-
NEET UG 2023: నేడే నీట్ ఎగ్జామ్.. ఈ రూల్స్ తప్పక పాటించాల్సిందే!
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG 2023) పరీక్ష ఈరోజు(ఆదివారం) నిర్వహించనున్నారు. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందుగా చేరుకుంటే మంచింది. పరీక్ష కేంద్రాన్ని చెక్ చేసుకోవాలి. కొన్ని నగరాల్లో ఒకటే పేరు మీద పీజీ, యూజీ కాలేజీలు ఉంటాయి. కాబట్టి పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుంటే మంచింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 1.15 గంటల వరకు విద్యార్థులు తమ హాల్ టికెట్స్ ఆధారంగా.. ఏ గదిలో మీ సీట్ ఎలాట్ చేశారో చూసుకోవాలి. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత హాల్లోకి ఎవరినీ అనుమతించరు. 1.45 గంటలకు ప్రశ్నపత్రం బుక్లెట్ ఇస్తారు. మధ్యాహ్నం 1.50 నుంచి 2 గంటల వరకు అభ్యర్థులు తమకు అవసరమైన వివరాలను బుక్లెట్లో నింపాల్సి ఉంటుంది. 2 గంటలకు పేపర్ ఇస్తారు. చదవండి: భార్యకు విడాకులు ఇచ్చిన ఆనందంలో బంగీ జంప్.. చివరికి! ► పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పాస్పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి. ఫొటోను అటెండెన్స్ షీట్పై అతికించాలి. ► అభ్యర్థులు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్ వస్తువులను లోనికి అనుమతించరు. ► స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్ మాత్రమే వేసుకోవాలి. ► పేపర్లు, జామెట్రీ/పెన్సిల్ బాక్సులు, ప్లాస్టిక్ పౌచ్లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్ ప్యాడ్స్, పెన్డ్రైవ్స్, ఎలక్ట్రానిక్ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రానికి అనుతించరు. ► చేతికి వాచ్లు, వాలెట్లు, హ్యాండ్బ్యాగ్లు, బెల్ట్లు, టోపీలు వంటివి ధరించకూడదు. ► మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, ఇయర్ఫోన్లు, పేజర్స్, హెల్త్ బ్యాండ్స్, స్మార్ట్ వాచ్లు వంటి కమ్యూనికేషన్ డివైజ్లను లోనికి అనుమతించరు. ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లకూడదు. ► అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అవసరమైన బాల్ పాయింట్ పెన్నును పరీక్ష గదిలోనే ఇస్తారు. -
Heart Attack: బార్బడోస్లో గుండెపోటుతో ఖమ్మం విద్యార్థి మృతి
ఖమ్మం క్రైం: కరేబియన్ దీవుల్లోని బార్బడోస్లో ఎంబీబీఎస్ చదువుతున్న ఖమ్మం విద్యార్థి గుండెపోటుతో మృతిచెందిన విషాద ఘటన ఇది. ఖమ్మం ట్రాఫిక్ ఎస్సై రవికుమార్ కుటుంబ సభ్యులతో కలసి ఖమ్మం రూరల్ మండలం పెదతండాలో నివసిస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడైన హేమంత్ శివరామకృష్ణ (20) బార్బడోస్లో ఎంబీబీయస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలసి మంగళవారం బీచ్కు వెళ్లిన అతను... ఈత కొట్టివచ్చిన కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలాడు. సహచరులు అతన్ని ఆస్పత్రికి తరలించేలోగానే మృతిచెందాడు. శివరామకృష్ణ మృతదేహన్ని స్వస్థలానికి పంపించేందుకు అక్కడి భారతీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎంబీబీఎస్ పూర్తి అయ్యి 16 ఏళ్లట. ఇప్పటికీ అదే జీతమట!
కొందరి ఉద్యోగంలో ఉన్నతి ఉండక, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే! అన్నట్లుగా ఉంటుంది. ఏం చేద్దాం అన్న కలిసిరాదు. కనీసం ఏళ్లుగా చేస్తున్నాడు కదా అని యజమాన్యం కూడా జాలి చూపదు. ఆ ఉద్యోగి నా వల్ల కాదని రాజీనామ చేసేంత వరకు పరిస్థితి అంతే అన్నట్లు ఉంటుంది. అచ్చం అలాంటి పరిస్థితిని ఓ డాక్టర్ ఎదర్కొంటున్నాడు. వివరాల్లోకెళ్తే..హైదరాబాద్లోని అపోలా హాస్పటల్స్లో పనిచేస్తేన్న బిహార్కి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ అరకొర జీతాన్ని ఎంత పొదుపుగా వాడాలో నేర్చుకున్నాని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. తాను 2004లో ఎంబీబీఎస్ పూర్తి చేశానని, 16 ఏళ్ల నుంచి ఒకే జీతం అందుకున్నట్లు తెలిపాడు. ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటి నుంచి అంతే జీతం అని చెబుతున్నాడు. దీంతో తన కుటుంబసభ్యులు ఎవరూ కూడా చూసేందుకు రావడం కూడా మానేసిట్లు తెలిపాడు. అలాగే తన నాన్న పనిచేసే ప్రభుత్వ కార్యాలయం ఫ్యూన్ జీతం, కొడుకు జీతం ఒకటేనని అమ్మ బాధపడుతుంటుందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తాను తమిళనాడులోని వెల్లూరులో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు వైద్యుడు సుధీర్ తెలిపారు. తాను అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఐదేళ్లు ఎంబీబీఎస్ పూర్తి అయ్యే వరకు కూడా తన ఖర్చులన్నీ తానే నిర్వహించుకున్నట్లు తెలిపాడు. ఆర్థిక స్తోమత లేని కారణంగా తన కుటుంబ సభ్యులెవరూ ఆ సమయంలో తనను చూసేందకు కూడా వచ్చేవారు కాదని చెప్పుకొచ్చారు. ఒక జూనియర్ డాక్టర్ తను జీవించడానికే ఇంతలా కష్టపడుతున్నప్పుడూ.. ఎలా సామాజిక సేవ చేయగలను అని పోస్ట్ పెట్డడంతో రిప్లైగా సదరు వైద్యుడు సుధీర్ తన గురించి వివరించాడు. ఈ విషయం నెట్టిట వైరల్ అవ్వడంతో నెటిజన్లు భారతదేశంలో వైద్యులకు తగిన జీతాలు లభించడం లేదని ఒకరు, పేషంట్ల దగ్గర నుంచి భారీగా వసూలు చేసే ఆస్పత్రి యాజమాన్యం వైద్యులకు మాత్రం తగిన జీతాల ఇవ్వదంటూ మండిపడుతూ ట్వీట్ చేశారు. Apollo Hospitals' doctor says his salary was Rs 9,000 10 years after completing MBBS #MedTwitter #equity #investments https://t.co/mI1FmfE6xp — Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) April 6, 2023 (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి) -
రెండు ప్రయత్నాల్లో పూర్తి చేయొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్ తదితర దేశాల నుంచి భీతావహ పరిస్థితుల్లో ప్రాణాలు అరచేత పట్టుకొని దేశానికి వచ్చిన ఫైనల్ ఇయర్ వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు సుప్రీంకోర్టు ఊపిరిపోసింది. దేశీయంగా ఏ కళాశాలలోనూ చేరకుండానే రెండు ప్రయత్నాల్లో ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు పూర్తి చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఏడాది కాలంగా ఆందోళన చెందుతున్న విద్యార్థుల సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపింది. చైనా, ఫిలిప్పీన్స్లో కరోనా ఆంక్షలు, ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయలేకపోయిన వైద్య విద్యార్థుల పిటిషన్లను మంగళవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్నాద్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యార్థుల అభ్యర్థన దృష్టిలో ఉంచుకొని నిపుణుల కమిటీ కొన్ని సూచనలు చేసిందని కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ధర్మాసనానికి తెలిపారు. ‘‘ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం, భారతీయ కళాశాలల్లో నమోదు చేసుకోకుండా ఎంబీబీఎస్ ఫైనల్ పార్ట్–1, పార్ట్–2 పరీక్షలు (థియరీ, ప్రాక్టికల్) ఒక ఏడాదిలో పూర్తి చేయడానికి అవకాశం ఇస్తాం. అంటే, పార్ట్–2 పరీక్ష రాయాలంటే పార్ట్–1 పూర్తి చేసి ఒక ఏడాది పూర్తి కావాలి. దేశీయంగా ఎంబీబీఎస్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారో అదేవిధంగా థియరీ పరీక్షలు, నిర్ణయించిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. పార్ట్ట్–1, పార్ట్–2 పూర్తి చేసిన తర్వాత రెండు సంవత్సరాల నిర్బంధ రొటేషనల్ ఇంటర్న్షిప్ పూర్తి చేయాలి. జాతీయ వైద్య కమిషన్ నిర్ణయించిన విధంగా చెల్లింపులు ఉంటాయి. ఈ సిఫార్సులు అత్యవసర చర్యగా భావించాలి.’’ అని ఐశ్వర్య భాటి వివరించారు. ‘‘ఉత్తీర్ణత సాధించకపోతే భవిష్యత్తు ఉండదు.. అందుకే’’ జాతీయ వైద్య కమిషన్, విదేశీ వైద్య విద్య సంస్థలు అనుసరించే సిలబస్ వేరుగా ఉంటాయని విద్యార్థుల తరఫు సీనియర్ న్యాయవాదులు గోపాల శంకర్నారాయణ్,నాగముత్తులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరీక్ష పూర్తి చేయడానికి ఒక ప్రయత్నంలో సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. ‘‘ఇదేమీ అఖిల భారత బార్ ఎగ్జామినేషన్ కాదు. ఉత్తీర్ణత సాధించకపోతే కనీసం అప్పటికే పూర్తి చేసిన ఎల్ఎల్బీ డిగ్రీ ఉంటుంది. విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే భవిష్యత్తు ఉండదు’’ అని గోపాల శంకర్నారాయణ్ తెలిపారు. నిపుణుల కమిటీ నిర్ణయంలో జోక్యం చేసుకోమని, అయితే ఒకే ప్రయత్నంలో పరీక్ష పూర్తి చేయాలన్న సూచన ఆందోళన కలిగించే విషయమని ధర్మాసనం అభిప్రాయపడింది. రెండు ప్రయత్నాలు అవకాశం ఇవ్వాలన్న సవరణ చేయాలని కమిటీని ఆదేశించింది. ‘‘కమిటీ నివేదికను చిన్న మార్పుతో పరిగణనలోకి తీసుకుంటాం. పార్ట్–1, పార్ట్–2 (థియరీ, ప్రాక్టికల్) పరీక్షలు పూర్తి చేయడానికి రెండు అవకాశాలు ఇవ్వాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. మానవతా దృక్పథంతో భారతీయ వైద్య కళాశాలల్లో ప్రవేశం కలి్పంచాలని సుప్రీంకోర్టును విద్యార్థులు ఆశ్రయించారు. జాతీయ వైద్య కమిషన్తో సంప్రదింపులు చేసి దీనికి పరిష్కారం కనుక్కొనే దిశగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని గతంలో కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. -
