఏ పార్టీకీ గెలిచే బలం లేదు. నేను బీజేపీలోనే ఉంటా’ -
మన వైద్య రంగం దేశానికే దిక్సూచి
కొన్ని స్టేట్మెంట్స్ ఎప్పుడూ నా మనసును తడుతుంటాయి. ఈవేళ అలా ‘నాట్ ఆల్ ఏంజిల్స్ హేవ్ వింగ్స్.. సమ్ హేవ్ స్టెతస్కోప్స్’ (దేవతలంటే రెక్కలున్న వాళ్లు మాత్రమే కాదు.. స్టెతస్కోప్స్ ఉన్న వాళ్లు కూడా) అనే కోట్ నా మనసుకు తట్టింది. అందుకే ఈ కళాశాలలో అడుగు పెట్టినప్పుడు దీనిని బోర్డుపై రాసి సంతకం పెట్టాను. కీప్ దిస్ ఇన్ మైండ్. మీరంతా మంచి డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేట్ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్లర్లు అవుతారన్న నమ్మకం నాకు ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయనగరం: నాలుగేళ్లలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, కార్యక్రమాల వల్ల మన వైద్య రంగం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రూ.8,480 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం చేపట్టిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తొలి దశలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఐదు కళాశాలలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని స్వయంగా, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విశాఖపట్నం నుంచి ఉదయం 10:30 గంటలకు విజయనగరం మెడికల్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. కళాశాల అంతటా కలియదిరిగి పరిశీలించిన తర్వాత విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టామని, అందులో ఇప్పటికే పూర్తి అయిన ఐదు మెడికల్ కాలేజీల్లో ఈరోజు పిల్లలు అడ్మిషన్లు తీసుకొని డాక్టర్లుగా అడుగులు వేస్తున్నారన్నారు. వైద్య విద్య అభ్యసించాక, అందరూ మంచి సేవల ద్వారా గొప్ప డాక్టర్లుగా, గొప్ప మనుషులుగా, గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మనసారా ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. మనసున్న డాక్టర్లను సమాజానికి అందించడమే లక్ష్యంగా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రతి జిల్లాలో టెరిషరీ కేర్... ఈ రోజు 5 మెడికల్ కాలేజీలు.. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ప్రారంభించాం. వచ్చే ఏడాది మరో ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు చేస్తాం. మళ్లీ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు అడ్మిషన్ స్థాయిలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకు రాగలుగుతున్నాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేశాం. ప్రతి జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజీ పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాం. దీనివల్ల టెరిషరీ కేర్ (స్పెషలిస్టు డాక్టర్లతో అత్యున్నత స్థాయి వైద్యం) అనేది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలోకి మనం తీసుకు పోగలుగుతాం. ఎప్పుడైతే మెడికల్ కాలేజీ అందుబాటులో ఉంటుందో అప్పుడు అక్కడి ప్రొఫెసర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు నిత్యం అందుబాటులో ఉంటారు. దీనివల్ల వైద్య సేవల్లో గొప్ప మార్పు ఉంటుంది. ఇలా టెరిషరీ కేర్ పెరగడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఇది ఒక ఎత్తయితే మరోవైపు వేల మంది పిల్లలను మంచి డాక్టర్లుగా తయారు చేసే గొప్ప ఇన్స్టిట్యూషన్లను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయగలుగుతున్నాం. అదనంగా ఎంబీబీఎస్ సీట్లు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత వరకు మన రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 11 మాత్రమే ఉన్నాయి. కేవలం ఈ నాలుగేళ్ల కాలంలో దేవుడి దయతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా అధికార వికేంద్రీకరణ చేయగలిగాం. అలాగే, కొత్తగా ఏర్పాటు చేసే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 28 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉండే దిశగా అడుగులు వేగంగా వేస్తున్నాం. ఈ 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వీటివల్ల 2,250 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 2,185 కాగా, ఈ 17 మెడికల్ కాలేజీలు రావడంతో ఏకంగా 4,735కు పెరుగుతాయి. ఇప్పటికే ఉన్న కాలేజీల ఆధునికీకరణ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీలన్నింటిలోనూ మౌలిక సదుపాయాలన్నీ అప్గ్రేడ్ చేయగలిగాం. ‘జీరో వేకెన్సీ’ పాలసీ తీసుకొచ్చి గతంలో పెండింగ్లో ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయతలపెట్టాం. తద్వారా దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే 609 కొత్త పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 17 కొత్త మెడికల్ కాలేజీల ద్వారా భవిష్యత్లో మరో 2,737 పీజీ సీట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తోందంటే మీరంతా (వైద్య విద్యార్థులు) మంచి డాక్టర్లు కావాలి. రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉపయోగపడాలనేదే నా ఆశయం. యాజ్ ఏ లీడర్, విజనరీస్, దిస్ ఈజ్ అవర్ డిజైర్. అందుకే ఇదంతా మీకు వివరిస్తున్నాను. ఈ రోజు ప్రారంభమవుతున్న ఐదు మెడికల్ కాలేజీల్లో దాదాపు 750 ఎంబీబీఎస్ సీట్లతో పిల్లలు డాక్టర్లు కాబోతున్నారు. రేపటి సంవత్సరం పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని ఇలాంటి బ్యాక్వర్డ్ ఏరియాల్లో కూడా మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. తద్వారా 2024–25లో మరో 750 మెడికల్ సీట్లు వస్తాయి. ఆ తర్వాత 2025–26లో గిరిజన ప్రాంతాలు, టెరిషరీ కేర్ దొరకడం కష్టంగా ఉన్న పార్వతీపురం, నర్సీపట్నం లాంటి చోట్ల మరో ఏడు మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. తద్వారా 1,050 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. నర్సింగ్ కాలేజీలూ అభివృద్ధి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 1,090 నర్సింగ్ సీట్లు ఉన్నాయి. కొత్తగా 18 నర్సింగ్ కాలేజీలను తీసుకొస్తున్నాం. వీటి ద్వారా మరో 1,200 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 2,090 సీట్లు ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎన్ఏబీహెచ్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్, హెల్త్ కేర్ ప్రొవైడర్స్), ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) మార్గదర్శకాలకు అనుగుణంగా నాడు–నేడు ద్వారా అప్గ్రేడ్ చేస్తున్నాం. ఇందుకోసం దాదాపు రూ.3,820 కోట్లు వెచ్చిస్తున్నాం. జాతీయ స్థాయి కన్నా ఎంతో మెరుగు గతంలో కనివినీ చూడని విధంగా రాష్ట్రంలో ప్రతి మండలానికి కనీసం ఒక 108 వాహనం, రెండు 104 వాహనాలు ఉండేట్లుగా ఏర్పాట్లు చేశాం. 1,514 కొత్త వాహనాలు కొనుగోలు చేశాం. తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్లతో కలిపితే మొత్తం 2,204 అంబులెన్స్ వాహనాలు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. ఇలా ఏ రాష్ట్రంలోనూ తిరగడం లేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో ఒక్క వైద్య, ఆరోగ్య విభాగంలోనే 53,126 మందిని రిక్రూట్ చేశాం. జాతీయ సగటును గమనిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల ఖాళీలు 61 శాతం ఉన్నాయి. మన రాష్ట్రంలో అది 3.96 శాతం మాత్రమే. ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి, నో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి అసలు ఎక్కడా ఖాళీలు ఏర్పడక ముందే భర్తీ చేయాలని వెంట పడుతున్నాం. జాతీయ స్థాయిలో సగటున ప్రభుత్వాస్పత్రుల్లో నర్సు పోస్టుల ఖాళీలు 27 శాతం ఉంది. మన రాష్ట్రంలో జీరో (సున్నా శాతం). జాతీయ స్థాయిలో సగటున ప్రభుత్వాస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ల ఖాళీలు 33 శాతం. మన రాష్ట్రంలో జీరో. పేదవాళ్లకు ఉపయోగపడాలి వైద్య ఆరోగ్య రంగంలో మంచి డాక్టర్లు రావాలి. మంచి పీజీ స్టూడెంట్లు రావాలి. మీలో (వైద్య విద్యార్థుల్లో) మంచి మనసు రావాలి. మీరంతా పేదవాళ్లకు ఉపయోగపడే పరిస్థితి రావాలనేదే నా ఆశయం. ఇప్పటి వరకు బటన్ నొక్కితే డీబీటీ పద్ధతిలో 2.35 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేద ప్రజల ఖాతాల్లోకి వేయగలిగాం. ఎలాంటి లంచాలకు, ఎక్కడా వివక్షకు చోటు లేకుండా చేయగలిగాం. ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేలా వ్యవస్థను గడప వరకు తీసుకుపోగలిగాం. రేషన్ కార్డు, రేషన్ బియ్యాన్ని ప్రతి గడప ముంగిటకు చేర్చగలిగాం. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి, ఇంటి స్థలం లేని వారెవరైనా ఉన్నారా అని వెతికి, అప్లికేషన్ పెట్టించి 30 లక్షల ఇంటి స్థలాలను పేదవాళ్లకు ఇవ్వగలిగాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఎవరికి ఏ రకమైన సర్టిఫికెట్ కావాలన్నా ఇంటింటికీ వెళ్లి అడిగి మరీ సమకూరుస్తున్నాం. ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమంలో 98 లక్షల సర్టిఫికెట్లు అందజేశాం. గతానికి ఇప్పటికీ ఎంతో తేడా గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మందులు తీసుకుంటే నయం కాదని చాలా మంది అనుకుంటారు. కానీ ఈరోజు అన్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్), జీఎంపీ (గుడ్ మాన్యుఫాక్టరింగ్ ప్రాక్టీసెస్) నిర్దేశించిన మందులు మాత్రమే ఉంచాం. ఆరోగ్యశ్రీ సేవలు మనం రాకముందు నామమాత్రంగా ఉండేవి. గతంలో 1050 ప్రొసీజర్లు ఉంటే ఈరోజు 3,255 ప్రాసీజర్లకు విస్తరించాం. అన్ని రకాల క్యాన్సర్ల నుంచి కాంక్లియర్ ఇంప్లాంట్ వరకు ఆరోగ్య శ్రీలో కవర్ అవుతున్నాయి. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలనే తపన, తాపత్రయంతో విస్తరిస్తున్నాం. గతంలో ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ హాస్పిటళ్లు 900 ఉంటే ఈరోజు 2,285కు విస్తరించాయి. గతంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్ రూ.1,100 కోట్లు కూడా సరిగా లేదు. ఈ రోజు ఆ బడ్జెట్ దాదాపు రూ.3,600 కోట్ల వరకూ ఉంది. ప్రివెంటివ్ కేర్ అవసరం నాలుగేళ్ల మన పాలనలో ప్రణాళికా బద్ధంగా గ్రామ స్థాయి నుంచి మార్పులు తీసుకొస్తున్నాం. ఒకపక్క క్యూరేటివ్ కేర్, టెరిషరీ కేర్పై దృష్టి పెట్టాం. క్యూరేటివ్ కేర్ ఎంత అవసరమో ప్రివెంటివ్ కేర్ (ప్రమాదకరమైన వ్యాధులు, ఆరోగ్య సమస్యలు తీవ్ర స్థాయికి చేరకముందే కనుక్కొని నిరోధించడం) కూడా అంతే అవసరం. ఈ విషయంలో దేశానికే మార్గదర్శకంగా నిలబడే విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా అడుగులు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటయ్యాయి. వాటిలో సీహెచ్ఓ, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ఉంటారు. అక్కడ 105 రకాల మందులు ఇస్తారు. 14 రకాల డయోగ్నోస్టిక్ టెస్టులు చేస్తారు. మరో 542 అర్బన్ క్లినిక్లు తీసుకొచ్చాం. విలేజ్ క్లినిక్లను ప్రివెంటివ్ కేర్ దిశగా అడుగులు వేయిస్తున్నాం. ప్రతి మండలానికి కనీసం 2 పీహెచ్సీలు ఉండేట్లుగా చేస్తున్నాం. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు చొప్పున ఉంటారు. ఒక 104 వాహనం ఉంటుంది. ఒక డాక్టరు ఆస్పత్రిలో అందుబాటులో ఉంటే, మరో డాక్టరు ఈ అంబులెన్స్లో షెడ్యూల్ ప్రకారం కేటాయించిన గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. ఇలా ప్రతి నెలా ఆ గ్రామానికి కనీసం రెండుసార్లు వెళ్లేట్లు చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఆర్నెల్ల వ్యవధిలోనే ఆ గ్రామంలో ఎవరికి ఏ రోగం ఉంది.. ఎవరికి బీపీ, షుగర్ వంటి సమస్యలున్నాయనేది పూర్తిగా చెప్పగలిగేలా ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. జగనన్న ఆరోగ్య సురక్ష మరో మంచి కార్యక్రమం ఈ రోజు మరో మంచి కార్యక్రమం దిశగా అడుగులు వేస్తున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభించాం. ఇంటింటికీ వెళ్లి జల్లెడ పట్టి ఆ ఇంట్లో ఎవరికి ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా సరే 7 రకాల టెస్టులు చేస్తారు. 5 దశల్లో యాక్టివిటీ మొదలు పెట్టాం. నాలుగో దశలో హెల్త్ క్యాంపులు ఉంటాయి. సెప్టెంబర్ 30న మొదటి హెల్త్ క్యాంపు నిర్వహిస్తారు. తర్వాత 45 రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపులు పూర్తవుతాయి. గ్రామం మొత్తం మ్యాపింగ్ అవుతుంది. ప్రతి ఇంట్లో ఏ రకమైన సమస్య ఉన్నా, వారికి ఉచితంగా టెస్టులు చేస్తాం. ఉచితంగా మందులు ఇవ్వబోతున్నాం. తర్వాత హ్యాండ్ హోల్డింగ్ చేయబోతున్నాం. అది చాలా కీలకమైంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా అడుగులు వేస్తున్నాం. ఇందుకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నా." అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, మంత్రులు విడదల రజని, బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాసరావు, కళావతి, పుష్ప శ్రీవాణి, జోగారావు, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్బాబు, విక్రాంత్, రఘురాజు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, డీసీఎంఎస్ చైర్పర్సన్ భావన, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యాధిగ్రస్తులకు పెద్దమనసుతో సాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హెలిప్యాడ్ వద్ద అనారోగ్యంతో బాధ పడుతున్న పలువురు బాధితులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పూసపాటిరేగ గ్రామానికి చెందిన టొంపల లేఖన, బోన్మ్యారో మార్పిడి కోసం ఎదురు చూస్తున్న గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన దూరి భానుప్రసాద్, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దేరసాం గ్రామానికి చెందిన పోలియో వ్యాధిగ్రస్తుడు పిల్లా శంకరరావు, అనుకోని ప్రమాదంతో వీల్చైర్కే పరిమితమైన జి.సిగడాం మండలం నిద్దాం గ్రామానికి చెందిన చౌదరి గణే‹Ùలు తమ అనారోగ్య సమస్యలు చెప్పుకున్నారు. వీరందరి సమస్యలను ఓపికగా విన్న సీఎం వారి భుజం తట్టి ఓదార్చారు. తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున అందించాలని, మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. నిమిషాల వ్యవధిలో కలెక్టర్ నాగలక్ష్మి వారికి చెక్కులు అందజేశారు. ఇది కూడా చదవండి: థాంక్యూ జగనన్న.. జీవితాంతం మేం మీకు రుణపడి ఉంటాం -
మన డాక్టర్లు.. దేశానికి రక్ష!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏటా పది వేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుందని.. ఇది భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాత్మకమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తి ఉండటానికి తెల్లరక్త కణాలు ఏ విధంగా పనిచేస్తయో.. తెలంగాణ ఉత్పత్తి చేసే తెల్లకోటు డాక్టర్లు రాష్ట్రానికే కాకుండా దేశానికి రక్షగా నిలుస్తారని చెప్పారు. రాష్ట్ర వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలిచేలా పురోగమించడం మనకు గర్వకారణమన్నారు. శుక్రవారం కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో కలిపి మొత్తం 9 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. రాష్ట్ర వైద్య రంగ చరిత్రలో చారిత్రక ఘట్టం ఇది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యానికి చేరువయ్యాం. తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదని ఎకసెక్కాలు పలికిన వారి సమయంలో తెలంగాణలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 26కు చేరుకున్నాయి. వచ్చే ఏడాది మరో 8 వైద్య కాలేజీలను ప్రారంభించుకోనున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మొత్తం 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉంటాయి. వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. గతంలో ఒక్క కాలేజీ కూడా లేని ఉమ్మడి నల్గొండలో మూడు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం. ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి అడవి బిడ్డలు నివసించే ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా చేసి మెడికల్ కాలేజీలను స్థాపించుకున్నాం. హరీశ్రావు ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టాక డైనమిక్గా పనిచేస్తున్నారు. మంచి విజయాలు సాధించారు. ఏటా పది వేల మంది డాక్టర్లు.. తెలంగాణలో 2014లో 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే.. ఇప్పుడు 8,515కు చేరుకున్నాయి. ఇందులో 85శాతం సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కేలా చర్యలు చేపట్టాం. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కలిపి తెలంగాణ రాష్ట్రం నుంచి ఏటా 10వేల మంది డాక్టర్లను తయారుచేసే స్థాయికి ఎదుగుతున్నాం. వారు రాష్ట్రానికే కాకుండా దేశమంతటికీ సేవలు అందిస్తారు. ప్రజలకు మంచి వైద్య సేవలు కూడా.. దేశంలోనే అత్యధికంగా ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లున్న ఏకైక రాష్ట్రం మనదే. 34 వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే 34 పెద్దాస్పత్రులలో వేలాది పడకలతో పేదలకు మంచి వైద్య సేవలు అందుతాయి. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కోర్సులు పెడుతున్నాం. 2014లో రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో 17వేల పడకలుంటే.. ఇప్పుడు 34 వేలకు పెరిగాయి. మరో 6 ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయి. వరంగల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం. హైదరాబాద్లో టిమ్స్ బ్యానర్ కింద నాలుగు ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. నిమ్స్ను విస్తరిస్తున్నాం. మొత్తంగా బెడ్ల సంఖ్యను 50వేలకు పెంచుకుంటున్నాం. ఏవైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనేందుకు మొత్తం 50వేల పడకలను ఆక్సిజన్ బెడ్స్గా సిద్ధం చేసుకుంటున్నాం. రాష్ట్రంలో మానవీయ పాలన తెలంగాణలో మానవీయ పాలన కొనసాగుతోంది. అమ్మఒడి వాహనాలు ఏర్పాటు చేసి గోండు గూడాలు, ఆదివాసీ, బంజారా తండాలు, మారుమూల ప్రాంతాల్లోని గర్భవతులను ఆస్పత్రులకు తరలిస్తున్నాం. ప్రసవం అయ్యాక తిరిగి ఇంటివద్ద దింపుతున్నాం. తల్లీపిల్లల కోసం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలను అమలు చేస్తున్నాం. వైద్య వృత్తి పవిత్రమైనది. తెలంగాణ వైద్యులంటే గొప్ప పేరు రావాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలి..’’ అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. దేశ చరిత్రలోనే తొలిసారి: హరీశ్రావు ఒక రాష్ట్రం ఒకేసారి తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారని.. ఇది సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో సుదినమని చెప్పారు. గత ఏడాది ఒకేసారి 8 కాలేజీలు ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఈసారి మన రికార్డును మనమే అధిగమించామని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో ఒక్క తెలంగాణ వాటానే 43 శాతమని వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. కాగా.. సీఎం కాలేజీలను వర్చువల్గా ప్రారంభించగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లాల్లో కాలేజీల వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్ -
వైద్య విద్యార్థుల భవిష్యత్కు బంగారుబాట పడింది: సీఎం కేసీఆర్
నిర్మల్: తెలంగాణ అంతటా మెడికల్ కళాశాలల ఏర్పాటుతో వైద్య విద్యార్థుల భవిష్యత్కు బంగారుబాట పడిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్యకళాశాలతోపాటు రాష్ట్రంలో మరో ఎనిమిది కళాశాలలను సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం వర్చువల్ విధానంలో ఒకేసారి ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీలున్నాయని.. భవిష్యత్లో మరో ఎనిమిదింటిని ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ ఏటా 10వేల మంది వైద్యులను దేశానికి అందించబోతోందని తెలిపారు. లక్ష జనాభాకో 22 మెడికల్ సీట్లు ఉన్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. 500 టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని, రాష్ట్రంలో 10 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేద గర్భిణులకు కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నామని, గర్భిణులకు ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని, ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. వైద్యరంగంలో అరుదైన ఘట్టం.. జిల్లా వైద్యరంగంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అరుదైన ఘట్టమని స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వర్చువల్గా వైద్యకళాశాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ చొరవతో నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ చేతుల మీదుగానే నిర్మల్లో మెడికల్ కాలేజీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. పేదలకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువైందని తెలిపారు. నిర్మల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేక దృష్టి పెట్టారని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి సేవలు.. జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని, ఇక పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ వరుణ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా యువత వైద్యవిద్య కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదని తెలిపారు. సంతోషంగా ఉంది.. మా నాన్న జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఫార్మసిస్ట్గా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. డాక్టర్ చదవాలనే నా లక్ష్యానికి అంకురార్పణ ఇక్కడే జరిగింది. సొంత జిల్లాలోనే నాకు సీటు రావడం సంతోషంగా ఉంది. ఈ జిల్లా బిడ్డగా బాగా చదివి మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంటా. కళాశాలకు మంచిపేరు తెస్తా. – జారా నవాల్, నిర్మల్ అమ్మ కల నిజం చేస్తా.. డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలగన్న. మా అమ్మ జిల్లా ఆస్పత్రిలో 20 ఏళ్లుగా స్టాఫ్నర్స్గా పని చేస్తున్నారు. అమ్మ నన్ను డాక్టర్ను చేయాలనే ఆశతో చదివించారు. అమ్మ కల నిజం చేసేరోజు వచ్చింది. సీటు సాధించేందుకు కష్టపడ్డా. సొంత జిల్లాలో చదివే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. – ఎస్.భానుతేజ, నిర్మల్ నేను చదువుకోలేకపోయినా.. నేను ఆటో నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న. నేను చదువులో అంతగా రాణించలేదు. నాలాగా నా కుమారుడు కావద్దని అతడిని కష్టపడి చదివించిన. ఇప్పుడు పక్క జిల్లాలోనే మెడికల్ కాలేజీలో సీటు రావడం సంతోషంగా ఉంది. నా కుమారుడు మంచి డాక్టర్ కావాలన్నదే నా కోరిక. – విజయ్కుమార్, ఆదిలాబాద్, విద్యార్థి తండ్రి మంచి డాక్టర్గా ఎదుగుతా.. ఎంతో కష్టపడితేనే నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. ఈరోజు నుంచి క్లాసులు ప్రారంభం కావడం.. నాన్నతో వచ్చి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. కష్టపడి చదివి మంచి డాక్టర్గా ఎదుగుతా. – సమ్మిత్, ఆదిలాబాద్ సైకియాట్రిస్ట్ను అవుతా.. తెలంగాణలో మెడికల్ సీట్లు పెంచడం వల్లే నాకు అవకాశం వ చ్చింది. నేను సైకియాట్రిస్ట్ను అవుతా. డాక్టర్ కోర్సు పూర్తిచేశాక పేదలకు సేవ చేస్తా. ఇక్కడి కళాశాలలో సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి. – నందిని, నిజామాబాద్ చాలా దగ్గరగా ఉంది.. గతంలో ఎంబీబీఎస్ చదవాలంటే ఇబ్బందిగా ఉండేది. కాలేజీ నాకు దగ్గరగా ఉంది. ఇక్కడకు వచ్చి వెళ్లడం చాలా సులభం. చదువు పూర్తిచేశాక పేదలకు సేవలందిస్తా. మా నాన్న వైద్యుడే. ఆయన ప్రోత్సాహంతో డాక్టర్ కావాలనుకుంటున్నాను. – మహిన్, ఆర్మూర్ అక్కలాగే కావాలని.. మా అక్కయ్య వికారాబాద్లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. నేను కూడా మా అక్క లాగే డాక్టర్ కావాలనుకుని కష్టపడి చదివి సీటు సంపాదించాను. మన జిల్లాలోని మెడికల్ కాలేజీలో సీటు రావడం ఆనందంగా ఉంది. – ఆదుముల్ల శశివర్ధన్, భైంసా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.. జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ శకటం ముందు నడవగా రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్రెడ్డి, ఎస్పీ ప్రవీణ్కుమార్, ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ చైర్మన్ అప్పాల గణేశ్, ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్, నాయకులు అల్లోల గౌతమ్రెడ్డి, పాకాల రాంచందర్, అల్లోల మురళీధర్రెడ్డి, సురేందర్రెడ్డి, రామ్కిషన్రెడ్డి, రామేశ్వర్రెడ్డి, రాము, లక్ష్మణాచారి, విద్యార్థులు, ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు, వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ పండుగ వాతావరణంలో మంచిర్యాల చౌరస్తా మీదుగా దివ్యాగార్డెన్స్ వరకు కొనసాగింది. దారి పొడవునా డీజే పాటలతో విద్యార్థులు, యువకులు నృత్యాలు చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, ర్యాలీ సందర్భంగా మంత్రి ఐకేరెడ్డి నృత్యం చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం దివ్యాగార్డెన్స్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. -