నారాయణ మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ సాక్షి, అమరావతి: ‘తమ బిడ్డలకు వైద్య విద్య థియరీ పరీక్షల్లో 90 శాతం, 88 శాతం మార్కులొచ్చాయి. అయితే ప్రాక్టికల్ పరీక్షల్లో మాత్రం ఫెయిల్ చేశారు.’ ఇది అన్యాయమంటూ పలువురు వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం నగరంలోని నారాయణ మెడికల్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు సరిగా ప్రాక్టికల్స్ చేయలేదని యాజమాన్యం చెబుతోందని తెలిపారు. అయితే, థియరీ పరీక్షల్లో 90, 88, 85 మార్కులు ఎలా వచ్చాయో తెలపాలంటూ డిమాండ్ చేశారు. వైద్యకళాశాల డీన్, అధ్యాపకులు మళ్లీ పరీక్షలు రాసుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు తమ వద్దకు ట్యూషన్కు రావాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించారు. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. వైద్య కళాశాల వద్ద ఆందోళన అనంతరం పలువురు మెడికోల (వైద్య విద్యార్థులు) తల్లిదండ్రులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి నివాసానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు కళాశాల డీన్ మాట్లాడుతూ గత నెలలో నారాయణ కళాశాలలో నిర్వహించిన ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ పార్ట్–2 ప్రాక్టికల్ పరీక్షల్లో కొంత మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. ఇందుకు కళాశాలను నిందించడం దురదృష్టకరమన్నారు. అంతమంది ఫెయిల్ అవ్వడానికి కారణమేంటి? ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పార్ట్–2 పరీక్షల్లో నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఫెయిల్ కావడంతో పలువురు తల్లిదండ్రులు ఈ విషయాన్ని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ బాబ్జీ దృష్టికి తీసుకువచ్చారు. యాజమాన్యం చేసిన తప్పిదాల వల్లే తమ పిల్లలు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలియజేయాలని నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ను విశ్వవిద్యాలయం వివరణ కోరింది. కళాశాలలో సుమారు 250 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉండగా, 106 మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. వీరిలో 56 మంది ప్రాక్టికల్స్, థియరీ రెండింటిలో ఫెయిల్ అవ్వగా, 50 మంది థియరీలో ఉత్తీర్ణత సాధించి, ప్రాక్టికల్స్లో మాత్రమే ఫెయిల్ అయ్యారు. -
‘విదేశీ’ వైద్య విద్యార్థులకు ఇంటర్న్షిప్
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఎంబీబీఎస్, తత్సమాన మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు రాష్ట్రంలో కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ (సీఆర్ఎంఐ) చేసుకునేందుకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రాష్ట్రంలో ఇంటర్న్షిప్కు అవకాశం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల వివరాలను పొందుపరిచింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) పాసైన విద్యార్థులంతా రాష్ట్రంలో ఇంటర్న్షిప్ చేసుకోవచ్చని తెలిపింది. ఏడాది ఇంటర్న్షిప్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వారికి స్టైపెండ్ కూడా ఇవ్వాలని ఎన్ఎంసీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. త్వరలో ఇంటర్న్షిప్ కోసం ఎఫ్ఎంజీఈ పాసైన విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కాళోజీ వర్సిటీ తెలి పింది. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. 3,833 మందికి ఇంటర్న్షిప్ అవకాశం.. కరోనా కాలంలోనూ, ఆ తర్వాత అనేకమంది విదేశీ ఎంబీబీఎస్ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. కొందరు అక్కడకు వెళ్లి చదవగా, చాలామంది ఆన్లైన్ క్లాసుల ద్వారా మెడికల్ కోర్సు పూర్తి చేశారు. అలా విదేశీ వైద్య విద్య పూర్తి చేసినవారు తర్వాత దేశంలో మెడికల్ రిజిస్ట్రేషన్, ప్రాక్టీస్ కోసం ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎఫ్ఎంజీఈ పరీక్ష పాసైన వారు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంది. గతంలో విదేశీ గ్రాడ్యుయేట్ల కోసం కొన్ని కాలేజీల్లోనే ఇంటర్న్షిప్కు అవకాశం ఉండగా, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 44 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్న్షిప్ చేయడానికి వీలు కల్పించారు. ప్రస్తుతం ఆయా కాలేజీల్లో 3,833 మంది ఇంటర్న్షిప్ చేయవచ్చు. ఇప్పటివరకు ఎంబీబీఎస్ బ్యాచ్ బయటకు రాని మెడికల్ కాలేజీల్లో ఆయా కాలేజీలకు చెందినవారు ఇంటర్న్షిప్ దశకు చేరుకోనందున, అక్కడ పూర్తిస్థాయిలో విదేశీ గ్రా డ్యుయేట్లకు ఇంటర్న్షిప్కు అవకాశం కల్పించారు. సీట్ల సంఖ్యకు మించి కూడా కొన్నిచోట్ల ఇంటర్న్షిప్కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. -
నాన్ క్లినికల్ పీజీ... నాట్ ఇంట్రెస్టెడ్!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు మెడికల్ పీజీ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. తద్వారా స్పెషలిస్టు వైద్యులుగా తమ కెరీర్ను మలుచుకుంటారు. అందువల్ల క్లినికల్ విభాగంలోని సీట్లకు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కోట్లు ఖర్చు చేసి వాటిల్లో చేరుతుంటారు. ఒక్క సీటు కూడా మిగలదు. కానీ నాన్ క్లినికల్ పీజీ సీట్ల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ సీట్లను పట్టించుకునే నాథుడే లేడు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉండే కన్వీనర్ కోటా సీట్లలోనూ విద్యార్థులు చేరడంలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సాధారణ ఫీజు చెల్లిస్తే చాలనీ, డొనేషన్ కూడా వద్దని, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కోరుతున్నా పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. క్లినికల్ సీట్లపైనే అందరి దృష్టి... క్లినికల్ విభాగంలోని సబ్జెక్టులన్నింటికీ భారీగా డిమాండ్ ఉండగా, నాన్క్లినికల్ సబ్జెక్టులకు డిమాండ్ ఉండటం లేదు. నాన్క్లినికల్లో అనాటమీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ప్యాథాలజీ, మైక్రో బయోలజీ, ఎస్పీఎం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి సబ్జెక్టులున్నాయి. ఇవి చేసిన వారికి ప్రధానంగా మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా చేయడానికి వీలుంటుంది. ఫోరెన్సిక్ మెడిసిన్ వంటి వాటికి ఇతరత్రా అవకాశాలుంటాయి. కానీ క్లినికల్ కోర్సుల మాదిరి నాన్ క్లినికల్ సబ్జెక్టులకు డిమాండ్ ఉండదు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నాన్క్లినికల్ అధ్యాపక ఖాళీలను భర్తీ చేయడంలేదు. దీంతో ఈ కోర్సులు చేసినవాళ్లు చాలామంది ఖాళీగా ఉంటున్నారు. నాన్ క్లినికల్ కోర్సులు చేసినవారి సంఖ్య పెరగడంతో ప్రైవేటు కాలేజీల్లోనూ అవకాశాలు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఒకప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో రూ. లక్షకు పైగా జీతాలు తీసుకున్నవారు, ఇప్పుడు రూ. 40–50 వేలకే పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. కొన్నిసార్లు ఆ మేరకైనా అవకాశాలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు నాన్ క్లినికల్ విభాగాల్లో చేరడానికి ఆసక్తి చూపడంలేదు. క్లినికల్ విభాగాలైన జనరల్ మెడిసిన్, రేడియాలజీ, నెఫ్రాలజీ, న్యూరో, ఆర్థో, గైనిక్ తదితర కీలకమైన వాటిపైనే దృష్టిసారిస్తున్నారు. బయట ప్రాక్టీస్ చేయడానికి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో భారీ జీతాలు పొందడానికి క్లినికల్ మెడికల్ కోర్సులే ఉపయోగపడతాయి. క్లినికల్ సీట్లనైనా పెంచితే... మెడికల్ కాలేజీల్లో నాన్ క్లినికల్ పీజీ వైద్య సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతుండటంపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. సీట్లుండీ మిగిలిపోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోతోందని అంటున్నాయి. ఇన్ సర్వీస్ కోటా కింద భర్తీ చేసుకోవడానికి వీలు కల్పించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు గతంలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు లేఖ రాశాయి. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ‘నీట్’పరీక్ష తప్పనిసరి కాబట్టి తామేమీ చేయలేమని ఎన్ఎంసీకి చెందిన కొందరు వ్యాఖ్యానించినట్లు సమాచారం. నాన్ క్లినికల్ సీట్లను తగ్గించి క్లినికల్ సీట్లనైనా పెంచితే బాగుంటుందని ఎంబీబీఎస్ విద్యార్థులు కోరుతున్నారు. -
అరకొర ఫ్యాకల్టీ.. క్లాసులు పల్టీ.. దయనీయ స్థితిలో బీబీనగర్ ఎయిమ్స్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బీబీనగర్ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రస్తుతం సగం ఫ్యాకల్టీతోనే నడుస్తున్నాయి. బోధన సిబ్బంది (ఫ్యాకల్టీ)కి సంబంధించి మంజూరైన పోస్టులు 183 ఉండగా, కేవలం 92 మందినే నియమించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక ఈ అంశాన్ని వెల్లడిస్తుండగా.. ఏకంగా 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఎయిమ్స్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కొత్తగా ప్రారంభమైన అనేక ఎయిమ్స్ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భోపాల్ ఎయిమ్స్లో 305 పోస్టులకు, 105 ఖాళీగా ఉన్నాయి. భువనేశ్వర్లో 305కు గాను 74, జో«ధ్పూర్లో 305కు గాను 77, పాట్నాలో 305కు గాను 151, రాయిపూర్లో 305కు 135, రిషికేష్లో 305కు గాను 106, మంగళగిరిలో 183కు గాను 65, నాగ్పూర్లో 183కు గాను 64, కళ్యాణిలో 183కు గాను 88, గోరఖ్పూర్లో 183కు గాను 105, భటిండాలో 183కు గాను 72, భిలాస్పూర్లో 183కు గాను 90, గౌహతిలో 183కు గాను 89, రాజ్కోట్లో 183కు గాను 143, విజయ్పూర్లో 183కు గాను 107, రాయ్బరేలీలో 183కు గాను 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫ్యాకల్టీ ఇంత తక్కువగా ఉండటం వల్ల తరగతులు సరిగా జరగక పోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారని రాష్ట్ర వైద్య వర్గాలు చెబుతున్నాయి. 2021లో శస్త్రచికిత్సలు షురూ బీబీనగర్ ఎయిమ్స్లో 2021లో శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. ఆ సంవత్సరం ప్రధాన శస్త్రచికిత్సలు 26 జరగ్గా, 2022 జూలై నాటి వరకు 294 జరిగాయి. ఇక చిన్నపాటి శస్త్రచికిత్సలు ఇప్పటివరకు 3,600పైగా జరిగాయి. అయితే సీనియర్ రెసిడెంట్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అందుబాటులోకి వచ్చి మూడేళ్లు గడిచినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషితో రాష్ట్రానికి ఎయిమ్స్ వచ్చింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం బీబీనగర్లో ఏకంగా 200 ఎకరాల భూమి ఇచ్చింది. అలాగే అక్కడ నిమ్స్ ఆసుపత్రి భవనాలను కూడా ఉచితంగా అప్పగించింది. అనంతరం 2019 నుంచి బీబీనగర్ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్తో అన్ని వర్గాల ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావాలనేది ప్రధాన ఉద్దేశం. కీలకమైన 50 రకాల స్పెషలిస్టు వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉండాలి. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో ఎంబీబీఎస్, నర్సింగ్ విద్య అందించాలన్నది లక్ష్యం. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాలకు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఎయిమ్స్ను బీబీనగర్లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు సమీపంలో, ఔటర్రింగ్ రోడ్డుకు 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి అన్ని జిల్లాలకూ సులువుగా వెళ్లి వచ్చేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఎయిర్పోర్టుకు ఇక్కడి నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. జాతీయ స్థాయిలో నిపుణులైన వైద్యులు సులభంగా వచ్చివెళ్లేందుకు అవకాశం ఉంది. ఇంత కీలకమైన ఎయిమ్స్పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దన్నా... ప్రభుత్వ ఉద్యోగమే ముద్దు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ పూర్తి చేసినవారి చూపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యపోస్టుల వైపు మళ్లింది. ప్రైవేట్ ప్రాక్టీసు కన్నా ప్రభుత్వ ఆసుపత్రే మిన్న అని భావిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వేతనాలు ఆశాజనకంగా లేకపోవడం కూడా దీనికి మరో కారణం. ప్రైవేట్ ప్రాక్టీసుపై ప్రభుత్వం నిషేధం విధించినా ప్రభుత్వ పోస్టుల వైపే ఎక్కువగా మొగ్గు చూపడం గమనార్హం. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో భాగంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వస్తున్న దరఖాస్తుల సంఖ్యే అందుకు నిదర్శనమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంతా కార్పొరేట్ వైద్యమయం అయిన పరిస్థితుల్లో ప్రైవేట్ ప్రాక్టీసు అసాధ్యమన్న భావనలో చాలామంది వైద్యులు ఉన్నారు. కొందరికైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 25 వేలు కూడా ఇవ్వడంలేదు. విదేశీ ఎంబీబీఎస్లకైతే కొందరికి రూ. 20 వేలు కూడా ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతుంది. సివిల్ అసిస్టెంట్ పోస్టులకు ఐదు రెట్ల డిమాండ్ వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 12,755 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అందులో 10,028 పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటివరకు ఎంబీబీఎస్ అర్హతతో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 734 పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 209 పోస్టులు, ఐపీఎం పరిధిలో ఏడు సివిల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీచేశారు. మొత్తం 950 పోస్టులకు 4,800 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఏకంగా ఐదురెట్ల దరఖాస్తులు వచ్చాయి. వీరికి బేసిక్ వేతనం రూ.58,850 ఉంది. డీఏ, హెచ్ఆర్ఏ అదనం. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వారికే 90 శాతం మేరకు ఇందులో పోస్టులు దక్కాయి. అనుభవం లేనివారికి, ఇప్పుడే ఎంబీబీఎస్ పూర్తయినవారిలో 90 శాతం మందికి అవకాశమే రాలేదు. కాగా, మొత్తం పోస్టులు పొందినవారిలో అధికంగా మహిళాడాక్టర్లు 509 మంది, పురుష డాక్టర్లు 441 మంది ఉన్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు మహిళలే ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ జారీచేయగా, ఇప్పటికే 2 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని వైద్య, ఆరోగ్య సేవల నియామక సంస్థ(ఎంహెచ్ఎస్ఆర్ఏ) సభ్యకార్యదర్శి గోపికాంత్రెడ్డి చెబుతున్నారు. ఇంకా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. స్టాఫ్నర్సు పోస్టులకైతే 30 వేల మంది పోటీ? రాష్ట్రంలోని వివిధ వైద్య, ఆరోగ్య విభాగాల్లో 5,204 స్టాఫ్నర్సు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ అయిన సంగతి విదితమే. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750– రూ. 1,06,990 మధ్య ఉండటంతో దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే ఆరురెట్ల డిమాండ్ ఉంటుందని అంటున్నారు. 1,500 ఏఎన్ఎం పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. వాటికి పదిరెట్లు పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: గతంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి పొందిన, 2022 అక్టోబరు 21వ తేదీ లోపు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) గుర్తించిన విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆయా దేశాల్లోనే ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేస్తే దాన్ని ఈ ఒక్క ఏడాది వరకు గుర్తిస్తామని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏ దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా భారత్లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అనంతరం ఒక ఏడాది పాటు తప్పనిసరిగా ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంది. ఈ నిబంధన తాజాగా అమల్లోకి రావడంతో 2022 అక్టోబర్కు ముందే ఇంటర్న్షిప్ విదేశాల్లో పూర్తి చేసిన వారు మళ్లీ ఇక్కడ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అలాంటి అభ్యర్థులు ఈ నిబంధనను సడలించాలని ఎన్ఎంసీని కోరారు. దీన్ని పరిశీలించిన ఎన్ఎంసీ తాజాగా వెసులుబాటు కల్పించింది. తాము అనుమతించిన కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో గతేడాది అక్టోబర్ 21కు ముందు ఎంబీబీఎస్, తత్సమాన అర్హతతో వైద్య విద్య పూర్తి చేసి, ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేసినట్లయితే వారికి ఈ ఒక్క ఏడాదికి సడలింపిస్తామని ఉత్తర్వులు జారీచేశారు. (క్లిక్ చేయండి: 20 కోట్ల ఆఫర్ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