TS Election 2023: మందు పొయ్య.. పైసలు ఇయ్య అంటే.. చాలా మంది ప్రశ్నించారు : మంత్రి కేటీఆర్
సిరిసిల్ల: మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లాలో గడపగడపకూ వైద్యసేవలు అందుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ఆరు నెలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరు వద్ద మెడికల్ కాలేజీని శుక్రవారం ప్రారంభించిన అనంతరం అంబేడ్కర్ సర్కిల్ వద్ద జరిగిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞత సభలో మాట్లాడారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో తాగు, సాగునీరు వచ్చిందని.. విద్య, వైద్యరంగాల్లో పెను మార్పులు వచ్చాయని భావిస్తే సిరిసిల్లలో నన్ను, వేములవాడ మా లక్ష్మీనర్సింహారావును గెలిపించాలని కోరారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతోపాటు మెడికల్ కాలేజీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, వ్యవసాయ డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయన్నారు. త్వరలోనే జిల్లాకు ఆక్వా యూనివర్సిటీ రాబోతుందని తెలిపారు. అభివృద్ధి సాధించిందని నమ్మితేనే గెలిపించండి.. సిరిసిల్ల అభివృద్ధి సాధించిందని భావిస్తేనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కేటీఆర్ కోరారు. నాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉందని, గుండె లోతుల్లోంచి చెబుతున్నానన్నారు. సిరిసిల్ల ప్రజలకు మందు పొయ్య.. పైసలు ఇయ్య అంటే.. చాలా మంది ప్రశ్నించారని.. కానీ ఇక్కడి ప్రజలపై ఉన్న నమ్మకంతోనే ఆ మాటలు చెబుతున్నానని స్పష్టం చేశారు. మధ్యమానేరులోకి గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెచ్చామని, మల్కపేట రిజర్వాయర్తో బీడు భూములకు సాగునీరు వస్తుందన్నారు. 1001 గురుకులాలతో నాణ్యమైన విద్యనందిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. 2009లో ఎమ్మెల్యేగా ఉండగా సిరిసిల్ల ఆస్పత్రికి చైర్మన్గా ఉన్నానని, వైద్యులు లేక అప్పటి ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్మలాదేవి మీకు చేతనైతే డాక్టర్లను నియమించాలని కోరారని గుర్తుచేశారు. జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వంద మంది వైద్యులు అందుబాటులో ఉండి.. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. జబ్బు ఏదైనా.. డబ్బులు లేకుండానే ఉచితంగా వైద్యం అందుతుందని తెలిపారు. మోడల్ మెడికల్ కాలేజీగా మార్చుతా.. జిల్లా మెడికల్ కాలేజీని మోడల్గా మార్చుతానని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పెద్దూరు శివారులోని మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ వర్చువల్లో ప్రారంభించిన అనంతరం ఆయన జ్యోతి వెలిగించి ప్రసంగించారు. కొత్త కాలేజీ, కొత్త భవనం కావడంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయన్నారు. ఆ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామన్నారు. కలెక్టర్, జిల్లా అధికారులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని వెల్లడించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కారానికి నేను ముందుంటానని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోనే మోడల్ మెడికల్ కాలేజీగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రజుమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, బి.గౌతమ్రెడ్డి, ఆర్డీవో ఆనంద్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకులు మురళీధర్రావు, ఏఎస్పీ చంద్రయ్య, మెడికల్ కాలేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జీవన నైపుణ్యాల ఒప్పందం ఆవిష్కరణ! జిల్లాలోని కిశోర బాలికలకు జీవన నైపుణ్య శిక్షణపై టీఐఎస్సీ సంస్థతో జరిగిన ఒప్పందాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీలో జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు ఒప్పంద పత్రాన్ని తీసుకురాగా.. మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. జిల్లాలోని కేజీబీవీ విద్యార్థినుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు టీఐఎస్సీ శిక్షణ ఇవ్వనుంది. 350 నుంచి 10 వేల సీట్లకు.. : బోయినపల్లి వినోద్కుమార్ మేము చదువుకునే రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో 350 మెడికల్ సీట్లు ఉండేవని, ఇప్పుడు 10వేల సీట్లు తెలంగాణలోనే ఉన్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణను ప్రపంచంలోనే గొప్ప ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే కసితో ఉన్నామని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనర్సింహారావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి చైర్మన్ గడ్డం నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే వి.మోహన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జెడ్పీ వైస్చైర్మన్ సిద్ధం వేణు, మున్సిపల్ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం
-
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు మెరుగైన వైద్యం
-
థాంక్యూ జగనన్న.. జీవితాంతం మేం మీకు రుణపడి ఉంటాం
సాక్షి, విజయనగరం: ఏపీ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం జగన్ ప్రారంభించారు. విజయనగరం గాజులరేగలో 70 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రారంభించి.. ఆ ప్రాంగణం నుంచి వర్చువల్గా మిగతా నాలుగు మెడికల్ కాలేజీలను ప్రారంభించారాయన. వరల్డ్క్లాస్ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి రావడంతో వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యార్ధులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే.. మాది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం సీఎం సార్, మన రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో ఇన్ని మెడికల్ కాలేజీలు నిర్మించడంపై మేం మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను ఆర్ధికంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చాను, మా కుటుంబంలో నేను మొదటి డాక్టర్ను, మీ ప్రభుత్వంలో నేను డాక్టర్ అవడం గొప్పగా ఫీలవుతున్నాను, ఇది నా అభిప్రాయమే కాదు నాతోటి విద్యార్ధులందరి అభిప్రాయం. ఇన్ని మౌలిక సదుపాయాలతో అధునాతనమైన వైద్య విద్య మాకు అందుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా ఇన్ని సౌకర్యాలు ఉండవు, మంచి అనుభవమున్న టీచింగ్ స్టాఫ్ని కూడా మాకు ఇచ్చారు, చక్కటి హాస్టల్ కూడా ఉంది, మంచి వాతావరణం కూడా ఉంది, మీరు మా విద్యార్ధులకు మార్గదర్శకంగా ఉన్నారు, నేను మీకు మాట ఇస్తున్నాను, మీ సంకల్పం వల్లే నా కల నెరవేరింది, ఈ విజయానికి మీరే కారణం, మీలా ప్రజాసేవ చేయాలని, మీ అంత గొప్పగా అయ్యేలా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు, ధ్యాంక్యూ సార్. -ప్రసూన, వైద్య విద్యార్ధిని, విజయనగరం మెడికల్ కాలేజ్ మా జగనన్న వల్ల ఇన్ని మార్పులు ఊహించలేదు గుడ్ మార్నింగ్ అన్నా, నేను విజయనగరం జిల్లాకు చెందిన అమ్మాయిని, మేం ఎస్టీలం, మా నాన్న దినసరి కూలీ, అమ్మ గృహిణి, నేను చిన్నప్పటి నుంచి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నాను, నీకు ఎంబీబీఎస్ ఎందుకు, రాదని చాలామంది చెప్పారు, కానీ మా జగనన్న వల్ల వైద్య విద్యలో ఇన్ని మార్పులు జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. ప్రభుత్వ కాలేజ్ అంటే ముందు భయపడ్డా కానీ తర్వాత చూస్తే చాలా ఆశ్చర్యపోయా, అంతా డిజిటలైజేషన్, స్కిల్ ల్యాబ్స్ ఉన్నాయి, మాలాంటి పేద, మధ్యతరగతి పిల్లలు వైద్య విద్య చదువుతున్నారంటే మీరే కారణం, మా కుటుంబంలోనే కాదు మా ఊరిలోనే మొదటి డాక్టర్ను, నేను ప్రజలకు మంచి సేవలు అందిస్తానని మీకు మాట ఇస్తున్నాను, నవరత్నాల వల్ల కూడా చాలా లబ్ధి జరిగింది మాకు, మీరు వచ్చిన తర్వాత స్కూల్స్ చాలా మారిపోయాయి, మా అమ్మకు క్యాన్సర్, క్రిటికల్ స్టేజ్ అన్నారు, చాలా ఖర్చవుతుందనుకున్నాం, నమ్మకం కోల్పోయాం, కానీ ఆరోగ్యశ్రీ వల్ల మేం రూపాయి ఖర్చు లేకుండా చికిత్స చేయించాం, మా అమ్మ నన్ను చూస్తుందంటే మీరే కారణం, మా కుటుంబం మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది, మిమ్మల్ని స్పూర్తిగా తీసుకుని కులం, మతం, ప్రాంతం చూడకుండా నేను సేవలు అందిస్తాను, మీరు సీఎంగా ఉంటారు, నేను డాక్టర్గా ఉంటాను, ఇద్దరం ప్రజలకు సేవ చేద్దాం అన్నా, ధ్యాంక్యూ అన్నా. -గగనశ్రీ, వైద్య విద్యార్ధిని, రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీకు రుణపడి ఉంటాం సార్ మాది దిగువ మధ్యతరగతి కుటుంబం, మా నాన్న చిన్న వ్యవసాయ కూలీ, మా అమ్మ టైలర్, వాళ్ళ రెక్కల కష్టంతో ఇక్కడ వరకు తీసుకొచ్చారు, నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉండేది, కానీ పేరెంట్స్ ఆర్ధిక పరిస్ధితులతో భయపడ్డారు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, కొత్త కాలేజ్లో నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, మా ఫ్యామిలీలో నేను మొదటి డాక్టర్ను, మా కుటుంబం డాక్టర్ కుటుంబంగా మారుతుంది. జీవితాంతం మేం మీకు రుణపడి ఉంటాం, ధ్యాంక్యూ సార్. -కోటేశ్వరి, కంభంపాడు, వైద్య విద్యార్ధిని, ఏలూరు మమ్మల్ని ప్రగతి వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు సార్, మాది అనంతపురం జిల్లా, నేను రెండేళ్ళ వెటర్నరీ సైన్స్ చదివిన తర్వాత మూడోసారి నీట్లో ఎంబీబీఎస్ వచ్చింది, ఈ కాలేజ్ లేకపోతే నాకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చేది, కాలేజ్ చాలా బావుంది, ఇంత మంచి కాలేజ్ చూడలేదు, హాస్టల్ బావుంది, క్లీన్ గా ఉంచుతున్నారు, ప్రేవేట్ మెడికల్ కాలేజ్ను తలపిస్తుంది, స్కిల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు, మాకు మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, మంచి ల్యాబ్లు ఏర్పాటు చేశారు, పెద్ద లైబ్రరీ ఉంది, డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు, క్వాలిటీ చక్కగా ఉంది, సెక్యూరిటీ బావుంది, మీరు మంచి వైద్యవిద్య అందిస్తున్నారు, మీరు మమ్మల్ని ప్రగతి వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు, ధన్యవాదాలు. మేం రాబోయే రోజుల్లో మంచి డాక్టర్లగా సేవలందిస్తాం, మా రాయలసీమకు ఒక వెలుగు వచ్చింది, మా కల సాకారం అయింది, ధ్యాంక్యూ సార్. -జలదుర్గం త్రిభువని, మెడికల్ స్టూడెంట్, నంద్యాల ఇంత మంచి కాలేజ్లో చదువుకోవడం గర్వంగా భావిస్తున్నా సీఎం సార్ నేను ఇక్కడ చదువుకోవడం సంతోషంగా ఫీలవుతున్నాను, ఇది మంచి అవకాశం, మా కుటుంబ నేపధ్యం కూడా అంతంతమాత్రమే, ఇన్ని సౌకర్యాలతో ఇంత మంచి కాలేజ్లో చదువుకోవడం గర్వంగా భావిస్తున్నాను. మెడికల్ స్టూడెంట్స్కు అవసరమైన ప్రతిది ఇక్కడ ఏర్పాటు చేశారు, క్యాంపస్ చాలా బావుంది. థాంక్యూ సార్. -సచిన్ దాండియా , మెడికల్ స్టూడెంట్, ఆల్ ఇండియా కోటా, రాజస్ధాన్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్ మీరు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు సార్, నేను చిన్నప్పటి నుంచి ఇష్టంగా చదువుకుని వైద్యరంగంలోకి వచ్చాను, నేను గుంటూరు మెడికల్ కాలేజ్లో చదువుకున్నాను, నేను పీజీ కూడా ఇక్కడే చేస్తున్నాను. వైద్య విద్యలో మీరు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు, మా జీఎంసీ ఏర్పాటై 76 సంవత్సరాలు అయింది, ఈ నాలుగేళ్ళలో మాకు 80కు పైగా పీజీ సీట్లు పెరిగాయి, గతంలో సీట్లు రాక నిరుత్సాహంతో ఉండేవారు కానీ మీరు వచ్చిన తర్వాత మనసు పెట్టి చదివితే సీట్లు వస్తున్నాయి, మీకు రుణపడి ఉంటాం, రిక్రూట్మెంట్ త్వరగా జరుగుతుంది, జీరో వేకెన్సీ పాలసీ, మా ప్రొఫెసర్స్ కూడా సంతోషంగా ఉన్నారు, మా జీఎంసీలో మంచి ఎక్విప్మెంట్ ఏర్పాటుచేశారు, కోవిడ్ సమయంలో ఎంతో మంది ప్రాణాలు నిలిచాయంటే ఈ ఎక్విప్మెంటే కారణం, కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా జీఎంసీ ఉంది, అధునాతనమైన సౌకర్యాలు వచ్చాయి, క్యాన్సర్ విభాగంలో రేడియో థెరపీ ఏర్పాటు చేశారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్లో ఉంది, ఓపీ టైం కూడా పెంచడం వల్ల పేదలకు అన్నీ అందుతున్నాయి, రోజుకు 3500, 4000 ఓపీ కేసులు చూస్తున్నాం, క్యాజువాల్టీలు కూడా పెరిగాయి, ఇది మంచి అనుభవం, రేపటి మా భవిష్యత్ కోసం మీరు ఈ రోజు వేసే ఈ ఆరోగ్య పునాది మీకు ఉన్న ఆరోగ్యాంధ్రప్రదేశ్ కలకు నిదర్శనం, మీరు ఈ బీజాన్ని వేయడానికి కష్టపడుతుంటే అర్ధం కాదేమో ఎవరికీ, కానీ అది మహా వృక్షమై మాకు ఉద్యోగ ఫలాలు, ప్రజలకు ఆరోగ్య ఫలితాలు ఇస్తుంటే తెలుస్తుంది, సామాన్యులకు మీ విజన్ ఏంటో మీ మిషన్ ఏంటో, చిరునవ్వుతో పెను మార్పులు చేయచ్చు అని తెలుసుకున్నాం మిమ్మల్ని చూసి, ఏపీని హెల్తీ అండ్ హ్యపీ స్టేట్గా చూస్తున్నాం, ధ్యాంక్యూ. -డాక్టర్ అలేఖ్య, పీజీ స్టూడెంట్, గుంటూరు మెడికల్ కాలేజ్ ఏపీని మీరు మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతున్నారు సార్, మాది కేరళ, ఆల్ ఇండియా కోటాలో ఇక్కడ చదువుతున్నాను, మీ నాన్నగారు, మీరు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు, ఏపీని మీరు మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతున్నారు, పీజీ సీట్లు కూడా పెంచారు, మీకు ధన్యవాదాలు, నేను ఏపీని ఎంచుకోవడానికి కారణం, ఇక్కడ మంచి వాతావరణం, మంచి విద్య అందుతుందనే కారణం, ప్రతి మెడికల్ కాలేజీలో అనేక అసౌకర్యాలు ఉంటాయి కానీ ఇక్కడ అన్నీ ఏర్పాటు చేశారు, నాడు నేడు కింద అన్ని మౌలిక సదుపాయాలు, అధునాతన టెక్నాలజీ ఏర్పాటు చేయడం వల్ల మా పీజీ విద్యార్ధులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు, ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనకు మీరు చేస్తున్న ప్రయత్నంలో మేం భాగస్వామ్యులవుతాం, విలేజ్ హెల్త్ క్లీనిక్లు, జగనన్న ఆరోగ్య సురక్ష చక్కటి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ పథకం పేదలకు చాలా ఉపయోగపడుతుంది, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ చాలా బావుంది, మీరు ఏపీ ప్రజల దేవుడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, మీ ఆరోగ్యాంధ్రప్రదేశ్ కలను సాకారం చేస్తామని మాట ఇస్తున్నాం, థ్యాంక్యూ సార్. డాక్టర్ ఐశ్వర్య, పీజీ స్టూడెంట్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లకు ధీటుగా గవర్నమెంట్ కాలేజ్లు సార్ మాకు మెడికల్ కాలేజీలలో మంచి విద్య, సౌకర్యాలు అందుతున్నాయి, దీని వల్ల మంచి అనుభవం వస్తుంది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లకు ధీటుగా గవర్నమెంట్ కాలేజ్ ఏర్పాటు చేశారు, టీచింగ్ ఫ్యాకల్టీ బావుంది, నేను మంచి డాక్టర్గా సేవలందిస్తానని మీకు మాట ఇస్తున్నాను. -డాక్టర్ అనంత్, పీజీ స్టూడెంట్, విజయనగరం మెడికల్ కాలేజ్ చదవండి: వెనుకబడిన ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీలు: సీఎం జగన్ -
నేను మెడిసిన్ సీటు పొందలేకపోయాను: మంత్రి కేటీఆర్
-
మంత్రి కేటీఆర్ మెడిసిన్ ఎందుకు చదవలేకపోయారంటే..?