ఢిల్లీ తరహా దారుణం.. బైక్ని ఢీ కొట్టి లాక్కెళ్లిన ట్రక్కు..విద్యార్థి మృతి
సాక్షి, భోపాల్: ఢిల్లీ మహిళను కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన మరువక మునుపే అచ్చం అలాంటి తరహ మరోక ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి మృతి చెందింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో చోటు చేసకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...బాధితురాలు మధ్యప్రదేశ్లోని షాదోల్ నివాసి రూబీ థాకూర్. ఆమె జబల్పూర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీస్ చదువుతోంది. ఆమె తన క్లాస్మేట్ సౌరవ్ ఓజా అనే అబ్బాయితో కలసి జబల్పూర్కి 35 కిలోమీటర్లు దూరంలో ఉన్న భేదాఘాట్ జలపాతాన్ని చూసేందుకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఒక పెద్ద ట్రక్కు వారిని దారుణంగా ఢీ కొట్టింది. ఐతే బాధితురాలు రూబీ వెనుక కూర్చొని (పిలియన్ రైడర్)వెనుక కూర్చొని ఉండగా, బైక్ని అతని క్లాస్మేట్ సౌరవ్ డ్రైవ్ చేశాడు. ఈ ఘటనలో సౌరవ్ 20 మీటర్ల దూరంలో పడిపోగా, రూబీ శరీరం ట్రక్లో చిక్కుకుపోవడంతో.. సుమారు 100 మీటర్లు ఈడ్చకుని పోయింది. దీంతో శరీరం నుజ్జునుజ్జు అయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గాయపడిని సౌరవ్ని ప్రభుత్వా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, కానీ అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఐతే దర్యాప్తులో హెవీలోడ్ ట్రక్కు వారి బైక్ని వెనుక నుంచి ఢీ కొట్టినట్లు తేలిందని, ఆ ట్రక్కుని కూడా గుర్తించమని వెల్లడించారు. తాము నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: అంజలి సింగ్ కేసులో ట్విస్ట్.. ఐదుగురు కాదు మరో ఇద్దరు ఉన్నారటా!) -
నెక్ట్స్ పాసైతేనే ఎంబీబీఎస్ పట్టా
సాక్షి, హైదరాబాద్: ఇకపై ఎంబీబీఎస్ పట్టా పొందాలన్నా, పీజీ మెడికల్ సీట్లలో ప్రవేశించాలన్నా, విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు గుర్తింపు ఇవ్వాలన్నా అందరూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (ఎగ్జిట్) పాస్ కావాలి. ఆ తర్వాతే వైద్యవిద్య పట్టా ఇవ్వనున్నారు. నెక్ట్స్ పాసైతేనే మెడికల్ ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లభిస్తుంది. అంతేకాదు నియామకాలకు కూడా ఈ పరీక్షలో వచ్చే మార్కులే ఆధా రం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా విడుదల చేసింది. దాన్ని ప్రజాభిప్రాయం నిమిత్తం అందుబాటులో ఉంచింది. తదుపరి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి దీన్ని అమలులోకి తీసుకొస్తారు. అంటే 2019–20లో ఎంబీబీఎస్లో చేరిన బ్యాచ్ నుంచి ఇది అమలవుతుందని అంటున్నారు. అంటే వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి అమలవుతుందని చెబుతున్నారు. దీనిపై ఎన్ఎంసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రెండింట్లో పాసైతేనే... నెక్ట్స్ పరీక్ష రెండుషెడ్యూళ్లలో నిర్వహిస్తారు. స్టెప్–1, స్టెప్–2 పద్ధతిలో జరుగుతుంది. స్టెప్–1 పరీక్ష నాలుగున్నరేళ్లకు తర్వాత... ఇంటర్న్షిప్కు ముందు ఉంటుంది. ఇది ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షతో సమానం. అంటే ఎంబీబీఎస్లో ఫైనయర్ బదులుగా నెక్ట్స్ స్టెప్–1 థియరీ పరీక్ష నిర్వహిస్తారు. ఏటా డిసెంబర్ రెండో వారంలో దీన్ని నిర్వహిస్తారు. దీని ఫలితాలు జన వరి రెండో వారంలో విడుదల చేస్తారు. ఆ తర్వాత యథావిధిగా కాలేజీలు నిర్వ హించే ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఇంటర్న్షిప్ అయ్యాక స్టెప్–2 ప్రాక్టికల్స్ ఉంటాయి. కోర్సు పూర్తయ్యాక అంటే స్టెప్–1 పరీక్ష తర్వాత ఏడాదికి స్టెప్–2 పరీక్షను నిర్వహిస్తారు. అది పూర్తిగా ప్రాక్టికల్ పరీక్ష. స్టెప్–2 పరీక్ష ఏటా మార్చిలో నిర్వహించి ఏప్రిల్లో ఫలితాలు విడుదల చేస్తారు. ఈ రెండింటిలో పాసైతేనే ఎంబీబీఎస్ పట్టా, పీజీ మెడికల్ అర్హత, విదేశీ వైద్య కు గుర్తింపు ఉంటుంది. స్టెప్–2 కేవలం పాసైతే సరిపోతుంది. ఒకవేళ ఇందులో 3 అంతకంటే తక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలైతేనే సప్లిమెంటరీ ఉంటుంది. లేకుంటే అన్ని పరీక్షలు రాయాలి. మూడు కంటే ఎక్కువ ఫెయిలైతే ఏడాది కోల్పోయినట్లే లెక్క. పదేళ్లలోగా ఎన్నిసార్లు అయినా నెక్ట్స్ రాసుకోవచ్చు. అలాగే ఒకసారి పాసైనా కూడా మార్కులను పెంచుకొనేందుకు కూడా పరీక్ష రాసుకోవచ్చు. అంటే పీజీలో సీటు పొందేందుకు ఎక్కువ మార్కులు రావాలనుకుంటే మరోసారి రాసుకోవచ్చు. నెక్ట్స్ అమలైతే సంబంధిత సమానమైన ప్రస్తుత పరీక్షలు దశలవారీగా రద్దవుతాయి. ఉదాహరణకు ‘నీట్’పీజీ పరీక్ష రద్దు అవుతుంది. ప్రాక్టికల్స్కు ప్రాధాన్యత ఇవ్వాల్సింది... అమెరికా లాంటి దేశాల్లో గత 20 ఏళ్ల నుంచి ఈ తరహా పరీక్షా విధానం అమలవుతోంది. వైద్యవిద్యలో దేశవ్యాప్తంగా ఏకీకృతంగా ఇప్పటికే అమలు చేస్తున్న ‘నీట్’విధానానికి నెక్ట్స్ కొనసాగింపు మాత్రమే. తుది ర్యాంకులో స్టెప్–1కు మాత్రమే కాకుండాప్రాక్టికల్స్కు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. – డాక్టర్ కిరణ్ మాదల, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు -
Telangana: 8.78 లక్షల ర్యాంకుకూ ఎంబీబీఎస్ సీటు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ చదువు అంటే అందని ద్రాక్ష అనే భావనకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. 8,78,280 నీట్ ర్యాంకు వచ్చిన విద్యార్థికి సైతం స్వరాష్ట్రంలోనే ఎంబీబీఎస్ సీటు దక్కేలా చేసి, రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొనేలా చేసింది. 2021–22 వైద్య విద్యా సంవత్సరంలో మైనార్టీ మెడికల్ కాలేజీలు కలుపుకొని బీ కేటగిరీలో 1,214 సీట్లు ఉండేవి. రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇందులో 495 సీట్లు మాత్రమే లోకల్ విద్యార్థులకు దక్కాయి. గరిష్టంగా 2,71,272 ర్యాంకు వచ్చిన తెలంగాణ లోకల్ విద్యార్థికి అడ్మిషన్ దొరికింది. మిగతా 719 సీట్లలో నాన్ లోకల్ కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇలా రాష్ట్ర విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి బీ కేటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్ను తీసుకువచ్చింది. దీంతో స్థానిక విద్యార్థులకు వైద్య విద్యనభ్యసించే అవకాశాలు మరింత పెరిగాయి. ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి సైతం ఎంబీబీఎస్ సీటు వచ్చింది. 2022–23 విద్యా సంవత్సరంలో బీ కేటగిరీలో మొత్తం 1,267 సీట్లు ఉన్నాయి. ఇందులో నూతన స్థానిక రిజర్వేషన్ విధానం వల్ల రాష్ట్ర విద్యార్థులకు 1,071 సీట్లు రిజర్వ్ అయ్యాయి. దీంతో ఈసారి 8,78,280 ర్యాంకు వచ్చిన తెలంగాణ లోకల్ విద్యార్థికి కూడా సీటు వచ్చినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కన్వీనర్ కోటాలోనూ పెరిగిన అవకాశాలు రాష్ట్రంలో ఈ ఏడాది 8 కొత్త మెడికల్ కాలేజీలు రావడంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆలిండియా కోటా మినహాయించుకొని కేటగిరీ ఏ (కన్వీనర్) కోటాలో 2021–22లో 3,038 సీట్లు ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 4,094కు పెరిగింది. దీంతో ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ, బీసీ బీ, బీసీ డీ, బీసీ ఈ కేటగిరీల్లో కటాఫ్ తగ్గి ఎక్కువ మందికి సీట్లు దక్కాయి. ఎస్టీ రిజర్వేషన్ కోటాను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో ఆ కేటగిరీలో మరింత మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశం కలిగింది. గరిష్టంగా 10,55,181 ర్యాంకు వచ్చిన అభ్యర్థికి సైతం సీటు వచ్చింది. విద్యార్థినులదే పైచేయి.. ఎంబీబీఎస్లో ఎక్కువగా విద్యార్థినులే సీట్లు పొందుతున్నారు. 2021–22లో మొత్తం 5,095 సీట్లలో 60.79 శాతం సీట్లు విద్యార్థినులే పొందారు. కన్వీనర్ కోటాలో 63.36 శాతం, మేనేజ్మెంట్ కోటాలో 55.76 శాతం సీట్లు విద్యార్థినులకు దక్కా యి. ఈ ఏడాది కూడా కన్వీనర్ కోటాలో 62.68 శాతం, మేనేజ్మెంట్ కోటాలో 63.73 శాతం సీట్లు విద్యార్థినులు సాధించారు. మొత్తం 6,186 సీట్లలో 62.98 శాతం సీట్లు విద్యార్థులు పొందారు. 42 కాలేజీలు..6,690 సీట్లు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 42కు పెరిగింది. ఎంబీబీఎస్ సీట్లు 6,690కు పెరిగాయి. 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో కొత్తగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు రాగా, బి– కేటగిరీలో 85 శాతం లోకల్ రిజర్వేషన్, 6 శాతం నుంచి 10 శాతానికి పెరిగిన ఎస్టీ రిజర్వేషన్ వల్ల మార్కుల కటాఫ్ భారీగా తగ్గింది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, దేశంలోని మిగతా ఏ రాష్ట్రంలో ఇన్ని సీట్లు లేకపోవడం గమనార్హమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక పీజీ సీట్ల విషయంలో దేశంలోనే తెలంగాణ టాప్ 2వ స్థానంలో ఉండటం గమనార్హమని, రాష్ట్రంలో మొత్తం 2,544 పీజీ సీట్లు ఉన్నాయని వివరించారు. -
డాక్టర్ పోస్టులకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలో ఎంబీబీఎస్ అర్హతతో చేప ట్టే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాలకు మంగళవారం నుంచి 3 రోజు లపాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 27, 28 తేదీల్లో మల్టీజోన్–1కు చెందిన 452 మంది అభ్యర్థులకు, 29న మల్టీజోన్–2కు చెందిన 282 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరగనుంది. అభ్యర్థులు హైదరాబాద్ వెంగళరావునగర్లోని ఇండియ న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ కార్యాలయంలో హాజరుకావాలి. అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరు కాకపోతే సుమోటోగా పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేస్తారు. ఎంపిక ప్రక్రియలో పొందిన ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్కు పిలుస్తారు. మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్ ఉంటుంది కాబట్టి ఎవరు ముందుగా వస్తే వారి ప్రాధాన్యం ప్రకారం పోస్టింగ్లు వస్తాయని, పైరవీలను నమ్ముకోవద్దని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. -
సర్పంచ్గా ‘ఎంబీబీఎస్’ విద్యార్థిని.. ఎన్నికల్లో ఘన విజయం
ముంబై: యశోధరా షిండే.. 21 ఏళ్ల ఈ యువతి డాక్టర్ కావాలని కలలు కన్నది. అందుకు తగ్గట్లుగా జార్జియా వెళ్లి ఎంబీబీఎస్ చదువుతోంది. కానీ, ఆమెకు విధి మరో కొత్త రంగాన్ని అందించాలని తలపించింది. ఆమెను గ్రామానికి తిరిగి వచ్చేలా చేసింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచింది యశోధరా. భారీ మెజారిటీతో సర్పంచ్గా ఘన విజయం సాధించింది. చిన్న వయసులోనే సర్పంచ్గా ఎన్నికై అందరి మన్ననలు పొందుతోంది. ఈ సంఘటన మహారాష్ట్ర, సంగ్లీ జిల్లాలోని మిరాజ్ తహసీల్ వడ్డి గ్రామంలో జరిగింది. యశోధరా సర్పంచ్గా పోటీ చేయాల్సి రావటంపై ఆమె మాటల్లోనే.. ‘జార్జియాలోని న్యూ విజన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను నాలుగో సంవత్సరంలో ఉన్నా. ఇంకా ఏడాదిన్నర కోర్సు మిగిలి ఉంది. మా గ్రామంలో ఎన్నికలు ప్రకటించిన క్రమంలో మా ఇంటి నుంచి ఎవరైనా పోటీ చేయాలని స్థానికులు కోరారు. సర్పంచ్గా నన్ను బరిలో నిలపాలని మా కుటుంబంతో పాటు అంతా నిర్ణయించారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పడంతో వచ్చాను. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను.’ - యశోధరా షిండే, వడ్డి గ్రామ సర్పంచ్ తమ గ్రామం వడ్డి అభివృద్ధి కోసం పాటుపడతానని, మహిళలు స్వయంసమృద్ధిగా ఎదిగేందుకు, విద్యార్థుల కోసం ఈ లర్నింగ్, ఇతర మెరుగైన విద్యావిధాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొంది యశోధరా. రైతుల సంక్షేమంతో పాటు యువతకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తానని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు సమానమైన అవకాశాలు రావాలని, అందుకు తగినట్లుగా వారు చదువుకుని స్వతంత్రంగా జీవించేందుకు కృషి చేస్తానని నొక్కి చెప్పారు యశోధరా. మరోవైపు.. తన ఎంబీబీఎస్ చదువును కొనసాగిస్తానని, ఆన్లైన్ విధానంలో పూర్తి చేస్తానని వెల్లడించింది. మహారాష్ట్రలోని 7,682 గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 18న ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికల ఓటింగ్ ఫలితాలను గత మంగళవారం వెల్లడించారు. ఇదీ చదవండి: కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళనకరమే.. కానీ: అదర్ పూనావాలా -
ఎంబీబీఎస్లోనే మూడుసార్లు ‘నెక్ట్స్’
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్)కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సన్నాహాలు చేస్తోంది. 2019 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు వచ్చే ఏడాది మొదటి విడత (స్టెప్–1) పరీక్ష నిర్వహించే అవకాశముందని, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై తమకు స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉందంటున్నాయి. 2019 ఎంబీబీఎస్ బ్యాచ్ల నుంచి అమలు చేయనుండటంతో ఆయా విద్యార్థులు ఆ మేరకు సిద్ధంగా ఉండాలంటున్నాయి. ఎంబీబీఎస్ చదివేటప్పుడే నెక్ట్స్ పరీక్ష మూడుసార్లు జాతీయ స్థాయిలో జరగనుంది. వాటిల్లో విద్యార్థులు పాస్ కావాలి. ఒకటి బేసిక్ సైన్స్... రెండోది థియరీ... ఇంకోటి ప్రాక్టికల్స్ పరీక్ష ఉంటుంది. విదేశాల్లో ఉన్న పద్ధతిని అనుకరించాలన్నది జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఉద్దేశం. ఈ మూడు పరీక్షలు పాస్ కావాలి. అయితే థియరీ పరీక్షనే ప్రధానంగా తీసుకుంటామని, మిగిలిన రెండు పరీక్షలు కేవలం అర్హత సాధిస్తే చాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఎంబీబీఎస్ పాస్కు, తర్వాత రిజిస్ట్రేషన్, ప్రాక్టీస్కు కూడా ఈ పరీక్ష పాస్ కావడం తప్పనిసరి. అలాగే పీజీ మెడికల్ సీటులో ప్రవేశం కూడా నెక్ట్స్ అర్హతతోనే ఉంటుంది. అంటే నీట్ పీజీ పరీక్ష రద్దవుతుంది. అలాగే విదేశీ వైద్యవిద్యకు గుర్తింపు కూడా ఈ పరీక్ష ద్వారానే ఉంటుంది. అంటే మూడింటికీ ఇదే కీలకమైన పరీక్షగా ఉంటుంది. 2019 బ్యాచ్ వైద్య విద్యార్థులకు 2023 ఆగస్టు నాటికి నాలుగేళ్లు పూర్తవుతాయి. 2024 ఫిబ్రవరి–మార్చి నాటికి నాలుగున్నరేళ్లు అవుతుంది. కానీ మొదటి పరీక్ష బేసిక్ సైన్స్ ముందుగా నిర్వహించాలి. అంటే 2019 బ్యాచ్కు 2023లో ఉంటుందని అంటున్నారు. బేసిక్ సైన్స్ మొదటి పరీక్షను రెండో ఏడాది తర్వాత ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు. మొదటి పరీక్షలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలతో ఉంటుంది. తర్వాత స్టెప్–2లో థియరీ, స్టెప్–3లో ప్రాక్టికల్స్ ఉంటాయి. థియరీ పరీక్షనే ప్రధానంగా తీసుకుంటామని, ప్రాక్టికల్స్ కేవలం క్వాలిఫై అయితే చాలని ఎన్ఎంసీ పేర్కొంది. హౌస్సర్జన్ తర్వాత ప్రాక్టికల్స్ నిర్వహించాలా లేక ముందే నిర్వహించాలా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. వైద్యవిద్యలో నాణ్యతను పెంచడమే లక్ష్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా వైద్యవిద్యలో నాణ్యతను పెంచడమే లక్ష్యంగా ఎన్ఎంసీ నెక్ట్స్ పరీక్షకు శ్రీకారం చుడుతోంది. జాతీయ స్థాయిలో ఏకీకృతమైన పరీక్షను పెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా నాణ్యమైన వైద్యవిద్యను అందించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారతీయులు విదేశాల్లో ఎంబీబీఎస్ వైద్యవిద్య పూర్తి చేసిన వారికి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అందులో పాసైతేనే ఇండియాలో డాక్టర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, ప్రభుత్వ వైద్య ఉద్యోగాల్లో చేరడానికి అనుమతి ఉంది. అయితే ఎఫ్ఎంజీఈ పరీక్ష ఎంతో కఠినంగా ఉండటంతో పరీక్ష రాసేవారిలో 20 శాతానికి మించి అర్హత సాధించలేకపోతున్నారు. ఇప్పుడు నెక్ట్స్ పరీక్షను మూడు రకాల అర్హతలకు నిర్వహిస్తున్నందున దీన్ని కీలకంగా భావిస్తున్నారు. ఇది పాస్ కాకుంటే ఎంబీబీఎస్ పట్టా ఇవ్వరు. ఎంతో కఠినంగా ఈ పరీక్ష ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే 2023లో నిర్వహించే స్టెప్–1 పరీక్ష ఎంబీబీఎస్లో బేసిక్ పరీక్ష మాత్రమే. 2024లో నిర్వహించేదే ఎంబీబీఎస్ అర్హతకు, మెడికల్ పీజీ సీట్లలో ప్రవేశానికి ఉంటుందని వివరిస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది నీట్–పీజీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. నెక్ట్స్ పరీక్ష సిలబస్, సరళిని ఇంకా నిర్ణయించాల్సి ఉంది. -
దేశంలో పెరుగుతున్న వైద్యుల సంఖ్య.. ప్రతి 834 మందికి ఒకరు