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో తొమ్మిది మెడికల్ కాలేజీలను వైద్య, ఆరోగ్యశాఖామంత్రి హరీష్రావుతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం వర్చువల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రారంభించినందుకు సెస్ కార్యాలయం నుంచి సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం వరకూ భారీ కృతజ్ఞతా ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చైరస్తాలో కేటీఆర్ మాట్లాడుతూ.. 1993లో తాను కూడా బైపీసీ పూర్తిచేసినట్లు తెలిపారు. అమ్మ తనను డాక్టర్ చేయాలనుకుంటే.. నాన్న నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారని ఆనాటి రోజులను మంత్రి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనకు ఎంసెట్లో 1600 ర్యాంక్ వచ్చినా.. మెడికల్ సీటు రాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు విద్యార్థులు అదృష్టవంతులని.. తెలంగాణాలో 10000 మంది వైద్యులు ప్రైవేట్& ప్రభుత్వ కళాశాలల నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, అగ్రికల్చర్ లాంటి పెద్ద పెద్ద కళాశాలలు తెలంగాణలో వచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోనే ప్రప్రథమ కేజీ టూ పీజీ విద్య మన జిల్లాలోనే(సిరిసిల్ల) ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలోనే కాకుండా, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే పరిస్ధితులు ఉండేవని విమర్శించారు. చదవండి: కవిత పిటిషన్పై విచారణ వాయిదా.. ఈడీ ఆఫీసుకు వెళ్తారా? ‘మొన్నటి దాకా డాక్టర్ల కొరత వుండేది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వల్ల కేవలం సిరిసిల్ల జిల్లాలోనే దాదాపు 100కు పైగా డాక్టర్లు సేవలందిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ లక్ష జనాభాకు 22 మంది డాక్టర్లున్నారు. గత పాలనలో రెండే రెండు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసారు. వచ్చే సంవత్సరం మరో ఎనిమిది కాలేజీలను ఏర్పాటు చేస్తాం. మోదీ లాంటి వాళ్ళు సహకరించకున్నా జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. మాకు బాసులు ఎవరూ లేరు. ప్రజలే మాకు బాసులు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఎవరిని అడగాలి? వాళ్లకు టికెట్లు కావాలంటే ఎవరిని అడగాలి? ఢిల్లీ వాళ్లనడగాలి.సిరిసిల్లలో నన్ను, వేములవాడలో లక్ష్మీనరసింహారావును మంచి మెజారిటీతో గెలిపించండి. మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు జన్మనిచ్చింది మా తల్లి అయితే నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల. మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేసినందుకు మా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల పక్షాన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు’ తెలిపారు మంత్రి కేటీఆర్. -
ఈ స్టూడెంట్ మాటలకి సీఎం జగన్ రియాక్షన్
-
వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను ప్రారంభిస్తాం: సీఎం జగన్
-
సీఎం జగన్ను సత్కరించిన మంత్రి విడదల రజిని
-
ఆరోగ్యశ్రీ సేవలు 3,255 ప్రొసీజర్స్కు విస్తరించాం
-
తెలంగాణలో ఏకకాలంలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం
-
ట్రీట్మెంట్ కు సంబంధించిన వివరాలను సీఎం వైఎస్ జగన్ కు వివరిస్తున్న వైద్యులు
-
వెనుకబడిన ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీలు
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఐదు మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం విజయనగరం గాజులరేగలో 70 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రారంభించి.. ఆ ప్రాంగణం నుంచి వర్చువల్గా మిగతా నాలుగు మెడికల్ కాలేజీలను ప్రారంభించారాయన. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘దేవుడి దయతో మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తుండడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మీరంతా గొప్ప డాక్టర్లు కావాలి. మీరంతా అత్యున్నత స్థాయికి చేరుకోవాలి అని విద్యార్థులను ఉద్దేశించి ఆకాంక్షించారు సీఎం జగన్. స్వతంత్రం వచ్చాక ఏపీలో కేవలం 11 మెడికల్ కాలేజీలే ఉన్నాయి. అందుకే ఈ 11 మెడికల్ కాలేజీలకు మరో 17 మెడికల్ కాలేజీలను చేర్చి 28 మెడికల్ కాలేజీల దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓ మెడికల్ కాలేజీ ఉండబోతోంది. ఇవాళ ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం. వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తాం. ఆ మరుసటి ఏడాది మరో ఏడు కాలేజీలు ప్రారంభిస్తాం. ఈ 17 మెడికల్ కాలేజీలు కట్టడం కోసం దాదాపు రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ కాలేజీల వల్ల కొత్తగా 2,250 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో.. మొత్తంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,735 సీట్లకు చేరుతుంది. ఈ ఒక్క ఏడాదే 609 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మంచి డాక్టర్లు అయ్యి.. ప్రజలకు ఉపయోగపడాలి. ఇదే నేను మీ నుంచి కోరుకుంటున్నా. అందుకే ఖర్చు ఎంతైనా వెనకాడడం లేదని తెలిపారాయన. రాబోయే రోజుల్లో.. వెనకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయి. గిరిజన ప్రాంతాలతో పాటు వైద్యసదుపాయాలకు దూరంగా మారుమూల ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటు ఉండనుందని సీఎం జగన్ తెలిపారు. ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. హెల్త్ సెక్టార్లో 53 వేలమందిని రిక్రూట్ చేశాం. కొత్తగా 18 నర్సింగ్ కాలేజీలను తీసుకొస్తున్నాం. ప్రస్తుత కాలేజీల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరుస్తాం. వైద్య రంగంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నాం అని సీఎం జగన్ వివరించారు. ఇంకా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈరోజు 5 మెడికల్ కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రారంభించాం. ఐదు చోట్ల ఫస్టియర్ అడ్మిషన్లకు కూడా ఈరోజు పిల్లలను తీసుకొనే పరిస్థితిలోకి అడుగులు వేగంగా ముందుకు వేయగలుగుతున్నాం. ► ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయడమే కాకుండా ప్రతి పార్లమెంటు స్థాయిలో ఒక మెడికల్ కాలేజీ పెట్టే కార్యక్రమం ఇనీషియేట్ చేస్తున్నాం. దీని వల్ల ఏం జరుగుతుందంటే.. టెరిషరీ కేర్ అన్నది ప్రతి పార్లమెంటు స్థాయిలోకి మనం తీసుకొని పోగలుగుతాం. ► ఎప్పుడైతే మెడికల్ కాలేజీ అవైలబుల్గా ఉంటుందో అప్పుడు ఆ మెడికల్ కాలేజీతో పాటు ప్రొఫెసర్లుగానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లుగానీ వీళ్లందరూ అవైలబుల్గా ఉండటం కూడా ఒక గొప్ప మార్పు టెరిషరీ కేర్లో జరుగుతుంది. ► టెరిషరీ కేర్ పెరగడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ► ఇది ఒక ఎత్తయితే వేల మంది పిల్లలను మంచి డాక్టర్లుగా తయారు చేసే గొప్ప ఇన్స్టిట్యూషన్స్ను కూడా రాష్ట్రంలో క్రియేట్ చేయగలుగుతున్నాం. ► ఈరోజు ప్రారంభం అవుతున్న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజీల్లో దాదాపు 750 ఎంబీబీఎస్ సీట్లతో పిల్లలు డాక్టర్లు కాబోతున్నారు. ►ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలన్నింటిలోనూ సదుపాయాలన్నీ అప్గ్రేడ్ చేయగలిగాం. ► ఆల్ ది పెండింగ్ వేకెన్సీస్, విత్ ఎ జీరో వ్యాకెన్సీ పాలసీ తీసుకుని రావడం వల్ల దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే 609 కొత్త పీజీ సీట్లు అందుబాటులోకి రాగలిగాయి. ► భవిష్యత్లో మరో 2,737 పీజీ సీట్లు కూడా వీటి ద్వారా రానున్న రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. ► ఈరోజు ప్రారంభం అవుతున్న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజీల్లో దాదాపు 750 ఎంబీబీఎస్ సీట్లతో పిల్లలు డాక్టర్లు కాబోతున్నారు. ► రేపు సంవత్సరం పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, ఇలాంటి బ్యాక్వర్డ్ ఏరియాల్లో కూడా మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ► ఈ ఎంబీబీఎస్, పీజీ మెడికల్కాలేజీల్లో సీట్లు మాత్రమే కాకుండా గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలను డెవలప్ చేస్తున్నాం. ► ఇప్పటి వరకు దాదాపు 1090 నర్సింగ్సీట్లు ఉంటే మరో 18 నర్సింగ్ కాలేజీలను తీసుకొస్తున్నాం. ► వీటి ద్వారా మరో 1200 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ► ఉన్న 11 మెడికల్ కాలేజీల్లోనూ ప్రతి కాలేజీలోనూ ఎన్ఏబీహెచ్, ఎన్ఎఫ్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా కాలేజీలను నాడు–నేడు ద్వారా అన్నింటినీ అప్గ్రేడ్ చేస్తున్నాం. ► నాడు–నేడు కార్యక్రమాలు అన్నింటి మీద దాదాపు రూ.3,820 కోట్లు వెచ్చిస్తున్నాం. ► ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ స్థాయిలో నుంచి మార్పులు తీసుకొస్తున్నాం. ► ఒకపక్క క్యూరేటివ్ క్యూర్ ఎంత అవసరమో, ప్రివెంటివ్ కేర్ కూడా అంతే అవసరం. ► దేశానికే మార్గదర్శకంగా నిలబడే విధంగా అడుగులు పడటం జరిగింది. ► ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడూ చూడని అడుగులుపడ్డాయి. 10,032 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటయ్యాయి. ► ఆ విలేజ్ క్లినిక్స్లో సీహెచ్వో, ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఉంటారు. ► గ్రామస్థాయిలో 105 రకాల మందులు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. 14 రకాల డయోగ్నస్టిక్ టెస్టులు చేస్తారు. ► మరో 542కు సంబంధించిన అర్బన్ క్లినిక్ష్ తీసుకొచ్చాం. ► ఈ విలేజ్ క్లినిక్స్ను ప్రివెంటివ్ కేర్ దిశగా అడుగులు వేయిస్తున్నాం. ► ప్రతి మండలానికీ కనీసం 2 పీహెచ్సీలు ఉండేట్లుగా చేస్తున్నాం. ఇద్దరు డాక్టర్లు ఉండేట్లు చేస్తున్నాం. ► ప్రతి పీహెచ్సీలోనూ నలుగురు డాక్టర్లు, ఒక 104 వాహనం ఉండేట్లు చేస్తున్నాం. ► ప్రతి నెలా గ్రామానికి 2 సార్లు వెళ్లేటట్లు చేస్తున్నాం. ► దీని వల్ల 6 నెలల్లో ఎవరికి ఏ రోగముంది, ఎవరికి బీపీ, షుగర్, ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని పూర్తిగా చెప్పే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. ► గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మందులు తీసుకుంటే నయం కాదు అని చాలా మంది అనుకుంటారు. ► ఈరోజు అన్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్వో జీఎంపీ మందులు మాత్రమే ఆంధ్రరాష్ట్రంలో ఉన్నాయి. ► ఆరోగ్యశ్రీ సేవలు మనం రాకముందు నామమాత్రంగా ఉండేవి. ► 1050 ప్రొసీజర్లు ఉంటే, ఈరోజు 30255 ప్రసీజర్లకు విస్తరించాయి. ► క్యాన్సర్ దగ్గర నుంచి కాక్లియర్ ఇంప్లాంట్దాకా కవర్ అవుతున్నాయి. ► వైద్యం ఖర్చు రూ.1000 దాటితే అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలని తపన, తాపత్రయంతో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తున్నాం. ► గతంలో ఆరోగ్యశ్రీ ఎంపానెల్ 900 హాస్పిటల్స్ ఉంటే, ఈరోజు 2285కు విస్తరించాయి. ► గతంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్ రూ.1100 కోట్లు కూడా లేని పరిస్థితి ఉంటే, ఈరోజు రూ.3,600 కోట్లకు అందుతోంది. ► ప్రతి మండలానికి 108, రెండు 104 వాహనాలు ఉండేట్లుగా 1514 కొత్త వాహనాలు కొనుగోలు చేశాం. ► తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ కలుపుకుంటే 2,204 అంబులెన్స్ వాహనాలు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. ఇలా ఏ రాష్ట్రంలోనూ తిరగడం లేదు. ► రాష్ట్రంలో ఈ నాలుగు సంవత్సరా కాలంలో మనం రిక్రూట్ చేసిన హెల్త్ డిపార్ట్ మెంట్స్టాఫ్ 53,126 మంది. ► నేషనల్ యావరేజ్ స్పెషలిస్ట్డాక్టర్లకు సంబంధించి 61 శాతం అవైలబుల్ ఉంటే, స్టేట్యావరేజ్ కేవలం 3.96 శాతం మాత్రమే. ► స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ పెట్టి, ప్రత్యేక బోర్డు పెట్టి వెంట పడుతున్నాం. ► జాతీయ స్థాయిలో నర్సుల పోస్టులు ప్రభుత్వాస్పత్రుల్లో వేకెన్సీ 27 శాతం. రాష్ట్ర యావరేజ్ జీరో. ► జాతీయ స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్ల వేకెన్సీలు గవర్నమెంట్ ఆస్పత్రుల్లో 33 శాతం. స్టేట్ యావరేజ్ జీరో. ► ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఇక్కడ నుంచి మంచి డాక్టర్లు రావాలి. ► మంచి పీజీ స్టూడెంట్లు రావాలి. మంచి మనసు రావాలి, మీరు కూడా పేదవాళ్లకు ఉపయోగపడే పరిస్థితి రావాలి. ► ఇప్పటి వరకు బటన్ నొక్కితే నేరుగా డీబీటీ పద్ధతిలో 2.35 లక్షల కోట్లు పేద ప్రజల ఖాతాల్లోకి నేరుగా లంచాలు, వివక్షకు చోటు లేకుండా చేయగలిగాం. ► ఇంటి తలుపు తట్టి పెన్షన్ను ప్రతి గడపకూ తీసుకొని పోగలిగాం. ► ఇంటి తలుపుతట్టి రేషన్ కార్డు, రేషన్ బియ్యం, ప్రతి గడప ముంగిటకు చేర్చగలిగాం. ► ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ఇంటి స్థలం లేని వారు ఉన్నారా అని వెతికి, అప్లికేషన్పెట్టించి 30 లక్షల ఇంటి స్థలాలను పేదవాళ్లకు ఇవ్వగలిగాం. ► 22 లక్షల ఇళ్లు వేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ► ఎవరికి ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఇంటింటికీ వెళ్లి జల్లెడ పట్టి అవసరాలు తీరుస్తున్నాం. ► జగనన్న సురక్షలో 98 లక్షల సర్టిఫికెట్లు అందజేశాం. ► ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ఇంకో మంచి కార్యక్రమం చేస్తున్నాం. ► జగనన్న ఆరోగ్య సురక్ష అని ఈరోజు ప్రారంభించాం. ► ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడ పట్టి ఆ ఇంట్లో ఎవరికి ఏరకమైన సమస్య ఉన్నా 7 రకాల టెస్టులు, 5 దశల్లో యాక్టివిటీ మొదలు పెట్టాం. ► 4వ ఫేజ్ హెల్త్ క్యాంపు, సెప్టెంబర్ 30న మొదటి హెల్త్ క్యాంపు, తర్వాతి 45 రోజులు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ హెల్త్క్యాంపులు విస్తరించి పూర్తవుతాయి. ► గ్రామం మొత్తం మ్యాపింగ్ అవుతుంది. ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా వాళ్లకు ఫ్రీగా టెస్టులు చేస్తాం. మందులు ఇవ్వబోతున్నాం. ► తర్వాత హ్యాండ్ హోల్డింగ్ చేయబోతున్నాం. ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా అడుగులు వేయబోతున్నాం. ► మీ అందరి సహాయ సహకారాలు రావాలి, కావాలి అని మనస్పూర్తిగా అడుగుతున్నా. ► కొన్ని మాటలు ఎప్పుడూ కూడా నా మనసుకు తడుతుంటాయి. ► నాట్ ఆల్ ఏంజిల్స్ హావ్ వింగ్స్. సమ్ హ్యావ్ స్టెతస్కోప్స్. కీప్ దిస్ ఇన్మైండ్. ► ఇది ఇక్కడే రాసి సంతకం కూడా పెట్టా. ► ప్రజలకు మీరు చేయబోయే కార్యక్రమం, మంచి పోస్టు గ్రాడ్యుయేట్లు, మంచి డాక్టర్లుగా అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..!