సాక్షి, హైదరాబాద్: దేశంలో డాక్టర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎనిమిదేళ్లతో పోలిస్తే ఇప్పుడు వైద్యులు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మెడికల్ కాలేజీలు, వాటిల్లో సీట్లు, దీంతో వైద్య సేవల మెరుగుదలపై కేంద్రం సోమవారం ఒక నివేదిక విడుదల చేసింది. 2014లో 1,008 మంది జనాభాకు ఒక డాక్టర్ ఉండగా, ఇప్పుడు 834 మందికి ఒక డాక్టర్ ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 13.01 లక్షల మంది నమోదిత అల్లోపతి వైద్యులు, 5.65 లక్షల ఆయుష్ వైద్యులు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నవారు మొత్తంగా 15.80 లక్షల మంది ఉన్నారు. ఇక 2014లో దేశంలో 387 మాత్రమే మెడికల్ కాలేజీలుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 648కి చేరింది. వాటిలో 355 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 293 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. గత ఎనిమిదేళ్లలో కొత్తగా 261 మెడికల్ కాలేజీలు వచ్చి చేరాయి. ఇప్పటివరకు మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యం 96,077 కాగా, పీజీ మెడికల్ సీట్లు 63,842కు చేరాయి. ప్రత్యేక విభాగంగా కుటుంబ వైద్యం కుటుంబ వైద్యాన్ని ఒక ప్రత్యేక విభాగంగా సిద్ధం చేయాలి. ఈ విభాగంలో స్పెషలైజేషన్ను అందించే ఎండీ, డిప్లొమా కోర్సులు రెండూ ఉన్నాయి. ఫ్యామిలీ మెడిసిన్లో పోస్ట్–గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ మెడిసిన్, సర్జరీ, ప్రసూతి, గైనకాలజీకి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న స్పెషలిస్ట్ ఫ్యామిలీ ఫిజిషియన్లను అందుబాటులోకి తెస్తారు. గ్రామాల్లో అందుబాటులో వైద్యులు వైద్య విద్యలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సంస్థాగత సంస్కరణలు ప్రారంభించినట్లు కేంద్రం పేర్కొంది. కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పడానికి వీలుగా ఎన్ఎంసీ అనేక నిబంధనలను సులభతరం చేసింది. ఉపాధ్యాయ–విద్యార్థి నిష్పత్తితో సహా కనీస అవసరాల హేతుబద్ధీకరణ, పీజీ సీట్ల సంఖ్య పెంపు, ఇతర అంశాలకు సంబంధించిన నిబంధనల్లో సవరణలు చేసింది. చిన్న నగరాలు, పట్టణాలకు వైద్య విద్యను తీసుకెళ్లడం వల్ల గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో వైద్యులను అందుబాటులో ఉంచడానికి వీలు కలిగింది. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులకు ఎగ్జిట్ టెస్ట్ ‘నీట్’తో ఒకే దేశం.. ఒకే పరీక్ష.. ఒకే ప్రతిభ వ్యవస్థ ఏర్పడింది. ఒకేసారి వైద్య సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించడానికి వీలు కుదిరింది. మరోవైపు ఎంబీబీఎస్ పాసైన విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఇది ప్రాక్టీస్ కోసం లైసెన్స్గా కూడా ఉపయోగపడుతుంది. స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ప్రవేశానికి కూడా ఉపయోగపడుతుంది. ఇదే పరీక్ష విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లకు స్క్రీనింగ్ పరీక్షగా ఉపయోగపడుతుంది. దీన్ని త్వరలో అమలు చేయడానికి ఎన్ఎంసీ సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వైద్యులు – జనాభా నిష్పత్తిని ఇంకా మెరుగుపరిచేందుకు కృషి చేయాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. మరికొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లను అందుబాటులోకి తెస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేందుకు డాక్టర్లను సన్నద్ధం చేస్తారు. జిల్లా రెసిడెన్సీ పథకం కింద జిల్లా ఆసుపత్రుల్లో పీజీ మెడికల్ విద్యార్థులకు మూడు నెలలు శిక్షణ ఇస్తారు. దీనివల్ల ప్రతి జిల్లా ఆసుపత్రిలో అదనంగా 4 నుంచి 8 మంది జూనియర్ రెసిడెంట్లు ఉంటారు. పేదలకు అందుబాటులో వైద్య విద్య పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉండేలా సంస్కరణలు చేపట్టారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల్లోని 50 శాతం సీట్ల ఫీజులను నియంత్రించేలా నిబంధనను అమలు చేస్తున్నారు. స్కిల్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తారు. ప్రత్యక్షంగా రోగులపై నేర్చుకునే పద్ధతులను తగ్గిస్తారు. బొమ్మలు, కంప్యూటరైజ్డ్ సిమ్యులేషన్ ద్వారా నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. 2022–23 వైద్య విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాన్ని తప్పక ఏర్పాటు చేయాలి. క్యాజువాలిటీ ఏరియా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఆపరేషన్ థియేటర్తో పాటు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ఉండాలి. విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోవడానికి, ఇంగ్లిష్ అలవాటు చేసుకోవడానికి నెల రోజుల ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. -
కొత్త మెడికల్ కాలేజీల్లో బోధన.. ఫస్టియర్ ఎంబీబీఎస్ తరగతులు షురూ
సాక్షి, హైదరాబాద్: ఒక వైద్య విద్యాసంవత్సరంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో 8 మెడికల్ కాలేజీలు కొత్తగా ప్రారంభం కావడం, ఆయా కాలేజీల్లో ఏకంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రావడం రాష్ట్ర చరిత్రలో రికార్డుగా నిలవనుంది. 2022–23 వైద్య విద్యా సంవత్సరంలో కొత్తగూడెం, నాగర్కర్నూల్, మహబూబాబాద్, సంగారెడ్డి, రామగుండం, వనపర్తి, జగిత్యాల, మంచిర్యాల ల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు సహా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి. 2014లో 850 ప్రభుత్వ సీట్లుండగా... ఇప్పుడు 2,815 తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిల్లో 850 సీట్లు ఉండేవి. రాష్ట్రం ఏర్పడ్డాక కాలేజీల సంఖ్య 17కు పెరగ్గా సీట్ల సంఖ్య 2,815కి పెరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్నగర్లలో 4 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిదేళ్లలో కొత్తగా 12 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 కాలేజీలను ఏర్పాటు చేసినప్పటికీ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే కొత్త మెడికల్ కాలేజీలన్నింటినీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గతంలోకన్నా 3 రెట్లకుపైగా ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. వచ్చే ఏడాది 9 కొత్త మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాది మరో 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇప్పటికైనా కేంద్రం కొత్త కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేస్తున్నారు. ► 2014లో రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. మొత్తం 20 కాలేజీలున్నాయి. ► 2022 (ప్రస్తుతం)లో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 24 ప్రైవేటు కాలేజీలు అయ్యాయి. ► 2014లో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వంలో 850, ప్రైవేటులో 2,100... మొత్తం 2,950 ► 2022లో ప్రభుత్వంలో 2,815 ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటులో 3,800 సీట్లు... మొత్తం 6,615 ► 2014లో పీజీ మెడికల్ సీట్లు ప్రభుత్వంలో 529, ప్రైవేటులో 601... మొత్తం 1,130 ► 2022లో పీజీ మెడికల్ సీట్లు ప్రభుత్వంలో 1,850, ప్రైవేటులో 613... మొత్తం 2,463 ► 2014లో నర్సింగ్ కాలేజీలు ప్రభుత్వంలో ఐదు, ప్రైవేటులో 74... మొత్తం 79 ► 2022లో నర్సింగ్ కాలేజీలు ప్రభుత్వంలో 9, ప్రైవేటులో 83... మొత్తం 92 చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత.. విద్యార్థిని హారికకు గొప్ప సాయం!
హైదరాబాద్: చదువుల తల్లి హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లాలోని నాందేవ్ గూడకు చెందిన హారికకు కవిత అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తక్షణమే స్పందించారు. తన నిజామాబాద్ పర్యటనలో హారికను కలిసి కవిత ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును భరిస్తానని భరోసానిచ్చారు. మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని తెలిపారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హారిక ఎంబీబీఎస్లో రాణించి, వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. కవిత తన చదువుకు ఆర్థికంగా అండగా నిలిచినందుకుగాను హారిక తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చెక్కు అందుకుంటున్న సమయంలో భావోద్వాగానికి లోనయ్యారు. తాను బాగా చదువుకొని కవిత సూచించినట్లుగా సమాజానికి తోడ్పాటునందిస్తానని హారిక అన్నారు. Dare to dream and then never stop working until you achieve them. This is the story of Harika,who passed and excelled in the MBBS exams via YouTube videos. I met her and her mother and extended my support towards her dreams by handing over the first installment of her fees (1/2) pic.twitter.com/8NIUqSk91e — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 9, 2022 -
ఎండీ పేరుతో బురిడీ!
ఆయన పేరు డాక్టర్ రమేష్బాబు (పేరు మార్చాం). విదేశాల్లో ఎంబీబీఎస్ సమానమైన ఎండీ కోర్సు చదివి వచ్చాడు. హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో జనరల్ ఫిజీషియన్గా పని చేస్తున్నాడు. యాజమాన్యం కూడా అతనికి అదే బోర్డు పెట్టి ప్రోత్సహిస్తోంది. ఇటీవల జరిగిన దాడుల్లో అతన్ని నకిలీ ఎండీగా గుర్తించారు. డాక్టర్ శ్రీనివాస్ (పేరు మార్చాం) విదేశీ ఎండీ (ఎంబీబీఎస్ తత్సమాన కోర్సు) పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాలో వైద్యం చేస్తున్నాడు. ఎండీ కార్డియాలజీగా అవతారం ఎత్తాడు. కార్డియాలజిస్ట్గా మందులూ రాస్తాడు. సర్జరీలు మాత్రం తనకు తెలిసిన డాక్టర్లకు రిఫర్ చేస్తాడు. ఇతని నిర్వాకాన్ని కూడా ఇటీవలి దాడుల్లో గుర్తించారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనేకమంది నకిలీ ఎండీలు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గుర్తించింది. అమెరికా, ఫ్రాన్స్ సహా అనేక దేశాల్లో ఎంబీబీఎస్ తత్సమాన ఎండీ కోర్సు ఉంది. ఆయా దేశాల్లో సదరు కోర్సు చేసిన పలువురు డాక్టర్లు రాష్ట్రంలో ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్)లుగా చలామణి అవుతూ రోగులను బురిడీ కొట్టిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి వచ్చింది. ఇటీవలి దాడుల నేపథ్యంలో తమ చదువుకు మించి వైద్యం చేస్తున్న అనేక మంది డాక్టర్లకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కాగా అందులో విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి ఎండీగా చలామణి అవుతున్నవారూ ఉన్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి. అలాగే దాదాపు 150 ఆసుపత్రులు అసలు రిజిస్ట్రేషనే లేకుండా పని చేస్తున్నాయని తేలడంతో వాటిని సీజ్ చేసినట్లు తెలిసింది. వైద్యాధికారులకు ముడుపులు ఇస్తూ.. ఎంబీబీఎస్ చదివినా ఎండీగా బోర్డులు పెట్టుకోవడంతో స్పెషలిస్ట్ వైద్యులనుకొని అనేకమంది రోగులు చికిత్స కోసం వారిని ఆశ్రయిస్తున్నారు. జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్ధోపెడిక్, పీడియాట్రిక్, గైనిక్, రేడియాలజీ తదితర స్పెషలైజేషన్లు ఎండీ పక్కన పెడుతూ రోగులను గందరగోళానికి గురి చేస్తున్నారు. అంతేకాదు ఎండీ (యూఎస్), ఎండీ (ఫ్రాన్స్).. అంటూ బోర్డులపై ప్రదర్శిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో తిష్ట వేసిన వీరంతా పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరిపై నిఘా పెట్టాల్సిన అనేక జిల్లాల వైద్యాధికారులు భారీగా ముడుపులు తీసుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఎవరూ గుర్తించే పరిస్థితి కూడా ఉండటం లేదని, ఒక పేరున్న కార్పొరేట్ ఆసుపత్రి సైతం విదేశీ ఎండీ చదివిన వారికే జనరల్ ఫిజీషియన్, సర్జన్, కార్డియాలజీ వంటి బోర్డులు పెట్టి నడిపిస్తున్నట్లు తెలిసింది. అనేకచోట్ల వికటించిన వైద్యం ఎంబీబీఎస్లే ఎండీల మాదిరి స్పెషలిస్ట్ సేవలు అందిస్తుండటంతో, అనేకచోట్ల వైద్యం వికటించిన సంఘటనలు కూడా వైద్య, ఆరోగ్యశాఖ తనిఖీల్లో వెలుగు చూసినట్లు తెలిసింది. స్పెషాలిటీలో కనీస పరిజ్ఞానం లేకపోవడంతో వైద్యం వికటిస్తోంది. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు రోగులను బెదిరించి నోరు మూయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల హైదరాబాద్లో కూడా ఎంబీబీఎస్ తత్సమాన ఎండీ చదివిన ఒక డాక్టర్ చిన్న పాపకు వైద్యం చేయడంతో అదికాస్తా వికటించి ఆ పాప ప్రాణం వదిలింది. అయితే ఈ ఘటన బయటకు పొక్కకుండా ఆసుపత్రి యాజమాన్యం మేనేజ్ చేసింది. టీఎస్ఎంసీ ఆగ్రహం.. విదేశాల్లో ఎంబీబీఎస్ తత్సమాన ఎండీ చేసిన డాక్టర్లు పలువురు రోగులను మోసగించడంపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబీబీఎస్ అని మాత్రమే బోర్డులు పెట్టుకోవాలని ఆదేశిస్తూ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంబీబీఎస్తో పాటు ఇతరత్రా అదనపు అర్హతలు ఉన్నవారు మండలిలో నమోదు చేసుకోవాలని సూచించింది. జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) లేదా టీఎస్ఎంసీలో నమోదు చేయని అర్హతలను బోర్డులపై ప్రదర్శించవద్దని స్పష్టం చేసింది. అల్లోపతి వైద్యాన్నే అనుసరించాలని, ప్రతి ఐదు సంవత్సరాలకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించుకోవాలని ఆదేశించింది. విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసినవారు దేశంలో ప్రాక్టీస్కు, శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ చేయాలని స్పష్టం చేసింది. -
అనుమతి లేని కాలేజీల్లో చేరొద్దు.. మెడికల్ అభ్యర్థులకు ఎన్ఎంసీ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని మెడికల్ కాలేజీల్లో చేరవద్దని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విద్యార్థులను హెచ్చరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సహా ఇతర వైద్య కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్న నేపథ్యంలో ఎన్ఎంసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేని రాజస్తాన్లోని సింఘానియా యూనివర్సిటీ ఎంబీబీఎస్, ఇతర మెడికల్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానించినట్లు ఎన్ఎంసీ తెలిపింది. వివిధ వార్తాపత్రికల్లో సైతం ఈ సంస్థ ప్రకటన ఇచ్చిందని వివరించింది. కొత్త మెడికల్ కాలేజీని స్థాపించడానికి, ఆధునిక వైద్యంలో కోర్సులను అందించడానికి ఎన్ఎంసీ ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. అనుమతి లేని సంస్థల్లో ఎంబీబీఎస్, ఎండీ సహా ఇతరత్రా వైద్య కోర్సులు చేసిన విద్యార్థులు మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అనర్హులవుతారని హెచ్చరించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనుమతి ఉన్న వైద్య కళాశాలల వివరాలను, సీట్ల సంఖ్యను ఎన్ఎంసీ వెబ్సైట్లో ప్రదర్శించింది. ఏదైనా మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకునేముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెబ్సైట్ను పరిశీలించాలని సూచించింది. అన్ని విధాలా కాలేజీలను పరిశీలించి తనిఖీ చేసిన తర్వాతే వాటిల్లో చేరే విషయమై నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దు.. రాష్ట్రంలో గత వైద్య ప్రవేశాల అనంతరం మూడు మెడికల్ కాలేజీల అడ్మిషన్లను ఎన్ఎంసీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇది పెద్ద దుమారాన్నే లేపింది. కొన్ని నెలల అనంతరం ఒక కాలేజీ సీట్లను పునరుద్ధరించగా, మరో రెండు కాలేజీల విద్యార్థులను ఇతర ప్రైవేట్ కాలేజీల్లో సర్దుబాటు చేశారు. అయితే 2022–23 వైద్య విద్య అడ్మిషన్లలో ఆ రెండు కాలేజీలైన టీఆర్ఆర్, మహావీర్లకు ఎన్ఎంసీ అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని విద్యార్థులు ప్రత్యేకంగా గమనంలో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొందరు దళారులు సీట్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటారని, ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. -
హిందీలో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలు
భోపాల్: వైద్య విద్యను హిందీలో అందించే లక్ష్యంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్ మూడు సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు. ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందిస్తున్న మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అని అన్నారు. ఇది స్వర్ణాక్షరాలతో లిఖింపబడుతుందని అభివర్ణించారు. ఆదివారం భోపాల్ మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్లోని మెడికల్ బయో కెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియాలజీ సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించారు. సాంకేతిక, వైద్య విద్యను మరో 8 భాషల్లోనూ ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు. ఇంగ్లిష్ తమకు రాదనే ఆత్మనూనతతో విద్యార్థులు బాధపడాల్సిన పనిలేదన్నారు. మాతృభాషల్లోనూ విద్యను కొనసాగించవచ్చని తెలిపారు. ఈ పాఠ్యపుస్తకాలను 97 మంది వైద్యులతో కూడిన బృందం రూపొందించిందని సీఎం చౌహాన్ చెప్పారు. కాగా, ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను హిందీలో తీసుకురావడం వైద్యవిద్యలో సానుకూల పరిణామమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
ఎంబీబీఎస్ విద్యార్థులు ఇకపై ఫ్యామిలీ డాక్టర్లుగా..