-
Live Updates: మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం జగన్
Updates.. ► విజయనగరం పర్యటన ముగించుకొని విశాఖ ఎయిర్పోర్ట్కు బయలుదేరిన సీఎం జగన్. సీఎం జగన్ కామెంట్స్ ఇవే.. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక ఏపీ కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరో 17 మెడికల్ కాలజీల కోసం రూ.8480 కోట్లు వెచ్చిస్తున్నాం. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఉండాలి. ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో వీరంతా గొప్ప డాక్టర్లు కావాలి. మీరంతా అత్యున్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తున్నాను. ► వచ్చే ఏడాది మరో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తాం. ఆ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు ప్రారంభిస్తాం. ఇప్పటి వరకు 2185 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త కాలేజీల రాకతో సీట్ల సంఖ్య 4735కు చేరింది. ఈ ఒక్క ఏడాదే 609 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లోనూ కాలేజీలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో మరో 2737 పీజీ సీట్లు అందుబాటులోకి వస్తాయి. వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయి. మరో 18 నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి తెస్తాం. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. 10,032 విలేజ్ క్లీనిక్స ఏర్పాటు చేశాం. గ్రామస్థాయిలో ఆశావర్కర్లతో సేవలు అందిస్తున్నాం. ► ప్రతీ మండలానికి ఒక పీహెచ్సీ. ఊరిలోనే ఉచిత వైద్యం అందించేలా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన మందులు అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవలు 3,255 ప్రొసీజర్స్కు విస్తరించాం. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం. గతంతో పోలిస్తే వైద్యానికి భారీగా బడ్జెట్ పెంచాం. 108, 104 వాహనాల సంఖ్యను పెంచాం. వైద్యరంగంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నాం. మీరంతా పేదవారికి సేవ చేయాలి. హెల్త్ సెక్టార్ కోసం 53,126 మందిని రిక్రూట్ చేశాం. 2.35 లక్షల కోట్ల డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించాం. పెన్షన్ను నేరుగా ఇంటి తలుపు తట్టి అందిస్తున్నాం. ► ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదవారికి మంచి జరగాలన్నదే మా ఆలోచన. ఏ చదువైనా పేదవారికి అందుబాటులో ఉండాలి అని అన్నారు. ► ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఈ స్థాయిలో సదుపాయాలతో కాలేజీ నిర్మాణం అద్భుతం. మెడిసిన్ చదవాలనుకున్న మా కల సాకారమవుతోంది. సీఎం జగన్కు మా కృతజ్ఞతలు. ► ట్రీట్మెంట్కు సంబంధించిన వివరాలను వైద్యులు.. సీఎం జగన్కు వివరించారు. ► సీఎం జగన్తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినీ, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు ఉన్నారు. ► మెడికల్ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన సీఎం జగన్. ► విజయనగరంలో సీఎం జగన్ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. ► మెడికల్ కాలేజీ ప్రాంగణానికి బయలుదేరిన సీఎం జగన్ ► సీఎం జగన్ విజయనగరం చేరుకున్నారు. ► సీఎం జగన్కు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం రాజన్న దొర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ► విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం జగన్. ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ►మెడికల్ కాలేజీలో ప్రారంభోత్సవం కోసం సీఎం జగన్ విజయనగరం బయలుదేరారు. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించి అనంతరం.. వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కాలేజీలను ప్రారంభించనున్నారు. ► ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటారు. ► అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహావిష్కరణ, తర్వాత నూతన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, ల్యాబ్ల పరిశీలన, మిగిలిన 4 మెడికల్ కాలేజీల వర్చువల్ ప్రారంభోత్సవం తర్వాత సీఎం జగన్ ప్రసంగిస్తారు. ► అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు. ► ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం. ► ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా వేగంగా జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ► వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా ఏడు కాలేజీలలో అకడమిక్ తరగతులు ప్రారంభించనున్న జగనన్న ప్రభుత్వం. ► రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏకకాలంలో 5 మెడికల్ కాలేజీల్లో అకడమిక్ తరగతుల ప్రారంభం. ► స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు. ► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు. ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి. మెడికల్ పీజీ సీట్ల సంఖ్య నాలుగేళ్లలో 966 నుంచి 1,767 కు పెంచిన జగనన్న ప్రభుత్వం. ► వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల టోల్ ఫ్రీ నెంబర్ 104 లేదా 1902 ► మల్టీ, సూపర్ స్పెషాలిటీ, అధునాతన వైద్యసేవలను ఉచితంగా అందుబాటులోకి.. ► దేశానికే దిక్సూచిగా వైద్య ఆరోగ్య రంగంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు. ► 2024-25లో ప్రారంభించే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె ► 2025-26లో ప్రారంభించే 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పిడుగురాళ్ళ, పెనుకొండ ► గిరిజన ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురం, బుట్టాయిగూడెం, దోర్నాల ► 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కిడ్నీ రిసెర్చ్ సెంటర్, పలాస శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, తిరుపతి మానసిక ఆరోగ్య కేంద్రం, కడప -
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం
-
సాకారమైన విజయనగరం వాసుల కల
-
రేపు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శుక్రవారం వాటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామల్లో కొత్తగా ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర సొంత నిధులతో ఒకే ఏడాది ఇంత పెద్దసంఖ్యలో మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశంలోనే ఇదే ప్రథమంగా చెబుతున్నారు. కేసీఆర్ హయాంలోనే 21 మెడికల్ కళాశాలలు తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, సీఎం కేసీఆర్ దశాబ్ద కాలంలోనే 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది.ౖ కాగా, వచ్చే ఏడాది ప్రారంభించేందుకు మంజూరు చేసుకున్న 8 మెడికల్ కాలేజీలతో ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. 2014లో 5 మెడికల్ కాలేజీల ద్వారా 850 సీట్లు ఉంటే, 2023 నాటికి 26 మెడికల్ కాలేజీలతో సీట్ల సంఖ్య 3,690కి చేరింది. ప్రభుత్వ ప్రైవేటులో కలిపి ఏటా పది వేల మంది విద్యార్థులను తయారు చేసే స్థాయికి నేడు తెలంగాణ ఎదిగింది. చట్టంలో మార్పులతో విస్తృత అవకాశాలు 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు ప్రభుత్వం సవరణ చేసిన సంగతి తెలిసిందే. గతంలో 85శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. తాజా నిర్ణయం వల్ల మన విద్యార్థులకు మరో 520 సీట్లు దక్కాయి. దీంతో పాటు ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడం వల్ల రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు మరో 1,300 ఎంబీబీఎస్ సీట్లు దక్కాయి.ౖ ఈ రెండు నిర్ణయాల వల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా మొత్తం 1,820 సీట్లు ప్రతి ఏటా దక్కనున్నాయి.