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ విద్యార్థులు ఇక ముందు ఫ్యామిలీ డాక్టర్లుగా మారిపోనున్నారు. నేరుగా గ్రామాల్లోని ప్రజల వద్దకే వెళ్లి.. కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోనున్నారు. ఆ కుటుంబాల యోగక్షేమాలను తెలుసుకోవడం, రెండు వారాలకోసారి ఇంటికే వచ్చి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అవసరమైన మందులు సూచించడం, మరీ అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించడం వంటివి చేయనున్నారు. ఎంబీబీఎస్ సిలబస్లో భాగంగా కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని చేపట్టాలని గతంలో చేసిన సిఫార్సులను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు వైద్య విద్య క్యాలెండర్లో కుటుంబాల దత్తతను ప్రధాన అంశంగా ప్రస్తావించింది. ఇంటి ముంగిటికే వైద్యం ప్రస్తుతం చాలావరకు గ్రామాల్లో గుర్తింపు లేని ప్రైవేట్ ప్రాక్టీషనర్లు, ఆర్ఎంపీల వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. కొందరు తెలిసీ తెలియని వైద్యం చేస్తుండటం, నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలూ ఎన్నో. అర్హత లేని ప్రాక్టీషనర్లు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాల్సి ఉండగా.. కొందరు సర్జరీలు, డెలివరీలు వంటివి కూడా చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అంతేగాకుండా విచ్చలవిడిగా నొప్పుల మాత్రలు, యాంటీ బయాటిక్స్, ఇతర మందులు ఇస్తున్నారు కూడా. ఈ క్రమంలో అటు గ్రామీణ ప్రజలకు మంచి వైద్యం అందించడం, ఇటు ఎంబీబీఎస్ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వివిధ వ్యాధులపై అవగాహన, ప్రాక్టీస్ లభించేందుకు.. కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఎన్ఎంసీ గతంలోనే సిఫార్సు చేసింది. తాజాగా దీనిని అమల్లోకి తెచ్చింది. దీనితో పలుచోట్ల గ్రామీణ ప్రాంతాల వారికి నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో బ్యాచ్కు ఒక్కో గ్రామం ఎన్ఎంసీ నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలకు చెందిన ఒక్కో బ్యాచ్ విద్యార్థులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. బ్యాచ్లోని ఒక్కో విద్యార్థికి ఐదు నుంచి ఏడు కుటుంబాలను కేటాయిస్తారు. ప్రతి 25 మంది విద్యార్థుల బృందాన్ని పర్యవేక్షించడానికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు. వైద్య విద్యార్థులకు స్థానికంగా ఆశా కార్యకర్తల సాయం అందించేలా ఏర్పాటు చేస్తారు. వైద్య విద్యార్థులు ఆయా కుటుంబాల్లోని వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎవరికైనా, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. తక్షణమే టెలి మెడిసిన్ పద్ధతిలో అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. అవసరమైతే ఆస్పత్రికి రిఫర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు రెండు వారాలకోసారి ఆయా గ్రామాలకు వెళ్లాలి. కోర్సు మొదటి ఏడాదిలో కనీసం 10 సార్లయినా వారికి కేటాయించిన కుటుంబాల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దీనంతటినీ కోర్సులో భాగంగానే పరిగణిస్తారు. ఇలా విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచే ఫ్యామిలీ డాక్టర్ల అవతారం ఎత్తుతారు. దత్తత తీసుకున్న గ్రామాలకు పదుల సంఖ్యలో వైద్య విద్యార్థులు వచ్చిపోవడం, సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల అక్కడి ప్రజలకు ఆరోగ్య సమకూరుతుందని చెప్తున్నారు. వేల మంది విద్యార్థులు.. లక్షన్నరకుపైగా కుటుంబాలు.. ఈ ఏడాది మొదలవుతున్న కొత్త కాలేజీలతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం 18 ప్రభుత్వ, 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో వచ్చే నెల 15వ తేదీ నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అన్ని బ్యాచ్లకు చెందినవారు కలిపి దాదాపు 20 వేల మందికిపైగా ఎంబీబీఎస్ విద్యార్థులు ఉంటారు. ఆయుష్, డెంటల్ వారినీ కలిపితే మరో ఐదారు వేల మంది జత అవుతారు. ఇంతమందికి కుటుంబాల దత్తత బాధ్యత ఇస్తే.. లక్షన్నరకు పైగా కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందనున్నాయి. ప్రతి జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉన్నందున అన్ని చోట్లా ఫ్యామిలీ డాక్టర్ పద్ధతి అమల్లోకి వస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థులు చేసేదిదీ.. ►వైద్య విద్యార్థులు గ్రామాల్లో తాము దత్తత తీసుకున్న కుటుంబాల వద్దకు నెలకు రెండు సార్లు వస్తారు. కుటుంబంలోని వారందరితో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటారు. ►వ్యక్తుల వారీగా ఆరోగ్య రికార్డులను తయారు చేస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యసనాలను తెలుసుకుని నమోదు చేస్తారు. ►అవసరాన్ని బట్టి బీపీ, షుగర్, కిడ్నీ, లివర్, గుండె పనితీరు పరీక్షలు, కేన్సర్ స్క్రీనింగ్, ఇతర వైద్య పరీక్షలు చేయిస్తారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. పరిశీలించి తగిన వైద్య సలహాలు ఇస్తారు. మందులు సూచిస్తారు. అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ►పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు రెగ్యులర్ చెకప్లపై అవగాహన కల్పిస్తారు. ►రోగాలు రాకుండా ఎలాంటి ఆహార అలవాట్లు అలవరుచుకోవాలో సూచిస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తారు. ►గ్రామాల్లో స్థానిక పరిస్థితులు, తరచుగా వస్తున్న వ్యాధులను పరిశీలిస్తారు. ►ఈ అన్ని అంశాల్లో తమకు పర్యవేక్షకుడిగా ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూచనల మేరకు వైద్య విద్యార్థులు వ్యవహరిస్తారు. -
ఉక్రెయిన్లో చదివిన వైద్య విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చదువుకున్న వైద్య విద్యార్థులకు భారత ప్రభుత్వం ఊరటనిచ్చింది. యుద్ధ కారణంగా చదువు ఆగిపోయిన విద్యార్థులకు ఉపశమనమిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 కన్నాముందు మెడిసిన్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్కు కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్లు జారీ చేసింది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష(ఎఫ్ఎంజీఈ) రాసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఇందులో అర్హత సాధించిన వారు రెండేళ్లపాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్(CRMI) చేయాల్సి ఉంటుంది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా లేదా ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా చాలా మంది వైద్య విధ్యార్థులు మెడిసిన్ పూర్తి చేయకుండా ఫైనల్ ఇయర్లోనే తిరిగొచ్చారు. వారు ఎలాంటి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోలేదు. దీంతో సీఆర్ఎంఐని రెండేళ్లు తప్పనిసరి చేసింది కేంద్రం. సాధారణ వైద్య విద్యార్థులకు ఇది ఒక్క ఏడాదే ఉంటుంది. చదవండి: జర జాగ్రత్త.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు -
కజకిస్తాన్లో కర్నూలు యువకుడి మృతి
కర్నూలు(సెంట్రల్): కజకిస్తాన్లో ఎంబీబీఎస్ చదువుతున్న కర్నూలు యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈతకు వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు కాలేజీ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పొట్లపాడుకు చెందిన పి.ప్రసాదు, మేరీ కుమారి దంపతులకు ఇద్దరు సంతానం. వీరి కుమారుడు పి.వినయ్కుమార్(23) కజకిస్తాన్లోని ఆల్మమట్టి నగరంలో ఉన్న కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మూడో సంవత్సరం పరీక్షలు ముగిశాయి. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం గురువారం స్నేహితులతో కలసి సమీపంలో ఉన్న కుంటలో ఈతకు వెళ్లాడు. అయితే నీటిలోకి దూకే సమయంలో అదుపు తప్పి రాయికి తలకొట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని మొదట స్నేహితులు వినయ్కుమార్ తల్లిదండ్రులకు తెలిపారు. తరువాత మెడికల్ కాలేజీ యూనివర్సిటీ కూడా యువకుడి మరణాన్ని ధ్రువీకరించి సమాచారం ఇచ్చింది. జేసీ ఎస్.రామ్సుందర్రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న వినయ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఉన్నత చదువు కోసం కజకిస్తాన్ వెళ్లిన వినయ్కుమార్ మృతి చెందడాన్ని తల్లిదండ్రులు, బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుమారుడిని తలుచుకొని విలపిస్తున్న తల్లిని నిలువరించడం బంధుమిత్రులకు సాధ్యం కావడంలేదు. కడసారి చూపుకోసం తమ కుమారుడి మృతదేహాన్ని రప్పించాలని ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు విన్నవించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జేసీ ఎస్.రామ్సుందర్రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. విదేశాంగ శాఖతో మాట్లాడిన కలెక్టర్... ఎంతో భవిష్యత్ ఉన్న పి.వినయ్కుమార్ కజకిస్తాన్ లో చనిపోవడంపై కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే అతడి మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు చర్యలు చేపట్టారు. విదేశాంగ శాఖ అధికారులు, ఏపీ భవన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు కజకిస్తాన్లోని ఎంబసీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు కలెక్టర్ తెలిపారు. వినయ్కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.